27, జనవరి 2024, శనివారం

ఉల్లిపాయ

 ఉల్లిపాయతో  ఉపయోగాలు  - 


  *  సిగిరెట్లు , పాన్ పరాగ్ లు అధికంగా వాడటం వలన cancer లు వంటి వ్యాధులకు అద్బుతంగా విరుగుడుగా పనిచేస్తూంది . 


 *  పిల్లలు బాగా పుష్టిగా ఆరోగ్యంగా ఎదగడానికి నీరుల్లి బెల్లం కలిపి తినిపిస్తూ ఉండాలి.


 *  రాత్రి పూట నిద్రపట్టక అవస్తలు పడే వాళ్లు పచ్చి నీరుల్లి పాయల రసం 20 గ్రా , పంచదార 10 గ్రా కలుపుకుని పూటకు ఒక మోతాదుగా రెండు పూటలా తాగుతూ ఉంటే పైల్స్ వ్యాధులు ఆశ్చర్య కరంగా తగ్గుతాయి . 


 *  మేహా వాత నొప్పులు తో బాధపడే రోగులు ఆవాల నూనె , నీరుల్లిగడ్డ రసం సమాన బాగాలుగా కలిపి మర్దన చేస్తూ ఉంటే వాతనోప్పులు మాయం అయిపోతాయి . 


 *  కుక్క కరిచినప్పుడు వెంటనే ఉల్లిపాయని తేనేతో కలిపి మెత్తగా నూరి కాటు వేసినచోట పట్టువేస్తే విషం హరిస్తుంది .


 *  నీరస రోగంతో బాధపడేవారు ప్రతిరోజు క్రమం తప్పకుండా 10 గ్రా నీరుల్లి రసం 10 గ్రా తేనే కలిపి తాగుతూ ఉంటే మంచిబలం , వీర్యవ్రుద్ది కలుగుతుంది.


 *  స్థనాల వాపు , పోట్లుతో  బాధ పడే స్త్రీలు ఒక నీరుల్లి గడ్డని కుమ్ములో పెట్టి ఉడికించి స్థనాల మీద వేసి కట్టుకడుతూ ఉండాలి. ఇలా రెండు మూడు సార్లు చేయగానే వాపు , పోటు పోతాయి .


 *  మూర్చ వచ్చినపుడు నీరుల్లి రసం 4 చుక్కలు  ముక్కులో వేసి నీరుల్లి రసాన్ని అరికాళ్ళకు మర్దన చేస్తే వెంటనే మూర్చ నుండి తేరుకుంటారు.


 *  కలరా సోకినపుడు వెంటనే 10 గ్రా నీరుల్లి రసం 10 గ్రా నిమ్మకాయ రసం కలిపి అందులో కొంచం పంచదార వేసి తాగుతూ ఉంటే చాలా తొందరగా కోలుకోవచ్చు . 


 *  వాంతులు విపరీతంగా అవుతుంటే నీరుల్లి గడ్డని చితగ్గొట్టి వాసన చుస్తూ ఉండాలి. 


 *  మూత్రాశయం లొ గాని , మూత్రపిండాల్లో గాని రాళ్లు ఏర్పడిన వాళ్లు ప్రతిరోజు నీరుల్లి రసం 10 గ్రా తీసుకుంటూ ఉంటే రాళ్లు కరిగిపోతాయి. బొట్టుబొట్టుగా పడే మూత్రవ్యాది కూడా పొతుంది.


 *  ముక్కునుండి చెడు నీరు , రక్తం ధారాపాతంగా కారుతూ భాద పడేవాళ్లు నీరుల్లి రసాన్ని రెండు ముక్కు రంద్రాల్లో రెండు చుక్కలు వేస్తే వెంటనే రక్తం , నీరు ఆగిపోతుంది . 


 *  తేలు కాటుకి నీరుల్లిపాయ రసాన్ని రుద్దితే వెంటనే విషం విరుగుతుంది. 


 *  చెవిపోటు వచ్చినపుడు నీరుల్లిపాయల రసం నువ్వుల నూనెలో కలిపి కొంచం గోరువెచ్చ చేసి గోరువెచ్చటి ద్రవాన్ని నాలుగు చుక్కలు చెవిలొ వేస్తే పోటు తగ్గును . 


 *  కంటి రోగాలు ఉన్నవాళ్ళు నీరుల్లిరసం తేనే సమబాగాలుగా కలిపి కళ్ళలో రెండు చుక్కలు వేస్తూ ఉంటే కంటి కలకలు , కంటి ఎరుపులు , కంటి మంటలు , కంటి శుక్లాలు హరించి పోతాయి . 


  గమనిక - నీరుల్లిని డైరెక్టుగా అతిగా వాడకూడదు శరీరంలో వేడిని పెంచుతుంది. నీరుల్లి మజ్జిగతో కలిపి మజ్జిగ అన్నంలో వాడటం మంచిది. 


 

  ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

డెంగ్యూ జ్వరం వచ్చినపుడు

 డెంగ్యూ జ్వరం వచ్చినపుడు ప్లేట్లెట్స్ సంఖ్య హఠాత్తుగా పడిపోతున్నప్పుడు  ఉపయోగించవలసిన అద్బుత యోగం  - 


    మొదట ఒక కప్పు నీటిలో ఒక స్పూన్ తేనే కరిగేలా చేసి దానిలో ఒకస్పూన్ గోధుమగడ్డి చూర్ణం కలిపి వెంటనే రోగికి తాగించాలి. కొంతసేపట్లో ప్లేట్లెట్ల సంఖ్య పెరగడం మొదలవుతుంది. ఒక గంట తరువాత ఒక పెద్ద గ్లాస్ నీటిలో ఒక బొప్పాయి ఆకు మొత్తం చిన్నచిన్న ముక్కలుగా చేసి పొయ్యి మీద పెట్టి అందులొ తాటిబెల్లం వేసి సగం గ్లాస్ కషాయం మిగిలేలా కాచి దానిని కూడా తాగించడం వలన వేగంగా ప్లేట్లెట్స్ సంఖ్య పెరిగి రోగి ప్రాణాయాపాయ స్థితి నుంచి బయటపడతాడు.


           ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

26, జనవరి 2024, శుక్రవారం

26-01-2024 / శుక్రవారం / రాశిఫలాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️


•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

*26-01-2024 / శుక్రవారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

మేషం


ఋణ సమస్యల వలన మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. ఉద్యోగమున అధికారులతో నూతన సమస్యలు  తప్పవు.  కుటుంబ సభ్యులతో  మాటపట్టింపులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు.

---------------------------------------

వృషభం


నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమించి సకాలంలో పూర్తి చేస్తారు. సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి. సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.

---------------------------------------

మిధునం


దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ధన వ్యవహారాలు అంతగా కలసిరావు. నూతన వ్యాపారాల ప్రారంభానికి అవరోధాలుంటాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. ఇంటా బయట గందరగోళ పరిస్థితులుంటాయి.

