https://drive.google.com/file/d/11zAppFN_V1l1zC9y_tTrBE8PlJdIOogw/view?usp=drivesdk
ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
13, ఏప్రిల్ 2021, మంగళవారం
అమృత రసాన్ని
సకల విశ్వ శ్రేయస్కరమై, చరాచర జీవజాలపు నిత్య సుచైతన్య సంక్షేమార్ధమై, పవిత్ర ప్రకృతి ఒసగే స్నేహ హస్తం ! కాలానుగుణంగా తరలివచ్చే వివిధ సదావకాశాల సమ్మేళనంగా, విశ్వ మానవాళి పుణికిపుచ్చుకోవాల్సిన సన్మార్గ, సుహృద్భావ, సహృదయ, సువ్యక్తిత్వ వికాస సద్భావనాత్మక జీవన శైలి ! యావత్ విశ్వానికే మణిహారమై, అమృతతుల్యమై దేదీప్యమానమై అనునిత్యం ఈ భువిన ప్రకాశించే, దివ్య భవ్య సమైక్యతను ప్రస్ఫుటించే విభిన్న భావనలకు ఆలవాలమైన అద్భుత భాషా వికసన స్ఫూర్తి ! ప్రకృతి, సకల జీవుల పట్ల అభిమానంతో, స్నేహమయిగా కురిపించే అమృత ధార, వివిధ నదీనదాలుగా ప్రవహిస్తూ, ఈ అవనిపై అనుక్షణం అమృత రసాన్ని యావత్ చరాచర జీవజగతికి అందచేస్తున్న వైనం ! ఏ భాషైనా, ఏ మతమైనా, వివిధ వర్గ లేక తెగలకు చెందిన మానవాళి ఈ పవిత్ర పృధ్విపై మరువరాని ముఖ్యాంశం, " సమున్నతమై, సమైక్య భావనతో, సయోధ్యతో, కలసిమెలసి నడుస్తూ సకల విశ్వ జీవరాశి సంరక్షణకై నిత్య చైతన్య స్ఫూర్తిమంతమైన సుమైత్రీ బాటలో పయనించే విషయం " ! " ప్లవ నామ వత్సరపు ముఖ్య ధ్యేయం, యావత్ విశ్వ జీవరాశి ప్రశాంత జీవనానికై అనాదిగా ఈ ఇలపై నిర్దేశించబడిన ప్రాచీన వైదిక, ధార్మిక సనాతన స్ఫూర్తి ఆధారితమైన, ప్రత్యేకమైన, అత్యంత ప్రధానమైన సువిశాల సుహృద్భావ సయోధ్య ! ప్లవ నామ వత్సర శుభ ఫలాల లభ్యత, సకల విశ్వ మానవాళి నిత్య సుచైతన్య సయోధ్యపై ఆధారితమన్నదే, ఈ క్రమంలో సత్య చైతన్య దార్శనికతగా నిలుస్తున్నదే ఇక్కడ గమనించాల్సిన విషయం ! " స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాభినందనలతో.... సకల విశ్వ జీవరాశి సంరక్షణకై అనునిత్యం, అన్నికోణాల్లో యావత్ విశ్వ వ్యాప్తమైన కృషి జరగాలని మనసారా అభిలషిస్తూ....... ✍️గుళ్లపల్లి ఆంజనేయులు
ఉప్పు వ్యాపారి
పరమాచార్య స్వామి – ఉప్పు వ్యాపారి
అనుకోకుండా నాకు ఒక పెద్ద దుఃఖం, భరింపరాని శోకం కలిగింది. నాలుగు నెలల దాకా మహాస్వామి వారిని దర్శించుకోవడానికి కూడా వెళ్ళలేదు. మహాస్వామి వారు నాకోసం కబురు పంపారు. ఇద్దరు లేదా ముగ్గురు పెద్ద అధికారులు వచ్చి నన్ను వారి వద్దకు తీసుకుని వెళ్ళారు.
అప్పుడు రాత్రి పది గంటలు. . . . కటిక చీకటి. . . . కేవలం ఒక మట్టి ప్రమిద మాత్రమే వెలుగుతోంది.
”...నిపుణౌ”, మహాస్వామి వారు మెల్లిగా చెప్పారు, “చెప్పు”.
”తవ హి చరణావేవ నిపుణౌ . . . సౌందర్యలహరి లోని నాలుగవ శ్లోకం
త్వదన్యః పాణిభ్యాం. . . ”
పరమాచార్య స్వామి వారు చిన్నగా అన్నారు, “అందరికీ ఆ అమ్మే ఆశ్రయం. ఎవరెవరికి ఏమి ఎప్పుడు ఎలా ఇవ్వాలో ఆమెకి తెలుసు.”
అంతా నిశ్శబ్ధం.... ”సాంబమూర్తి నీకు సంత అంటే ఏంటో తెలుసా?”
“తెలుసు పెరియావ. చాలామంది వర్తకులు సరుకులు తెచ్చి అమ్ముతూ ఉంటారు. వారంలో ఒక రోజు ప్రతి గ్రామంలో సంత జరుగుతుంది. వారు ఈరోజు ఇక్కడ రేపు అక్కడ అని ప్రయాణిస్తూంటారు.”
“నీవు ఉప్పు వ్యాపారి గురించి ఎప్పుడైనా విన్నావా?”
“అవును. వారు సంతలో ఉప్పు అమ్ముకుని జీవిస్తూ ఉంటారు. వారికి అదే జీవనాధారం.”
“అవును. అటువంటి ఒక ఉప్పు వ్యాపారి కామాక్షి అమ్మకి పరమ భక్తుడు. ఒకసారి అతను ఒక ఊరిలో సంత ముగించుకుని మరొక ఊరికి వెళ్తుండగా మార్గమధ్యంలో ఒక అడవి గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు కొంతమంది దొంగలు ఇతన్ని చూసారు. గాడిద పైన ఉప్పు మూటలు తీసుకువెళ్తున్న అతన్ని చూసి “రేయ్ రేపు సంతలో ఇతను ఈ ఉప్పునంతా అమ్మి డబ్బులతో మళ్ళా ఇదే మార్గంలో వెళ్తాడు. అప్పుడు మనం ఇతని ధనాన్ని దొంగిలించాలి.” వారు ఒక పథకం వేసారు. ఇంకా, వాళ్ళు పేల్చే మందుగుండు సామాగ్రి గురించి నీకు తెలుసా?”
“దేవాలయాలలో ఉత్సవాల సమయంలో పేలుడు పదార్థాలతో మందుగుండు సామాగ్రి తయారుచేస్తారు. గొట్టాలలో గట్టిగా కుక్కి ఒక వత్తి పెడతారు. ఆ వత్తి చివరకు అగ్ని తగిలితే అది చిన్నగా వెళ్ళి మందుగుండును తాకి పెద్దగా శబ్దము చేస్తూ పేలుతుంది.”
“అవును. ఆ దొంగల పథకము కూడా అదే. ఒక మందుగుండు పేలిస్తే ఆ గాడిద కంగారులో అటు ఇటు పరిగెడుతుంది. ఆ ఉప్పు వ్యాపారి భయతో అరుస్తూ గగ్గోలు పెడతాడు. అప్పుడు అతని దట్టీ నుండి డబ్బు తస్కరించవచ్చు.”
“ఆ రోజు సంతలో ఉప్పు వ్యాపారి తన దగ్గర ఉన్న ఉప్పును అమ్మడానికి కుప్పలుగా పోసాడు. కాని ఆరోజు బాగా వర్శం పడి ఉప్పు మొత్తం కరిగిపోయింది. అతనికి ఆరోజు వ్యాపారం లో నష్టము మనస్సుకు కష్టము కలిగింది. బుద్దికి తోచినట్టుగా మనస్సుకు వచ్చినట్టుగా కామాక్షిని తిట్టడం మొదలుపెట్టాడు. అతని కోపం ఏంటంటే డబ్బులేకుండా ఇంటికి వెళ్ళాలి అని. ఇంటికి వెనుతిరిగి నడక మొదలుపెట్టాడు. అడవి మార్గంలోకి ప్రవేశించగానే దొంగలు అతన్ని చూసి మందుగుండు పేల్చడానికి సిద్ధపడ్డారు. వత్తి గుండా మంట లోపలికి వెళ్ళి మందుగుండు సామాగ్రిని చేరింది కాని పేలలేదు. వారు దానికి కారణం వెతకగా ఆ మందుగుండు బాగా తడిసిపోయింది పొద్దున్న పడిన వర్షానికి. వాళ్ళు ఉప్పు వ్యాపారితో ఇలా అన్నారు. “దేవుడు నిన్ను కాపాడాడు. నీకోసమే ఈరోజు వర్షం పడినట్టుంది. పో ఇంటికి పోయి దేవున్ని ప్రార్థించు”
ఆ ఉప్పు వ్యాపారి నిశ్చేష్టుడయ్యాడు. “అమ్మ నాకు ద్రోహం చేసింది అనుకున్నాను. కాని అది తప్పు. ఆమె నన్ను కాపాడింది. అమ్మా కామాక్షి నన్ను క్షమించు. నాకు ఎప్పుడు ఎక్కడ ఏమి ఇవ్వాలో నీకు బాగా తెలుసు. నా అజ్ఞానాన్ని మన్నించు తల్లీ. వర్షం రాకపోయి ఉంటే నేను ఉప్పు మొత్తం అమ్మి డబ్బుతో వస్తుండేవాడిని. డబ్బు తీసుకోవడంతో పాటు ఈ దొంగలు నన్ను కొట్టేవారు. నన్ను కాపాడినందుకు నీకు కృతజ్ఞతలు.“
కావున మనకి ఏమి లభించినా అది అమ్మ అనుగ్రహమే. మిగిలినది దేనికోసమూ ఆశించకుండా పరులకు మంచి చెయ్యడమే.
మహాస్వామి వారు చిన్న గొంతుకతో, తీరికగా చెప్పిన ఈ దీర్ఘ ఉపన్యాసం ముగిసే నాటికి రాత్రి 2:30 అయ్యింది.
అప్పుడు నేను “నా తల పైన ఉన్న వెయ్యి టన్నుల బరువు తీసేసినట్టు అయ్యింది” అని అన్నాను.
పరమాచార్య స్వామి వారు సంతతో మొదలుపెట్టి కామాక్షి అమ్మతో ముగించారు. అది నా మనస్థితి కోసం చెప్పబడినా ఇది అందరికీ వర్తిస్తుంది. ఎందుకంటే అందరూ ఇటువంటి స్థితిలో ఉన్నవారమే కదా!
తరువాత మహాస్వామి వారు ”క్రమం తప్పకుండా ప్రతిరోజూ రామాయణం చదువు. నీ మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది.” అని అన్నారు
ఈనాటికి నాకు రామాయణ పారాయణ - మనస్సుకు ప్రశాంతత ఒకేసారి వస్తుంది.
