25, డిసెంబర్ 2025, గురువారం

గుండె బలహీనత

  గుండె బలహీనత పోగొట్టు సిద్ద యోగములు  -

 

*  తవాక్షరి చూర్ణంని తేనెతో సేవించుచున్న గుండెకు మంచి బలం కలిగి గుండె బలహీనత తొలగును .

 

*  కోడిగుడ్డు సొన పాలతో బాగుగా కలియునట్లు చేసి దానిలో మిరియాల చూర్ణం , చక్కెర కలిపి ఉదయమే సేవించుచున్న బలహీనత తగ్గును. గుండెకు సత్తువ ఇచ్చును.

 

*  బెల్లపు పానకం లో మద్దిచెక్క చూర్ణంని కలిపి తాగిన గుండెజబ్బులు పోవును . దీర్గాయువుని ఇచ్చును.


 *  గోధుమలు , మద్దిచెక్క చూర్ణములను ఆవునెయ్యి మేకపాలలో వేసి పక్వముగా చేసి దానిలో చక్కర చేర్చి సేవించుచున్న గుండెజబ్బులు తొలగును . గుండె బలహీనత పొవును .


 *  మద్దిచెక్క చూర్ణం, నెయ్యి, పాలు కలిపి తాగుచున్న గుండె బలహీనత తగ్గును.

 

*  పెద్ద ముత్తువపులాగ చూర్ణంని పాలతో కలిపి తాగుచున్న గుండెబలహీనత , గుండెజబ్బు తగ్గును.

 

*  12 గ్రాముల స్వచ్ఛమైన తేనెను నీళ్లతో కలిపి ఉదయాన్నే తాగుచున్న గుండెజబ్బు నయం అగును.

 

*  మద్దిచెక్క చూర్ణంని పంచదారతో కలిపి తాగిన గుండెజబ్బు నయం అగును.

 

*  కటుకరోహిణి గంధమును గుండెకు పట్టువేసిన గుండెజబ్బు తొలగును .


 *  మారేడు వేరును కషాయంగా చేసి తాగుచున్న గుండెదడ హరించును .


 *  ఇంగువ 10 గ్రాములు , హారతి కర్పూరం 10 గ్రాములు  ఇవి రెండు నీళ్లతో నూరి గురిగింజలు అంత మాత్రలు చేసి పూటకి ఒకమాత్ర చొప్పున రోజూ రెండుపూటలా వేసుకొని అనుపానంగా 40 గ్రాములు జటామాంసి కషాయం తాగుచున్న యెడల గుండెదడ , ఆయాసం హరించిపోవును .

 

*  మూసామ్బారం నీళ్లతో నూరి గుండెలకు పట్టువేసిన యెడల గుండెలాగుట , పీకుట , ఆయాసం తగ్గును.


 *  గుండెల్లో మంట గా ఉంటే పుచ్చగింజలు 20 గ్రాములు నీటిలో రాత్రిపూట నానబెట్టి ఉదయమున ఆ నీటిలో ఆ గింజలను బాగా పిసికి పటికబెల్లం పొడి కొద్దిగా కలిపి ఆ తరువాత దానిని వడపోసి ఆ ద్రవమును తాగవలెను .

 

*  రావి ఆకులను నీళ్లలో నానబెట్టి మరునాడు ఉదయము దానిని వడబోసి తెల్లటి సీసాలో నిలువ ఉంచవలెను. ఆ ద్రావకం రోజుకి మూడుమార్లు 50ml చొప్పున తాగుచున్న గుండెదడ తగ్గును.

           


        పైన చెప్పిన వాటిలో కొలతలు లేకున్నచో 3 నుంచి 5 గ్రాములు చూర్ణపు మోతాదు తీసుకోవచ్చు . ద్రవపదార్థం 100 ml నుంచి 150 ml వరకు తీసుకోవచ్చు .  



ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు .  

 

 గమనిక  -

      

         నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

          

          నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 

   

ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

              

       ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

            

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 

         

                  కాళహస్తి వేంకటేశ్వరరావు .

              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .

                          9885030034

కురుక్షేత్ర మహా సంగ్రామము.*

  🌹🦜🙏🏽🦜🌹

    22.12.2025

      సోమవారం 


 *అంశం..కురుక్షేత్ర మహా సంగ్రామము.* 

.................................................... 


 *ఉత్పలమాల...* 


దాయల క్రౌర్యనీతి, ఘన దౌత్యపు 

రీతియు, ద్వేషముల్, పగల్ , 


న్యాయము కానరాదు, గురునాజ్ఞల

వీడిన కౌరవేంద్రుడున్, 


మాయ దురోదరంబు, మతిమాలిన

స్నేహము, హీన సంస్కృతుల్ , 


సాయము సేయు గీతయును సాక్షిగ

నిల్చెగ సంగరంబునన్!!

..................................................... 

🦄🐓🦜🦢🐘

పి.ఎల్.నాగేశ్వరరావు 

హైదరాబాదు

గంగానది నేలపైకి

 


శ్రీభారత్ వీక్షకులకు శుభాకాంక్షలు 🌹

   ప్రతి విద్యార్థి ఒక భగీరథుడు కావాలి అనే ఒక గొప్ప సందేశంతో చక్కని గంగావతరణ కథను ఈ ఎపిసోడ్ లో అందిస్తున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డా. తిరుమల నీరజ గారు. దేవ లోకంలో ప్రవహించే గంగానది నేలపైకి ఎందుకొచ్చింది? ఎలా వచ్చిందనే ప్రశ్నలకు ఈ కథలో సమాధానం లభిస్తుంది. పితరుల రుణం తీర్చుకోవడం ఎంత అవసరమో, దానిని ఎలా తీర్చుకోవాలో, అందుకు ఎంత కష్టపడాలో, దానికి ఎంతటి దివ్యమైన ఫలితం లభిస్తుందో ఈకథ వింటే అర్థమవుతుంది. పూర్తిగా వినండి మరి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

రఘురామచంద్ర పురుషోత్తమ

 హరిః ఓం నమః.

శ్రీసద్గురుపరంపరాభ్యాం నమః.

శాస్త్రార్థప్రతిపాదకం పరమకం సత్యప్రకాశాంతర్గతం

సాక్షద్బ్రహ్మపదదావలంబితచణం సాఫల్యసామర్థ్యకమ్ l  

సర్వవ్యాపితవ్యోమసామ్య మచలం సంశుద్ధబుద్ధ్యాత్మకం

సచ్చిత్సౌఖ్య రసైకలాభ మమలం శ్రీసద్గురుం భావయే ll


శ్రీసీతారామచంద్ర పరబ్రహ్మణే నమః.


ఓ రఘురామచంద్ర పురుషోత్తమ జానకినాధ మన్మథా

కార వినీలదేహ ఘనకార్ముకధారి ధరాధినేత దు

ర్వారమహాప్రతాప మునివందిత దివ్యపదారవింద గం

భీరవిరాజమానముఖ భీకరదైత్యవినాశ ఘోరసం

సారభయాపహార గణసాగర నన్ గృపజూప వేడెదన్ ll 


      జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.

        ---- పరమహంస ----

చిత్తూరు జిల్లా : తిరుపతి

 🕉 ధనుర్మాసం సందర్భంగా


🔅 చిత్తూరు జిల్లా : తిరుపతి 


🔅శ్రీ గోవిందరాజస్వామి ఆలయం : తిరుపతి:

🔅 తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తుల్లో కొందరు వెంకన్నకు పెద్దన్నగా చెప్పబడే శ్రీ గోవిందరాజస్వామిని ముందుగా దర్శించుకొంటారు.

తమ్ముడి వివాహానికి కుబేరుడు అప్పుగా ఇచ్చిన ధనాన్ని కొలిచి కొలిచి అలసిపోయి తల కింద కుంచం పెట్టుకుని దిగువ తిరుపతిలో విశ్రాంతి తీసుకొంటున్నాడట. 


👉శ్రీ గోవిందరాజ స్వామి గుడి తిరుపతి పరిసరాల్లోని గుడులన్నిటికంటే పెద్దది. ఇక గుడి రాజగోపురం అత్యంత ఆకర్షణీయంగా వుంది. సుదూర ప్రాంతం నుంచే కనిపిస్తుంది. 