---------------------------------------

కర్కాటకం


వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. నూతన విషయాలపై దృష్టి సారిస్తారు. విద్యార్థులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఆదాయమార్గాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులు సహాయంతో పనులు సకాలంలో  పూర్తిచేస్తారు. ఇంటాబయట కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి.

---------------------------------------

సింహం


ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. చిన్ననాటి మిత్రులతో పుణ్యక్షేత్రాలు  సందర్శిస్తారు.  వ్యాపారమున తొందరపాటు నిర్ణయాలు తీసుకుని నష్టపడతారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి విమర్శలు తప్పవు. ఆదాయనికి మించి ఖర్చులు పెరుగుతాయి.

---------------------------------------

కన్య


నూతన కార్యక్రమాలు ప్రారంభానికి శ్రీకారం చూడతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలించి పాత ఋణాలు తీరుస్తారు. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు కలసి వస్తాయి. మిత్రులతో దూర ప్రయాణ సూచనలున్నవి. వ్యాపార విస్తరణకు నూతన పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది.

---------------------------------------

తుల


ఉద్యోగమున అందరితో సఖ్యతగా వ్యవహరించిన  ప్రశంసలు అందుకుంటారు. చేపట్టిన వ్యవహారాలు  విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలలో సమస్యలను అధిగమించి లాభాలు పొందుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. విద్యార్థులు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు.

---------------------------------------

వృశ్చికం


వృత్తి వ్యాపారాలలో ఊహించని స్థానచలన సూచనలు ఉన్నవి. ఇంటాబయట ఒత్తిడులు అధికమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. పితృవర్గం వారితో మాట పట్టింపులుంటాయి. అనారోగ్య సమస్యలను అశ్రద్ధ చేయడం మంచిది కాదు. కుటుంబ సభ్యుల ప్రవర్తన  మానసికంగా బాధిస్తుంది.

---------------------------------------

ధనస్సు


వ్యాపారాలలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. నిరుద్యోగప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో  పాల్గొంటారు.

---------------------------------------

మకరం


వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. గృహనిర్మాణ   పనులు వేగవంతం చేస్తారు. ఉద్యోగమున  మీ మాటకు విలువ మరింత పెరుగుతుంది. ఇతరుల అవసరానికి  సైతం ధన సహాయం చేస్తారు. వివాదాలకు సంభందించి కీలక సమాచారం అందుతుంది.

---------------------------------------

కుంభం


ఆర్థిక వ్యవహారాలు ఆశజనకంగా ఉంటాయి. మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులలో కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. కొన్ని వ్యవహారాలలో సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు.

---------------------------------------

మీనం


ఉద్యోగమున చిన్న పాటి ఇబ్బందులు తప్పవు. ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత తప్పదు. నూతన పెట్టుబదుల విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది. సంతాన విద్యా విషయాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా పడుతాయి.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

🍁 *శుభం భూయాత్* 🍀

మఠం - మందుల షాపు

 మఠం - మందుల షాపు


చాలా ఏళ్ల క్రితం కంచిలో శ్రీమఠం ఎదురుగా పూల కొట్టు, పచారి కొట్టు, మందుల షాపు ఇలా చాలా దుకాణాలు ఉండి వ్యాపారం చేసుకునేవాళ్ళు. ఇండియన్ బ్యాంకు వారికి శ్రీమఠం ఎదురుగా ఒక శాఖను ప్రారంభించి మఠం లావాదేవీలను చూసుకోవాలని వారి కోరిక. వారు తమ అలోచనని మఠం అధికారులకు తెలిపి వారి అనుమతి తీసుకున్నారు.


మఠం ఉన్నప్పటి పరిస్థితుల ప్రకారం బ్యాంకు వారు మఠం ఎదురుగా స్వయంగా ఒక సొంత భవనాన్ని కట్టుకుని శాఖను ప్రారంభించవలిసి ఉంది. ఇందుకోసం అక్కడున్న దుకాణాలను ఖాళీ చేయించి వేరొకచోట వాటిని ఏర్పాటు చేసుకోవడానికి తగిన స్థలాన్ని ఆ దుకాణదారులకు ఇవ్వాలి. అంతా సవ్యంగా జరిగి ఇండియన్ బ్యాంకు వారు మఠం ఎదురుగా తమ శాఖను ప్రారంభించారు.


రెండు సంవత్సరాల తరువాత దంపతులొకరు మహాస్వామి వారి దర్శనానికి వచ్చి, స్వామి వారితో “ఈరోజు మా పెళ్ళిరోజు. పరమాచార్య స్వామి వారు మమ్మల్ని దీవించాలి” అని ప్రార్థించారు.


మహస్వామి వారు వారిని గుర్తుపట్టి, “నువ్వు మందుల షాపు ముదలియార్ కదూ?” అని అడిగారు. 

”అవును పెరియవ”


“మీ తండ్రి అంతిమ సమయంలో చాలా క్లేశపడ్డాడు”

”అవును పెరియవ”


వారి బాగోగుల గురించి కనుక్కున్న తరువాత మహాస్వామి వారు ఇలా అడిగారు. “ఇప్పుడు షాపు ఎక్కడ పెట్టుకున్నావు?”


“షాపు ఇంకా ఎక్కడా పెట్టుకోలేదు పెరియవ. సరైన స్థలం కోసం చూస్తున్నాము” అని చెప్పారు.


మహాస్వామి వారు కనుబొమ్మలు ముడిచి ”ఎందుకు? శ్రీమఠం ఎదురుగా ఉన్న స్థలం ఖాలీ చేసిన తరువాత వారు నీకు వేరొక స్థలం ఇవ్వలఏదా?” అని అడిగారు.


ముదలియార్ సణుగుతూ ”అది పెరియవ . . ”


ఏదో తప్పు జరిగిందని మహాస్వామి వారుకి అర్థం అయ్యింది. మఠం మేనేజరు గణేశ అయ్యర్ ని పిలిపించారు. మహాస్వామి వారు నెమ్మదిగా విషయం విచారిస్తున్నారు. ”మనకు వీలున్నంతలో దదాపు అందరికి మరోచోట స్థలాలు ఇచ్చాము” అని చెప్పాడు


“కాని మెడికల్ షాపు ముదలియార్ ఎక్కడ ఇచ్చినట్టు లేదు. అతను ఇంకా షాపు పెట్టుకోలేదు అని చెప్తున్నాడు” అని అడిగారు స్వామి వారు.


గణేశ అయ్యర్ తడబడుతూ ”లేదు పెరియవ అతనితో అన్ని మాట్లాడి నిర్ణయించాము. . . .”