--- బ్రహ్మశ్రీ రామకృష్ణ దీక్షితర్, శ్రీమఠం విద్వాన్. మహాపెరియావళ్ దరిశన అనుభవంగళ్-1
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.
https://t.me/paramacharyavaibhavam
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
*ఉగాది సమాచారం
*శ్రీ ప్లవ నామ సంవత్సర*
*ఉగాది సమాచారం* ..
🌱🌱🌱🙏🏻🙏🏻🙏🏻🌱🌱🌱
*_శుభమస్తు_*
*_ పంచాంగము_*
కలియుగ సంవత్సరం - 5122
విక్రమార్క సంవత్సరం - 2078
శ్రీ మద్వచార్య సంవత్సరం - 905
శ్రీ శంకరాచార్య సంవత్సరం - 2093
శాలివాహన సంవత్సరం - 1943 - 1944
శ్రీ రామానుజ సంవత్సరం - 1004
భారత దేశ స్వతంత్ర సంవత్సరం - 74
ఆంగ్ల సంవత్సరం - 2021 - 2022.
*_ఆదాయ , వ్యయాలు_*
మేషం 8 - 14
వృషభం 2 - 8
మిధునం 5 - 5
కర్కాటకం 14 - 2
సింహం 2 - 14
కన్య 5 - 5
తుల 2 - 8
వృశ్చికం. 8 - 14
ధనుస్సు 11 - 5
మకరం 14 - 14
కుంభం 14 - 14
మీనం 11 - 5
🌱🌱🌱🌻🌻🌻🌱🌱🌱
ఉగాది పూజా విధానం పై ధర్మ సూక్ష్మ సహితమైన ప్రవచనం శ్రీ చాగంటి వారిచే
https://youtu.be/WnMH6J5TleM
🌱🌱🌱🧘♀️🧘♀️🧘♀️🌱🌱🌱
పండుగ వేదాశీర్వచనం
https://youtu.be/wpwLVbnP0kM
🌱🌱🌱🧘♀️🧘♀️🧘♀️🌱🌱🌱
*_రాజపూజ్యం , అవమానాలు_*
మేషం 4 - 3
వృషభం 7 - 3
మిధునం 3 - 6
కర్కాటకం 6 - 6
సింహం 2 - 2
కన్య 5 - 2
తుల 1 - 5
వృశ్చికం. 4 - 5
ధనుస్సు 7 - 5
మకరం 3 - 1
కుంభం 6 - 1
మీనం 2 - 4
🌱🌱🌱🧘♀️🧘♀️🧘♀️🌱🌱🌱
ఈ సంవత్సరానికి
రాజు - కుజుడు
మంత్రి - బుధుడు
పూర్వ సస్యాధిపతి - శని
రసాధిపతి - చంద్రుడు
ధాన్యాధిపతి - గురుడు
🌱🌱🌱🌻🌻🌻🌱🌱🌱
🥭🌿🎋🥭🌿🎋🥭🌿
🎋🥭🌿🎋🥭🌿🎋🥭
🙏🙏 *సేకరణ*🙏🙏
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
మొగలిచెర్ల
*శివరాత్రీ..స్వామివారి సోదరులు..*
"బాగున్నావా..?" అనే పిలుపుతో తలయెత్తి చూసాను..శ్రీ రాజయ్యగారు..మొగిలిచెర్ల గ్రామ శివారులో ఆశ్రమం నిర్మించుకొని..కఠోరతపస్సు ఆచరించి..హఠయోగం ప్రక్రియ తో కపాలమోక్షం ద్వారా సిద్ధిపొందిన దిగంబర అవధూత కు తోడబుట్టిన వారు..శ్రీ స్వామివారికి అన్నయ్యగారైన రాజయ్యగారు..నేను కూర్చునే టేబుల్ ప్రక్కన నిలబడి వున్నారు..గబుక్కున లేచి నిలుచున్నాను.."ఎప్పుడొచ్చారు రాజయ్య గారూ..కనీసం ఒక ఫోన్ కూడా చేయలేదు..మీరు ఇక్కడికి వచ్చి దాదాపు మూడు సంవత్సరాల కాలం గడిచి పోయింది..ఆరోగ్యం ఎలా ఉంది..?..మీ సామాన్లు ఎక్కడ?.." అని గబ గబా అడిగేశాను..ఒక్కక్షణం ఆగమన్నట్టు సైగ చేశారు..కుర్చీ లో కూర్చోమని చెప్పాను..నా ప్రక్కనే కూర్చున్నారు.."మధ్యాహ్నం వచ్చాను..అదిగో ఆ శెట్టిగారి సత్రం లో సంచీ పెట్టాను..ఇక్కడికి వచ్చాను..నువ్వు అప్పుడే భోజనానికి పొయ్యావని మీ సిబ్బంది చెప్పారు..నేను కూడా అన్నదానసత్రం వద్దకు వెళ్లి భోజనం చేసి..ఆ శెట్టిగారి సత్రం లోనే కొంచెం సేపు పడుకొని..లేచి ఇటు వచ్చాను.." అన్నారు..మా సిబ్బందికి చెప్పి ఒక రూమ్ కేటాయించాను..
మొన్న శివరాత్రికి రెండురోజుల ముందు శ్రీ రాజయ్యగారు శ్రీ స్వామివారి మందిరానికి వచ్చారు..మహాశివరాత్రికి వచ్చే భక్తుల కు సౌకర్యాలు..స్వామివారి మందిరం లో క్యూ లైన్ల ఏర్పాట్లు..వచ్చేపోయే అధికారుల హడావిడులు..వీటి మధ్యలో ఉన్నాము..రాజయ్య గారు అన్నీ గమనిస్తూ..స్వామివారి మందిరం లో అటూ ఇటూ తిరుగుతూ వున్నారు..మధ్య మధ్య లో నా వద్దకు వచ్చి.."ఇంత ఏర్పాట్లు చేస్తున్నారు..ఎంతమంది వస్తారని అనుకుంటున్నారు..ఇందాక RTC వారిని అడిగితే..కావలి, కందుకూరు..రెండు డిపో ల నుంచీ సుమారు 80 బస్సులు తిరుగుతాయి అని చెప్పారు..ఓ పాతిక వేల మంది వస్తారా?.."అని ఒకసారి..
" శివరాత్రికి ముందు రోజు నుంచీ అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తున్నారట..దాదాపు 15 వేల మందికి అని వంటవాళ్ళు చెప్పారు.." అని మరోసారి కుతూహలం తో నన్ను అడుగుతున్నారు.."పాతిక వేల మంది కాదు..సుమారు నలభై, యాభై వేల మంది వస్తారని అంచనా తో ఉన్నాము.." అన్నాను..ఒక్కక్షణం ఆశ్చర్యం గా చూసి.."మా కుటుంబం లో పుట్టాడు అని కాదు కానీ..మహానుభావుడు ఇంతమందిని రప్పించుకుంటున్నాడు..ఈసారి ఈ శివరాత్రి పూర్తి అయ్యేదాకా ఇక్కడే ఉంటాను.." అన్నారు..
మహాశివరాత్రి రోజు రాజయ్య గారు ఎక్కువ సేపు స్వామివారి మందిరం లొనే గడిపారు..ఆరోజు మధ్యాహ్నం స్వామివారి తమ్ముడు శ్రీ పద్మయ్య నాయుడు కూడా తమ కుమారుడి తో సహా వచ్చారు..శ్రీ పద్మయ్యనాయుడు గారు స్వామివారి సమాధి దర్శించుకొని.."ఏర్పాట్లు బాగున్నాయి ప్రసాద్..ఈరోజు ఇక్కడ ఉండాలని ఉంది గానీ..త్వరగా వెళ్ళాలి..ఎన్ని పనులున్నా..శివరాత్రికి..స్వామి ఆరాధనకూ..నేను ఖచ్చితంగా వస్తానని తెలుసుకదా..ఆ మహానుభావుడి దయవల్ల నేను, నా బిడ్డలూ అందరమూ క్షేమంగా ఉన్నాము..అది మర్చిపోలేను..నువ్వు బాగా కష్టపడుతున్నావు.." అన్నారు..కొద్దిసేపు అన్నదమ్ములిద్దరూ మాట్లాడుకుంటూ వున్నారు..శ్రీ పద్మయ్యనాయుడు మా అందరికీ వెళ్ళొస్తానని చెప్పి..మరొక్కసారి స్వామివారి సమాధి దర్శించుకొని తిరిగి నెల్లూరు వెళ్లిపోయారు..
మహాశివరాత్రి అయిపోయిన తెల్లవారి శనివారం నాడు శ్రీ రాజయ్య గారు నా వద్దకు వచ్చి.."ఒక్క పొరపాటు కూడా జరుగకుండా..ఎటువంటి చిన్న అపశృతి కూడా లేకుండా..ఈ మొత్తం ఉత్సవం సవ్యంగా జరిగిపోయింది..ఈరోజు శనివారం కదా రాత్రికి పల్లకీసేవ ఉన్నదా?.." అన్నారు.."యధావిధిగా ఉంది.." అన్నాను..ఆరోజు కూడా స్వామివారి మందిరం లోనే ఎక్కువభాగం గడిపారు రాజయ్య గారు..పల్లకీసేవ మొత్తం ఆసక్తిగా చూసారు..రాజయ్యగారు చాలా ఉద్వేగం పొందారు..స్వామివారి ని తమ్ముడు గా భావించి కలిసి ఉన్న రోజులు..స్వామివారు సన్యాసిగా మారిన తరువాత తమతో ప్రవర్తించిన తీరు..స్వామివారు సిద్ధిపొందిన తరువాత నుండి ఇప్పటి వరకూ మొగిలిచెర్ల లోని మందిరం ఒక క్షేత్రం గా మారేవరకూ వచ్చిన మార్పులూ..అన్నీ గుర్తుకు తెచ్చుకున్నారు..తాను స్వామివారికి అన్నయ్య ను అనే భావన విడనాడి..ఒక సిద్ధపురుషుడి సమాధి ని దర్శించుకుంటున్నాము అనే భావనలో వున్నారు..అటువంటి మహానుభావుడికి తాను సోదరుడిని కావడం తన భాగ్యం గా చెప్పుకున్నారు..