 

👉 ఈ ఆలయాన్ని కేంద్రంగా చేసుకొని నూతన పట్టణం ఏర్పడింది. అదే అభివృద్ధి చెందిన తిరుపతి మహానగరి. గోవిందరాజులు వెలసినారు కాబట్టి గోవిందరాజపట్టణం అనీ, రామానుజచార్యుల

వారు ప్రతిష్టించారు కనుక రామానుజపురం అనీ పిలిచేవారు. కాలక్రమేణ తిరుపతిగా మారింది. తిరు అంటే తమిళంలో శ్రీ అని అర్థం. శ్రీపతి అంటే వేంకటేశ్వరస్వామి అని కూడా అర్థం.


👉ఆ ఆలయ ప్రాంగణంలో పార్థసారథి శ్రీకృష్ణుడు (వేణుగోపాలుడు), ఆండాళ్ తదితర దేవాలయాలు ఉన్నాయి. విజయనగర శైలిలో నిర్మితమైన ముఖ మండపాలు, కళ్యాణ నుండపాలు అందులోని విశేష శిల్పసంపద అద్భుతంగా వుంది.


👉 తిరుపతి పట్టణంలో అడుగు పెడుతూనే యాత్రీకులను ముఖ్యంగా ఆకర్షించేది గోవిందుని రాజగోపురమే. ఆలయ రాజగోపురాన్ని మట్టి అనంతరాజు క్రీ.శ. 1624లో నిర్మించారు.


👉 శ్రీరామానుజా చార్యులు క్రీ.శ. 1129-30లో “ఎంబెరుమానార్' బిరుదాంకితమై తిరుమలకు వచ్చాడు.

 శ్రీ గోవిందరాజు విగ్రహ ప్రతిష్ట 24-2-1130 జరిగిందనే దానికి శాసన ఆధారాలున్నాయి.

రామానుజుని ఆదేశం ప్రకారం శయనమూర్తి విగ్రహ నిర్మాణం జరిగేటప్పుడు అనుకోని విధంగా మూర్తి భిన్నమయింది. భంగమయిన శయిన మూర్తి గోవిందుని అసలు విగ్రహాన్ని నరసింహాతీర్థం (మంచినీళ్ళ గుంట) ఒడ్డులో వదలి, ముహూర్త సమయం దగ్గరపడడంతో సున్నం (సుద్దతో విగ్రహాన్ని నిర్మించి ప్రతిష్టించారు. అందుకే శ్రీగోవింద రాజ స్వామి ఆలయంలో స్వామి వారికి అభిషేకాలుండవు. కేవలం "తైలకాపు" సేవలు మాత్రమే చేస్తారు.


👉ఈనాడు మనం చూస్తున్న విగ్రహం నిజమైన మూలవిరాట్ కాదు...శుద్ధతో చేసిన పెట్టుడు విగ్రహం. 


👉 చిదంబరంలో ఉత్సవ విగ్రహంగా వుండిన గోవింద రాజ స్వామి వారి విగ్రహం ఇక్కడ మూల విరాట్టు అయింది. అప్పటిటి వరకు మూల విరాట్టయిన వరద రాజ స్వామి విగ్రహం ఉత్సవ విగ్రహం అయింది.


👉 శ్రీ గోవిందరాజ స్వామి విగ్రహం ప్రతిష్ఠకు ముందే శ్రీ పార్థసారథి ఆలయం వుంది. ఇది ప్రధాన ఆలయం అనేదానికి కారణం మహా ద్వారానికి ఎదురుగా ఆలయం దక్షిణదిశలో శ్రీపార్థసారధి ఉత్తర దిశలో గోవిందుని ఆలయం వున్నాయి. 

శ్రీ అండాల్ అమ్మవారికి ఆలయంలో ప్రత్యేక సన్నిధామం ఉంది.


👉ఈ ఆలయానికి రాజగోపురం (శ్రీమట్టి అనంతరాయల గోపురం) 7 అంతస్తులతోను , బంగారు కలశాలతోను నిటారుగ తిరుపతి పట్టణం మధ్యలో ప్రత్యేకతను సంతరించుకొని వుంది. 

ఈ గోపురం కాకుండా మరో రెండు గోపురాలున్నాయి. నడిమిగోపురం 15వ శతాబ్దంలో నిర్మితమయింది. ఈ గోపురపు అధిష్టానంలో గోడల పై రామాయణంలో రాముడు తన బాణంలో 7తాటి చెట్లను కూల్చిన దృశ్యం, భాగవతంలోని గోపికా వస్త్రాపహరణ దృశ్యాలను చెక్కబడి వుంది, అంతేకాక అనేక దేవతా మూర్తుల శిల్పాలు కూడా ఉన్నాయి.


👉 శ్రీపార్థసారధి ఆలయ ముఖమండపం కళ్యాణమండపం శ్రీకృష్ణదేవరాయల కళాభిరుచికి దర్పణం. ఇందులో శిల్పకళా నైపుణ్యం ప్రదర్శించబడింది. ముఖ్యంగా ఈ మండపంలో 4 విశిష్టమయిన నల్లరాతి స్థంభాల్లో ఎన్నో శిల్పాలున్నాయి. కేవలం ఐదారు అంగుళాల ఎత్తుగల కోలాట నృత్యభంగిమల శిల్పాలు వేదికపై కప్పులో వున్నాయి.


👉గోవిందుని ఆలయంలో వసంతమండపం, నీరాళీ మండపం, చిత్రకూట మండపం, కుంభ హారతి, లక్ష్మీదేవి మండపాలున్నాయి. ఆలయానికి అనుబంధంగా పుష్కరిణి ఉంది. దీనిని గోవిందరాజు పుష్కరిణి అంటారు. ఈ పుష్కరిణ లోనే తెప్పోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ తెప్పోత్సవాలనే 'నీరాజోత్సవం' అని కూడా అంటారు.


👉 అనేక ఇతర సన్నిధానాలు ఈ ఆలయంలోని ప్రత్యేకత. 

శ్రీపార్థసారథి ఆలయం, గోదాదేవి గుడి (అండాళ్ సన్నిధి) శ్రీకళ్యాణ వేంకటేశ్వర ఆలయం, శ్రీలక్ష్మీ దేవి ( పుండరీక వల్లి తాయారు) గుడి, శ్రీభాష్యకారుల సన్నిధి (రామానుజాచార్యులు), శ్రీ తిరుమలనంబి, శ్రీమధురకవి ఆళ్వార్ల సన్నిధి. శ్రీ తిరుమంగై అళ్వారు. శ్రీవేదాంత దేశికుల సన్నిధులు వున్నాయి. విశేషంగా గోవిందుని ఆలయంలో దాదాపుగా ప్రతిరోజూ ఏదో ఒక ఉత్సవం ఉంటుంది. అది ఆళ్వారుల వారోత్సవ, పక్షోత్సవ, నక్షత్రోత్సవాలు బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి.


👉 ఎప్పుడూ కళకళాడుతుండే ఈ ఆలయంలో నిత్యకళ్యాణాలే అధికారులు, ఇతర ప్రభుత్వాధికారులు - జడ్జిలు - సాధారణంగా ఈ ఆలయానికి విచ్చేసి దర్శనాడులు నిర్వహించుకొని తమ మొక్కులు తీర్చుకుంటుంటారు,


కానీ రాజకీయ నాయకులు మాత్రం ఈ గుడికి రావాలంటే వెనుకంజ వేస్తారు. రాజకీయ హోదాలో గుడిలో కాలుపెడితే పదవి కాస్తా గోవిందా! ఇది మాత్రం బలమయిన నమ్మకం.

శీతలమ్మధికమై

 ఆ.వె.

