9, మే 2023, మంగళవారం

వైశాఖ పురాణం - 18 వ అధ్యాయము🚩*_

   _*🚩వైశాఖ పురాణం - 18 వ అధ్యాయము🚩*_


🕉🍁🕉️🍁🕉️🍁🕉️🍁🕉️


*విష్ణువు యముని ఊరడించుట*


🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹


నారదుడు అంబరీషునితో పలుకుచున్నాడు. శ్రుతదేవుడు శ్రుతకీర్తితో నిట్లనెను.


యముని మాటలను విని బ్రహ్మ ఇట్లనెను. ఓయీ ! నీవెందులకు విచారింతువు. నీవు చూచినదానిలో నాశ్చర్యమేమున్నది ? సజ్జనులకు బాధను కలిగించినచో దాని వలని ఫలము జీవితాంతముండును. శ్రీహరి నామమునుచ్చరించినంతనే విష్ణులోకమును చేరుదురు. రాజాజ్ఞచే వైశాఖవ్రతమును చేసి శ్రీహరి లోకమును చేరుటలో నాశ్చర్యమేమున్నది ? గోవిందనామము నొక్కసారి పలికినను నూరు అశ్వమేధ యాగముల అనంతరము అవబృధస్నానము చేసిన వచ్చునంత పుణ్యము కల్గును. ఎన్ని యజ్ఞములను చేసినవారైనను పుణ్యఫలముల ననుభవించి మరల జన్మింపక తప్పదు కాని శ్రీహరికి నమస్కరించినచో పునర్జన్మ వుండదు. శ్రీహరి నామము నుచ్చరించినవారు  కురుక్షేత్రమునకు పోనక్కరలేదు. సరస్వతి మున్నగు తీర్థముల యందు మునగనక్కరలేదు. చేయరాని పనులను చేసిన వారైనను యెంత పాపము చేసినను మరణకాలమున విష్ణువును స్మరించినచో శ్రీహరి పదమును చేరుదురు. తినరానిదానిని తిన్నవారును శ్రీహరిని స్మరించినచో పాపములను పోగొట్టుకొని విష్ణు సాయుజ్యమునందుదురు. ఇట్టి శ్రీమహా విష్ణువునకిష్టమైనది వైశాఖమాసము.  వైశాఖ ధర్మములను విన్నచో సర్వపాపములును హరించును. విష్ణుప్రియమగు వైశాఖ వ్రతము నాచరించినవారు శ్రీహరి పదమును చేరుటలో నాశ్చర్యమేమున్నది ? మనలందరిని సృష్టించి సర్వ జగన్నాధుడు శ్రీమహా విష్ణువు అట్టివానిని సేవించినవారు విష్ణులోకమును చేరుటలో నాశ్చర్యమేమున్నది ? కీర్తిమంతుడు శ్రీహరి భక్తుడు. శ్రీహరికిష్టమైన వైశాఖమాస వ్రతమును చేసిన వారియందు శ్రీహరి ప్రీతుడై వారికి సాయపడుట సహజమే కదా ! యమధర్మరాజా ! శ్రీహరి భక్తుడగు ఆ రాజును శిక్షింపగల శక్తి నాకు లేదు. శ్రీహరి భక్తులకెప్పుడును అశుభముండదు కదా ! జన్మమృత్యు జరావ్యాధి భయము కూడ నుండదు. యజమాని చెప్పిన పనిని అధికారి శక్తికొలది ఆచరింప యత్నించినచో నతడు పనిని పూర్తిచేయకపోయినను నరకమునకు పోడు. తన శక్తికి మించినచో ఆ విషయమును యజమానికి నివేదించిన అధికారి / సేవకుడు పాపమునందడు. వానికెట్టి దోషమును లేదు. యజమాని చెప్పిన పని శక్తికి మించినప్పుడు అది వాని దోషము కాదు. అని బ్రహ్మ యముని బహువిధములుగ ఊరడించెను.


అప్పుడు యముడు బ్రహ్మమాటలను విని స్వామీ ! నీ యాజ్ఞను పాటించి నేను కృతార్థుడనైతిని. అన్నిటిని పొందితిని. ఇది చాలును. నేను మరల నా పూర్వపు ఉద్యోగములోనికి వెళ్లజాలను. కీర్తిమంతుడిట్లు పరాక్రమముతో వైశాఖవ్రతములతో భూమిని పాలించుచుండగా నేను నాయధికారమును వహింపను. ఆ రాజు వైశాఖ వ్రతమును మానునట్లు చేయగలిగినచో నేను తండ్రికి గయాశ్రాద్దము చేసిన పుత్రునివలె సంతృప్తి పడుదును. కృపాకరా ! నాయీ కోరిక తీరునట్టి యుపాయమును చెప్పుము. అప్పుడు నేను మరల నా కర్తవ్యమును నిర్వహింపబోదును అని ప్రార్థించెను.


అప్పుడు బ్రహ్మ యమధర్మరాజా ! విష్ణుభక్తుడగు అతనితో నీవు విరోధపడుట మంచిది కాదు. నీకు కీర్తిమంతునిపై కోపమున్నచో మనము శ్రీహరి వద్దకు పోవుదము. జరిగినదంతయు శ్రీమన్నారాయణునకు చెప్పి ఆయన చెప్పినట్లు చెయుదము. సర్వలోకములకు కర్తయగు ఆ శ్రీమన్నారాయణుడే. ధర్మపరిపాలకుడు. మనలను శిక్షించు దండధరుడు మనల నాజ్ఞాపించు నియామకుడు. శ్రీహరిమాటలకు మనము బదులు చెప్పదగినది యుండదు. కీర్తిమంతుడును శ్రీహరి భక్తుడగుటచే అతనికిని బదులు చెప్పజాలము. మనము శ్రీహరి యెద్దకే పోవుదుమని యమధర్మరాజును వెంట నిడుకొని క్షీరసముద్రము కడకరిగెను. జ్ఞానస్వరూపుడు నిర్గుణుడును సాంఖ్యయోగములతో కూడినవాడును పురుషోత్తముడునగు శ్రీహరిని స్తుతించెను. అప్పుడు శ్రీహరి వారికి ప్రత్యక్షమయ్యెను. బ్రహ్మ, యమధర్మరాజు ఇద్దరును శ్రీహరికి నమస్కరించిరి.


శ్రీహరియు వారిద్దరిని జూచి *"మీరిద్దరు నెందులకిచటకు వచ్చితిరి. రాక్షసుల వలన బాధ కలిగినదా ? యముని ముఖము వాడియున్నదేమి ? అతడు శిరము వంచుకొని యేల నుండెను ? బ్రహ్మ ! ఈ విషయమును చెప్పుమని"* యడిగెను.