"వయసు మీద పడి పోతున్నది..ఆరోగ్యము అంతంత మాత్రమే..కానీ..ఈ నాలుగు రోజులూ..ఇక్కడ జరిగిన శివరాత్రి ఉత్సవమూ..పల్లకీసేవ..ఆదివారం నాటి విశేష హారతులూ..అంతకుమించి స్వామివారి సమాధి దర్శనం కొరకు దూరప్రాంతాల నుంచి వస్తున్న ఈ భక్తులూ..అన్నీ చూసిన తరువాత..అతి త్వరలో ఇది ఒక ప్రసిద్ధ క్షేత్రం గా మారుతుందనే నమ్మకం కలిగిందయ్యా..నాకు ఓపిక ఇచ్చినంతకాలం తరచూ ఇక్కడికి వస్తాను ప్రసాదూ..నాకోసం నువ్వేమీ పెద్ద ఏర్పాట్లు చేయొద్దు..అంతగా అయితే..అందరితో పాటు నేనుకూడా స్వామివారి సన్నిధి లోనే ఉంటాను.." అని చెప్పారు..
శ్రీ స్వామివారి సోదరులు రావడం..స్వామివారి సమాధిని దర్శించుకొని వెళ్లడం..మాకు అభినందన పూర్వక ఆశీస్సులు అందచేయడం..మాకు కూడా ఒక మంచి అనుభూతిని మిగిల్చింది..ఇది కూడా స్వామివారి ఆశీర్వాదమే అని మా సిబ్బందీ..మా దంపతులమూ అనుకున్నాము..ఇక మహాశివరాత్రి ఉత్సవం మొత్తం ఏ ఇబ్బందీ లేకుండా జరగడానికి కారణం..ముమ్మాటికీ స్వామివారే..మేము కేవలం నిమిత్తమాత్రులం..
సర్వం..
శ్రీ దత్తకృప!
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).
12, ఏప్రిల్ 2021, సోమవారం
కరోనా మహమ్మారి* దాక్కొని ఉంది
ప్రమాదం *మరోసారి* కాపు కాసుకుని ఉంది.
*ఈ నాలుగు మాటలు చదవండి... ఆచరించండి... జాగ్రత్తగా ఉండండి...*
అందరికీ నమస్కారం...
మనం ఇప్పుడు చాలా విషమ పరిస్థితిలో ఉన్నాం. మన చుట్టు ప్రక్కల *కరోనా మహమ్మారి* దాక్కొని ఉంది.
ఒక సర్వే ప్రకారం...
మనం టీవీలో టెస్టులు చేసుకున్న వారి సంఖ్య మాత్రమే వింటున్నాం. టెస్టులు చేయించుకోకుండా వైరస్ సోకి ఉన్న వారు *లక్షల్లో మనమధ్యే ఉన్నారు.*
*అందుచేత...*
● దయచేసి ఎవ్వరూ ఎవరి ఇంటికి వెళ్ళకండి.
● తెలిసిన వారే కదా అని వెళ్లి, వారిని ఇబ్బంది పెట్టకండి.
● చెప్పకుండా చొరవగా వెళ్లి, వాళ్ల ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ కూర్చోకండి.
● ఏ వస్తువులు పడితే వాటిని ముట్టుకోకండి.
● ఒకవేళ బంధుమిత్రులతో మాట్లాడాలనుకుంటే, ఫోన్ కాల్ చేసి మాట్లాడండి.
● చూడాలనిపిస్తే వీడియో కాల్ చేసి మాట్లాడండి.
● ప్రత్యక్షంగా కలవాలి అనుకుంటే ముందే ఫోన్ చేసి, ఇంటి ముందుకు వెళ్లి, బయటకు పిలిచి, మాస్కు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకొని కాసేపు మాట్లాడిరండి.
● వారు మిమ్మల్ని ఇంట్లోకి రమ్మని పిలిచినా, మీరు గౌరవంగా పర్వాలేదు, మరోసారి వస్తానని చెప్పి వెళ్ళండి. అప్పుడే మీరు మర్యాద తెలిసిన వ్యక్తులుగా పరిగణించబడతారు.
● మీరు వారికి ఎంత ప్రాణస్నేహితులైనా కావచ్చు... లేక ఎంత దగ్గరి బంధువులైనా కావచ్చు... వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ కలవకండి.
● ఇక ఇరుగుపొరుగు వారు ఇచ్చే వంటకాలను ససేమిరా తీసుకోకండి.
● అలాగే వారికి మీ వంటకాలను ఇతర తినుబండారాలను ఏమీ ఇవ్వకండి.
● ఇచ్చి పుచ్చుకోవడాలు మరికొంతకాలం ఆపేయండి.
● ఈ విషయమై వారితో ఒకసారి సౌమ్యంగా చెప్పండి.
● స్నేహితులతో కలిసి అన్నిరకాల పార్టీలు కొన్ని రోజులు ఆపేయండి.
● ఈ పార్టీల వలన చాలా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.
● అవసరం లేకపోయినా రోడ్డుమీదకు వెళ్ళకండి.
● వాకింగ్ కూడా మానేయండి.
● ఇంట్లోనే యోగ, మెడిటేషన్, సూర్య నమస్కారాలు, స్కిప్పింగ్ వంటివి చేయండి.
● నువ్వు నీ శ్రేయోభిలాషులకు ఇచ్చే గౌరవం వారిని కలవకపోవడమే. *అదే ఇరువురికీ క్షేమదాయకం.*
*ఇవి యదార్ధములుగా భావించి ఆచరించి, ఆరోగ్యంగా ఉండండి.*
*సమస్త లోకా: సుఖినో భవంతు*
చిట్టికథ
✍️... చిట్టికథ
ఒకసారి తమ పితరుల శ్రాద్ధము / తిథి భోజనానికి భోక్తగా రమ్మని వశిష్ఠులు విశ్వామిత్రులను పిలిచినారు .
దానికి విశ్వామిత్రులు, ’ దానికేమి, వస్తాను.... కాని నాదొక నిబంధన .. మీరు ఒకవెయ్యి ఎనిమిది రకాల కూరగాయలతో వంట చేసి నాకు వడ్డించవలెను .. " అన్నారు.
.
"’ ఈ లోకములో శ్రాద్ధ దినమునాడు వాడతగిన కూరలు వెయ్యిన్ని ఎనిమిది రకాలు ఉన్నాయా ? అసలు మామూలు దినమైనా తినడానికి అన్ని రకాలు దొరుకుతాయా ? ఒక వేళ ఉన్నా, ఎవరైనా అన్ని కూరలు శ్రాద్ధపు వంటలో వాడుతారా ? వడ్డిస్తారా? ఒక వేళ వడ్డించినా, అన్ని ఎవరు తినగలరు ? .....విశ్వామిత్రులు కావాలని తనను ఇరికించి అవమానించడానికే ఈ కోరిక కోరినారు..." అని వశిష్ఠులకు తెలియకపోలేదు..
.
అయినా కూడా, ’ మీరు అడిగిన వెయ్యిన్ని ఎనిమిది రకాల కూరలు ఉపయోగించి వంట చేయమని అరుంధతికి చెబుతాను ’ అన్నారు.
శ్రాద్ధ దినము రానే వచ్చింది, విశ్వామిత్రులు రానే వచ్చినారు.
వారికి అరటి ఆకు పరచి, కాకర కాయ కూర, పనస పండు, మరియు నల్లేరు తీగతో పచ్చడి చేసి, ఇంకా కొన్ని కూరలు మాత్రము వాడి చేసిన వంటను అరుంధతి వడ్డించింది.
.
వెయ్యిన్ని ఎనిమిది కూరలు అయితే లేవు.
దానికి విశ్వామిత్రులు కోపించి, " ఇదేమిది ? ఈ ఆకులో వెయ్యిన్ని ఎనిమిది రకాల కూరలు ఎక్కడున్నాయి ? " అన్నారు.
దానికి వశిష్ఠులు, " నేను తమ కోరికను అరుంధతి వద్ద ముందే చెప్పి ఉంచినాను. మీ కోరిక ప్రకారమే చేస్తాను అని చెప్పింది కూడా... అడుగుతాను, ఉండండి, .." అన్నారు.
వీరి మాటలు వింటున్న అరుంధతి తానే ముందుకు వచ్చి, ఈ శ్లోకాన్ని విశ్వామిత్రులకు చెపుతుంది..
కారవల్లీ శతం చైవ, వజ్రవల్లీ శత త్రయం
పనసమ్ షట్ శతశ్చైవ శ్రాద్ధకాలే విధీయతే
దాని అర్థము, శ్రాద్ధ సమయములో వడ్డించిన ఒక కాకర కాయ [ కారవల్లీ ] నూరు కూరగాయలకు సమానము. మరియు, వజ్రవళ్ళి [ నల్లేరు ] పచ్చడి మూడు వందల కూరలకు సమానము.. పనసపండు ఆరు వందల కూరలకు సమానము.
ఇవి మూడూ కలిపితే మొత్తం వెయ్యి కూరలు. ఇవికాక ఇంకొక ఎనిమిది రకాల కూరలు వండి వడ్డించినాను .." అంది నమస్కరించి వినయముతో.
అది విని విశ్వామిత్రులు తబ్బిబ్బై, నోటమాట రాక, భోజనము చేసి వెళ్లారుట.
🌻🌻🌻🌻🌻🌻
తప్పక చదువ వలసిన కొన్ని
🌹🌹🌹🌷🌷🌹🌹🌹
తెలుగులో తప్పక చదువ వలసిన కొన్ని పుస్తకాల కోసం వ్రాద్దామని కూర్చున్నాను. *“లోకో భిన్న రుచిః”* అన్నారు కదా మన పెద్దలు. కనుక, ఏవో కొన్ని పుస్తకాలను ఉదహరిస్తూ, ఇంతకు మించిన ఉత్తమ సాహిత్యం లేదు అని చెప్పడం వివేకమనిపించుకోదు. కానీ, మనం చదివిన పుస్తకాలలో గొప్పగా అనిపించిన వాటికోసం మాత్రం, బలంగా బల్లగుద్ది గట్టిగానే చెప్పుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయే పుస్తకాలు అటువంటి వాటిలో కొన్ని.
“మంచినీళ్ళు త్రాగుతారా అనకూడదు, పుచ్చుకుంటారా అనాలి” వంటి మన తెలుగువారి భాష, అలవాట్ల గురించి తెలుసుకోవాలన్నా, వడ్లగింజలు, కలుపు మెక్కలు, మార్గదర్శి వంటి అద్భుతమైన కథలను మనకు అందించిన ఓ అసలు సిసలు తెలుగు రచయిత జీవితాన్ని చూడాలన్నా, అచ్చ తెలుగు అందాలను చదివి ఆనందించాలన్నా, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి ఆత్మకథ… *“అనుభవాలూ - జ్ఞాపకాలూనూ”* చదవాలి.