భూతలమ్మునందు శీతలమ్మధికమై 

చలికి వడకజొచ్చె జనులు ఘనులు 

ధనువు వంగినట్లు తనువెల్ల వంగగా 

వంగి వంగి మసలె పవలురాత్రి 

*~శ్రీశర్మద*

24, డిసెంబర్ 2025, బుధవారం

పంచాంగం

 


అది నువ్వే


అది నువ్వే


ఒకరోజు సాయంత్రం 7 గంటల సమయంలో సీతాదేవి తన ఇంట్లో ఏదో పాత బట్ట చేత్తో కుట్టుకుంటున్నది. దారాన్ని తెంపి కొత్తదారం సూదిలోకి ఎక్కిద్దామని ప్రయత్నిస్తుండగా కరంటు పోయింది చేతిలోంచి సూది జారీ పడింది. ఇల్లంతా చీకటి సూదిని ఎలా వెతకాలి అని ఒక కొవ్వొత్తి వెలిగించి కొవ్వొత్తి కాంతిలో వెతకటానికి ప్రయత్నించింది. కానీ సూది ఎక్కడ  పడ్డదో ఆమెకు ఎంతవెతికిన కనిపించటం లేదు. ఇంతలో ఆమె భర్త రామారావు ఇంట్లోకి వచ్చాడు. ఇల్లంతా చీకటిగా వుంది తన భార్య కొవ్వొత్తి వెలుగులో ఏదో వెతుకుతుండటం చూసి ఏమి వెతుకుతున్నావు అని అడిగాడు. ఆమె జరిగినది మొత్తం చెప్పి సూదికోసం వెతుకుతున్నాను అని అన్నది. పిచ్చిదానా ఇంట గుడ్డి వెలుతురులో నీకు సూది కనపడుతుందా ఏమిటి బైట చూడు వీధి దీపం ప్రకాశమానంగా వెలుగుతున్నది రోడ్డుమీద వెతుకుదాం పద అని ఆమెను వీధిలోకి రమ్మని పిలిచాడు. ఏమండీ మీకు మాతికాని పోయిందా సూది నా చెతిలొనుంచి జారీ ఇంట్లో  పడ్డది బయట వెతికితే ప్రయోజనం ఏమిటీ అని ఆమె అంటే. పిచ్చిదానా బైట వెలుతురు బాగా వుంది కాబట్టి అక్కడ మనం వెతికితే వెతకటం తెలుస్తుంది తరువాత మనం అక్కడ దొరకక పొతే ఇంట్లో వెతుక్కోవచ్చు. ఇప్పుడు నాకు పూర్తిగా అర్ధం అయ్యింది మీ తెలివి ఎలా పనిచేస్తున్నదో అని ఆమె అని. మీకు చాతనయితే ఒక ఎక్కువ వెలుతురు ఇచ్చే దీపాన్ని తీసుకొని రండి అప్పుడు నేను సూదిని వెతుక్కోగలను. వెలుతురు బైట ఉండవచ్చు కానీ వెలుతురు కావలసింది పోయిన వస్తువు వున్నచోట మాత్రమే. ఇదికూడా మీకు తెలియకపొతే యెట్లా అని భర్తతో అన్నది. 


నిజానికి ఈ దృష్టాంతరం చదివితే హాస్యాస్పదంగా కనపడుతుంది. కానీ ఇది మాత్రం అక్షర సత్యం. మనం దాదాపు కోఠిలో ఏవక్కరో తప్ప అందరం సూది ఇంట్లో ఉంటే వీధిలో వెతికే వారమే అంతేకాదు అక్కడ వెలుతు రూ ఎక్కువగా వుంది ఇక్కడ ఇంకా వెలుతురువుంది అని చెప్పే వాళ్ళ మాటలు విని అక్కడ ఇక్కడ మనం వెతుకుతూ వున్నాం కానీ సూది మాత్రం దొరకటం లేదు కేవలం కాలం గడుస్తుంది, జీవితం అయిపోతున్నది. ఇక విషయానికి వస్తే మిత్రమా 


ఈ రోజుల్లో ఆ గుడికి వెళ్ళండి, ఈ క్షేత్రానికి వెళ్ళండి అక్కడ దేవుడిని దర్శించుకోవటం ఎన్నో జన్మల పుణ్యం ఇక్కడి క్షేత్రంలో దేవుడు చాలా శక్తివంతుడు అని మనలను తప్పు త్రోవ పట్టించే వారు సమాజంలో అనేక మంది తయారుఅవుతున్నారు. దానితో సామాన్యుడు ఏది నిజమో ఏది కాదో తెలుసుకోలేక వారి మాటల గారడితో ప డి కాలాన్ని, ధనాన్ని వృధా చేసుకుంటున్నారని చెప్పటానికి బాధపడుతున్నాను. నిజానికి ఏ గుడికి వెళ్లినా ఏ తీర్థానికి వెళ్లినా నీకు మోక్షం రాదు కేవలం నీ సాధనకు మనస్సు కొంత తోడ్పడుతుంది. దానివల్ల నీకు కలిగే ప్రయోజనం చాలా తక్కువ. 


ఇది ఇలా ఉండగా ఈ రోజుల్లో అనేకమంది స్వామీజీలు, బాబాలు తమకు తామే దేవుళ్లమని పేర్కొనటమే కాకుండా ఇంకా కొంతమంది ఎప్పుడో గతించిన వారికి గూళ్లుకట్టి, పూజలు చేస్తూ మనలను కూడా పూజలు చేయమని ప్రోత్సహించటమే కాక నీవు ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడితే నీతో స్పర్ధకు దిగి వారి వాదనే సరైనదని అయన ఫలానా దేవుడి అవతారం, ఈయన ఫలానా దేవుడి అవతారం అని అయన ఆ మహిమలు చూపెట్టారు, ఈయన ఈ మహిమలు చూపెట్టారని మనలని మభ్యపెడుతూ మన జీవితాలను లక్ష్యంనుంచి విముఖులను చేస్తున్నారు. 


మన సాంప్రదాయంలో వక్తి పూజా ఆరాధనా ఎప్పుడు చెప్పలేదు. కేవలం అంటే కేవలం పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకుంటేనే మోక్షం సిద్ధిస్తుందని మన ఉపనిషత్తులు గోషిస్తున్నాయి. మానిషి కొంతకాలం తపస్సు చేస్తే కొన్ని దివ్య శక్తులు సంప్రాప్తం అవుతాయి. వాటిని అణువాది అష్టసిద్ధులు అంటారు అట్లా సిద్ధులను పొందినవారిని సిద్దులు అంటారు. సిద్ధులను పొందటం అంత అసాధ్యం ఏమీకాదు. కొంతకాలం తపస్సు చేస్తే చాలు వారు ఏవైతే మహిమలు అన్నారో అవి చాలామంది తాపసులు పొంది వున్నారు. మీరు కూడా పొందగలరు. అది ఏమి విశేషం కాదు.


వీళ్ళు చెప్పే బాబాలు, స్వామీజీలు మన మహర్షులముందు చాలా స్వల్పులు. వసిష్ఠ మహర్షి ఒక దర్భను జీవమున్న బాలునిగా చేసాడు, విశ్వమిత్ర మహర్షి స్వర్గాన్నే సృష్టించగలిగాడు. వీళ్ళు చెప్పే ఈ బాబాలు, స్వామీజీలు అంతకన్నా గొప్పవాళ్ళా ఆలోచించండి. 


ఇక వారు సద్గురువులని వారిని ఆరాధిస్తే మోక్షం వస్తుందని కొందరు అభిప్రాయపడుతుంటారు. మిత్రమా నిజానికి మోక్షాన్ని ఏ సద్గురువు కూడా యివ్వలేదు అది సాధకుడు తనకు తానుగా కఠోర దీక్షతో సిద్దించుకోవలసరైంది. గురువు పాత్ర చాలా చిన్నది. ఒక్కమాటలో చెప్పాలంటే నీవు ఒక రోడ్డు మీద వెళుతున్నావు అడవిలో ఆ రోడ్డు రెండుగా చీలింది. ఇప్పుడు నీవు ఏ రోడ్డుమీద వెళ్ళాలి అని అనుకుంటే అక్కడ నీకు ఒక మార్గదర్శిని (బోర్డు) కనిపించింది అది ఆ రెండు రోడ్లు ఎటువైపుకు వెళతాయో చూపిస్తుంది. దానిని అనుసరించి నీవు నీ గమ్యాన్ని చేరుకోవటానికి నీ కారును నీవే నడుపుకుంటూ వెళతావు. ఆ రోడ్డు దాటిన తరువాత అక్కడి సైను బోర్డు సంగతే మరచిపోతావు. నీ గురువు స్తానం కూడా అటువంటిదే నీకు మార్గదర్శనం చేస్తాడు. నీ మార్గంలో నీవే వెళ్ళాలి. ఆలా వెళ్లక గురువునే పూజిస్తూవుంటే కాలయాపన కాక వేరొకటి కాదు.  