అప్పుడు బ్రహ్మ మీ భక్తుడగు కీర్తిమంతుని పరిపాలనలో ప్రజలందరును వైశాఖ వ్రతమును పాటించి విషులోకమును చేరుచున్నారు. అందువలన యమలోకము శూన్యమై యున్నది. అందుచే నితడు దుఃఖపడుచున్నాడు. ఆ దుఃఖము నాపుకొనలేక కర్తవ్యపరాయణుడగు యముడు కీర్తిమంతునిపైకి దండెత్తి వెళ్ళెను. తుదకు యమదండమును గూడ ప్రయోగించెను. కీర్తిమంతుని రక్షించుటకై వచ్చిన మీ చక్రముచే పరాభూతుడై యేమి చేయవలయునో తెలియక నా యొద్దకు వచ్చెను. నేనును యేమి చేయుదును. స్వామీ నీ భక్తులను శిక్షించుటకు మేము చాలము. అందువలన మేము నీ శరణు గోరి వచ్చితిమి. దయయుంచి నీ భక్తుని శిక్షించి ఆత్మీయుడైన యముని కాపాడుమని బ్రహ్మ పలికెను. శ్రీమహావిష్ణువు ఆ మాటలను విని నవ్వి యముని , బ్రహ్మను జూచి యిట్లనెను. నేను లక్ష్మీదేవినైనను , నా ప్రాణములను , దేహమును , శ్రీవత్సమును , కౌస్తుభమును , వైజయంతీమాలను , శ్వేతద్వీపమును , వైకుంఠమును , క్షీరసాగరమును , శేషుని , గరుత్మంతుని దేనినైనను విడిచెదను గాని నా భక్తుని మాత్రము విడువను. సమస్త భోగములను , జీవితములను విడిచి నాయందే ఆధారపడియున్న యుత్తమ భక్తునెట్లు విడిచెదను ?


యమధర్మరాజా ! నీ దుఃఖము పోవుటకొక యుపాయమును కల్పింపగలను. నేను కీర్తిమంతుమహారాజునకు సంతుష్టుడనై పదివేల సంవత్సరముల ఆయుర్దాయము నిచ్చితిని. ఇప్పటికెనిమిదివేల సంవత్సరములు గడచినవి. ఆ తరువాత వేనుడను దుర్మార్గుడు రాజు కాగలడు. అతడు నాకిష్టములైన వేదోక్తములగు సదాచారములను నశింపజేయును. పెక్కు దురాచారములను ఆచరణలో నుంచును. అప్పుడు వైశాఖమాస ధర్మములును ఆచరించువారు లేక లోపించును. ఆ వేనుడును తాను చేసిన పాప బలమున నశించును. అటుపిమ్మట నేను పృధువను పేరున జన్మించి ధర్మసంస్థాపన చేయుదును. అప్పుడు మరల వైశాఖ ధర్మములను లోకమున ప్రవర్తింప జేయగలను. అప్పుడు నాకు భక్తుడైనవాడు నన్నే ప్రాణములకంటె మిన్నగా నమ్మి వ్యామోహమును విడిచి వైశాఖధర్మములను తప్పక పాటించును. కాని అట్టివాడు వేయిమందిలో నొకండుండును. అనంత సంఖ్యలోను జనులలో కొద్దిమంది మాత్రమే నాయీ వైశాఖధర్మముల నెరిగి పాటింతురు. మిగిలిన వారు అట్లుగాక కామవివశులై యుందురు. యమధర్మరాజా ! అప్పుడు నీకు కావలసినంతపని యుండును. విచారపడకుము. వైశాఖమాస వ్రతమునందును నీకు భాగము నిప్పింతును. వైశాఖవ్రతము నాచరించువారందరును నీకు భాగము నిచ్చునట్లు చేయుదును. యుద్దములో నిన్ను గెలిచి నీకీయవలసిన భాగమును రాకుండ జేసిన కీర్తిమంతుని నుండియు నీకు భాగము వచ్చునట్లు చేయుదును. నీకురావలసిన భాగము కొంతయైన వచ్చినచో నీకును విచారముండదు కదా ! *(ఇచట గమనింపవలసిన విషయమిది. కీర్తిమంతుడు యముని ఓడించి భాగమును గ్రహించుట యేమని సందేహము రావచ్చును. వైశాఖవ్రతము చేసిన పాపాత్ములు నరకమునకు పోకుండ విష్ణులోకమునకు పోవుటయనగా నరకమునకు పోవలసినవారు యముని భాగము కాని వారు యముని భాగము కాకుండ విష్ణులోకమునకు పోవుచున్నారు. ఇందులకు కారణమెవరు ? రాజైన కీర్తిమంతుడు ఇతడు శాసనము చేసి బలవంతముగా ప్రజలందరిని వైశాఖ ధర్మము నాచరించు వారినిగా చేసెను. కావున యముని భాగమును కీర్తిమంతుడు ఇతడు శాసనము చేసి బలవంతముగా ప్రజలందరిని వైశాఖ ధర్మము నాచరించు వారినిగా చేసెను. కావున యముని భాగమును కీర్తిమంతుడు గెలుచుకొనుటయనగా ఇప్పుడు శ్రీహరి వైశాఖ ధర్మమునాచరించువారు యమునికి గూడ భాగమునిచ్చునట్లు చేయుదును. అనగా వైశాఖ ధర్మము నాచరించువారు యమునికి గూడ భాగమునిచ్చునట్లు చేయుదును. అనగా వైశాఖ వ్రతము నాచరించు కీర్తిమంతుడును యమునకు తానును భాగము నిచ్చునట్లు చేయును. ఇందువలన యమధర్మరాజు మనస్సున కూరట కలుగునని శ్రీహరి యభిప్రాయము)* వైశాఖ వ్రతము నాచరించువారు ప్రతిదినమునను స్నానము చేసి నీకు అర్ఘ్యము నిత్తురు. వైశాఖవ్రతము చివరినాడు జలపూర్ణమైన కలశమును , పెరుగన్నమును నీకు సమర్పింతురు. అట్లు చేయని వైశాఖ కర్మలన్నియు వ్యర్థములగును. అనగా వైశాఖ వ్రతమాచరించువారు ప్రతిదినము స్నానసమయమున యమునకు అర్ఘ్యము నీయవలయును మరియు వ్రతాంతమున జలపూర్ణమైన కలశమును , పెరుగన్నమును యమునకు నివేదింపవలయును. యముని పేరుతో దానమీయవలయును. అట్లు చేయనివారి పూజాదికర్మలు వ్యర్థములగునని భావము.