ఆ తరువాత రోజంతా మహాస్వామి వారు ఎవ్వరితోను మాట్లాడలేదు. తీవ్రమైన చింతలో ఉన్నట్టు కనిపించారు. మందుల షాపు ముదలియారుకు వేరోకచోట స్థలం ఇవ్వలేదు అనే విషయం వారిని చాలా సంకటంలో పడేసింది. ఇలా చేయ్యడం ఇచ్చిన మాటను అతిక్రమించడమే. అది అసత్య దోషం. వారు చివరగా తీసుకున్న నిర్ణయం అందరికి చెప్పారు. వారి నిర్ణయం అందరిని ఆశ్చర్యానికి గురి చెసింది.


ముదలియార్ ఇంటి చిరునామా తీసుకుని అతణ్ణి అప్పుడే పంపించివేసారు. తరువాత వారు మేనేజరుని పిలిచి విచారించారు. శ్రీమఠం వెనకాతల రోడ్డు పక్కగా చాలా ఖాళీ స్థలం ఉంది. మఠం కాంపౌండు గోడని కూల్చితే ముదలియార్ పాత షాపు కంటే మూడింతలు పెద్ద స్థలం లభిస్తుంది. సాయిత్రం లోపల ఆ స్థలాన్ని అతనికి కేటాయించారు. ఆ రోజు దర్శనానికి వచ్చిన శ్రీమఠం భక్తుడైన ఒక ఇంజనీయరుకు అక్కడ దుకాణం కట్టవలసిందని అనుజ్ఞ ఇచ్చారు.


మూడునెలలో చక్కగా దుకాణాన్ని నిర్మించారు. ముదలియార్ అక్కడ తన మందుల షాపుని పెట్టుకుని మళ్ళీ వ్యాపారం మొదలుపెట్టాడు.


పరమాచార్య స్వామి వారు చేసిన ప్రమాణాలు నెరవేర్చడంలో చాలా నిక్కచ్చిగా ఉంటారు. ఎంతటి స్థితిలోనైనా వాటిని నెరవేర్చవలసిందే. ఈ సంఘటన తరువాత మహాస్వామి వారి అనుగ్రహాన్ని తనకు కలిగిన అదృష్టాన్ని తలచుకొని ముదలియార్ చాలా సంతోషపడ్డాడు.


--- రా. వెంకటస్వామి, శక్తి వికటన్ ప్రచురణ


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

పంచాంగం 26.01.2024

 ఈ రోజు పంచాంగం 26.01.2024

Friday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: ఉత్తరాయణం హేమన్త ఋతు పుష్య మాస కృష్ణ పక్ష: ప్రతిపత్తి తిధి భృగు వాసర: పుష్యమీ నక్షత్రం ప్రీతి యోగ: బాలవ తదుపరి కౌలవ కరణం. ఇది ఈరోజు పంచాంగం.


పాడ్యమి రాత్రి 01:20 వరకు.

పుష్యమి పగలు 10:29 వరకు.

సూర్యోదయం : 06:53

సూర్యాస్తమయం : 06:04


వర్జ్యం : రాత్రి 12:38 నుండి 02:25 వరకు.


దుర్ముహూర్తం : పగలు 09:07 నుండి 09:52 వరకు తిరిగి మధ్యాహ్నం 12:51 నుండి 01:36 వరకు.


అమృత ఘడియలు : ఈ రోజు లేదు.


రాహుకాలం : పగలు 10:30 నుండి 12:00 వరకు.


యమగండం: మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.

 


శుభోదయ:, నమస్కార:

పంచాంగం

 *శుభోదయం*

**********

సంధ్యా వందన 

మరియు ఇతర 

పూజాకార్యక్రమాల 

సంకల్పము. 

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ.26.01.2024 

శుక్ర వారం (భృగు వాసరే)

 **********


గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం.  దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో  వచ్చును. 

__________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ  మహావిష్ణోరాజ్నేయా  ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే  శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ  అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ శోభకృత్ నామ సంవత్సరే ఉత్తరాయణే

హేమంతృతౌ

పౌష్య మాసే కృష్ణ పక్షే ప్రతి పత్తిథౌ (సూర్యోదయానికి ఉన్న తిథే  చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)

భృగు వాసరే 

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.

ఇతర పూజలకు*

*శ్రీ శోభకృత్  నామ సంవత్సరే ఉత్తరాయణే(*

హేమంతృతౌ పౌష్య మాసే  కృష్ణ పక్షే

*ప్రతి పత్తిథౌ*

*భృగు వాసరే అని చెప్పుకోవాలి*.


*ఇతర ఉపయుక్త విషయాలు*

సూ.ఉ.6.38

సూ.అ.5.48

శాలివాహనశకం 1945 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2080 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5124 వ సంవత్సరం. 

*శ్రీ శోభకృత్ నామ సంవత్సరం* 

*ఉత్తరాయణ పుణ్యకాలం శరత్ ఋతువు*

*పుష్య మాసం* 

*కృష్ణ పక్షం పాడ్యమి రా.12.04 వరకు.*

*శుక్ర వారం*. 

*నక్షత్రం పుష్యమి ఉ.9.57 వరకు*. 

అమృతం లేదు. 

దుర్ముహూర్తం ఉ. 8.52 ల 9.37 వరకు.

దుర్ముహూర్తం ప.12.35 ల 1.20 వరకు. 

వర్జ్యం రా.11.55 ల 1.40 వరకు. 

యోగం ప్రీతి ఉ.7.37 వరకు. 

కరణం బాలవ ప.11.19 వరకు.   

కరణం కౌలవ రా.12.04 వరకు. 

సూర్యోదయము  ఉ.6.00 గంటలకు అయితే

రాహు కాలం ఉ.10.30 ల 12.00 వరకు. 

గుళిక కాలం ఉ.7.30 ల 9.00 వరకు. 

యమగండ కాలం మ. 3.00 ల 4.30 వరకు. 

---////----////---////---////---

పుణ్యతిధి పుష్య బహుళ పాడ్యమి. 

*********************

బ్రాహ్మణ వధూవరుల వివరాలకై సంప్రదించండి:-

*శ్రీ పద్మావతి శ్రీనివాస బ్రాహ్మణ వివాహ సమాచార సంస్థ*, 

(రి.జి.నెం.556/2013)

S2 - C 92, 6 - 3 -1599/92,

సచివాలయనగర్,వనస్థలిపురం,

హైదరాబాద్ 500 070.

ఫోన్(చరవాణి) నెం.

*8019566579/9848751577*

****

*బ్రాహ్మణ వధూవరుల సమాచార కేంద్రం*

                           వారి

*బ్రాహ్మణ వధూవరుల ద్వై మాసవపత్రిక*

*పత్రికలో రిజిస్ట్రేషన్*ఉచితం, పుస్తకం కావలసిన వారు ₹100/- చెల్లించిన చో పుస్తకం వారి చిరునామాకు పంపబడును* 

*రిజిస్ట్రేషన్ మరియు ఇతర వివరాలకై*

*సంప్రదించండి*

ఫోన్(చరవాణి) నెం లను 

*9030293127/9959599505

*.**************

ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న   అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని  కోరుకుంటూ మీ  శ్రేయోభిలాషి.