కాబట్టి సాధక మిత్రమా నీవు ఎవరి మాటలు వినక నీకు నీవుగా నీ మార్గాన్ని (మోక్ష మార్గాన్ని) ఎంచుకో ఆ దిశగా నీవు ప్రయత్నం చేసి నీలో నీ హృదయాంతరాలలో నిగూఢంగా వున్న పరమాత్మను దర్శించుకో నీవు ఏ దేముడిగూర్చి గుడులకు వెళుతున్నావో ఆ దేవుడు గుడులలో కాదు నీహృదయంలోనే వున్నాడని మన వేదం మంత్రాలు గోషిస్తున్నాయి. 


పైన కధలో సీతాదేవి ఇంట్లో పారేసుకున్న సూదిని వీధిలో వెతుకుదామని రామారావు చెప్పినా నిరాకరించి ఇంట్లోనే వెతకటానికి నిర్ణయించుకుందో అదే మాదిరిగా నీవుకూడా నీలోనే దేవుడిని వెతకటానికి ప్రయత్నించు వెలుతురూ తక్కువైన వెలుతురూ ఎక్కువ చేసుకొని (ఇక్కడ వెలుతురూ అంటే జ్ఞ్యానం సరిపడిన జ్ఞ్యానం లేకపోతె జ్ఞ్యానులనుండి అంటే గురువులనుండి జ్ఞ్యానాన్ని పొంది నీవే వెతుకు )


ప్రతిరోజూ అన్ని దేవాలయాలలో పఠించే మంత్రపుష్పంలోని ఈ మంత్రాలను చుడండి 


యచ్చ కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతేఽపి వా ।


అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణః స్థితః ॥ 5 ॥


మనకు కనిపించేది వినిపించేది అది యెంత సూక్ష్మ  మైన కానీ అది పూర్తిగా నారాయణుడితో వ్యాపించి వున్నది. అటువంటప్పుడు భగవంతుని ఒక దేవాలయానికి పరిమితం చేయటం ఎంతవరకు సబబు. మీరే చెప్పండి. విశ్వమంతా వ్యాపించి వున్న దేవుడు దేవాలయాలలో కూడా వున్నాడు,  ఉండి  భక్తుల కోరికలను తీరుస్తున్నాడు. అంటే కేవలం ఐహిక వాంఛలను తీర్చుకోవటానికి మాత్రమే దేవాలయాలకు వెళ్ళాలి కానీ మోక్ష సిద్ధికి మాత్రం కాదు. ఇక బాబాలను, సాధువులను దేవుళ్లుగా కొలవటం ఔచుత్యం అనిపించుకోదు. 


అనన్తం అవ్యయం కవిం సముద్రేన్తం విశ్వశంభువమ్ ।


పద్మ కోశ ప్రతీకాశం హృదయం చ అపి అధోముఖమ్ ॥ 6 ॥


అధో నిష్ఠ్యా వితస్త్యాన్తే నాభ్యామ్ ఉపరి తిష్ఠతి ।


జ్వాలామాలాకులం భాతీ విశ్వస్యాయతనం మహత్ ॥ 7 ॥


సన్తతం శిలాభిస్తు లమ్బత్యా కోశసన్నిభమ్ ।


తస్యాన్తే సుషిరం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితమ్ ॥ 8 ॥


తస్య మధ్యే మహానగ్నిః విశ్వార్చిః విశ్వతో ముఖః ।


సోఽగ్రవిభజంతిష్ఠన్ ఆహారం అజరః కవిః ॥ 9 ॥


హృదయంలో (నీ) బంగారు కాంతులు విరజిమ్ముతూ వడ్ల గింజ కొసపరిమాణంలో భగవంతుడు వసించి వున్నాడు. ఆయనే సర్వాంతర్యామి, అది తెలుసుకొని నీకు నీవే దేవుడవు కమ్ము. 


మోక్ష మార్గం యెంత కఠినమైనదో ఉపనిషత్తు తెలుపుతున్నది. 




ఉత్తిష్ఠతా జాగ్రతా ప్రాప్య వరన్నిబోధతా .

క్షురస్య ధార నిశితా దురత్యయా

దుర్గాం పాఠస్తత్కవయో వదంతి .. ౧౪.. 

 

14 లేవండి! మేలుకో! గొప్పవారిని సంప్రదించి నేర్చుకోండి. రేజర్ యొక్క పదునైన అంచు వంటిది ఆ మార్గం, కాబట్టి తెలివైనవారు నడవడం కష్టం మరియు దాటడం కష్టం.  

ఒక రేజర్ బ్లేడు మీద నడవటం యెంత కష్టమో అంత కష్టం మోక్షమార్గంలో పయనించటం అని ఈ మంత్రం చెపుతున్నది. కాబట్టి సాదాకా కఠినాతి కఠినమైన మోక్షమార్గాన్ని ఎంచుకొని నీ శాయశక్తుల పణంగా పెట్టి మోక్షసిద్ది పొందు మోక్షం అంటే నిన్ను నీవు నీకుగా తెలుసుకోవటమే, అది తెలుసుకో చాందోగ్యఉపనిషత్‌లోని ఆరవ అధ్యాయంలో తత్ త్వం అసి మహావాక్యాన్ని వ్యక్తం చేసింది దీని అర్ధం ఏమిటంటే నీవు దేనినిగూర్చి వెతుకుతున్నావో అది నీవే అని తెలుసుకో. 

శ్రీకృష్ణ పరమాత్మ బోధించిన శ్రీమత్ భగవత్గీత, ఆది శంకరులు రచించిన అనేక ఆధ్యాత్మిక గ్రంధాలూ, మన మహర్షుల నుండి ఉద్బవించిన ఉపనిషత్తులను నిత్యం చదివి ఆకళింపు చేసుకొని, అనుసరించే సాధకునికి భగవంతుని గూర్చి, మోక్షాన్ని గూర్చి నిశీత , నిశ్చిత అభిప్రాయం ఏర్పడుతుంది. తెలిసి తెలియక బోధించెడి అజ్ఞ్యానుల మాటలు తేలికగా కనిపించి నిత్యము సత్యము, అనంతము అయిన పరబ్రహ్మ గూర్చి పరుగులిడతాడు.