కావున వైశాఖవ్రతము నారంభించు ప్రతివారును ప్రతిదినము స్నానసమయమున యమునకు అర్ఘ్యమునీయవలెను. వైశాఖపూర్ణిమయందు జలకలశమును దధ్యన్నమును ముందుగా యమునకిచ్చి తరువాత శ్రీమహావిష్ణువు కర్పింపవలయును. అటు తరువాత పితృదేవతలను , గురువును పూజింపవలయును , తరువాత శ్రీమహావిష్ణువునుద్దేశించి చల్లని నీరు పెరుగు కలిపిన యన్నమును దక్షిణగల తాంబూలమును ఫలములనుంచిన కంచుపాత్రను సద్బ్రాహ్మణునకు /పేదవాడగు వానికి నీయవలయును బ్రాహ్మణుని తన శక్తికి దగినట్లుగ గౌరవించిన శ్రీహరి సంతసించి మరిన్ని వివరముల నీయగలడు. వైశాఖవ్రతము నాచరించువారిలో భక్తి పూర్ణత ముఖ్యము. వ్రతధర్మములను పాటించునప్పుడు యధాశక్తిగ నాచరించుట మరింత ముఖ్యము.


ఇట్లు వైశాఖవ్రతము నాచరించినవారు జీవించినంతకాలము అభీష్టభోగముల ననుభవించుచు పుత్రులు , పుత్రికలు , మనుమలు. , మనుమరాండ్రు మున్నగువారితో సుఖముగ శుభలాభములతో నుండును. మరణించిన తరువాత సకుటుంబముగ శ్రీహరి లోకమును చేరును. కీర్తిమంతుడును యధాశక్తిగ వైశాఖవ్రతమును దానధర్మముల నాచరించి సకల భోగభాగ్యములను సర్వసంపదల ననుభవించి తనవారితో శ్రీహరి సాన్నిధ్యమును చేరెను.


కీర్తిమంతుని తరువాత దుర్మార్గుడు నీచుడునగు వేనుడు రాజయ్యెను. అతడు సర్వధర్మములను నశింపజేసెను. వైశాఖమాస వ్రతాదులును లోపించినవి. ఇందువలన మోక్షసాధనము సర్వసులభమునగు వైశాఖధర్మము యెవరికిని దెలియని స్థితిలోనుండెను. పూర్వజన్మ పుణ్యమున్నవారికి మాత్రమే వైశాఖధర్మములయందాసక్తి నిశ్చల దీక్ష శ్రీహరిభక్తి యుండును. అట్టివారికి ముక్తి ఇహలోక సుఖములు , సులభములు తప్పవు. కాని పురాకృతసుకృతమువలననే ఇది సాధ్యము సుమా అని శ్రుతదేవుడు శ్రుతకీర్తికి వివరించెను. శ్రుతదేవమహామునీ ! పూర్వపు మన్వంతరముననున్న వేనుడు దుర్మార్గుడనియు ఇక్ష్వాకు వంశమునకు చెందిన వేనుడు మంచి వాడనియు వింటిని. మీ మాటలవలన కీర్తిమంతుని తరువాత వేనుడు రాజగునని చెప్పిరి. దీనిని వివరింపుడని యడిగెను.


శ్రుతదేవుడును రాజా ! యుగములనుబట్టి , కల్పములనుబట్టి కథలు అందలి వారి స్వభావము వేరుగ చెప్పబడి యుండవచ్చును. ఆ కథలును ప్రమాణములే మార్కండేయాదిమునులు చెప్పిన వేనుడొక కల్పమువాడు. నేను చెప్పిన వేనుడు మరియొక కల్పమువాడు మంచి చెడుకలవారి చరిత్రలనే మనము మంచి చెడులకు గుర్తుగా చెప్పుకొందుము. అట్లే కీర్తిమంతుని మంచితనము , గొప్పతనము తరువాత వేనుని చెడ్డతనము దుష్టత మనము గమనింపవలసిన విషయములు సుమా యని పలికెను. అని నారదుడు అంబరీషునకు వివరించెను.


*వైశాఖ పురాణంలోని పద్దెనిమిదవ అధ్యాయం సంపూర్ణం*


           🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🙏🍁🙏🍁🙏🍁🙏🍁🙏

కాశీకి పోలేని వాళ్ళు

 .

*గంగా పుష్కరాలకు కాశీకి పోలేని వాళ్ళు చింతించక్కరలేదు. 


💦💦 💦💦 💦💦 💦💦 💦💦 💦💦 💦💦 💦💦


శంకరాచార్యులు కాశీ పంచకంలో చెప్పిన ఈశ్లోకం మనస్పూర్తిగా స్మరించుకొంటే చాలు:*

 *"కాశీ క్షేత్రం శరీరం, త్రిభువనజననీ వ్యాపినీ జ్ఞాన గంగా|*

*భక్తిఃశ్రద్ధా గయేయం నిజగురుచరణధ్యానయోగః ప్రయాగః|*

*విశ్వేశోయం తురీయః సకలజనమనస్సాక్షిభూతోంతరాత్మా|*

*దేహే సర్వం మదీయే యది వసతి పునః తీర్థ మన్యత్ కిమస్తి|"*


*తాత్పర్యం:*

🌾*మన శరీరమే కాశీ క్షేత్రం. 

జ్ఞానమే మూడు లోకాలలో వ్యాపించిన గంగానది. మన భక్తిశ్రద్ధలే గయాక్షేత్రం.

🌾 మన గురు చరణ ధ్యాన యోగమే ప్రయాగాతీర్థం. 

🌾సకల జనుల మనస్సాక్షి భూతంగా మనలోని సమాధ్యవస్థాతత్త్వమైఉన్న ఆత్మయే కాశీ విశ్వేశ్వరుడు.

🌾 ఈ విధంగా మన శరీరంలోనే సర్వ తీర్థాలు నెలకొని ఉన్నాయి 


💦💦💦💦💦💦💦💦💦💦💦💦💦💦💦💦💦💦 

ఆత్మసంపదలు

 .

          _*సుభాషితమ్*_


*బాహుశ్రుత్యం తపస్త్యాగః*

*శ్రద్ధా యజ్ఞక్రియా క్షమా।*

*భావశుద్ధిర్దయా సత్యం*

*సంయమశ్చాత్మసమ్పదః॥*

                            ~విదురనీతి


"రాజా! అనేక శాస్త్రాలపరిశీలనం, తపస్సు, త్యాగం, శ్రద్ధ, క్షమా, మనశ్శుద్ధి, దయ, సత్యం, ఇంద్రియనిగ్రహం అనేవి ఆత్మసంపదలు."