**************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.

🙏🙏🙏

.

25, జనవరి 2024, గురువారం

నవగ్రహా పురాణం

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *147వ అధ్యాయం*


*పురాణ పఠనం ప్రారంభం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*శుక్రగ్రహ మహిమ - 2*


అదితి వ్రతం ఫలించింది. ఆదిదేవుడి వరం సాకారమైంది. అదితి దివ్యగర్భం ధరించింది. ఆమె శరీరాన్ని ఏదో దివ్యకాంతి ఆవరించింది. సహజ సౌందర్యవతి అయిన ఆమె అందం వెయ్యింతలయ్యింది.


ఆదితి గర్భాన అందంగా , ఆనందంగా కదలాడుతూ అవతరించడానికి సన్నద్ధుడవుతున్న క్షీరసాగరశాయిని చతుర్ముఖ బ్రహ్మ పరిపరివిధాలుగా ప్రస్తుతించాడు. 


నారదమహర్షి అదితి గర్భవతి అయిన శుభవార్తను , అందుకు మూలకారణాన్ని ఇంద్రాదులకు చేరవేశాడు.


★★★★★★★★★★★★★★★★


*"మహేంద్రా ! దేవతల కష్టాలు కడతేరే కాలం కనుచూపు మేరలో ఉంది. పూర్వ వైభవం అందుకోవడానికి , నీ వంతు కృషి నీవు చేయాలి.”* బృహస్పతి సాలోచనగా అన్నాడు.


*“శలవియ్యండి, గురుదేవా!”* 


*"స్వర్గరాజ్యం రాక్షసరాజ్యం కావడానికి మూలకారణం...”* బృహస్పతి ఏదో చెప్పబోయాడు.


*"తెలుసు... బలిచక్రవర్తి !"* ఇంద్రుడు అడ్డుతగిలాడు.


*"బలిచక్రవర్తి కారణం కావచ్చు , కానీ , మూలకారణం వేరే వుంది , దేవేంద్రా !"*


*“ఏమిటది , గురుదేవా?"*


*"నీ మీద ప్రసరిస్తున్న శుక్రుడి వక్రదృష్టి !"* బృహస్పతి ఇంద్రుడి కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు. *“శుక్రుడు అశుభ దృష్టితో నిన్ను చూస్తున్నాడు. అతడి అశుభ దృష్టిని , శుభదృష్టిగా మార్చుకోవాలి నువ్వు !"*


*"ఊ....మార్గం ఉపదేశించండి !"*


*“భక్తిశ్రద్ధలతో నవగ్రహాలలో ఆరవగ్రహమైన శుక్రుడిని ధ్యానించు ! ఆరాధించు !"*


*"గురుదేవా !"* ఇంద్రుడు నివ్వెరపాటుతో అన్నాడు. *"శుక్రుడు సురవిరోధుల గురువు ! శుక్రుడు గురువు శత్రువే కద ! ఆయన నాకు ప్రసన్నుడవుతాడా ? అసంభవం !”*


*"సందేహాన్ని పరిత్యజించి , శుక్రుడిని ఆరాధించు , మహేంద్రా !”* బృహస్పతి గంభీరంగా అన్నాడు. *“శుక్రుడు కరుణిస్తాడు !”*


*"ఒక్క మాట చెప్పండి , గురుదేవా ! రాక్షసరాజు బలిచక్రవర్తి మిమ్మల్ని ఆరాధిస్తే అతనికి మీరు ప్రసన్నులవుతారా ?”*


*"తప్పక ప్రసన్నుడవుతాను ! తప్పదు ! అది మా విధి !”* బృహస్పతి చిరునవ్వుతో అన్నాడు. *"చరాచర ప్రపంచంలో అందరినీ శుభంగా , అశుభంగా , ఆగ్రహంతో , అనుగ్రహంతో వీక్షించే అధికారం త్రిమూర్తులు మా నవగ్రహాలకు ప్రసాదించారు. ఏ దైవమైనా నిన్ను కనికరించాలంటే , దానికి ముందుగా పునాది రూపంలో నవగ్రహాలలో అనుకూలంగా లేని గ్రహవీక్షణ శుభంగా మారాల్సిందే. నా మాటను విశ్వసించు ! ఐశ్వర్య వైభవ కారకుడైన శుక్రగ్రహ దేవతను ఆరాధించు !"* బృహస్పతి నొక్కి వక్కాణించాడు.


*"ఆజ్ఞ !"* ఇంద్రుడు వినయంగా అన్నాడు.


★★★★★★★★★★★★★★★★


అది శ్రావణమాసం. ద్వాదశ తిథి. శ్రవణా నక్షత్రయుక్త అభిజిత్ లగ్నం. సూర్య భగవానుడు ఆకాశ మధ్యంలో ప్రకాశించే మధ్యాహ్న సమయం. చంద్రుడూ , ఇతర గ్రహాలూ , నక్షత్రాలూ ఉచ్ఛస్థితిలో ఉన్న శుభఘడియలలో అదితి కుమారుణ్ణి ప్రసవించింది.


ఆ బాలకుడు గోరోచన వర్ణ వస్త్రంతో , మకర కుండలాలతో , శ్రీవత్సంతో మెరిసిపోతున్నాడు. చతుర్భుజుడుగా జన్మించిన ఆ శిశువు నాలుగు చేతులలో శంఖ చక్ర గదా పద్మాలను ధరించి ఉన్నాడు. కిరీటమూ , కంఠంలో కౌస్తుభమణీ , ఇతర హారాలూ దివ్యకాంతుల్ని వెదజల్లుతున్నాయి.


నాలుగు చేతులతో , ఆభరణాలతో , ఆయుధాలతో ఆ శిశువు తన గర్భవాసాన ఎలా ఉన్నాడో అన్న ఆలోచనలో పడింది అదితి. ఆశ్చర్యానందాలతో , భక్తి ప్రపత్తులతో అదితీ కశ్యపులు శిశురూపంలో ఉన్న శ్రీమహావిష్ణువును కీర్తించారు. మరుక్షణం ఆయుధాలతో , అలంకారాలతో , ఆభరణాలతో ఉన్న దివ్య స్వరూపాన్ని వదలి సామాన్య బాలక రూపాన్ని ధరించాడు. ఆ వెంటనే ఉపనయనానికి తగిన వయసుతో పొట్టివాడుగా రూపొందాడు. అదితి అబ్బురపాటు నుండి తేరుకుంది. ఆమెలో మాతృ వాత్సల్యం స్తన్యంగా పెల్లుబికింది. పొట్టిగా ఉన్న చిట్టి తండ్రిని అక్కున చేర్చుకుంది.