ఓం తత్సత్ 


ఇట్లు 


మీ భార్గవ శర్మ

తిరుప్పావై ప్రవచనం‎- 9 వ రోజు*


వేకువ ఝామున పాడుకొనుటకు…

```


*తిరుప్పావై ప్రవచనం‎- 9 వ రోజు*

               ➖➖➖✍️

              9 వ పాశురము:


*తూమణి మాడత్తు చ్చుత్తుమ్ విళక్కెరియ*

*తూపమ్ కమళ త్తుయిలణై మేల్ కణ్ వళరుమ్*

*మామాన్ మగళే! మణిక్కదవమ్ తాళ్ తిఱవాయ్*

*మామీర్! అవళై యెళుప్పీరో! ఉన్ మగళ్ దాన్*

*ఊమైయో? అన్ఱిచ్చెవిడో? ఆనన్దలో*

*ఏమప్పెరున్దుయిల్ మన్దిరప్పట్టాళో?*

*"మామాయన్, మాదవన్; వైగున్దన్" ఎన్ఱెన్ఱు*

*నామమ్ పలవుమ్ నవి న్ఱేలో రెమ్బావాయ్!*



*🌺భావము:*```

నిర్దోషమలైన మాణిక్యములతో నిర్మించిన భవనంలో చుట్టునూ దీపాలు వెలుగుతుండగా, అగరు ధూపములను పరిమళాలను వెదజల్లుచుండగా, అతిమెత్తనైన హంసతూలికా తల్పముపై పరుండి నిద్రిస్తున్న ఓ మేనమామ కూతురా! మణిమయ ప్రభలతో ప్రకాశించుచున్న నీ భవనపు గడియను తీయవమ్మా! ఏమమ్మా! మేనత్తా! నీవైనా ఆమెను లేపుమమ్మా! ఏమి? నీ పుత్రిక మూగదా? చెవిటిదా? లేక బద్దకస్తురాలా? లేక ఆమె లేవకుండగ ఎవరినైన కావలి వుంచినారా? లేక యింత మైమరచి నిద్రించుటకేమైన మంత్రించి వుంచినారా? ఆమెకేమైనది నిద్ర లేచుటలేదు? 

'ఓ ఆశ్చర్య గుణచేష్టితుడా! ఓ శ్రియః పతీ! ఓ పరమపదవాసీ!' అని అనేకమైన తిరునామాలను అనుసంధిస్తున్ననూ ఆమెకు వినబడుటలేదేమి? ఇంకను లేవదేమి? అని సంపదలతో తులతూగుతున్న ఒక కన్యను లేపుచున్నారు.```



*🌸అవతారిక :*```

'తూరుపుతెలవారె! ఓ జవ్వనీ లేవవే!' అంటూ పాడి 8వ (పాశురం) మాలికలో భగవదనుభవాన్ని పొందటానికి కుతూహలపడుతున్న ఒక గోపికను లేపి తన వ్రతంలో భాగస్వామిని చేసింది గోదాతల్లి. ఇప్పటివరకు శ్రవణం (వినటం) మననం (విన్నదానిని మాటిమాటికి స్మరించటం) వీటియొక్క విశిష్ఠతను తెలిపి ముగ్గురు గోపకన్యలను గోదా మేల్కొలిపి తన వ్రతంలో చేర్చుకొంది. ఇక (9మొదలు 12 మాలికలలో (పాశురాలలో) ధ్యానం యొక్క విశిష్ఠతను తెలుపబోతోంది. ఎల్లప్పుడూ శ్రవణము, మననమూ చేసే వారియొక్క మనస్సు పవిత్రమౌతుంది. నిర్మలమౌతుంది. మాలిన్యం తొలగితేనేకద జ్ఞానం చోటు చేసుకొనేది. అప్పుడా జ్ఞానమే 

ఆ జీవికి కవచమైపోతుంది. నిస్వార్ధమైన వ్రాత నిష్ఠ కలిగినవారికే తన్ను లభించే హక్కు కలదన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. మరిక మనకు స్వాతంత్ర్యం ఎందుకు? పరమాత్మ తానే స్వయంగా మన వద్దకు వచ్చి మన అభీష్టాలను తీరుస్తాడు. కావున మనం ఎచటికినీ పోక వున్నచోటునే భగవదనుభవ ఆనందాన్ని అనుభవిస్తూ వుంటే చాలుననుకొని అతి సుందరమైన మణిమయ భవనంలో నిద్రిస్తూన్న నాల్గవ గోపికను (యీ మాలికలో) లేపుచున్నారు. 'ఓ మామకూతురా! మరదలా లేలెమ్ము!' అంటున్నారు.```


🌷*9.వ మాలిక:*```

(కాంభోజి రాగము-ఆదితాళము)


1. ప.. ఓ మామకూతుర! మరదలా!


అ..ప.. ఏమిది? మణిమయ ద్వారము తెరువవు?

ఓ మామ కూతుర! మరదలా!


చ.. పావన మణిమయ భావనమందున

దివ్వెల వెలుగులు ధూపములమరగ

దివ్యమౌ తల్పమున దిటవుగ శయనించి

అవ్యక్తమైన నిద్దురపోదువటవే!


2 చ. మూగద? చెవిటిద? మిగుల నలసినద?

ఆగడప కావలి నందుంచబడినద?

ఆ గాఢ నిద్రకు మంత్రించబడినద?

వేగమె లేపవె! నీ కూతునత్తరో!


3 చ. లీలామానుష మాధువుడీతడు

కేళీలోలుడు వైకుంఠవాసుడు

చెలియలగూడి తిరునామ కీర్తనము

ఇలవెలియగ పలుమారు పాడితిమి

ఓ మామకూతుర! మరదలా!```



🌼*తొమ్మిదవరోజు ప్రవచనం:*

```

భగవంతునికి మనకు ఉన్న సంబంధం

*ఆండాళ్ తిరువడిగలే శరణం* ```



 🍀*పాశురము:*


*తూమణి మాడత్తు చ్చుత్తుం విళక్కెరియత్*

*దూపం కమళత్తుయిల్ అణైమేల్ కణ్ వళరుం*

*మామాన్ మగళే! మణి క్కదవం తాళ్ తిఱవాయ్*

*మామీర్! అవళై ఎళుప్పీరో ఉన్ మగళ్ తాన్*

*ఊమైయో అన్ఱి చ్చెవిడో అనందలో*

*ఏమ ప్పెరుందుయిల్ మందిర ప్పట్టాళో*

*మామాయన్ మాదవన్ వైకుందన్ ఎన్ఱెన్ఱు*

*నామం పలవుం నవిన్ఱేలోర్ ఎంబావాయ్*


ఆండాళ్ తల్లి ఈరోజు నాలుగో గోపబాలికను లేపుతుంది. *"తూ"* పరిశుద్దమైన *"మణి"* మణులతో చేసిన *"మాడత్తు"* మేడ, *"చ్చుత్తుం విళక్కెరియ"* చుట్టూ దీపాలు వెలిగించి ఉన్నాయి. ఇక్కడ మనం దీపం పెట్టే ఆంతర్యం తెలుసుకుందాం. దీపం లేని ఇల్లు ప్రాణం లేని శరీరం వంటిదే. దీపపు ప్రమిద శరీరానికి ప్రతీక, దానిలోని నూనె లేక నెయ్యి మనలోని ప్రేమ వంటిది. అయితే ఈ ప్రేమ భగవంతుని కోసం ప్రకాశించగలిగితే మన జన్మ ధన్యం. అలా ప్రకాశింపచేయాలంటే మనకు శాస్ర్తాలు కావాలి. శాస్ర్తాలకు గుర్తు మనం పెట్టే వత్తులు. ఆరెండు వత్తులు దేవుడి వైపు తిరిగి ఉండాలి. ఒక వత్తు వేదం, ఒక వత్తు ఆ వేదాలను వివరించే వ్యాఖ్యానాలు. అందులో వెలిగే నిప్పే మనలోని జ్ఞానం. అందుకే మన జ్ఞానం ప్రేమమయమై అది శాస్త్రాలకు అనుగుణంగా ఉండగలిగితే ఎదురుగుండా ఉండే రూపం మనకు చక్కగా దర్శనం ఇస్తుంది. ఈ గోపబాలిక వెలుతురుకోసం దీపం వెలిగించలేదు, అది మంగళకరమని వెలిగించింది. కృష్ణుడు ఇంటిచుట్టూ ఉంటాడని కృష్ణ సంబంధం కోసం ఇంటిచుట్టూ దీపాలు వెలిగించింది. *"ధూపం కమళ"* ధూపం పరిమళిస్తుంది. *"త్తుయిల్ అణైమేల్ కణ్ వళరుమ్"* నిద్రపుచ్చే అందమైన ఒక పడక పై కన్నులు మూసుకొని పడుకొని ఉన్నావా. *"మామాన్ మగళే!"* ఓ మామగారి కూతురా! *"మణి క్కదవం తాళ్ తిఱవాయ్"* మణులతో చేసిన ద్వారం తెరుచుకొని రావమ్మా. ``` సంస్కృతంలో వివిధ అంకెలకు గుర్తుగా, తొమ్మిది మణులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు అని ఇలా కొన్ని ఉపమాన సంబంధంతో చూపిస్తారు. ఇక్కడ మణి అనగానే మనకూ భగవంతునికి ఉండే తొమ్మిదిరకాల సంబంధాలు తెలుసుకోవాలి.



1. మనందరికి తండ్రి ఆయనే!


2. మనందరిని రక్షించేవాడు ఆయనే


3. మనందరిని నావాళ్ళు అన కల్గిన వాడు ఆయనే- శేషి అంటారు.


4. మనందరిని భరించేవాడు ఆయనే - భర్త అంటారు.


5. మనలోని జ్ఞానాన్ని పనిచేయిస్తూ ఇందులో మనకు తెలియాల్సినవాడు ఆయనే- జ్ఞేయము అంటారు.