బహిష్కరించాలి

 *ప్రసుతం హిందుా వివాహ సంప్రదాయాలు విదేశీ సంప్రదాయాలు నుండి రక్షించుకుందాము*


*1)ప్రీ వెడ్డింగ్ షూట్ చేయకూడదు*


*2)పెళ్లిలో వధువు లెహంగాకు బదులుగా చీరను ధరించాలి*


*3)అసభ్యకరమైన చెవి-బస్టింగ్ సంగీతానికి బదులుగా వివాహ వేదిక వద్ద తేలికపాటి వాయిద్య సంగీతం ప్లే చేయబడాలి*


*4)దండ వేసే సమయంలో వధూవరులు మాత్రమే వేదికపై ఉండాలి*


*5)వరమాల సమయంలో వధువు లేదా వరుడిని వేధించే వారిని వివాహం నుండి బహిష్కరించాలి*


*6)పురోహితుడు వివాహ ప్రక్రియను ప్రారంభించిన తర్వాత అతనిని ఎవరూ ఆపరాదు*


*7)కెమెరామేన్ దూరం నుండి ఛాయాచిత్రాలు తీస్తాలి. అవసరం మేరకు, ఎవరికీ అంతరాయం కలిగించకుండా దగ్గర నుండి కొన్ని చిత్రాలు తీస్తాలి. పురోహితుడి ప్రక్రియకు పదే పదే అంతరాయం కలిగించడం మాత్రం చేయకూడదు*


*ఇది అందరి సాక్ష్యంలో దేవుళ్ళను పిలిపించి జరిపే కళ్యాణం*

*సినిమా షూటింగ్ కాదు*


*8)వధూవరుల ద్వారా కెమెరామేన్ ఆదేశానుసారం, నేరుగా రివర్స్‌లో పోజులు పెట్టి చిత్రాలు తీయకుడదు*


*9)పగటిపూట కళ్యాణోత్సవం నిర్వహించి సాయంత్రంలోగా వీడ్కోలు పూర్తి చేయాలి. తద్వారా మధ్యాహ్నం 12 నుంచి 1 గంటకు ఆహారం తీసుకోవడం వల్ల నిద్రలేమి, అసిడిటీ తదితర సమస్యలతో అతిథి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు* 


*ఇది కాకుండా, అతిథులు తమ ఇంటికి చేరుకోవడానికి అర్ధరాత్రి వరకు సమయం తీసుకోకూడదు మరియు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి*


*10)తాళి కట్టిన వెంటనే అందరి ముందు ఎవరైనా ముద్దు పెట్టుకోమని, కౌగిలించుకోవాలని అడిగితే, అట్టి వారిని వెంటనే పెళ్లి నుంచి బహిష్కరించాలి*



 *సమాజాన్ని బాగుచేసే అందమైన సూచనలు.! అందరికి ఆదర్శంకావలి..!!*


*🙏వివాహం అనేది పవిత్ర కార్యక్రమం.. దానిని గౌరవిద్దాం.. మన సనతనహిందుా సాంప్రదాయాన్ని కాపాడుకుందాం🙏*


🚩🌹🪷🌻🌺🚩

 బజాజ్ స్కూటర్ మీద నాన్నఇంటికి తిరిగొస్తాడు… టేబుల్ మీదో అల్మారాలోనో హెచ్ఎంటీ వాచ్ ఉంటుంది…ట్రంకాల్ వస్తుందంటూ పోస్టాఫీసులోనో… మరోచోటో ఫోన్ కోసం ఎదురుచూసే రోజులు… అప్పుడప్పుడూ కనిపించే అంబాసిడర్ కార్లు… ఫియట్ కార్లో తిరిగితే సౌండ్ పార్టీ అనుకుంటా అని చూసే చూపులు… విమానం అనగానే ఇండియన్ ఏర్ లైన్స్ అంటూ చూపించే సినిమాలు…! ఇవన్నీ పాతికేళ్ల జ్ఞాపకాలు ! అప్పటి ఇండియా ఇదంతా ! ఇలాంటి పరిస్థితి నుంచి చేతిలో సెల్ ఫోన్… అందులోంచే మనీ ట్రాన్స్ ఫర్ చేసుకునేంత టెక్నాలజీ… ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా ఏమైనా కొనుక్కునే కెపాసిటీ అన్నీ వచ్చాయ్.ఇదంతా ఓ రూపశిల్పి రూపుదిద్దిన అద్భుతం. ప్రధానిగా పీవీ వేసిన ఆ ఒక్క అడుగూ దేశాన్నే కాదు మన జీవితాల్ని, జ్ఞాపకాల్ని కూడా మార్చేసింది. గ్లోబలైజేషన్ ఊపందుకుంటున్న దశలో పడిన ఆ అడుగులు ఇపుడు దేశ రూపురేఖల్నే మార్చేశాయ్.

మేకిన్ ఇండియాకి ఐకానిక్ సింబల్… లోహ సింహం ఉంటుంది చూశారు సమరనాదం చేస్తున్నట్టు… నిజానికి అది పాతికేళ్ల కిందట దీర్ఘదర్శి పీవీ రూపుకట్టిన ఆలోచన. దానికి ఓ అప్పియెరెన్స్ ఇస్తే ఇప్పుడది సింహం అయ్యింది. తాకట్టు పెట్టుకునే పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని… అవకాశాల కోసం ప్రపంచమే తలుపు తట్టేలా తీర్దిదిద్దిన వ్యూహం పట్టాలెక్కి సరిగ్గా పాతికేళ్లు. ఏ ఆర్థిక వేత్తలో… ప్రపంచబ్యాంకో… లేదంటే విశ్వవిఖ్యాత నిపుణులో తీర్చిదిద్దలేదు ఈ ఆలోచనల్ని ! ప్రపంచాన్ని పరిశీలించి… భారత బలాబలాల్ని మథించి రూపొందించిన వ్యూహం. తిరుగులేని స్ట్రాటజీ దేశాన్ని పదేళ్లలో అపూర్వంగా మార్చేస్తే… అందుకు కారకుడు, సాధకుడు అయిన పీవీ మాత్రం అప్పటికే తెరమరుగైపోయారు. ఆయన ప్రవేశ పెట్టిన సంస్కరణ బాటలకి ఇరవైదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇదే అయనకి మా ఘన నివాళి.....