తెలుగుభాషకు చెప్పలేనంత సేవ చేసి కూడా, ఏమాత్రం ప్రచారం ఆశించని మహానుభావుడొకాయన ఉన్నారు. అసాధారణ పాండిత్యం, అబ్బురపరిచే రచనా సామర్ధ్యం ఉన్నా అత్యంత వినయసంపన్నుడుగా మెలగిన సాహితీమూర్తి ఆయన. ఏ పుస్తకానికైనా ముందుమాట రాయాల్సి వస్తే, వినయం ఉట్టి పడేలా *“మనవి మాటలు”* అని శీర్షిక పెట్టేవారు. ఆ పరిచయ వాక్యాల చివరిలో *“భాషా సేవకుడు”* అని మాత్రమే తనని తాను సంబోధించుకునేవారు. ఉత్తమ స్థాయి పాత్రికేయునిగా వాసికెక్కిన ఆ తిరుమల రామచంద్రగారి ఆత్మకథే “హంపీ నుంచి హరప్పా దాకా”. గత శతాబ్దంలో వచ్చిన ఆత్మకథలలో అత్యున్నతమైనదిగా పరిగణింపబడే ఈ పుస్తకాన్ని తప్పక చదవాలి.
ఈ శతాబ్దంలో జీవించిన వారిలో “మహాత్మా గాంధీయే అత్యున్నతుడు” అని యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ 1999 లో ఒక మ్యాగజైన్కి ఇచ్చిన ఇంటర్య్వూలో గాంధీగారిపై తన ఆరాధనా భావాన్ని చాటుకున్నాడు. విఖ్యాత రచయిత “జార్జ్ బెర్నార్డ్ షా” గాంధీతో పోల్చడానికి హిమాలయా పర్వతం ఒకటే సరిపోతుందన్నాడు. “దక్షిణాఫ్రికా స్వాతంత్ర్య సాధనలో గాంధీజీ ఆదర్శాలకీ భాగముందని" నెల్సన్ మండేలా ఆ మహాత్మునకు నమస్కరించాడు. దలైలామా, అంగ్ సాన్ సూకీ, మార్టిన్ టూథర్ కింగ్లకు ఆయనే స్ఫూర్తి. వకీలు అయ్యుండి కోర్టు హాలులో మాట్లాడలేక నాలుక పిడచకట్టుకుపోతుంటే, చుట్టూ ఉన్నవారు నవ్వుతుంటే తల దించుకున్న ఒక సాధారణ మనిషాయన. ఆ తరువాత కాలంలో ఆయన నోటి వెంట మాట రావడమే ఆలస్యం 30 కోట్లమంది మారుమాట్లాడక ఆ మాటను అనుసరించే స్థాయికి చేరుకున్నాడు. ఆ గాంధీ మహాత్ముని జీవితంలో మూడొంతులు భాగం తెలుసుకోవాలంటే ఆయన ఆత్మకథ “సత్యశోధన” చదవాలి.
“తాంబూలాలు ఇచ్చేశాను ఇక తన్నుకు చావండి”, “ఎంకి పెళ్ళి సుబ్బి చావుకి వచ్చింది”, “డామిట్ కథ అడ్డం తిరిగింది” ఇలా తెలుగువారి నోళ్ళలో నానే ఎన్నో నానుడులకు వెనకనున్న కథాకమామిషులను, గిరీశం లెక్చర్లు, మధురవాణి నవ్వు, రామప్ప పంతులు కోతలు, ఆడవేషంలో చుట్టకాల్చే శిష్యుడు, చీపిరికట్ట తిరగేసి కొట్టే పూటకూళ్ళమ్మ, సజ్జనుడైన సౌజన్యారావు పంతులు గారు, “అన్నీ మన వేదాలలోనే ఉన్నాయిష” అనే అగ్నిహోత్రావధాన్లు ఇలా అందరినీ, అన్నిటినీ ఒక చుట్టు చుట్టి రావాలంటే *“కన్యాశుల్కం”* నాటకాన్ని చదవాలి.
ఒక చిన్న తండా నాయకుని కొడుకు జగజ్జేతగా మారిన వైనాన్నీ, ఆ జగజ్జేత జీవితాన్నీ, మనస్సుని తెలుసుకోవాలంటే తెన్నేటి సూరి గారి “చెంఘీజ్ ఖాన్” నవల చదవాలి.
తెలుగువారి మహాభారతంగా కీర్తించబడేది, కవిసమ్రాట్ విశ్వనాథ వారి మహోన్నత సృష్టి, అరుంధతీ ధర్మారావుల జీవితం చుట్టూ అల్లిన మనిషి చరిత్ర, ముళ్ళపూడి వెంకటరమణ గారు “నా తల్లీ, తండ్రీ గురువు దైవం ఈ పుస్తకమే” అని చెప్పుకున్న *“వేయిపడగలు”* ను తెలుగు వచ్చినవారంతా చదవాలి. ఆ మాటకొస్తే విశ్వనాథ వారి ప్రతీ పుస్తకాన్నీ తెలుగువాడన్న ప్రతీవాడూ వదలకుండా చదవాలి.
ఎక్కడికో మండుటెండలో వెళ్ళాల్సిన పనిబడితే, బస్సు ప్రయాణానికి డబ్బుల్లేక, ఆ ఎండ బాధ తెలియకుండా ఉండటానికి పుస్తకం చదువుకుంటూ నడిచిన ఘట్టాన్ని” నాకు అలవాటైన 11వ నెంబరు బస్సెక్కాను”, “ఎర్రని ఎండలో 58 పేజీలు నడిచాను” అంటూ సరదా మాటలతో నడిపించిన వారు ముళ్ళపూడి వారు. విషాదకరమైన విషయం చెబుతున్నా, చదివేవారిని బాధపడనివ్వకుండా దానికి హాస్యపు ముసుగు కప్పేస్తాడాయన. కొన్ని వందల సరదా విసుర్లు, సినిమా కబుర్లు కలగలసిన రచనే, ఆయన బాపూ గారితో కలిసి ఆడిన *“కోతికొమ్మచ్చి”.*
ఈ పుస్తకం మూడు భాగాలనూ చదవాలి.
రెండు జెడల సీత, ఒక జడ ముందుకి, ఇంకొక జడ వెనక్కీ వేసుకుని నడుస్తుంటే, తను వెళుతుందో, వస్తుందో తెలియడం లేదంటాడు బుడుగు. ఇక జాటర్ ఢమాల్, పక్కింటి లావుపాటి పిన్నిగారు, సీగాన పెసూనాంబా, రాచ్చసుడూ పదమూడో ఎక్కం ఇలా ఒకటని చెప్పడానికి లేదు, పుస్తకం నిండా నవ్వులే. ముళ్ళపూడి వారి మాటలు, బాపూ గారి గీతలు కలిపి తెలుగు హాస్య సాహిత్యంలో త్రివిక్రముడంతగా ఎదిగిన రచన "బుడుగు".
రాజు మరణించె నొక తార రాలిపోయె
కవియు మరణించె నొక తార గగన మెక్కె
రాజు జీవించె రాతివిగ్రహము లందు
సుకవి జీవించె ప్రజల నాలుకల యందు
అంటూ ఈ భూమి మీద ఉన్న సుకవులందరికీ తన ఒక్క పద్యంతో వెలకట్టలేని గౌరవాన్ని, శాశ్వతమైన కీర్తిని కట్టబెట్టిన “నవయుగ కవిచక్రవర్తి” శ్రీ గుఱ్ఱం జాషువా గారు.
నివసించుటకు చిన్న నిలయమొక్కటి దక్క
గడన సేయుట కాశపడను నేను
ఆలు బిడ్డలకునై యాస్తి పాస్తులు గూర్ప
పెడత్రోవలో పాదమిడను నేను
నేనాచరింపని నీతులు బోధించి
రానిరాగము తీయలేను నేను
సంసార యాత్రకు చాలినంతకు మించి
గ్రుడ్డి గవ్వయు కోరుకొనను నేను
“కుల మతాలు గీచుకున్న గీతలు జొచ్చి
పంజరాన గట్టు వడను నేను
నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు
తరుగు లేదు విశ్వనరుడ నేను” అంటూ తానొక విశ్వనరుడనని ఎలుగెత్తి చాటారు జాషువా గారు. ఈ కవికోకిల కవితా విశ్వరూపం చూడాలంటే వారి సర్వలభ్యరచనలు ఒక్క పుస్తకంలో దొరికే సంకలనాన్ని కళ్ళకద్దుకొని కొనుక్కోవాలి.
“అంతములేని ఈ భువనమంత పురాతన పాంథశాల…” అంటూ ఉమర్ ఖయ్యాం రుబాయితులను తేనెతో కలిపి తెలుగువారితో త్రాగించిన మరో కవికోకిల దువ్వూరి రామిరెడ్డి గారు. వారి “పానశాల”లో పద్యాలను మనం కూడా తాగి మత్తెక్కిపోవాలి.
ఏ దేశచరిత్ర చూచినా
ఏమున్నది గర్వకారణం
నరజాతి చరిత్ర సమస్తం
పరపీడన పరాయణత్వం
ప్రపంచ మొక పద్మవ్యూహం!
కవిత్వ మొక తీరని దాహం!
నిప్పులు చిమ్ముకుంటూ
నింగికి నే నెగిరిపోతే,
నిబిడాశ్చర్యంతో వీరు-
నెత్తురు కక్కుకుంటూ
నేలకు నే రాలిపోతే
నిర్దాక్షిణ్యంగా వీరే...
నేను సైతం
ప్రపంచాగ్నికి
సమిధనొక్కటి ఆహుతిచ్చాను!
నేను సైతం
విశ్వవృష్టికి
అశ్రువొక్కటి ధారపోశాను!
నేనొక దుర్గం!
నాదొక స్వర్గం!
అనర్గళం, అనితర సాధ్యం నా మార్గం!
ఇలా ఒకటా రెండా ఆ పుస్తకం నిండా మహోత్కృష్టమైన కవితలే. ఎందరో కవులను పుట్టించిన ఆ మహాకవి శ్రీశ్రీ గారి పుస్తకం… మహాప్రస్థానాన్ని చదివి తీరాలి.
హిందూమతాన్ని గురించి, సనాతన ధర్మాన్ని గురించి ఏ సందేహాలున్నా అవన్నీ పటాపంచలు అయిపోవడానికీ, ఇక ఇంతకుమించిన ప్రామాణికమైన బోధలు లేవని పూర్తి విశ్వాసం కలిగించగల కంచి పరమాచార్య శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహా స్వాముల వారి “జగద్గురు బోధలు” పది పుస్తకాల సెట్టును పట్టుకునే ఇంటికి వెళ్ళాలి. అసలు వేదములలో ఏముంది. వేదాంగములంటే ఏమిటి? ఉపనిషత్తులు ఏం చెబుతున్నాయి. ఇవన్నీ సంక్షిప్తంగా సాధికారికంగా తెలుసుకోవాలంటే పరమాచార్య గారి ఉపన్యాసాల సంకలనం *వేదములు* చదవాలి.