★★★★★★★★★★★★★★★★


నిర్వికల్పానంద చిరునవ్వుతో చూశాడు. *"ఇదీ వామనావతార గాథ ! బలిచక్రవర్తి స్వాధీనపరుచుకున్న స్వర్గసామ్రాజ్యాన్ని ఇంద్రుడికి అప్పగించే లక్ష్యంతో శ్రీమహావిష్ణువు వామనుడుగా అవతరించాడు.*


*“ఆ వామనుడు బలిచక్రవర్తి యాగానికి వెళ్ళడం , మూడడుగుల చోటు దాన మదగడం , దానం చేయబోయిన బలిని గురువు శుక్రాచార్యుడు వారించడం , జలధార పడకుండా శుక్రుడు సూక్ష్మ రూపం ధరించి కలశ రంధ్రానికి అడ్డుపడడం , కలశ రంధ్రాన్ని వామనుడు దర్భతో పొడవడం , ఫలితంగా శుక్రుడికి ఒక కన్ను పోవడం , దానంగా స్వీకరించిన సామ్రాజ్యాన్ని వామనరూప విష్ణువు ఇంద్రుడికి ప్రసాదించడం - అనే అంశాలు అందరికీ తెలిసినవే !"* నిర్వికల్పానంద ఆగాడు. 


*"గురువుగారూ... మరి శుక్రుడు..."* చిదానందుడు ఏదో అడిగే ప్రయత్నం చేశాడు.


*"అదే చెప్పబోతున్నాను , చిదానందా !"* నిర్వికల్పానంద నవ్వుతూ అన్నాడు. *"సరిగ్గా సమయానికి , ఇంద్రుడు చేసిన ధ్యాన పూర్వక శుక్రారాధన ఫలించింది ! ఇంద్రుడికి ప్రసన్నుడయ్యాడు. ఆయన మీద శుభవీక్షణలు ప్రసరించాడు...”* 


*"గురువుగారూ...ఒక సందేహం..."* విమలానందుడు వినయంగా అన్నాడు. *"శుక్రుడు వక్రంగా చూడడం , ఇంద్రుడు శుక్రుడిని ఆరాధించడం , ఆయన కరుణించడం అనే అంశాలు కొత్తగా ఉన్నాయి. యధార్థంగా ఆ సంఘటనలు జరిగాయా ?"*


నిర్వికల్పానంద చిరునవ్వు నవ్వాడు. *“వివరిస్తాను. జాగ్రత్తగా వినండి. కారణాన్ని ఆధారం చేసుకుని కార్యాన్ని , ఫలితాంశాన్ని గుర్తించడం ఒక పద్ధతి. తదనంతర కాలంలో జరిగిన కార్యాన్ని బట్టి కారణాన్ని ఊహించడం ఒక పద్ధతి. మొదటి పద్ధతిలాగే ఇది కూడా తర్కబద్ధమైనదే ! శాస్త్రీయమూ అయినదే ! ఎలాగంటే , ఒకసారి నువ్వు పగలంతా నిద్రలో మునిగిపోయావు. నువ్వు లేచేసరికి సూర్యుడు అస్తమిస్తున్నాడు. సాయం సమయంలో అస్తమిస్తున్న సూర్యుడు ఉదయాన ఉదయించాడా అని నువ్వు ఆలోచించవు. సూర్యోదయాన్ని చూడకపోయినా , ఉదయించాడని నిశ్చయంగా అనుకుంటావు. అది సత్యం కూడా !"*


*“అదే విధంగా , నవగ్రహాలలో ఒకానొక గ్రహం అశుభ దృష్టిని ప్రసరించబోతోందనీ , ఫలితంగా కష్టనష్టాలు సంభవిస్తాయనీ జ్యోతిషగణన చెప్తుంది – ముందుగా పరిశీలిస్తే. అలా కాకుండా , కష్టనష్టాలు వాటిల్లిన అనంతరం జాతక గణన చేస్తే , ఏ గ్రహ వీక్షణం అశుభంగా ఉన్న కారణంగా ఆ కష్టనష్టాలు సంభవించాయో చెప్తుంది జ్యోతిషం. రెండవ విశ్లేషణను ఆధారంగా తీసుకుని , ఇంద్రుడికి కలిగిన నష్టాలకూ , కష్టాలకూ కారణం - ఐశ్వర్యాన్నీ , వైభవాన్నీ కరుణించే శుక్రగ్రహ వక్రవీక్షణ అని అనుకోవడంలో తప్పులేదు.*


*"మరొక అంశం ఏమిటంటే శుక్రుడు అసుర గురువు. దేవతలకు సహజ శత్రువు.. ఆయన దేవరాజైన ఇంద్రుడిని క్రూరంగా చూడడంలో ఆశ్చర్యం లేదు. సందేహించాల్సిన అవసరమూ లేదు. నవగ్రహాలు దైవ స్వరూపాలు. ఆగ్రహించడంలో , అనుగ్రహించడంలో ఆ గ్రహదేవతలకు దేవ , దానవ , మానవ జాతులన్నీ సమానమే ! అదే ఆ గ్రహదేవతల ఔన్నత్యం ! కాబట్టి , తన శిష్యుడైన బలిచక్రవర్తి విజయం కోసం శుక్రుడు సురసార్వభౌముడైన ఇంద్రుడి మీద వక్రవీక్షణను ప్రసరించడంలోనూ , తదనంతరం ఇంద్రుడి ప్రార్థనను మన్నించి , వక్రదృష్టిని ఉపసంహరించి సక్రమ దృష్టిని ప్రసరించడంలోనూ - ఆశ్చర్యం ఏమీ లేదు !"*


*"గురువు గారూ ! మరొక సందేహం..."* శివానందుడు అన్నాడు. అడగమన్నట్టు నిర్వికల్పానంద తల పంకించాడు.


*“శుక్రుడు ఇంద్రుడికి ప్రసన్నం కావడం వల్ల బలిచక్రవర్తికి అన్యాయం జరిగింది కదా ? అది శుక్రుడికి మచ్చ కదా ?"*


*"కాదు ! తార్కికంగా ఆలోచిస్తే శుక్రుడు బలికీ , ఇంద్రుడికీ ఇద్దరికీ మహర్దశ కలిగించే ప్రయత్నమే చేశాడు. గురువుగా , మంత్రాలోచన చెప్పే మేధావిగా బలిచక్రవర్తిని దానం చేయవద్దంటూ వారించాడు. కలశ రంధ్రానికి అడ్డుపడ్డాడు. ఆ ప్రయత్నంలో కన్ను పోగొట్టుకున్నాడు. ఆ విధంగా గురువుగా తన విధిని నిర్వర్తించాడు. గ్రహదేవతగా ఇంద్రుడిని కరుణించాడు !"*


*"మీ విశ్లేషణ చక్కటి సమన్వయంతో , తార్కికంగా తృప్తి కలిగించే విధంగా సాగింది , గురువుగారూ !"* సదానందుడు మెప్పుగా అన్నాడు.