పర్యావరణానికి

 ప్రతి ఒక్కరూ చిన్న పనితో ప్రారంభిస్తారు. పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా దీన్ని ఇంట్లో సులభంగా చేయవచ్చు.


 వాటర్ బాటిల్ ఎక్కడైనా సులభంగా దొరుకుతుంది. ప్రతి ఇంటికి ప్రతిరోజూ కనీసం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ప్లాస్టిక్ సంచులు అందుతాయి, (నూనె సంచులు, పాల సంచులు, కిరాణా సంచులు, షాంపూ, సబ్బు, మాగీ, కుర్కురే మొదలైనవి) సీసాలో పోయాలి.


 మీరు వారానికి ఒకసారి సీసాని నింపవచ్చు మరియు సరైన మూతతో డస్ట్‌బిన్‌లో వేయవచ్చు. ఇలా చేయడం వల్ల జంతువులు చెల్లాచెదురుగా ఉన్న ప్లాస్టిక్‌ను తినవు.


 ప్లాస్టిక్ వ్యర్థాలు, వాటర్ బాటిళ్లను సక్రమంగా పారవేసే అవకాశం ఉంటుంది. చెత్తను నిక్షిప్తం చేసే వెసులుబాటు కూడా చెత్త శాఖకు ఉంటుంది.


 ఇలాంటి చిన్న పని పర్యావరణానికి, భూమికి, రాబోయే తరాలకు ఎంతో మేలు చేస్తుంది. ఈ పనిని ప్రతి ఒక్కరూ చేయగలిగిన సమయంలో వీలైనంత వరకు 100% చేయడానికి ప్రయత్నించండి.


 నగరం నుంచి పల్లె వరకు ప్రతి ఇంట్లో ఈ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడేలా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఇంటివారు ఈ ఆవశ్యకతను గుర్తించి ఈ శుభ కార్యాన్ని ప్రారంభించవలసిందిగా వినయపూర్వకమైన మనవి.

ధర్మం బోధపడదు.🙏

 శ్లోకం:☝️

*చిరం హ్యపి జడః శూరః*

 *పండితం పర్యుపాస్య హి ।*

*న స ధర్మాన్ విజానాతి*

 *దర్వీ సూపరసానివ ll*

(మహాభారతం, సౌప్తిక పర్వం - 5/3)


భావం: పప్పులో మునిగినా గరిటెకి దాని రుచి ఎలా తెలియదో, అలాగే జడత్వంతో కూడిన బుద్ధిగల వాడికి బహుకాలం పండితుల సేవ చేసినప్పటికీ, ధర్మం బోధపడదు.🙏

అభిన్నులు

 అపర కామాక్షి...

పరమాచార్య వారు మకాం చేసి ఉన్న ఊర్లో ఒకామె వారి పట్ల అత్యంత భక్తి ప్రపత్తులు కలిగి ఉండేది.

కుటుంబ పరిస్థితులు అనుకూలించక ఆమె స్వామి వారి దర్శనానికి తరచూ రాలేక పోయేది.

ఇంటి పనులు ముగించుకొని ఒకరోజు ఆమె స్వామి దర్శనానికి వచ్చింది. స్వామి పూజ ముగించుకొని వేదికపైనే కూర్చొని భక్తులతో మాట్లాడుతున్నారు. ఆమె స్వామి వారి ముందుకు వెళ్లి హారతి ఇవ్వటానికి ప్రయత్నించింది. స్వామి వారు ముఖం ప్రక్కకు తిప్పేసారు. ఇలా చాలాసార్లు జరిగే సరికి"అంబికా నన్నెందుకు పరీక్షస్తున్నావు " అంటూ  హారతి వేదికపై నున్న త్రిపుర సుందరి దేవికి ఇచ్చి ఆమె కన్నీళ్లతో వెను తిరిగింది. ఆమె కొద్ది దూరం వెళ్ళగానే ఎవరో వెనక నుంచి పరిగెత్తుకొని వచ్చి "అమ్మా  మిమ్మల్ని పెరియవ పిలుస్తున్నారు."అని పిలిచాడు.

ఆమె అతన్ని అనుసరించి వెళ్ళింది. స్వామి గదిలో కూర్చోని ఉన్నారు.

"అమ్మా. హారతి శ్రీ కామాక్షి (మహా త్రిపుర సుందరి )కి ఇచ్చినా నాకు ఇచ్చినా ఒకటే. నీ సంతోషం కోసం కావాలంటే ఇప్పుడు నా కివ్వు."అనటం తో ఆమె సంతోషానికి అవధులు లేవు. ఆమె స్వామి కి హారతి ఇచ్చింది.

****స్వామి సన్యాస దీక్ష తీసికొన్న తొలినాళ్లలో వారికి మంత్ర శాస్త్రము లో శిక్షణ ఇప్పించటానికి నిపుణులను పిలిపించి నప్పుడు వారు అన్న మాటలు మీకు గుర్తు చేస్తున్నాను."అన్ని మంత్రాలకు అధిష్టాన దేవత అయిన శ్రీ కామాక్షికి స్వామి కి పోలికలు కనిపిస్తున్నాయి.వారికి ఎలాంటి మంత్ర దీక్షలు అవసరం లేదు. వారు శ్రీ కామాక్షి కి అభిన్నులు "

తల్లితండ్రుల రుణము

 మనకి జన్మనిచ్చిన తల్లితండ్రుల రుణము తీర్చుకొనుటకు కాశీలో గర్భవాసము 9 నెలలు ఉండుట లేక తొమ్మిది రాత్రులు నిద్ర చేయుట అన్నది శాస్త్ర విధి కాబట్టి అటువంటి రుణమును తీర్చుకొనుటకు పరమ పవిత్రమైన కార్తీక మాసంలో తొమ్మిది రోజులు పాటు సాక్షాత్తు విశ్వనాథ మందిర ప్రాంగణంలో విశ్వనాథుని సన్నిధిలో రోజుకు ఒక విశేషమైన కార్యక్రమాన్ని మనం చేసుకుంటూ చివరి రోజు స్వామివారికి అందరం కలిసి పట్టాభిషేక మహోత్సవం చేయడానికి 108 జలాలతో శంకరాచార్య స్వామి పీఠాధిపతులు వారి చేతుల మీదుగా అభిషేకం చేయుటకు దేవస్థానం వారి యొక్క అనుమతి లభించినది కాబట్టి వారి యొక్క అనుమతితో విశ్వనాథ ప్రాంగణంలో గంగా తీరంలో కార్తీకమాసంలో ఈ కార్యక్రమం చేయడానికి సంకల్పం కాబట్టి 500 మంది కూర్చునే శక్తి కలిగినటువంటి విశ్వనాథ మందిరంలోని హాలు మనకు ఇవ్వబడినది ఆసక్తి ఉన్నవారు ఎవరైనా 9 రాత్రులు కాశీలో విడిగా హోటల్స్ లో నిద్ర చేయటం మరియు స్వామివారి సన్నిధిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పూజలు చేయడం కార్యక్రమం నిర్వహిస్తున్నాము అవకాశం ఉన్నవారు సంప్రదించగలరు నెంబర్ 98483 69716