ఒక ఆంగ్లేయుడు సత్యాన్వేషణ కోసం చేసిన పయనాన్ని, చివరికి తన గమ్యమైన అరుణాచలాన్ని చేరుకున్న వైనాన్నీ తెలుసుకోవాలంటే పాల్ బ్రంటన్ రచనకు తెలుగుసేత అయిన “రహస్య భారతంలో నా ఆధ్యాత్మిక అన్వేషణ”ను తప్పక చదవాలి.
సంఘజీవన విధానం మీద, మన అలవాట్ల మీద సెటైర్ ఎలా వెయ్యాలో తెలుసుకోవాలన్నా, సరదా కథనంతో వెళుతూనే చెంపలు ఛెళ్ళుమనిపించే చమక్కులు కురిపించాలన్నా, ఆ జంఘాలశాస్త్రిని పుట్టించిన పానుగంటి లక్ష్మీనరసింహరావు గారి “సాక్షి” వ్యాసాలను మళ్ళీ మళ్ళీ చదువుకోవాలి.
రెండేళ్ళుగా వర్షాలు లేక తిరుమలలో నీటికి కటకట ఏర్పడితే… వరుణ యాగం చేసి కుండపోత వర్షం కురిపించిన పద్మభూషణ్ ఉప్పులూరి గణపతి శాస్త్రి గారి గురించీ, నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థను ఓ IAS అధికారి పట్టాలెక్కించిన విధానం గురించీ, అపర చాణక్యుడిగా పేరుగాంచిన పి.వి. నరసింహారావు మనస్తత్వం గురించీ, తెలుగు వారి ఆరాధ్య కథా, ప్రజా నాయకుడు ఎన్టీయార్ పరిపాలనా విధానాల గురించీ, ఇలా ఆశ్చర్యం, ఆసక్తి కలిగించే ఇంకెన్నో విషయాలున్న పి.వి.ఆర్.కె ప్రసాద్ గారి ) "దాహం కర్తా, హరిః కర్తా", "అసలేం జరిగిందంటే” పుస్తకాలు కనబడగానే కొనేసుకోవాలి.
ఇంకా…
ఆది శంకరుల నుండి జిడ్డు కృష్ణమూర్తి వరకూ ఉన్న భారతీయ తత్వవేత్తల గురించి, కార్ల్మార్క్, ఫ్రెడరిక్ నీషే, ఆర్ధర్ షోపనార్ వంటి పాశ్చాత్య తత్వవేత్తల గురించి, వాళ్ళ తత్వసారాల గురించి సులభంగా తెలుసుకోవాలంటే త్రిపురనేని గోపీచంద్ “తత్వవేత్తలు” పుస్తకాన్ని చదవాలి.
భగవద్గీత చదవాలి అనుకునే వారికి అమృత తుల్యమయినది, ప్రతిపదార్థ, తాత్పర్య, వ్యాఖ్యలతో కూడినది అయిన శ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానంద స్వాములవారి “గీతామకరంద” గ్రంథాన్ని పారాయణ చేయాలి.
కృష్ణలో మునకలేస్తూ, కాస్త ఆశ్చర్యం, ఇంకాస్త ఆనందంతో అమరావతి పట్నంలో తిరుగుతున్న అనుభూతి కావాలంటే, సత్యం శంకరమంచి గారి “అమరావతి కథలు”ను తోడు తీసుకెళ్ళాలి,
ఆధ్యాత్మిక భావనలు ఉన్నవారెవరికైనా సరే, ఉన్నత స్థాయి ఆనందాన్ని కలిగించే ఉత్తమ స్థాయి పుస్తకం... పరమహంస యోగానంద గారి “ఒక యోగి ఆత్మకథ”. మహావతార్ బాబాజీ, లాహిరీ మహాశయులు, యుక్తేశ్వర్ గిరి వంటి యోగి పుంగవుల గురించి, మరెందరో మహిమాన్వితుల యోగ సాధనల గురించి మనకు తెలియజేసే ఆధ్యాత్మిక ఆత్మకథ ఈ *“ఒక యోగి ఆత్మకథ”.*
కథలు రాయాలి అనే కోరిక ఉన్నవాళ్ళు, కథ రాయడానికి ఏమేం సరంజామా కావాలో తెలుసుకోవాలనుకునేవాళ్ళు, భారతీయ పాశ్చాత్య కథకుల కథన రీతుల వివరాలు గ్రహించాలనుకునేవాళ్ళు కచ్చితంగా చదవవలసిన పుస్తకం వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారి “కథాశిల్పం”.
“రచన అన్నది అరటిపండులా ఒలిచి చదువరి చేతుల్లో పెడితే అతని మెదడుకు పనే ఉండదు. అందులో కవిత్వమూ ఉండదు. అతడు కాసేపు ఆలోచించి అర్థం చేసుకోవడమే మంచిది” అని సముద్రాల గారితో మల్లాది వారన్నారట, ఒకానొక సందర్భంలో. మల్లాది వారి రచనలన్నింటిలోనూ ఇదే అంతస్సూత్రంగా ఉన్నట్టు ఉంటుంది. 80 యేళ్ళ క్రితమే పేరొందిన అన్ని పత్రికలలో వారి రచనలు, వ్యాసాలు అచ్చయ్యేవి. స్వయానా సరస్వతీదేవే కొన్ని విషయాల మీద మాట్లాడటం మొదలు పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ వ్యాసాలు చదువుతుంటే. నా కవి మిత్రులు, మన కథకులు, చలవ మిరియాలు మొదలైన శీర్షికలతో వారు వ్రాసిన వ్యాస పరంపరకు పుస్తక రూపమే... *“చలవ మిరియాలు”.*
మాయాబజార్, మిస్సమ్మ, పాతాళభైరవి ఇలా తెలుగులో ఎన్నటికీ నిలచిపోయే చిత్రాలకు మాటలు పాటలూ రాసినవారు, గుండమ్మకథ, అప్పు చేసి పప్పుకూడు వంటి సినిమాలకు గీతకర్త పింగళి నాగేంద్రరావు గారు. వారు సినిమాలలోకి రాక పూర్వం నాటక రచన కూడా చేశారు. అందులో తొమ్మిది నాటకాలు రెండు సంపుటాలుగా వచ్చాయి.
“తెలుగు వారల మాట
భళియనగ చెల్లాలి
తెలుగుజెండా గగన
గగనాల యెగరాలి
తెలుగుతల్లీ నీకు జోహార్
తెలుగువారల కీర్తి
తళతళల మెరవాలి
తెలుగువారే దేశదేశల నేలాలి
తెలుగుతల్లీ నీకు జోహార్”
అని పింగళివారు తను రాసిన నారాజు అనే నాటకంలో ఒక పాత్రచేత చెప్పిస్తారు. తన మాతృ భాషమీద మమకారాన్ని చాటుకుంటారు.
తెలుగు సినీ కవిసార్వభౌముడైన వేటూరి సుందరరామమూర్తి గారు సినిమారంగంలోకి రాకపూర్వం చేసిన రచన సిరికాకొలను చిన్నది, అనే సంగీత రూపకం. సుమారు యాభై ఏళ్ళ క్రితం ఆకాశవాణిలో ప్రసారమయ్యి శ్రోతలను విపరీతంగా ఆనందపరచిన ఈ వేటూరి రచన తరువాత కాలంలో పుస్తకంగా అచ్చయ్యింది. అలానే ఎందరో సినీ ప్రముఖుల గురించి వేటూరిగారు హాసంపత్రికలో వ్రాసిన వ్యాస పరంపరకు పుస్తకరూపం కొమ్మకొమ్మకో సన్నాయి. ఈ రెండూ చదివితే కవిత్వంతో ఈ వేటూరి ఎంత ఎత్తుకు వెళ్ళాడో వచనంలోనూ అంతెత్తుకు వెళ్ళాడన్న విషయం అర్థమవుతుంది.
కవి అంటే కృష్ణశాస్త్రేనేమో అన్నంతగా తెలుగువారిని సమ్మోహ పరచిన వారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు.
“సౌరభములేల చిమ్ము పుష్పవ్రజంబు?
చంద్రికల నేల వెదజల్లు చందమామ?
ఏల సలిలంబు పారు? గాడ్పేల విసరు?
ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను?”
“నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు - నా యిచ్ఛయే గాక నా కేటి వెరపు?” వంటి ఆయన కవిత్వ పంక్తులు నోటికి రాని నిరక్షరాస్యులు కూడా ఆరోజులలో ఉండేవారు కారట. ఆయన కవితా సంపుటులన్నీ కొనుక్కొని చదువుకొవాలి. కుదరని పక్షంలో కనీసం కృష్ణపక్షం అయినా చదువుకోవాలి,
తెలుగులో హాస్యం అంటే గుర్తుకువచ్చే మొదటి పేరు భమిడిపాటి కామేశ్వరరావు గారిది. మన వేష భాషల మీద, అలవాట్ల మీద, మనస్తత్వం మీద వారు వేసినన్ని హాస్యోక్తులు మరే హాస్య రచయితకూ సాధ్య పడలేదు. ‘‘మన లిపిలోనే మన అనైక్యత తెలుస్తుంది. క-చ-ట-త-ప ఈ అక్షరాలు చూడండి. విడివిడిగా దేని తలకట్టు దానిదే. హిందీలో అయితే ఈ అక్షరాలకు పైన ఓ గీత పెట్టి కలుపుతారు. మనం? అబ్బే! కచట తపల గాళ్లం. మన అక్షరాల్లాగా ఎవడి పిలక వాడిదే. ఇంకోడితో కలిసే ప్రసక్తే లేదు.’’ ఇలా సాగుతుంది వారి వరస. అన్నీ తగాదాలే, మన తెలుగు, లోకో భిన్న రుచిః మొదలైన పుస్తకాలు చదువుతున్నంత సేపూ పెదాలు విచ్చుకునే ఉంటాయి.
చందమామ పత్రికకు సంపాదకునిగా దశాబ్దాల పాటూ పనిచేసి ఈనాటి ఎందరో సాహితీకారులకు పరోక్షంగా ప్రేరణగా నిలచినవారు... కొడవటిగంటి కుటుంబరావు గారు. సమాజం గురించి తెలుసుకోవాలంటే కుటుంబరావు గారి కథలు, నవలలు చదవాలి. సాహిత్యం కోసం తెలుసుకోవాలంటే వారి సాహిత్య వ్యాసాలు చదవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే కొడవటిగంటి కుటుంబరావు గారి పుస్తకాలన్నీ చదవాలి.