*"స్పష్టంగా లేని విషయాలను తార్కికమైన సమన్వయంతో సాధించి , నిర్ధారణ చేయాలి. మీకు చక్కటి అవగాహన కలగడానికి మరొక ఉదాహరణ చెప్తాను. వధూవరులకు వివాహం జరిగింది. కాలక్రమంలో వాళ్ళకు కొడుకు పుట్టాడు. అరె ! కొడుకు పుట్టాడే... ఆ ఇద్దరి మధ్యా దాంపత్యం సాగిందా ? అని అనుమానించడం ధర్మం కాదు కదా ! మన కంటికి కనిపిస్తున్న కొడుకుని ఆధారంగా చేసుకుని , ఆ ఇద్దరి మధ్యా దాంపత్యం జరిగిందనీ , అది ఫలించిందనీ నిర్ధారణగా అనుకుంటాం కద ! ఇదీ అంతే ! ఇంద్రుడికి జరిగిన వైభవ నష్టం , ఐశ్వర్య నష్టం ఇవన్నీ శుక్రగ్రహ దుర్వీక్షణ ఫలితమే అని లెక్కగట్టడం అపరాధం కాదు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసి - శనిగ్రహ మహిమను శ్రవణం చేద్దాం !"* నిర్వికల్పానంద వివరించాడు.


*రేపటి నుండి శనిగ్రహ మహిమ ప్రారంభం*

 

👆 *సేకరణ:-  శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

భండనభీముఁడార్తజన బాంధవు

 చొప్పకట్ల

  శు భో ద యం!


"భండనభీముఁడార్తజన బాంధవు డుజ్జ్వలబాణతూణ కో

దండ కళా ప్రచండ భుజతాండవకీర్తికి రామమూర్తికిన్

రెండవసాటి దైవ మికలేడనుచున్ గడఁగట్టి భేరికా

డాండ డడాండ డాండ నినదంబు లజాండమునిండ మత్త వే

దండము నెక్కి సాటెదను దాశరధీ! కరుణాపయోనిధీ!!

            -రామదాసకృతము.

జగద్గురువుల పరంపర

 అవిచ్ఛిన్న జగద్గురువుల పరంపర

పూరి 145మంది

ద్వారకా 78మంది

బదరీ 46మంది ( విచ్చిన్నం)

శృంగేరి 37మంది

కంచి 70మంది 


జగద్గురువులు

 పూరి పీఠం ( గోవర్ధన మఠం) 145 అధిక సంఖ్యలో ఉన్నారు , అక్కడి పీఠాధిపతులు కొద్ది సంవత్సరాలు మాత్రమే పీఠాధిపత్యం నిర్వహించి, తదుపరి ఉత్తరాధికారికి పీఠాధిపత్యం ఇచ్చివేసి వారు ,ఆత్మ నిష్టలో ఉండిపోయేవారు , అందువలన పూరీకి అత్యధిక జగద్గురువులు కలిగి ఉన్నారు.


ఇక బదరీ విషయానికి వస్తే , దురదృష్టవశాత్తు 165 సంవత్సరాలకు పూర్వం బదరీ పీఠ జగద్గురు పరంపర

విచ్చిన్నమయ్యింది ( ఆగిపోయింది) మరలా దాన్ని  విదేహముక్తులు అయినటువంటి జగద్గురు శ్రీ బ్రహ్మానంద సరస్వతి స్వామి వారి పునరుద్ధరించారు ,

ఆ తర్వాత శ్రీ కృష్ణబోదాశ్రమ స్వామి వారు ఆ తరువాత  శ్రీ స్వరూపానంద సరస్వతి స్వామి ఇప్పుడు ప్రస్తుత పీఠాధిపతిగా జగద్గురు శ్రీ అవిముక్తానంద  స్వామి వారు కొనసాగుతున్నారు, 


అన్నిటికంటే అత్యంత స్వల్ప ( తక్కువ) పీఠాధిపతుల సంఖ్య శృంగేరికి మాత్రమే కలిగి ఉన్నది , కారణం వారు శ్రీ ఆది శంకరాచార్యుల వారిని క్రీస్తు శకం 788 సంవత్సరంలో జన్మించారని పరిగణిస్తారు , 

అనగా ఇప్పటికీ 1232 సంవత్సరాలు  అయినది

కావున వారి సంఖ్య 37 మంది మాత్రమే ఉన్నారు, 

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే , 

మిగతా ప్రముఖ నాలుగు పీఠాలు అయినా బదరీ పూరీ ద్వారకా కంచి పీఠాలు మాత్రం శంకరాచార్య స్వామి వారు క్రీస్తుపూర్వం 509 వ సంవత్సరంలో జన్మించారని సత్యాన్ని తెలియజేస్తున్నాను

అందువలన వారి పీఠాధిపతుల సంఖ్య హెచ్చుగా ఆ సంవత్సరానికి సరిపోయే విధంగా ఉన్నది, 


ఆదిశంకరాచార్య స్వామి జనన  కాలం భారత ప్రభుత్వం వారు ఇప్పటికీ అధికారికంగా క్రీస్తు శకం 788 అనే చెబుతున్నారు ఎందువలన అంటే

భారత  చరిత్రను ఆంగ్లేయులు మరియు కమ్యూనిస్టులు రచించారు, వారు అనేక కుట్రల ద్వారా భారత చరిత్ర చాలా హీనంగా హేయంగా చిత్రీకరించారు, అందువలన ఆదిశంకరాచార్యుల జన్మ సంవత్సరాన్ని దాదాపు 1500 సంవత్సరాలు తగ్గించేశారు, 

ఈ విషయాన్ని అనేక భారత సాంప్రదాయ చరిత్రకారులు సాధికారికంగా ఖండించారు

అనేక కోణాలలో ప్రమాణాలు చూపించారు

అయినా ఇప్పటికే మన భారత దేశ చరిత్ర మార్చబడలేదు, 

దురదృష్టవశాత్తు దానినే జగద్గురు పీఠమైనటువంటి శృంగేరి శారదా పీఠం వారు కూడా క్రీస్తు శకం 788 ప్రమాణంగా తీసుకోవడం చాలా బాధాకరం.

అందువల్లనే శృంగేరి జగద్గురుల పరంపర 37 మాత్రమే ఉంటుంది, 

జయ జయ శంకర హర హర శంకర,

సుభాషితమ్

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


// *శ్లోకం* // 


*కంఠగతై ర్యసుభికస్య*    

*హ్యాత్మా నశక్యతే జేతుమ్*!    

*మూర్ఖ స్యశంకితస్యచ*,          

*విషాదినోవా కృతఘ్నస్య*!!!!!      


/- *_సంస్కృత సూక్తి సుధ_* /-


భావము -  *చావుకు సిద్ధమై ఉండికూడా ఎవరి చిత్తం వశం కాకుండా ఉంటుంది... మూర్ఖుడు, ప్రతి విషయంలోనూ సంశయించేవాడు, ఎప్పుడూ దుఃఖించే స్వభావం కలవాడు, చేసిన మేలు మరచేవాడు---- మరణం ఆసన్నమైవున్నా ఆత్మను జయించలేరు*.....