8, మే 2023, సోమవారం

విద్యార్థి

 ఆచార్యాత్ పాదమాదత్తే, 

పాదం శిష్యః స్వమేథయా ।

పాదం సబ్రహ్మచారిభ్యః, 

పాదం కాలక్రమేణ చ ॥


భావార్థమ్

విద్యార్థి జ్ఞాన సముపార్జనా మార్గాలని లేదా విధానాలని గురించి తెలియ చెప్పే సుభాషితం.


ఆచార్యుడు లేదా గురువు లేదా teacher వద్ద నుండి విద్యార్థి నిజముగా నేర్చుకునేది ఒక నాలుగవ వంతు మాత్రమే..... 

మరి ఒక నాలుగవంతు భాగం తన యొక్క స్వంత మేధా శక్తితోను, విషయ పరిజ్ఞానపరిశోధనతోను, తన యొక్క విశ్లేషణా శక్తితోనూ నేర్చుకుంటాడు.... 

మరి మూడవ భాగమైన నాలుగవ వంతు భాగాన్ని సహబ్రహ్మచారులతోనూ అనగా తోటి విద్యార్థులతోడి చర్చలద్వారా, discussions ద్వారానూ, interactions ద్వారానూ నేర్చుకుంటాడు...... 

తన యొక్క సంపూర్ణ విద్యాసముపార్జన, జ్ఞాన సముపార్జనలని చివరి నాలుగవ భాగాన్ని, కాలక్రమేణా తన జీవితానుభవముల ద్వారా, తన జిజ్ఞాసతో కూడిన నిరంతర గ్రంథ పఠనాల ద్వారా నేర్చుకుని పరిపక్వత సాధిస్తాడు.... 


అనగా, సమగ్రమైన విద్యాభ్యాసం విద్యాలయాలతో పరిసమాప్తి కాదు... 

అది జీవితాంతమూ జరిగే నిరంతర ప్రక్రియ అని తాత్పర్యం.... 


-------------- ॐ ॐ ॐ --------------

ఆపరేషన్ కావేరీ ' .

 భారత్ సైన్యం జరిపిన అత్యంత క్లిష్టమైన ఆపరేషన్.. ' ఆపరేషన్ కావేరీ ' .. 

భారత సైన్యం చేసిన  సాహసోపేతమైన రెండు-రోజుల ఆపరేషన్‌ కావేరీ కు అంతర్జాతీయ రక్షణ రంగం నివ్వెర పోయింది..

ఒకప్పుడు ఇజ్రాయెల్ ఉగాండా లో తన సైనిక చర్య జరిపినప్పుడు ప్రపంచం ఇజ్రాయెల్ సైన్యం వంక ఎలా చూసిందో అదే నివ్వెరపాటుతో భారత సైనిక పాటవాన్ని..

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వేగాన్ని చూసి ప్రపంచం నివ్వెరపోయింది..


భారత్ యొక్క స్వర్ణ యుగం ప్రారంభమైందని ప్రపంచం గమనించింది..


సూడాన్ లో జరిగిన ఈ ఆపరేషన్ మొత్తం ప్రపంచానికి చాలా షాకింగ్ మరియు థ్రిల్లింగ్‌గా ఉంది..ఒక హాలీవుడ్ సినిమాకు ఏమాత్రం తీసిపోని సంఘటన ఇది..


ఉక్రెయిన్ మరియు కాబూల్ నుండి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాల ద్వారా భారతీయులను రక్షించడం పెద్ద విషయం కాదు.. ఎందుకంటే వారిని అక్కడనుంచి లిఫ్ట్ చేసింది పగటిపూట అది కూడా సాధారణ విమానాశ్రయాల్లో..


కానీ సుడాన్‌లో అలా కాదు.. సుడాన్ యొక్క గగనతలం మూసివేశారు..విమానాలు ఎగరడానికి అనుమతి లేదు..కేవలం US మాత్రమే తన రాయబారులను రక్షించడానికి ధైర్యంగా తన హెలికాప్టర్‌లను పంపింది..


పోరాటం విమానాశ్రయాల్లో కూడా జరుగుతున్నందున అలాగే అక్కడ అల్మోస్ట్ అన్నీ ఇతర దేశాల దౌత్యవేత్తలు అక్కడికే చేరుకున్నారు కనుక అక్కడనుంచీ మనవాళ్లను కాపాడడం దాదాపు అసాధ్యం.. 


దేశంలోని చాలా మంది ఇలా చిక్కుకుపోయారు.

అక్కడ చిక్కుకున్నవారిలో తొలివిడతలో గుర్తించింది 278 మంది భారతీయులను.. ఇప్పుడు వారిని రక్షించడం పెద్ద సవాలుగా మారింది.


ప్రధాని మోదీ భారత వైమానిక దళానికి పూర్తి అధికారాన్ని ఇచ్చారు..

ఇండియన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ కూడా రంగంలోకి దిగింది..మిలిటరీ ఇంటిలిజెన్స్ మానిటరింగ్ మొదలుపెట్టింది..


వీళ్ళకి తోడు డైనమిక్ విదేశాంగ శాఖామాత్యులు జైశంకర్ గారి నేతృత్వంలో  విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో కలిసి ప్రపంచ వాయుసేన చరిత్రలో సువర్ణాక్షరాలతో భారత్ చరిత్రను లిఖించడానికి భారత వైమానిక దళం ఉత్సాహంతో రంగంలోకి దిగింది..


విదేశీ విమానాలు సుడాన్‌లో ఎగరలేవు..ఒకవేళ సూడాన్ కు రెండో వైపునుంచి భారత్ విమానాలు ఎగిరితే ఇంకోవైపు వారు భయంతో దాడి చేయవచ్చు..ప్రధాన విమానాశ్రయం శిధిలమై ఉంది.. ఈ పరిస్తితిలో  సూడాన్ అనుమతి లేకుండా భారతీయులను రక్షించాలి.