కవిగా ఆరుద్రని అందరికీ చేరువ చేసిన రచన *“త్వమేవా౽హమ్”.* 1948లో రజాకార్లచే చెరచబడ్డ స్త్రీకథనం కృష్ణాపత్రికలో చదివి “త్వమేవాహం” మొదలుపెట్టారు ఆరుద్ర. ఈ కావ్యం చదివిన శ్రీశ్రీ, “ఇక నే పద్యాలురాయనవసరంలేదు” అని ప్రశంసించారు ఆరుద్రని.
“నువ్వు ఎక్కదలచుకొన్న రైలు
ఎప్పుడూ ఒక జీవితకాలం లేటు” అనే ప్రసిద్ధ కవితా వాక్యం ఈ పుస్తకంలోనిదే.
చలంగారి హృదయం తెలుసున్నవాళ్ళకి, ఆయన ఆరాటం దేనిగురించో ఎరిగున్నవాళ్ళకే చలం రచనలు అర్థమవుతాయి. స్త్రీ స్వేచ్ఛ కోసం పరితపించినవాడు చలం. తన మైదానం నవలతో తెలుగునేలపై ఒక పెద్ద అలజడి సృష్టించిన రచయిత ఇతను. ఈయన పుస్తకాలన్నీ చదువవలసినవే అయినా, ప్రేమలేఖలు మాత్రం ముందుగా చదవవలసిన పుస్తకం.
నేను పుట్టకముందే
నెత్తిమీద నీలితెర
కాళ్ళకింద ధూళిపొర
ఇవి తెలుగువారిని రెండో మారు జ్ఞానపీఠం ఎక్కించిన విశ్వంభర కావ్యానికి ఆరంభాక్షరాలు.
మానవుడే నాయకునిగా, విశాల విశ్వంభరే రంగస్థలంగా, ప్రకృతి నేపథ్యంగా, తేదీలతో నిమిత్తంలేని, పేర్లతో అగత్యంలేని మనిషి కథకు వచన కవితారూపమే ఈ విశ్వంభర అని కృతికర్త నారాయణ రెడ్డి గారు కవితా వస్తువేమిటో చెప్పుకొచ్చారు.
మూడోమారు తెలుగువారికి జ్ఞానపీఠం తీసుకువచ్చిన వారు రావూరి భరద్వాజ గారు. మంగమ్మ అనే నాటకాల కంపెనీలో పనిచేసే స్త్రీ తన తెలివి తేటలతో, అందచందాలతో తెలుగు సినిమా పరిశ్రమలో మంజరి అనే ప్రఖ్యాత
కథానాయకురాలిగా ఎదిగి, తిరిగి అథః పాతాళానికి పడిపోయిన కథే,
*పాకుడు రాళ్ళు.*
పుట్టబోయెడి బుల్లి బుజ్జాయి కోసమై
పొదుగు గిన్నెకు పాలు పోసి పోసి
కలికి వెన్నెల లూరు చలువ దోసిళ్ళతో
లతలకు మారాకు లతికి యతికి
పూల కంచాలలో రోలంబములకు రే
పటి భోజనము సిద్ధ పరచి పరచి
తెలవారకుండ మొగ్గలలోన జొరబడి
వింత వింతల రంగు వేసి వేసి
తీరికే లేని విశ్వ సంసారమందు
అలసి పోయితివేమొ దేవాధిదేవ!
ఒక నిమేషమ్ము కన్నుమూయుదువు గాని
రమ్ము! తెరచితి మా కుటీరమ్ము తలుపు!!
అంటూ సృష్టికార్యంలో అలసిపోయావా స్వామీ అంటూ భగవంతుడి మీదే కరుణ చూపించిన కవి కరుణశ్రీ గారు.
“ఊలుదారాలతో గొంతు కురి బిగించి
గుండెలోనుండి సూదులు గ్రుచ్చి కూర్చి
ముడుచుకొందురు ముచ్చటముడుల మమ్ము
అకట! దయలేనివారు మీ యాడువారు.” అంటూ విలపించే పువ్వుల బాధని మన మనస్సులకు గుచ్చుకునేలా చేసిన కవితా ఖండిక పుష్పవిలాపం. తెలుగు పద్యం సొగసు తెలియాలంటే కరుణశ్రీ గారి *ఉదయశ్రీ* చదవాల్సిందే.
పుట్టపర్తి నారాయణాచార్యులు గారు 14 భాషలలో ప్రవీణులు. ఎంత ప్రావీణ్యం అంటే..ఆ 14 భాషలలో ఆశు కవిత్వం చెప్పగలిగినంత. వారు తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ భాషలలోని కావ్యాలను తెలుగులోకి అనువదించారు. విశ్వనాథ వారి ఏకవీరను మళయాళంలోకి అనువాదం చేసారు. పుట్టపర్తి వారి జీవితంలో ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, ఆయన రాసిన పుస్తకాన్ని ఆయనే పాఠ్యాంశంగా చదువుకోవాల్సి రావడం!
శివతాండవం చదువుతుంటే మనకు తెలియకుండానే అక్షరాలన్నీ సంగీతంతో కలిసి పరిగెడుతుంటాయి. అందుకేనేమో ఆ శివతాండవం కవిసమ్రాట్ విశ్వనాథుని ఆనంద పరవశుని చేసింది. కవికోకిల జాషువా చేత పుట్టపర్తి నారాయణాచార్యుల కంటే గొప్పవాడెవ్వడు? అనిపించింది.
“ఓ నిజాము పిశాచమా! కానరాడు
నిన్ను బోలిన రాజు మా కెన్నడేని;
తీగెలను తెంపి, అగ్నిలో దింపినావు
నా తెలంగాణ, కోటి రత్నాలవీణ”
అని నినదించిన మహాకవి దాశరథి. “దాశరథి వ్రాసిన పద్యాలు బోలెడు - అందులో నోటు చేయదగినవి కోకొల్లలు” అని ‘ఆరుద్ర’చే కొనియాడబడిన కవితావన పారిజాతం మన దాశరథి. నిజాం చెరనుండి తెలంగాణా విముక్తికై పోరాడిన కవనయోధుడతడు. “మహాంధ్రోదయం” కోసం తన కవిత్వంతో “అగ్నిధార”లు కురిపించి “రుద్రవీణ”లు మ్రోగించినవాడు. లక్ష్యం నెరవేరాక, చల్లబడ్డ మనస్సుతో సినిమా పాటలలో వేయి వేణువులు మ్రోగించి, ముత్యాల జల్లులు కురిపించినవాడు. ఆ కవితాగ్ని కాంతిలో దాశరథి విశ్వరూపాన్ని చూడాలంటే ఆయన సాహిత్యాన్ని చదవాల్సిందే.
"నేనింతా ఓ పిడికెడు మట్టే కావచ్చు - కానీ కలమెత్తితే నాకు ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది!" అంటూ నినదించిన మహాకవి గుంటూరు శేషేంద్ర శర్మ.
"శేషేన్
నీ పోయెమ్సు చూసేన్
పసందు చేసేన్
నీది పద్యమా లేక ఫ్రెంచి మద్యమా"
అంటూ ఆయనను కవితాత్మకంగా పొగిడి మురిసిపోయారు "శ్రీశ్రీ".
ఈ షోడశి పుస్తకంలో... సుందరకాండ కుండలినీ యోగమని, లంకానగరం మూలాధారమని, సీతాదేవియే కుండలినీశక్తి అని, స్వామి హనుమే కుండలినీ యోగము అనుష్ఠించు యోగి అని వేదోపనిషత్తులనుండి మంత్రశ్లోకాలను ఉదహరిస్తూ నిరూపిస్తారు రచయిత గుంటూరు శేషేంద్ర శర్మ గారు.
అనువాద హనుమంతుడంటూ బాపూరమణలు పిలుచుకునే నండూరి రామ్మోహనరావు గారి రచనా శైలి చాలా సరళంగా ఉంటుంది. మార్క్ట్వైన్ రచించిన టామ్ సాయర్, హకల్ బెరీఫిన్ మొదలైన వాటికి నండూరి వారి అనువాదాలు అనువాదపు వాసన తగలకుండా గుబాళిస్తుంటాయి. ఇవి కాక ఇంకొన్ని అనువాదాలయిన రాజూ-పేద, విచిత్ర వ్యక్తి, కాంచనద్వీపం వంటి పుస్తకాలు పిల్లలతో చదివిస్తే వాళ్ళ ఊహాశక్తి, భాషా పటిమ రెంటినీ పెంచినవాళ్ళమవుతాం.
ఆరు సారా కథలు, రత్తాలు రాంబాబు, రాజు-మహిషి, గోవులొస్తున్నాయి జాగ్రత్త వంటి రచనలతో తెలుగు సాహిత్యంలో స్థిర నివాసం ఏర్పరచుకొన్న రచయిత రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు. రావి శాస్త్రిగా సుప్రసిద్ధులు. ఈనాటి రచయితలు ఎందరికో స్ఫూర్తి. ఆయన రచనాశైలి కూడా వేరెవ్వరీ అందనంత విశిష్టమైనది. కేవలం మళ్ళా మళ్ళా చదువుతూ ఆనందించ వలసినది.
ఇంకొక సుప్రసిద్ధ కథా రచయిత చాసోగా పిలవబడే చాగంటి సోమయాజులు గారు. ఎందుకు పారేస్తాను నాన్నా, ఎంపు, జంక్షన్లో బడ్డీ వంటి ఆయన కథలు… కథను ఎలా నడిపించాలి అన్న విషయంలో ఔత్సాహిక కథకులకు మార్గదర్శనం చేస్తాయి.
అందరికీ అర్థం కాని కథలు, అర్థం అయినా తిరిగి ఇదీ ఆ కథ అని చెప్పలేని కథలు, మనసు పొరల్లోకి తవ్వుకుంటూ వెళ్ళే కథలు... త్రిపుర కథలు. పాము, భగవంతం కోసం వంటి కథలు చదివిన తరువాత మరలా ఈ వాస్తవిక ప్రపంచంలోకి రావడానికి చాలా సమయం పడుతుంది. త్రిపుర పేరుతో రచనలు చేసిన రచయిత అసలు పేరు రాయసం వెంకట త్రిపురాంతకేశ్వరరావు గారు.
ఇంకా తెలుగు అందాన్ని అక్షరాలలో పెట్టి పరుగులు పెట్టించిన వేలూరి శివరామశాస్త్రి గారి కథలు,
తన "గాలివాన" కథతో తెలుగు కథకు అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టిన పాలగుమ్మి పద్మరాజు గారి కథలు,
*"చివరకు మిగిలేది"* అనే నవలతో తెలుగు సాహిత్యం ఎంతకాలం ఉంటుందో అంతకాలం ఉండిపోయే స్థాయిని సంపాదించుకున్న బుచ్చిబాబు గారు రాసిన కథలు,
ఆనందాన్ని, హాయిని కలిగించే భానుమతి గారి “అత్తగారి కథలు”,
ఇలా వీరందరి కథలూ చదివి తీరాల్సిందే.