శ్రీమద్భగవద్గీత

 🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*శ్రీమద్భగవద్గీత - 2వ అధ్యాయము* 

. *సాంఖ్య యోగము*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹 

ఈ అధ్యాయములో అర్జునుడు, పరిస్థితిని తట్టుకోవడంలో ఉన్న తన పూర్తి అశక్తతని పునరుద్ఘాటించి, ఆసన్నమైన యుద్దంలో తన విధిని నిర్వర్తించడానికి నిరాకరించాడు. ఆ తరువాత శ్రీ కృష్ణుడిని తన ఆధ్యాత్మిక గురువు గా ఉండమని పద్ధతి ప్రకారముగా, మర్యాదపూర్వకంగా ప్రాధేయపడి, తను ఉన్న ఈ పరిస్థితిలో ఏమి చెయ్యాలో తనకు దిశానిర్దేశము చేయమని శ్రీ కృష్ణుడిని బ్రతిమాలతాడు. శరీరము నశించినా, నశించిపోని, మరణము లేని ఆత్మ గురించి చెప్పటం ద్వారా దివ్య జ్ఞానాన్ని విశదీకరించటం ప్రారంభిస్తాడు, ఆ పరమాత్మ. ఒక మనిషి పాత బట్టలు తీసివేసి కొత్త బట్టలు ఎలాగైతే వేసుకుంటాడో ఆత్మ అనేది కేవలం ఒక జీవిత కాలం నుండి ఇంకో జీవిత కాలానికి శరీరాలను మార్చుకుంటుంది. ఆ తరువాత శ్రీ కృష్ణుడు సామాజిక భాధ్యతల గురించి ప్రస్తావిస్తాడు. ధర్మాన్ని పరిరక్షించడానికి యుద్ధం చేయవలసిన తన క్షత్రియ భాద్యతలను అర్జునుడికి గుర్తుచేస్తాడు. సామాజిక భాధ్యతని నిర్వర్తించటం ఒక పవిత్రమైన ధర్మమని, అది ఉత్తమ గతుల వైపు దారి చూపుతుందని, అదేసమయంలో, కర్తవ్య ఉల్లంఘన వలన అవమానము, తలవంపు, అపకీర్తి కలుగుతాయని చెప్తాడు.

అర్జునుడిని లౌకిక స్థాయి నుండి పైకి తీసిన శ్రీ కృష్ణుడు, తదుపరి, కర్మ శాస్త్రాన్ని లోతుగా విశదీకరిస్తాడు. కర్మ ఫలాలపై అనురక్తి పెంచుకోకుండా కర్మలను ఆచరించమని అర్జునుడికి సూచిస్తాడు. ప్రతిఫలాన్ని ఆశించకుండా కర్మలని ఆచరించడాన్ని 'బుద్ధి యోగము' అన్నాడు. బుద్దిని ఉపయోగించి మనము కర్మ ప్రతిఫల కాంక్షని నిగ్రహించాలి. ఇలాంటి దృక్పథంతో పని చేస్తే, బంధాన్ని కలిగించే కర్మలే, బంధ-నాశక కర్మలుగా మారిపోయి, అర్జునుడు దుఃఖ రహిత స్థితిని చేరుకుంటాడు.

దివ్య జ్ఞానం లో ఉన్న వారి లక్షణాల గురించి అర్జునుడు అడుగుతాడు. దానికి జవాబుగా, శ్రీ కృష్ణుడు, ఆధ్యాత్మిక జ్ఞానం లో ఉన్న వారు మోహము, భయం, కోపములకు అతీతంగా ఎలా ఉంటారో విశదీకరించాడు. వారు సుఖః-దుఃఖాలను సమానంగా స్వీకరిస్తూ, అన్ని పరిస్థితులలో ప్రశాంతంగా ఉంటారు; వారి ఇంద్రియములు నిగ్రహించబడి ఉంటాయి; వారి మనస్సు ఎప్పుడూ భగవంతునిలో లీనమై ఉంటుంది; మానసిక క్లేశములైన - కామము, క్రోధము, లోభములు - ఎలా ఎదుగుతాయో, వాటిని ఎలా నిర్మూలించవచ్చో, దశల వారీగా శ్రీ కృష్ణుడు విశదీకరిస్తాడు.

🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷

. *🌹శ్రీమద్భగవద్గీత🌹*

. *రెండొవ అధ్యాయము* 

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

. *సాంఖ్య యోగము*

. *శ్లోకము 01*

🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷


*సంజయ ఉవాచ ।*

*తం తథా కృపయావిష్టమశ్రుపూర్ణాకులేక్షణమ్ ।*

*విషీదంతమిదం వాక్యమువాచ మధుసూదనః ।।*


*భావము:* 

సంజయుడు పలికెను : జాలి నిండినవాడై, శోకతప్త హృదయంతో, కంటి నిండా నీరు నిండిపోయున్న అర్జునుడిని చూసిన, శ్రీ కృష్ణుడు ఈ విధంగా పలికెను.

 

*వివరణ:*

అర్జునుడి మనో భావాలని వర్ణించడానికి సంజయుడు, 'కృపయా', అంటే జాలి లేదా కరుణ, అన్న పదం వాడాడు. ఈ కరుణ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి- ఈశ్వర విముఖత వల్ల భౌతిక జగత్తులో వేదనని అనుభవిస్తున్న జీవాత్మలపై భగవంతుడికి, సత్పురుషులకు కలిగే దివ్యమైన కరుణ. మరియొకటి - ఎదుటివారిలో శారీరిక కష్టాలని చూసినప్పుడు మనకు కలిగే భౌతికమైన కరుణ. భౌతికమైన కరుణ ఒక మహనీయమైన భావమే కానీ అది సంపూర్ణంగా సరియైనదే అని చెప్పలేము. అది, కారులో డ్రైవర్ ఆహారం లేక ఆకలితో అలమటించి పోతుంటే, కారు పరిస్థితి గురించి ఆలోచించినట్టుగా ఉంటుంది. అర్జునుడు ఈ రెండవ శ్రేణి మనోభావం అనుభవిస్తున్నాడు. యుద్ధం కోసం చేరివున్న శత్రువులపై అతనికి భౌతికమైన కారుణ్యం పెల్లుబికింది. అర్జునుడి నిరాశ, శోకం తో తల్లడిల్లిపోతున్న పరిస్తితి చూస్తే, అతనికే కనికరము అవసరం వుంది అని తెలుస్తోంది. కాబట్టి తను వేరే వారి మీద దయతో ఉండటం అనేది అర్థరహితమైనది.

ఈ శ్లోకం లో శ్రీ కృష్ణుడు “మధుసూదనా” అని పిలవబడ్డాడు. మధు అనే రాక్షసుడిని సంహరించాడు కాబట్టి ఆయనకు ఆ పేరు వచ్చింది. ఇక్కడ అర్జునుడి మనస్సులో జనించిన, స్వధర్మాన్ని నిర్వర్తించటానికి అడ్డుగావున్న, అనుమాన రాక్షసిని మట్టుబెట్టబోతున్నాడు.