భారత ఇంటెలిజెన్స్ సూడాన్‌ లో రెక్కీ వేసింది.. రాజధానికి 50 కిలోమీటర్ల దూరంలో మానవరహిత..ఒక పాడుబడిన విమానాశ్రయాన్ని కనుగొంది.


అక్కడ విమానాన్ని ల్యాండ్ చేయవచ్చు కానీ సమస్య ఏమిటంటే 

అన్నింటిలో మొదటిది..అక్కడ భూమిపై ఎవరూ లేరు..కరెంటు లేదు..జనరేటర్ కూడా శిధిలమైంది..ఇక లైట్లు వెలిగే అవకాశమే లేదు..


ఎయిర్ ట్రాఫిక్ గైడెన్స్ లేదు..ఇక్కడ విమానం ల్యాండింగ్ లేదా టేకాఫ్ అయినా ప్రమాదాన్ని కావాలని కొనితెచ్చుకోవడమే..


విమానం వచ్చినా వారిని ధిక్కరించి రహస్యంగా రావడానికి సుడాన్ అనుమతించదు.


ఇక రక్షణ విషయానికి వస్తే భారతీయ విమానాలు ఎగరడానికి వాళ్ళ నిఘా లేని మార్గం లేదు.


ఇన్ని సమస్యలు!

అయినా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తన ఆపరేషన్ లో ముందుకే వెళ్లడానికి నిర్ణయం తీసుకుంది..


మొదటగా భారత వైమానిక దళం తన కమాండోలతో కూడిన ఒక పెద్ద విమానాన్ని సౌదీ జెడ్డాకు పంపింది అక్కడ నుండి అది సూడాన్ వైపు వెళ్లడానికి కావలసిన ఇంధనం నింపుకుంది..


ఇంటిలిజెన్స్ ఏజెన్సీలు ముందుగా ఆ 278 మంది భారతీయులను ఆ పాడుపడిన విమానాశ్రయానికి చేర్చాయి..


ఇక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తన జీవితంలోనే అత్యంత ఉద్విగ్నభరితమైన ఆపరేషన్ మొదలుపెట్టింది..అప్పటిదాకా ఏ విమానాన్ని పంపాలో కూడా టీం అత్యంత రహస్యంగా ఉంచింది..

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ' హెర్క్యులస్ ఎయిర్ క్రాఫ్ట్ ' ను రంగంలోకి దించింది..ఇక సాహసోపేతమైన ఫీట్ మొదలైంది.


లైట్లు లేని చీకటిలో నైట్ విజన్ పరికరాల సాయంతో  విమానం ఎగిరింది.. లైట్లు లేకుండా ఎగరడంతో సూడానీస్ ఆర్మీ..పారా మిలటరీ దానిని చూడలేకపోయింది.


శ్రీహరి కోట షార్ సెంటర్ నుంచి లభించిన  ఉపగ్రహ మార్గదర్శకత్వంలో భారత విమానం సంపూర్ణంగా చీకటిలో ప్రయాణించింది.


పైలట్లు రాత్రికి రాత్రే విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు..ఇంజన్ ను షట్ డౌన్ చేయలేదు..


విమానం డోర్ తెరుచుకోవడంతో భారత కమాండోలు పరుగున వెళ్లి విమానంలోకి 278 మందిని మెరుపు వేగంతో తీసుకెళ్లారు..


7 నిమిషాల పాటు విమానం సూడాన్ నేలపైనే ఉండిపోయింది..

నో లైట్స్..నో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్..నో సైన్ బోర్డ్స్ నథింగ్..అందరూ కూచున్న తర్వాత

కేవలం శాటిలైట్ నావిగేషన్ సాయంతో అంతే మెరుపువేగంతో విమానం టేకాఫ్ తీసుకుంది..


సౌదీ అరేబియాలోని జెడ్డాలో విమానం లాండ్ అయిన తర్వాత జెడ్డా నుంచి డిల్లీకి భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చారు.


ఈ సంఘటన ప్రపంచ వేదికపై తీవ్ర దిగ్భ్రాంతిని సృష్టించింది..నిజానికి ప్రకంపనాలే పుట్టించింది..

ఇజ్రాయెల్ తప్ప మరే దేశం ఇలాంటి సవాలును తీసుకోలేదు కానీ భారతదేశం ధైర్యం చేసింది.


మిలటరీ ఎయిర్ క్రాఫ్ట్ విషయంలో ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ల శక్తి తెలిసి పాకిస్థాన్ వణికిపోతోంది..చైనా ఆర్మీ చీఫ్ డయపర్స్ కి ఆర్డర్ ఇచ్చాడు..


నిజానికి ఈ ఆపరేషన్ చాలా సవాలుతో..ప్రమాదంతో కూడుకున్నది..విమానం అక్కడ చిక్కుకుపోయినా లేదా అక్కడి ఫైటర్స్ విమానాన్ని గమనించి విమానాన్ని చుట్టుముట్టినా  అత్యంత ప్రమాదమే కాదు..భారత్ కు పరువుప్రతిష్టల సమస్య..


కానీ మోదీజీ నాయకత్వంలోని భారతదేశం ప్రపంచంలోనే అతి గొప్ప సాహసం చేసింది.


ఆశ్చర్యకరంగా ఇది ఏప్రిల్ 29, 2023 శనివారం నాడు జరిగింది..


ఏదో ఒకటో రెండో జాతీయవాద చానల్స్ తప్ప మిగిలిన భారత మీడియా

ఎందుకు మాట్లాడలేదు?


భారత సైన్యంపై ప్రపంచం నలుమూలల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది.. దేశప్రజల ప్రాణాలు కాపాడడంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రుల మాదిరిగా మోదీజీ కూడా చరిత్రలో నిలిచిపోయారు.


తమ ప్రజలను కాపాడుకునేందుకు మోదీజీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం ఎంతకైనా తెగిస్తుందని నిరూపించింది.

ఈ ఘనత సాధించిన పైలట్‌, క్రూ చీఫ్‌ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

వీరి పేర్లను అవార్డులకు ఎప్పుడు ప్రకటిస్తారో అప్పుడే బహుశా వారి పేర్లు కచ్చితంగా తెలిసే అవకాశం  ఉంది.


భారత వైమానిక దళం ఒక గొప్ప విజయాన్ని సాధించింది.. 

ప్రతి భారతీయుడు తమ ఛాతీని పైకెత్తి గర్వంగా వారికి సెల్యూట్ చేయాల్సిన సమయం ఆసన్నమైంది.