ఇప్పటివరకూ చెప్పుకున్న పుస్తకాల రచయితలెవ్వరూ ఇప్పుడు భూమి మీద లేరు. ఇప్పుడు ఉన్న రచయితల్లో కూడా తారాపథాన్ని అందుకున్నవాళ్ళు ఇద్దరు ఉన్నారు. అప్పట్లో లక్షలాది తెలుగు పాఠకులకు వాళ్ళిద్దరి పుస్తకాలే తెలుగు సాహిత్యానికి ప్రవేశద్వారాలుగా ఉండేవి. వారిలో ఒకరు,
*యండమూరి వీరేంద్రనాథ్ గారు.* ఒక తరం నవలా సామ్రాజ్యానికి ఆయనే చక్రవర్తి. వెన్నెల్లో ఆడపిల్ల, అంతర్ముఖం వంటి నవలలు ఎప్పటికీ క్లాసిక్సే. ఛాలెంజ్, రాక్షసుడు, మరణమృదంగం, అభిలాష, ఒక రాధ ఇద్దరు కృష్ణులు మొదలైన తెలుగు సినిమాలన్నీ యండమూరి నవలలకు వెండితెర రూపాలే. “విజయానికి అయిదు మెట్లు” తెలుగులో వచ్చిన వ్యక్తిత్వ వికాస పుస్తకాలలోకెల్లా అత్యంత విజయవంతమైన పుస్తకం.
ఇంకొక ప్రసిద్ధ రచయిత, షాడో సృష్టికర్త అయిన *మధుబాబు గారు.* డిటెక్టివ్ సాహిత్యంలో ఎందరో రచయితలు ప్రఖ్యాతులైనా అగ్రస్థానం మాత్రం మధుబాబు గారిదే. షాడో గంగారాంతో కలసి దేశవిదేశాల్లో చేసిన విన్యాసాలు చదివి ఆనందించవలసిందే కానీ ఇలా చెప్పుకుంటే తనివితీరేది కాదు. డిటెక్టివ్ నవలలే కాదు కాళికాలయం, వీరభద్రారెడ్డి వంటి ఎన్నో జానపద నవలలు కూడా మధుబాబు గారి మార్క్తో తెలుగు సాహిత్యంలో నిలబడిపోయాయి.
ఇంకా…
ప్రజాకవి కాళోజీ గారి “నా గొడవ”, డైరక్టర్ వంశీ గారి “పసలపూడి కథలు”, యద్దనపూడి సులోచనారాణి గారి “జీవన తరంగాలు”, మల్లాది వెంకట కృష్ణమూర్తి గారి “నత్తలొస్తున్నాయి జగ్రత్త”, మాదిరెడ్డి సులోచన గారి “పూల మనసులు”, రంగనాయకమ్మ గారి “బలిపీఠం”, పొత్తూరి విజయలక్ష్మి గారి “హాస్య కథలు”, కె.ఎన్.వై. పతంజలి గారి “కథలు- పతంజలి భాష్యం”, శ్రీరమణ గారి “మిథునం”, “బంగారుమురుగు” కథలు, దేవరకొండ బాలగంగాధర తిలక్ గారి “అమృతం కురిసిన రాత్రి” రాసిన ఇలా చదవ వలసిన పుస్తకాలు ఎన్నో ఉన్నాయి.
రామాయణం 24 వేల శ్లోకాలూ టీకా తాత్పర్యాలతో సహా కావాలనుకునేవాళ్ళకు పుల్లెల శ్రీరామచంద్రుడు గారి రామాయణం, టి.టి.డి వాళ్ళు ప్రచురించిన ఆంధ్రమహాభారతం పదిహేను పుస్తకాల సెట్టు, వారి ప్రచురణే అయిన పోతన భాగవతం, రామకృష్ణమఠం వారు సులభశైలిలో అర్థమయ్యేలా ప్రచురించిన ఉపనిషత్తుల పుస్తకాలు, శృంగేరీ పీఠాధిపతుల సూచన మేరకు కాకతీయ సిమెంట్స్ వారు ప్రచురించిన పురాణ అనువాదాలు ఇలా ఇంకా ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి.
ఇప్పటికి కొందరు రచయితలను, కవులను తలుచుకుంటూ కొన్ని పుస్తకాలను మాత్రమే ప్రస్తావించాను. ఇలాంటి ఇంకొక పది వ్యాసాలు వ్రాసినా ఇంకా గుర్తుచేసుకోవలసిన, చదవ వలసిన మంచి పుస్తకాలు మిగిలే ఉంటాయి. అంత గొప్ప సాహిత్యం ఉంది మన భాషలో.
ఇప్పటికి మాత్రం ఈ పుస్తకాలతో సరిపెడుతూ, నా ఉత్సాహానికి అడ్డుకట్ట వేసుకుంటున్నాను.
*స్వస్తి! - రాజన్ పి.టి.ఎస్.కె*
(#RajanPTSK Rajan PTSK)
🌹🌹🌹🌷🌷🌹🌹🌹
మాస్క్ ఇవ్వండి
సాహిత్య అభిమాని ఒకరు తన దుకాణం వద్ద ఇలా బోర్డు పెట్టారు.
కొంచం కూడా ఆంగ్లం వాడకుండా వస్తువులు కొంటే 30శాతం రాయితీ ఇస్తాను.
వ్యక్తి... సూక్ష్మాతి సూక్ష్మ విషాణు రాక పోక నియంత్రణ ముఖోష్ట నాసికాది రక్షణార్ధం కర్ణ ధ్వయ సమర్థిత ద్వివస్త్రం ఇవ్వండి అన్నాడు.
యజమాని... బాబు 50 శాతం రాయితీ ఇస్తాను, ఆంగ్లంలోనే చెప్పండి.
మాస్క్ ఇవ్వండి అన్నాడు.😷😷😀😀
యుగాది
యుగాది🌹*
యుగాది కాలానికి ప్రమాణము. అది అనగా మొదలు.ఉగాది కాల ప్రమాణానికి తొలిరోజు. కాలానికి మనమంతా వశులమే. జీవులంతా ఈ కాల ప్రవాహం లో పుట్టి పెరిగి నశించినవారే.కానీ కాలతీతమైన మరొక తత్వం వుందని సాయి నాధుడు, దత్తాత్రేయ, రామకృష్ణ , రామణులు వంటి మహాత్ముల ద్వారా తెలుస్తోంది. ఆ తత్వం మే జడ,చైతన్య ప్రాణుల రూపంలో ప్రకటన అయిందని అన్ని మతాలు చెపుతున్నారు. "జీవో భ్రహైవ నా పరః",ఆని "స్సర్వం ఖలీవిధం భ్రహ్"అని వేదాలు, "నువ్వు చూసేదంతా కలిపి నేను" అని సాయి నాధుడు తెలిపారు. ఆనంద స్థితి ని అందుకోవడం జీవుల లక్ష్యం. అట్టి సాధనకు పునఃఅంకితం ఆయ్యెరోజు ఉగాది. ఉగాది పచ్చడి లోని ఆరు రుచులు కష్ట సుఖాలు సుఖ దుఃఖాలు అన్ని సాయి ప్రసాదంగా తలుద్దాం.
-శ్రీ వికారి నామ సంవత్సర శుభాకాంక్షలు.🌹🙏🏻💐
పరశురాముడు
*🚩పరశురాముడు-శ్రీ మహాభారతంలో కథలు!🚩*
పరశురాముడు -శ్రీ మహాభారతంలో కథలు పరశురాముడి చరిత్ర చాలా చిత్రమైనది.
పరశురాముడి తాత బుచీకుడనే ఋషి. ఆయన గాధిరాజు దగ్గరకు వెళ్ళి రాకుమారి సత్యవతిని తనకిచ్చి పెళ్ళి చేయమని కోరాడు. తాపసికి పిల్లనివ్వటం ఇష్టం లేక, నల్లటి చెవులున్న తెల్లటి గుర్రాలను వేయింటిని తెచ్చి కానుకగా ఇస్తే తన కూతుర్నిచ్చి పెళ్ళి చేస్తానని షరతు పెట్టాడు గాధిరాజు. బుచీకుడు ఇంద్రుణ్ణి ప్రసన్నం చేసుకుని అశ్వసహస్రాన్ని సాధించి తెచ్చి సత్యవతిని పెళ్ళిచేసుకున్నాడు.
తరువాత ఒకసారి గాధిరాజదంపతులు పుత్రసంతానం కోసం ఏమేమి పూజలు చేయాలో చెప్పమని బుచీకుడ్ని అర్ధించాడు. అప్పుడాయన రెండు రకాల హోమద్రవ్యాలు తయారు చేసాడు.
" ఇదిగో చూడు! ఈ హవ్యం తింటే క్షత్రియ నాశకుడు, అజేయుడు అయిన క్షత్రియ కుమారుడు పుడతాడు. ఇది మీ అమ్మకు ఇవ్వు. ఇలా చూడు, ఈ హవ్యం నీ కోసం ప్రత్యేకంగా తయారుచేసాను. ఇది తింటే తపస్సు, శమదమాలు గల ఉత్తమ ద్విజుడు పుడతాడు" అని భార్యతో చెప్పి బుచీకుడు స్నానానికి వెళ్ళాడు.
అతను వెళ్ళిన కాసేపటికి అత్తమామలు రానే వచ్చారు. సత్యవతి తల్లికి భర్త చేసిన హవ్యాలు చూపించింది. వాటి ప్రభావం వర్ణించింది. ఆమె సంతోషించి శుచిగా స్నానం చేసి వచ్చి పొరపాటున తాను సేవించవలసిన హవ్యం కూతురికి ఇచ్చి, కూతిరి వంతు హవ్యం తాను తిన్నది.
బుచీకుడు ఆశ్రమానికి వచ్చి దివ్యదృష్టితో జరిగినదంతా తెలుసుకున్నాడు.
" ఈ పొరపాటు వల్ల నీ తల్లికి బ్రహ్మతేజం గల పుత్రుడు , నీకు పరమ క్రూరుడయిన కొడుకు పుడతారని" బుచీకుడు భార్యతో చెప్పాడు. సత్యవతి బాధపడింది. బుచీకుడు జాలిపడి ఆ క్రౌర్యం తన మనుమడికి వచ్చేటట్టు అనుగ్రహించాడు. బుచీకుని హోమద్రవ్య ఫలంగా గాధిరాజుకు జన్నించిన విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడు. జమదగ్ని గొప్ప తపస్వి. ఆ మహర్షి సతీమణి రేణుకాదేవి.