6. మనందరిని తన వస్తువులుగా కల్గి ఉండి వాటికి స్వామి ఆయనే


7. మనందరికి ఆధారం ఆయనే - నారాయణుడు అంటారు


8. మనందరి లోపలుండే ఆత్మ ఆయనే - అంతర్యామి అంటారు


9. భోక్తా ఆయనే. స్వీకరించగల వాడు ఆయనే


లోకంలో మనం ఏదో ఒక సంబంధం అమ్మ,నాన్న, భార్య ఇలా ఉన్న ఒక్కొక్క సంబంధం వల్ల ఎంత ప్రేమ కల్గి ఉంటాం, అదే ఇన్ని సంబంధాలు కల్గి, శాశ్వతంగా వీడని సంబంధం మనకు ఆయనతో ఉంటే మరెంత ప్రేమ ఉండాలి ఆయనపై మనకు! ```

*"పితా రక్షకః శేషి భర్తా జ్ఞేయ స్వామి ఆధారః ఆత్మా భోక్తా"* అష్టాక్షరీ మహా మంత్రం దీన్నే తెలిపింది. భగవద్గీతలో ఎన్నో సార్లు ఈ విషయం చెప్పాడు. ఈ జ్ఞానం మనకు కలగాలి. ఈ జ్ఞానమే ఆగోపిక వెలిగించిన దీపాలు. మనలోని మంచి ఆచరణ ధూప పరిమళాల వంటిది.


అలాంటి జ్ఞానుల అభిమానం మనపై ఏర్పడితే మన జన్మ ధన్యం. వారి దివ్య ఆకృతిని స్మరించుకున్నా వాళ్ళ స్థానాన్ని తలచుకున్నా మనం తరించిపోతాం. మనం ఈ శరీరంపై దృష్టి ఉండి ఇకపై దేనియందు మనస్సు అనిపించదు, దీన్ని పోషించుకోవాలి, దీని కోసం దేన్నైనా వదిలెయ్యాలి అని ఇలా దేహ భ్రాంతి పెరిగిపోతుంది, ఈ తలుపు తెరుచుకోవాలి. ఈ ఆకర్షణమైన దేహం అనే తలుపు తెరుచుకొంటే లోపలుండే వాడి దర్శనం అవుతుంది. అయితే ఆ తలుపులు మనం తెరుచుకోలేం. ఒక మంత్ర ఆచరణ ద్వారా జ్ఞానులు తెరవాల్సిందే. 


*"మామీర్!" ఓమేనత్తా, "అవళై ఎళుప్పీరో"* మీ కూతురుని లేపమ్మా. ఇంత హాయిగా పడుకొని ఉన్నదంటే శ్రీకృష్ణుడు లోపల ఉన్నట్లే, ఆయనే మాట్లాడనివ్వడం లేదు అంటూ ఆక్షేపించసాగారు. *"ఉన్ మగళ్ తాన్ ఊమైయో"* నీపిల్ల ఏమైనా మూగదా లేక *"అన్ఱి చ్చెవిడో"* చెవిటిదా లేక *"ఆనందంలో"* అలసిపోయిందా *"ఏమ ప్పెరుందుయిల్ మందిర ప్పట్టాళో"* ఎవరైనా కాపలా కాస్తున్నారా లేక ఎవరైనా వచ్చి మంత్రం వేసేశాడా. శ్రీకృష్ణుడే పెద్ద మంత్రం, ఆయన దగ్గర ఉంటే ఇక ఏమంత్రం పనిచెయ్యదు. అక్కడి నుండి బయటకు రావడం కష్టం. భగవత్ జ్ఞానం కల్గిన వ్యక్తి అలానే ఉంటాడు, ఇతరమైన మాటలు మాట్లాడడు. బయటి విషయాల్లో మూగవాళ్ళ వలె ఉంటారు. లౌకికమైన మాటలు వినలేరు ఆ విషయంలో చెవిటివారివలె ఉంటారు. లౌకికమైన పనుల యందు అలిసినట్లు ఉంటారు. భగవంతుడు అలాంటి వాళ్ళను కాపలా కాస్తుంటాడు. ఈ గోపిక అలాంటి జ్ఞాని.


అయితే లోపలగోపబాలిక తల్లి “అలా ఆక్షేపించకండి, ఈమె ప్రవృత్తి మీకు తెలియనిదా, లోపల ఆయన నామాలను స్మరించుకుంటుంది. మీరూ ఆ నామాలను పాడండి, లేచి వస్తుంది”అని చెప్పింది. మేము ఆయన నామాలనే పాడుతున్నాం. ఏమేమి అని అడిగింది. 


*"మామాయన్"* చాలా ఆశ్చర్యమయిన పనులు చేసేవాడు, ఒకనాడు అడివి దహించి పోతుంటే ఒక్కసారి ఇలా మింగేసాడు, మన దృష్టిని ఆకర్షించేందుకు ఎన్నో చిలిపి పనులు, తుంటరి పనులు. ఎలాగో ఒకలాగ ఆయనపై మనస్సు పడేట్టు ఆయన మన బాగుకోసం చేసాడిన్ని పనులు. ఇవన్నీ దయ చేత కారుణ్యం చేత చేసాడు.

ఆ దయ పైకి లేచేట్టు చేసేందుకు ఆయనకు ఒకావిడ ఉంది, మన పాపాలను కనపడకుండా చేసే ఒకావిడ ఉంది, *"మాధవన్"* మా-లక్ష్మీదేవి ధవ-నాథుడు,లక్ష్మీదేవి సంబంధం కల్గిన వాడు ఆయన, మరి ఆయన ఏ దిక్కు లేక మన కోసం రావడంలేదు, ఆయన *"వైకుందన్"* వైకుంఠం అంటే ఈ విశ్వం కంటే మూడు రెట్లు ఎక్కువ- త్రిపాద్ విభూది అనిపేరు. అక్కడుండే వారంతా తన మనస్సు తెలుసుకొని ప్రవర్తించే వారు. అలాంటి వైకుంఠానికి నాథుడు. మన బాగుకోసం మనకోసం వచ్చాడు. ఇలా *"ఎన్ఱెన్ఱు"* ఎన్నెన్నో *"నామం పలవుం నవిన్ఱ్"* నామాలను పలుకుతున్నాం. 


ఇలా శ్రీకృష్ణ సంబంధం తెలిసిన ఒక గోపబాలికను లేపింది ఆండాళ్ తల్లి.'✍️

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```

 🙏

పంచాంగం



 

త్రిఫల ఉపయోగాలు:*

 

*మన ఆరోగ్యం…!