👆 *సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

వేమన పద్యములు

 🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

. *🌹వేమన పద్యములు🌹* 

. *అర్థము - తాత్పర్యము*

. *Part - 9*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹


*💥వేమన పద్యాలు-- 22*

      

*అండమండము గన నన్నియు నటుపిండ*

*మండమెట్లో బమ్మ యండ మట్లే*

*కర్మబంధమునను గానరే యీ నరుల్* 

*విశ్వదాభిరామ రామ వినుర వేమా !*


*🌹తాత్పర్యము --*

కర్మను ఎవరూ తప్పించలేరు గదా !

అండ పిండ బ్రహ్మాండములు కర్మబంధమునకు మూలములు.


*💥వేమన పద్యాలు -- 23*

 

*అండమందునుండు నఖిలమై జనులార*

*ఎందులేక యుండు నెరుగు నతడె*

*యతని పూజఫలము నందె నాశివయోగి* 

*విశ్వదాభిరామ రామ వినుర వేమా !*


*🌹తాత్పర్యము --*

మనిషి పూజాఫలమే శివ సాక్షాత్కారమునకు ముఖ్యము.


*💥 వేమన పద్యాలు -- 24*

 

*అండములో నాకాశం*

*బుండంగా జూడ జూడ నొనరగ దీపై*

*యుండును నంతయు దెలిసిన*

*మెండుగ నొక ముక్తి కాంత మెలగుర వేమా*


*🌹తాత్పర్యము --*       

సర్వజ్ఞునికి మోక్షము సులభము.

ముక్తి కాంత సర్వజ్ఞుని మెచ్చుకొనును.


*పార్వతీపరమేశ్వరుల దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ శుభరాత్రి* 


*సర్వేజనా సుఖినోభవంతు*


👆 *సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

భాగవతము

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

*🌹పోతనామాత్యులవారి భాగవతము నందలి ఆణిముత్యాలు🌹*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*తృతీయ స్కంధము*


*హరి నరుల కెల్లఁ బూజ్యుఁడు*

*హరి లీలామనుజుఁడును గుణాతీతుఁడు నై*

*పరఁగిన భవ కర్మంబులఁ*

*బొఁరయం డఁట హరికిఁ గర్మములు లీల లగున్.*


మహానుభావా! ఉద్ధవా! కర్మవశం వలన పుట్టిన జీవులందరికీ శ్రీహరి పూజింప దగినవాడు. ఆయన కోరికోరి కొన్ని మహాకార్యాలను చేయటానికి భూమిపై పుడుతూ ఉంటాడు. అందువలననే ఆయనను లీలామనుజుడు అంటారు. జీవులందరు సత్త్వము, రజస్సు, తమస్సు అనే గుణాలనుబట్టి మెలగుతూ ఉంటారు. దానివలన వారు బంధాలను వదలించుకోలేరు. కానీ శ్రీహరి గుణాలకు లోబడినవాడుకాడు. కాబట్టి ఆయనకు కర్మబంధాల అంటుసొంటులు ఉండవు. ఆయన చేసే కర్మములు ఆ విధంగా లీలలు అవుతాయి.


👆 *సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

నేటివేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*

               🌷🌷🌷

ప్రముఖ వేదపండితులు, *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటివేద ఆశీర్వచనం *(25-01-2024 గురువారం)* 


https://youtu.be/HTjWSJKqiRk?si=58yFLC17Clb8rWuk


🙏🙏

రాశిఫలాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️


•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

*25-01-2024 / గురువారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

మేషం


వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురి అవుతారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులు కష్టసాద్యంతో పూర్తవుతాయి. స్ధిరాస్తి వ్యవహారాలలో పెద్దలతో మాటపట్టింపులు తప్పవు. సంతాన విద్యా విషయాలు నిరుత్సాహపరుస్తాయి.

---------------------------------------

వృషభం


సోదరులతో మనస్పర్ధలు తొలగుతాయి. గృహ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలసి వస్తాయి. అవసరానికి ఇతురుల నుండి ధన సహాయం అందుతుంది. నూతన ఉద్యోగ అవకాశలు అందుతాయి.

---------------------------------------

మిధునం


నూతన వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు అధికారుల నుండి ఒత్తిడి తప్పవు. నేత్ర సంభందిత అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. చేపట్టినపనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గంధరగోళంగా ఉంటుంది. దైవ చింతన పెరుగుతుంది.

---------------------------------------

కర్కాటకం


సంతాన విద్యా ఉద్యోగం విషయాలు సంతృప్తి కరంగా సాగుతాయి. వ్యాపారాలలో ఆశించిన విధంగా రాణిస్తారు. సంఘంలో  గౌరవ మర్యాదలకు లోటుండదు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.

---------------------------------------

సింహం


ఆదాయనికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఋణదాతల ఒత్తిడి పెరుగుతుంది. ఉదర సంబంధ అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. వ్యాపారాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. వృత్తి ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

---------------------------------------

కన్య


సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు  సత్ఫలితాలు ఇస్తాయి. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. గృహమున సంతాన శుభకార్య విషయమై ప్రస్తావన వస్తుంది. ముఖ్యమైన పనులు బంధు మిత్రుల సహాయ సహకారాలతో పూర్తి చేస్తారు.

---------------------------------------

తుల


ఉద్యోగమున చాలా కాలంగా వేదిస్తున్న సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపార వ్యవహారాలు  ఆశాజనకంగా సాగుతాయి. ఇంటాబయటా అనుకూల వాతావరణం  ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలతో ముందుకు సాగడం మంచిది. బంధువులలో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

---------------------------------------

వృశ్చికం


ఒక వ్యవహారంలో ఇతరుల ప్రవర్తన వలన మానసిక అశాంతి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు   విఫలమౌతాయి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి మాటపట్టింపులుంటాయి. చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. 

---------------------------------------

ధనస్సు


వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. నిరుద్యోగులకు అతి కష్టం మీద అల్ప ఫలితం పొందుతారు. ఉద్యోగాలలో  బాధ్యతలు మరింత అధికమౌతాయి. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.  కొన్ని వ్యవహారాలు సమస్యాత్మకంగా సాగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. 

---------------------------------------

మకరం


ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు కలసి వస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

---------------------------------------

కుంభం


బంధు మిత్రులతో  సఖ్యత పెరుగుతుంది. వ్యాపారాలలో  శత్రు సమస్యలు నుండి తెలివిగా బయటపడతారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక  ఆలోచనలు అనుకూలంగా సాగుతాయి. వృత్తి  ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు.

---------------------------------------

మీనం


నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దూరప్రాంత బందు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగమున మంచి పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. కీలక సమయంలో మంచి ఆలోచన జ్ఞానంతో ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

🍁 *శుభం భూయాత్* 🍀