భారత ప్రభుత్వం తన పౌరులకు "భయం లేదు..భయం లేదు..భయం లేదని ' అభయం ఇచ్చిన క్షణం..


భారత్‌ సూపర్‌ పవర్‌ టైటిల్‌ను చేరిన క్షణం...


బెంగళూరు సమీపంలో రాజీవ్ హంతకులు మెరుపుదాడి చేసినప్పుడు ఢిల్లీ నుంచి కమాండోలు రావడానికి రెండు రోజులు పట్టింది..


ముంబై దాడి సమయంలో ఢిల్లీ నుంచి కమాండోలు రావడానికి ఒక రోజు పట్టింది..


మోడీ హయాంలో 7 నిమిషాల్లో సూడాన్ నుండి భారతీయులను రక్షించాం..

భారత్ మారుతుంది..భారత్ శక్తి మారుతుంది..

భారత్ వేగం మారుతుంది..

భారత్ ను ప్రపంచం చూసే దృష్టి మారుతుంది..

ఇది మోదీజీ నాయకత్వంలో దేశం సాధించిన అపురూప చారిత్రక విజయం..

( ఈ ఆపరేషన్ తర్వాత షుమారు 3 వేలమంది భారతీయులను సౌదీ అరేబియా..యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహాయంతో సీ పోర్ట్ మార్గం ద్వారా తరలించారు ) 

జైహింద్..భారత్ మాతాకీ జై..

7, మే 2023, ఆదివారం

అచ్చులతో ఆధ్యాత్మికత

 


*శుభోదయం* 

🙏💐🙏💐🙏


*అచ్చులతో ఆధ్యాత్మికత - అంతం నుంచి అంతం వరకు*............ 


*అం* తం (మరణం) నుంచే *ఆ* రంభమైన జీవితం (జననం)


*ఇం* టి (శరీరం) నుంచే *ఈ* శ్వరుడి (ఆత్మ)దర్శనం


*ఉ* పాసన (సాధన)తో *ఊ* డిపోయే *ఋ* ణం 

      (మోక్షం)


*ఎ* దగడమే (ఆత్మస్థితి) *ఏ* కమైన (ఒకటే) ఐశ్వర్యం  (ముక్తి)*


*ఒం* టరిపోరాటంలో (ధ్యానం)  *ఓ* రిమే (ధ్యేయమే)   *ఔ* న్నత్యం (సమాధి స్థితి)*


*అం* తం  చేస్తుంది  *అహం* కారం (నేను)

🙏🙏🙏🙏🙏

మిత్రులు

 .

          _*సుభాషితమ్*_


 𝕝𝕝శ్లోకం𝕝𝕝


*ఔరసం కృతసమ్బన్ధం* 

*తథా వంశక్రమాగతమ్l*

*రక్షితం వ్యసనేభ్యశ్చ* 

*మిత్రం ఙ్ఞేయం చతుర్విధమ్ll*

                                ~నీతిసారః


తా𝕝𝕝 

*రక్తసంబంధీకుడు, చిన్ననాటినుండి పరిచితుడైనవాడు, వంశక్రమంగా కుటుంబ సంబంధాలు కలవాడు, కష్టాలనుండి రక్షించుటవల్ల సన్నిహితుడైనవాడు- ఇట్లు మిత్రులు నాలుగువిధాలుగా ఉందురు"*........

వివాహంలోని కార్యక్రమాలు :

 🌀 *వివాహంలోని కార్యక్రమాలు :*


1. కన్యావరణం:

2. పెళ్ళి చూపులు

3. నిశ్చితార్థం:

4. అంకురార్పణం:

5. స్నాతకం:

6. సమావర్తనం:

7. కాశీయాత్ర:

8. మంగళస్నానాలు:

9. ఎదురుకోలు:

10. వరపూజ:

11. గౌరీపూజ:

12. పుణ్యాహవాచనం:

13. విఘ్నేశ్వరపూజ:

14. రక్షా బంధనం:

15. కొత్త జంధ్యం వేయడం:

16. గౌరీ కంకణ దేవతాపూజ:

17. కౌతుక ధారణ:

18. కంకణ ధారణ:

19. మధుపర్కము:

20. వధువును గంపలో తెచ్చుట:

21. తెరచాపు

22. మహా సంకల్పం:

23. కన్యాదానం:

24. వధూవరుల ప్రమాణములు:

25.సుముహూర్తం-జీలకర్ర-బెల్లం:

26. స్వర్ణ జలాభిషేకం:

27. చూర్ణిక:

28. వధూవర సంకల్పం:

29. యోక్త్రధారణం:

30. మాంగల్య పూజ:

31. మాంగల్య ధారణ:

32. అక్షతలు-తలంబ్రాలు:

33. బ్రహ్మముడి:

34. సన్నికల్లు తొక్కడం:

35. కాళ్లు తొక్కించడం:

36. పాణి గ్రహణం:

37. సప్తపది:

38. లాజహోమం:

39. యోక్త్రవిమోచనం:

40. స్థాలీపాకం:

41. ఉంగరాలు తీయడం:

42. బొమ్మని అప్పగింత:

43. నాగవల్లి:

44. ధ్రువనక్షత్రం:

45. అరుంధతి నక్షత్ర దర్శనం:

46. అప్పగింతలు:

47. అత్తమామలకు వధువు పూజ:

48. ఫలప్రదానం:

49. పానుపు:

50. మహదాశీర్వచనం:

51. వధువు గృహప్రవేశం:

52. కంకణ విమోచన:

53. గర్భాదానం:

54. పదహారు రోజుల పండుగ

55. అల్లెం.

________________________

హిందువుల పెళ్లి తంతులో తారసపడే ఘటనలు. తెలుసుకుంటే మన పిల్లల పెళ్లికి ఉపయోగపడుతుంది.

దీర్ఘకాలం గుర్తుంటాయి.

 శ్లోకం:☝️

*అసిద్ధిర్వాలుకాలేఖాః*

 *క్షణికా క్షణభంగురాః |*

*శిలాలేఖసమా శిక్షా*

 *స్థిరా దీర్ఘా నిరంతరా ||*


భావం: సముద్రపు ఇసుకపై గీసిన గీతల వలే వైఫల్యాలు క్షణికమైనవి మరియు వాటిని త్వరగా మరిచిపోవాలి. అయితే ఆ వైఫల్యాల నుండి నేర్చుకున్న పాఠలు మాత్రం రాళ్లపై చెక్కినట్టుగా స్థిరంగా దీర్ఘకాలం గుర్తుంటాయి.