          *త్రిఫల ఉపయోగాలు:*

                 ➖➖➖✍️


```

త్రిఫల చూర్ణం ఒక ముక్కలో చెప్పాలంటే ఈ చూర్ణం ప్రతి రోజు తీసుకుంటే డాక్టరుతో పని ఉండదు.


“మనిషి ఆరోగ్యం”.. వాత,పిత్త,కఫ, లక్షణాలు హెచ్చు తగ్గులపైనే ఆధారపడి ఉంటుందని ఆయుర్వేదం చెబుతుంది.


ఈ హెచ్చు తగ్గులను సమతూకం చేయగలిగిన తిరుగులేని ఔషధమే త్రిఫల చూర్ణం.


*#కరక్కాయ, #తానికాయ, #ఉసిరికాయల మిశ్రమమే ‘త్రిఫల చూర్ణం.’


*త్రిఫల చూర్ణంలో ఒక భాగం కరక్కాయ రెండు భాగాలు తానికాయ నాలుగు భాగాలు ఉసిరికాయ చూర్ణం ఉండాలి.


కొంతమంది ఈ మూడింటిని సమభాగాలుగా కూడా వాడుతుంటారు. మార్కెట్ లోని కొన్ని కంపెనీలు ఈ మూడు కాయలను లోపల విత్తనాలతో సహా చూర్ణం చేసి అమ్ముతున్నారు. విత్తనాలు కాకుండా పై పెచ్చులతో చేసిన త్రిఫలచూర్ణం ప్రభావవంతమైంది.


ఇది సమస్త రోగాలను తగ్గించే అద్భుతమైన శక్తి కలది.


జబ్బులు ఉన్నా లేకపోయినా ఒక నెల పాటు ఈ చూర్ణాన్ని రెగ్యులర్ గా వాడి, మీ శరీరాన్ని గమనించండి. మీరు ఆశ్చర్యపోయే ఫలితాలు కనిపిస్తాయి. మీ ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది.


అంతేకాదు త్రిఫల చూర్ణానికి శరీరంలో వేడిని తగ్గించే గుణం కూడా ఉంది.


*అలాగే త్రిఫల చూర్ణం కంటిచూపును పెంచుతుంది. జీర్ణశక్తి,ని ఆకలిని పెంచుతుంది, మలబద్ధకాన్ని తగ్గుతుంది, వాతం నొప్పులు తగ్గుతాయి, చర్మ సమస్యలను, లివర్, ఊపిరితిత్తులు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.```


*ఉపయోగించే విధానం:-*```

*ఉదయాన్నే పరగడుపున అర గ్లాస్ గోరువెచ్చని నీటిలో చెంచా త్రిఫల చూర్ణం వేసుకుని తాగాలి. అదేవిధంగా రాత్రి పడుకునే ముందు కూడా తాగాలి.✍️```-సేకరణ.

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🩺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

23, డిసెంబర్ 2025, మంగళవారం

అన్నియు గల లోకంబున

 *2318*

*కం*

అన్నియు గల లోకంబున

సన్నుతమతి మంచినిగని సజ్జనుడయ్యున్.

చెన్నటి వారలెయందలి

చిన్న చెడులనాలకించి చెడునిట సుజనా.

*భావం*:-- ఓ సుజనా! అన్నియునూ ఉన్న ఈ లోకంలో మంచి మనస్సు ఉన్న వారు మంచినే చూచి మంచివారిగా వెలుగుతారు. వ్యర్ధమైనవారు అందులో ఉన్న చిన్న చెడులనే ఆలకించి చెడిపోయెదరు.

*సందేశం*:-- ఈ లోకంలో అన్నీ ఉంటాయి, కానీ అది చూసేవాడి మనస్సును బట్టియే మంచి, చెడుగా గుర్తించబడుతుంది. మంచి మనస్సు ఉన్నవారి కి మంచియే పెద్దగా కనబడుతుంది, చెడ్డ మనస్సు ఉన్న వారికి చెడ్డ యే పెద్ద గా కనబడుతుంది.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

మంకీ ట్రాప్*

 


                 *మంకీ ట్రాప్*

                  ➖➖➖✍️```

(నాన్ పొలిటికల్)సైకాలజీ..అంశం 


ఇటీవల మూడు రోజుల క్రితం చదివిన ఒక చిన్న వార్త... మెదడు నుండి బయటికి పంపించేసినా.. పదేపదే మళ్ళీ వచ్చి మది తలుపు తడుతూనే ఉంది.. ఇంకా నన్ను వెంటాడుతూనే ఉంది.


భాగ్యనగరంలో ఒక బిక్షగాడు మృతి.. పోస్టుమార్టం లో తేలింది ఏమిటంటే, అతను 14 రోజుల నుంచి భోజనం లేదు... 

అంటే ఆకలి మరణం. 

ఇది కూడా పెద్ద సంచలన వార్త ఏమి కాదు, కానీ ఈ వార్తలోని కొసమెరుపు ఏమిటంటే బిక్షగాడి జోలిలో కానీ సంచిలో కానీ అక్షరాల మొత్తము 1లక్ష 34 వేల రూపాయలు దొరికాయి. న్యూస్ హెడ్డింగ్ కూడా ఇదేను. “బిచ్చగాడి దగ్గర భారీ మొత్తమని.”  


ఇక్కడ బాగా గుంజి పడేస్తున్న విషయం ఏమిటంటే అంత డబ్బు ఉంచుకున్న బిక్షగాడు ఒక పూట ఆహారం ఎందుకు తీసుకోలేకపోయాడు? అదీ తన ప్రాణం పోతున్నా.. 14 రోజుల నుంచి ఆకలితో ఉన్నాడు.. తప్ప డబ్బు ఎందుకు ఖర్చు పెట్టలేకపోయాడు? ఏమిటి ఈ మనస్తత్వం ? ఇటువంటి దౌర్భల్యం మనందరిలో కూడా ఉంటుందా? అంటే.. అవుననే చెబుతుంది ‘మానసిక శాస్త్రము.’


ఈ విషయం చదవగానే నాకు మొదట గుర్తు వచ్చిన విషయము “మంకీట్రాప్” 


అవును ఆఫ్రికాలోని ఒక తెగ వారు కోతులను వేటాడటానికి చెట్టు తొర్రలో కానీ, పుట్టలో కానీ, ఇవి కాకపోతే ఎండు కొబ్బరికాయలో... ఖచ్చితంగా కోతి చేయపట్టే అంత రంధ్రం చేస్తారు. ఈ రంధ్రం ప్రత్యేకత ఏమిటంటే.. ఇది కోతి చేయి పట్టే అంత పెద్దదిగా మరియు.. కోతి పిడికిలి బయటికి రానంత చిన్నదిగా ఉంటుంది.. 


ఇక ఈ రంధ్రంలో కోతి కి కావలసిన అరటికాయనో వేరుశనగ గింజలనో పోసి ఉంచుతారు. దీనికి ఆశ పడిన కోతి రంధ్రములో చేయి పెట్టి వాటిని పట్టుకుంటుంది. కానీ పిడికిలిని మాత్రం బయటికి తీయలేక పోతుంది. సరిగ్గా ఇదే సమయంలో ఆ తెగ వారు ఆ కోతిని పట్టుకుంటారు. 


గమ్మత్తుగా మనుషులు తనను సమీపిస్తున్న... ప్రమాదం పొంచి ఉన్న.. కోతి మాత్రం ఆ పిడికిల్ని తెరవలేకపోతుంది. తాను పట్టుకొన్నది వదలలేక పోతుంది.

చివరికి దొరికిపోతుంది. 

దీన్నే సింపుల్ గా మంకీ ట్రాప్ అంటాము.


నిజంగా మనకి ప్రమాదమని.. నష్టమని తెలిసినప్పటికినీ కొన్నిటిని మనం వదులుకోలేకపోతున్నామా? 


అయితే ఇటువంటి మంకీ ట్రాప్ లో మనం ఉన్నట్లే.. 


రోజువారి కష్టపడి సంపాదించుకున్న కూలీ డబ్బులను దాచిపెట్టుకొని ఆసుపత్రికి వెళ్ళటానికి కూడా మనసు ఒప్పుకోకుండా తనువు చాలించిన వారు నాకు చాలా మంది తెలుసు.


నిజంగా డబ్బు అంతగా కట్టి పడేస్తుందా అంటే..డబ్బు కాదుకాని మన తత్వం మనల్ని ట్రాప్ లో పడేస్తుంది.  


నిశితంగా ఇంకా పరిశీలిస్తే మన నష్టాన్ని మనం అంత తొందరగా వదులుకోలేము అనిపిస్తుంది..... 


చచ్చిన బిచ్చగాడిని చూసి నవ్వుకునే మనము .. *మనకు తెలియకుండానే మనమూ అదే ట్రాప్ లో ఉన్నామనిపిస్తుంది. 


ఎప్పుడో తెగిపోయిన ఒక బంధాన్ని పట్టుకొని ఇప్పటికీ ఏడుస్తున్న వాళ్ళము ఎంతమంది లేము? 

ఒక మాట పంతానికి ఇంకెన్నో బంధాలను దూరం చేసుకుని ఒంటరిగా మిగిలిపోయిన వాళ్లు మనలో లేరా?

వ్యాపార లాభాలు అంటూనో, పేరు ప్రతిష్ఠలంటూనో వృత్తికి అంకితం అయిపోయి తన కుటుంబాన్ని పిల్లల్ని నిర్లక్ష్యం చేసిన పెద్దలు నాకు బాగా తెలుసు. మేము పరాజితులమని వాళ్లే ఒప్పుకుంటున్నారు ఇప్పుడు.


అందుకే చిన్న మోతాదులో కానీ పెద్ద మోతాదులో కానీ మనం కూడా ఇటువంటి ట్రాప్ లో ఏమైనా ఉన్నామేమో చూసుకోవాలి. 


అది బంధం కావచ్చు డబ్బు కావచ్చు, కీర్తి కావచ్చు.. మనల్ని పట్టేసి ఉంచుతుందేమో గమనించుకోవాలి. 


అవసరానికి దాన్ని వదులుకోగలమో లేదో చూసుకోవాలి. అప్పుడే మనము ఈ ట్రాప్ నుంచి బయటపడగలం.


మనల్ని ఏడిపించే జ్ఞాపకాలు,  

నో అని చెప్పలేని మోహమాటాలు, తిరిగి అడగలేని అప్పులు, దండించలేని ప్రేమలు...

ఊపిరి సలపనివ్వని పనులు,  

ఒత్తిడి పెంచే కోరికలు, ఆరోగ్యాన్ని హరించే సంపాదనలు, పేరు ప్రఖ్యాతుల కోసం పరుగులు.. ఇలాంటివన్నీ మంకీ ట్రాప్ లే.


మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ చెప్పినట్లు “వదలటం గొప్పా? పట్టుకోవడం గొప్పా?”


*కొన్ని సార్లు వదిలేయడమే గొప్ప. 


రామాయణంలో రావణుడు సీతను వదిలేసి ఉంటే ప్రాణాలతో బతికేవాడు.. 


మంకీ ట్రాప్... మనందరికీ ఉంటుంది.✍️

-కే. రవీందర్ పటేల్, RSS

సనాతన హిందూ``` 

🧡 జై భారత్ 🇮🇳 జై హింద్ 💚

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖


ముక్కు వెనుక వైద్య శాస్త్రానికే

 మనందరి ముక్కు వెనుక వైద్య శాస్త్రానికే తెలియని కొత్త అవయవం కనిపించిందా ??!! 

- అవును కనిపించింది.! ఇది సత్యం మీరు ఊపిరి తీస్తున్నంత నిజం.!!!  

.

ఆ వివరాలోకి మనం వెళితే... 

కొన్ని శతాబ్దాలుగా మనకు తెలిసిన మానవ శరీర నిర్మాణ శాస్త్రంలో (Anatomy) ఇది ఒక విప్లవాత్మకమైన మార్పు. నెదర్లాండ్స్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు మన ముక్కు వెనుక భాగంలో ఒక కొత్త జత లాలాజల గ్రంథులను కనుగొన్నారు.


1. ఇది ఎలా బయటపడింది?

సాధారణంగా చేసే శస్త్రచికిత్సల్లో ఇవి కనిపించలేదు. ప్రొస్టేట్ క్యాన్సర్‌ను గుర్తించడానికి ఉపయోగించే PSMA PET-CT అనే అత్యాధునిక స్కాన్ ద్వారా వీటిని గుర్తించారు. ఈ స్కాన్ చేసినప్పుడు లాలాజల గ్రంథులు స్పష్టంగా మెరుస్తాయి. అలా 100 మంది రోగులను పరీక్షించినప్పుడు, అందరిలోనూ ముక్కు వెనుక భాగంలో ఒకే చోట ఈ కొత్త గ్రంథులు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గమనించారు.


2. వీటి పేరు మరియు ఉనికి

పేరు: వీటికి "టుబేరియల్ లాలాజల గ్రంథులు" (Tubarial Salivary Glands) అని పేరు పెట్టారు.


పరిమాణం: ఇవి సుమారు 1.5 అంగుళాల (3.9 సెంటీమీటర్లు) పొడవు ఉంటాయి.


స్థానం: ముక్కు లోపలి భాగం మరియు గొంతు కలిసే చోట (Nasopharynx), పుర్రెకు దగ్గరగా ఇవి దాగి ఉన్నాయి.


3. ఇన్నాళ్లూ ఇవి ఎందుకు కనిపించలేదు?

ఈ గ్రంథులు చాలా లోతైన భాగంలో, ఎముకల మధ్య అమరి ఉండటం వల్ల సాధారణ అల్ట్రాసౌండ్ లేదా MRI స్కాన్‌లలో ఇవి స్పష్టంగా తెలియవు. కేవలం ఆధునిక రేడియోధార్మిక స్కాన్‌ల వల్లనే వీటి ఉనికి ఇప్పుడు ప్రపంచానికి తెలిసింది.


4. దీని వల్ల కలిగే ప్రధాన వైద్య ప్రయోజనం

ఈ ఆవిష్కరణ ముఖ్యంగా క్యాన్సర్ రోగులకు ఒక వరం లాంటిది:


రేడియేషన్ నుండి రక్షణ: తల లేదా మెడకు క్యాన్సర్ వచ్చినప్పుడు ఇచ్చే రేడియేషన్ థెరపీలో, ఈ గ్రంథులు ఎక్కడున్నాయో తెలియక వైద్యులు వాటిపై కూడా రేడియేషన్ ఇచ్చేవారు.


దుష్ప్రభావాల నివారణ: ఆ గ్రంథులు దెబ్బతినడం వల్ల రోగులకు నోరు ఆరిపోవడం (Dry mouth), ఆహారం మింగలేకపోవడం, మాట్లాడటానికి ఇబ్బంది కలగడం వంటి సమస్యలు వచ్చేవి.


మెరుగైన చికిత్స: ఇప్పుడు వీటి ఉనికి తెలిసింది కాబట్టి, రేడియేషన్ ఇచ్చేటప్పుడు ఈ భాగానికి నష్టం కలగకుండా వైద్యులు జాగ్రత్త పడవచ్చు. తద్వారా క్యాన్సర్ చికిత్స తర్వాత రోగులు త్వరగా కోలుకుంటారు.


ఈ పరిశోధన ఎలా జరిగింది?

నెదర్లాండ్స్‌లోని వైన్ వోగెల్ (Wouter Vogel) మరియు మ్యాథైస్ వాల్‌స్టార్ (Matthijs Valstar) అనే ఇద్దరు పరిశోధకులు ఈ ఆవిష్కరణకు నేతృత్వం వహించారు. వీరు వందలాది స్కాన్‌లను పరిశీలించడమే కాకుండా, ఈ కొత్త గ్రంథుల ఉనికిని నిర్ధారించడానికి మృతదేహాలను (Cadavers) చాలా సూక్ష్మంగా విడదీసి (Dissection) పరీక్షించారు. ఆ పరీక్షలో ఆ గ్రంథులు ముక్కు వెనుక భాగంలోని కణజాలానికి అతుక్కుని ఉండటం గమనించారు.


ఇది అధికారికంగా ఆమోదించబడిందా?

అవును, ఈ పరిశోధన ప్రపంచ ప్రఖ్యాత మెడికల్ జర్నల్ 'రేడియోథెరపీ అండ్ ఆంకాలజీ' (Radiotherapy and Oncology) లో ప్రచురితమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనాటమీ నిపుణులు ఇది ఒక ముఖ్యమైన ఆవిష్కరణగా గుర్తించారు.


మన శరీరంలో ఉండే ఇతర లాలాజల గ్రంథులు:

ఈ కొత్త గ్రంథులతో కలిపి ప్రధాన లాలాజల గ్రంథుల జాబితా ఇప్పుడు ఇలా ఉంది:


పరోటిడ్ గ్రంథులు (Parotid glands): ఇవి చెవుల కింద ఉంటాయి.


సబ్‌మాండిబ్యులర్ గ్రంథులు (Submandibular glands): ఇవి దవడ కింద ఉంటాయి.


సబ్‌లింగువల్ గ్రంథులు (Sublingual glands): ఇవి నాలుక కింద ఉంటాయి.


టుబేరియల్ గ్రంథులు (Tubarial glands): ముక్కు వెనుక భాగంలో కొత్తగా కనుగొన్నవి.


ఇవే కాకుండా మన నోటి లోపల సుమారు 1,000 వరకు చిన్న చిన్న లాలాజల గ్రంథులు (Minor salivary glands) విస్తరించి ఉంటాయి.


ఈ ఆవిష్కరణ ఎందుకు అంత ఆశ్చర్యపరిచింది?

గత 200-300 ఏళ్లుగా మానవ శరీరంపై ప్రతి అంగుళం పరిశోధన జరిగిందని మనం భావించాం. ఆధునిక వైద్యశాస్త్రంలో ఇలాంటి ఒక ప్రధాన భాగం ఇన్నాళ్లూ కనుగొనబడకుండా ఉండటం శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది.

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ    చాంద్రమాన  విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనము  - హేమంత ఋతువు - పుష్య మాసం - శుక్ల పక్షం - తృతీయ - శ్రవణం -‌‌  భౌమ వాసరే* (23.12.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*