మానవులకు తల్లికంటే తండ్రే శ్రేష్ఠమైన దైవమని (పితాపరం దైవతం మానవానం) పరాశరగీత (297-2) తెలిపిన సూక్ష్మధర్మాన్ని పరశురాముడు రుజువు చేశాడు.ఓరోజు జమదగ్ని, పూజ చేసుకునేందుకు, భార్యను వెళ్ళి గంగాజలం తీసుకురమ్మన్నాడు. ఎంతమాత్రం ఆలస్యం చేయవద్దని, పూజకు సమయం మించిపోకుండా, గంగాజలాన్ని త్వరగా తెమ్మని చెప్పాడు. రేణుకాదేవి, భర్త చెప్పినట్లు, నీళ్ళు తెచ్చేందుకు, గంగానదికి వెళ్ళింది. గంగమ్మకు నమస్కరించి, కళ్ళు తెరిచేసరికి గంధర్వులు కనిపించారు. రేణుక ఆశ్చర్యానికి అంతు లేదు. చిత్రరథుడనే గంధర్వుడు అప్సరసలతో కలిసి జలక్రీడలు ఆడుతున్నాడు. అలాంటి ఆనందకర దృశ్యాన్ని5 ఎన్నడూ చూడని రేణుక పరవశంగా చూసింది.
కొద్దిసేపు అలా గంధర్వులను చూసిన రేణుక, భర్త కోపావేశాలు గుర్తొచ్చి ఉలిక్కిపడి, తాను తెచ్చిన పాత్రను గంగలో ముంచి ఉదకాన్ని తీసుకుంది. భయంతో గుండె కొట్టుకుంటూ ఉండగా, వేగంగా ఆశ్రమం చేరింది. ఒనుకుతున్న చేతులతో గంగాజలాన్ని భర్త ఎదుట ఉన్న పూజా సామగ్రి దగ్గర ఉంచింది.
జమదగ్ని దివ్యదృష్టితో చూడనే చూశాడు. భార్య ఆలస్యంగా రావడానికి కారణం తెలీగానే ఆగ్రహంతో దహించుకుపోయాడు. ఆవేశంతో రగిలిపోతూ "పరశురామా! ఈ చంచల మనస్కురాలిని ఒక్క వేటున నరికేయి" అని ఆజ్ఞాపించాడు. పరశురాముడు మరొకర్ని, ఇంకొకర్ని అయితే అలాగే నరికేసేవాడు. కానీ, ఆమె స్వయంగా తల్లి కావడంతో ఆ పని చేయలేకపోయాడు. తండ్రి మాటా విననట్లు ఊరుకున్నాడు.
కానీ, జమదగ్ని కోపం తగ్గలేదు.
"పరశురామా, చెప్తోంది నీకే.. వెంటనే పరశువు (గొడ్డలి) తీసుకో... మీ అమ్మని, సోదరుల్నీ కూడా నరుకు.. ఇది నా ఆజ్ఞ" అన్నాడు.
పరశురాముడికి తండ్రి తపశ్శక్తి తెలుసు కనుక ఇక లేచాడు. ఇక ఆలోచించకుండా కన్నతల్లిని, సోదరులని తన పరశువుతో నరికేశాడు. జమదగ్ని సంతోషానికి అవధుల్లేవు. కొడుకు తన ఆజ్ఞను శిరసావహించాడు. తల్లి అని కూడా చూడకుండా తాను చెప్పినట్లు చేశాడు.
అందుకే, "పరశురామా, నా మాట మన్నించినందుకు సంతోషం.. ఏదైనా వరం కోరుకో" అన్నాడు.
పరశురాముడు సందేహించకుండా,
"నాన్నా, దయచేసి అమ్మని, సోదరులని మళ్ళీ బతికించు.. అంతకంటే ఇంకేం అక్కర్లేదు" అన్నాడు. జమదగ్ని కోపగించుకోలేదు.
"తథాస్తు" అన్నాడు.
పరశురాముని తల్లి రేణుకాదేవి, సోదరులు పునర్జీవితులయ్యారు.
అయినా పరశురామునికి సంతోషం కలగలేదు. దుఃఖంతో రగిలిపోయాడు.
కార్తవీర్యార్జునుడు (సంస్కృతం: कार्तवीर्य अर्जुन, IAST: Kārtavīrya Arjuna) హైహయ వంశజుడైన కృతవీర్యుడు పుత్రుడు. ఇతడు శాపవశమున చేతులు లేకుండా జన్మించాడు. గొప్ప తపస్సుచేసి, దత్తాత్రేయుని ప్రసన్నము చేసుకొని, వెయ్యి చేతులను పొంది మహావీరుడైనాడు. దత్తాత్రేయ మహర్షి కి పరమ భక్తుడు. ఇతని రాజధాని వింధ్య పర్వతముల వద్ద గల మహిష్మతీపురము. ఇతని పురోహితుడు గర్గ మహర్షి.
ఒకసారి అగ్ని తనకు ఆహారము కావలెనని కార్తవీర్యార్జునుని అడిగెను. గిరినగరారణ్యమును భక్షింపుమని అనుమతిచ్చెను. ఆ అరణ్యములో మైత్రావరుణుని ఆశ్రమము కలదు, దానిని అగ్ని కాల్చివేసెను. మైత్రావరుణుని సుతులకు కోపము వచ్చి అతని బాహువులు పరశురాముడు ఖండించునని శపించెను.
🙏🏻
ఉగాది
*🍑ఉగాది పండుగను ఎందుకు, ఎలా జరుపుకుంటారు🍑*
తెలుగు సంవత్సరం ఆరంభమయ్యేది ఈ రోజే.. అందుకే సంవత్సరంలో మొదటి రోజు. యుగానికి ఆది యుగాది.. కాలక్రమేణ ఉగాదిగా మారింది. సంస్కృతం లో యుగాది అనే మాటకు కృత, త్రేత, ద్వాపర,కలియుగాల్లో ఏదో ఒకదానికి ఆది లేక ప్రారంభం అని అర్థం.
తెలుగులో ఉగాదిని సంవత్సరాది అంటే కొత్త ఏడాది ప్రారంభంగా వాడుతున్నాం. చైత్ర శుద్ధ పాడ్యమిని ఉగాదిగా జరుపుకొంటాం. హేమాద్రి, కమలాకరభట్టు వంటి పండితులు దీన్ని నిర్ధారించారు.
*🥭పురాణ కథ*
తెలుగు వారికి ఉగాది ముఖ్యమైన పండుగ. ఉగాది రోజు బ్రహ్మ సృష్టిని చేశాడని పురాణాలు చెబుతున్నాయి. పూర్వం ఒకప్పుడు సోమకాసుడనే రాక్షసుడు బ్రహ్మదేవుడి దగ్గరుండే పురాణాలను దొంగిలిస్తాడు. ఆ వేదాలను తీసుకుని రాక్షసుడు సముద్ర గర్భంలో దాక్కుంటాడు. ఈ విషయం విష్ణుమూర్తికి తెలుస్తుంది. దీంతో ఆయన మత్స్యావతారం ఎత్తి ఆ రాక్షసుణ్ణి సముద్ర గర్భంలో పాతిపెట్టి ఆ వేదాలు (పురాణాలు)ను తీసుకుని బ్రహ్మదేవుడికి అప్పగిస్తాడు.
దీంతో పురాణాలను పొందిన బ్రహ్మ సృష్టిని తయారు చేయడం ప్రారంభిస్తాడు. అలా బ్రహ్మ సృష్టిని చేయడం ఉగాది రోజే ప్రారంభిస్తాడు. దీంతో ఆ రోజుకి పురాణాల్లో ఎంతో ప్రాముఖ్యతను కల్పించారు. ఇక మనకు ఒక సంవత్సరం పూర్తయితే బ్రహ్మకు అది ఒక రోజు అవుతుంది. కనుక బ్రహ్మకు రోజూ ఉగాదే అవుతుంది. అంటే అతను రోజూ సృష్టి చేస్తాడన్నమాట.
*🥭ఉగాది పచ్చడి విశిష్టత*
ఈ రోజు అతి ముఖ్యమైనది ఉగాది పచ్చడి. ఈ రోజు చేసే పచ్చడి చాలా ప్రత్యేకత, విశేషత కలిగినది. ఏడాదిలో అన్ని రకాల రుచులను ఆస్వాదించాలనే తత్వ బోధ చేసే ఈ పచ్చడిని తప్పక ప్రతి ఒక్కరు స్వీకరించాలి.
వేపపువ్వు, కొత్త చింతపండు, బెల్లం, మామిడికాయ ముక్కలు, ఉప్పు, శనగపప్పు సాధారణంగా వాడుతారు. మరికొన్ని ప్రాంతాల్లో జీలకర్ర, చెరుకు ముక్కలు, కొంచెం కారం, నేయి వంటివి కూడా వాడుతారు. మొత్తం మీద షడ్రుచుల సమ్మితంగా దీన్ని తయారుచేస్తారు. దీన్ని కొత్త కుండలో/గిన్నెలో తయారు చేసి పంచాంగ పూజ చేసిన తర్వాత నైవేద్యం పెట్టి తీర్థ ప్రసాదాలను, ఉగాది పచ్చడిని స్వీకరిస్తారు.
ఉగాది పచ్చడి మహా ఔషధమని పురాణాలు చెబుతున్నాయి. దీన్ని ఉగాది నుంచి తరువాత వచ్చే శ్రీరామ నవమి వరకు లేదా చైత్ర పౌర్ణమి వరకు ప్రతి రోజూ తినాలట. మొత్తం 15 రోజుల పాటు ఉగాది పచ్చడిని తినాలని దీంతో శరీర రోగ నిరోధక శక్తి పెరిగి ఆయా వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందని చెబుతారు.
ఉగాది పచ్చడి ఆరు రుచుల సమ్మేళనమని మనకు తెలుసు. అందులో వేసే వేప పువ్వు, ఆకు కడుపులో ఉండే నులి పురుగులు, క్రిములను చంపేస్తాయి. గాలి సోకడం, ఆటలమ్మ, అమ్మోరు వ్యాధులు రాకుండా ఉంటాయి. అలాగే పచ్చి మామిడి కాయ యాంటీ వైరల్ లక్షణాలను కలిగి ఉంటుంది. దీంతో జ్వరాలు రావు. వాత, పిత్త, కఫాలు సమతుల్యంలో ఉంటాయి. దీని వల్ల ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.
*🥭ఇక ఉగాది పండుగకు చెందిన మరిన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.*
* పరగడుపునే షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరించాలి. ప్రకృతి మార్పులకు అనుగుణంగా మన శరీరాన్ని సంసిద్ధం చేసే శక్తి ఈ పచ్చడికి ఉందని పురాణోక్తి.
* ఉగాది పండుగ వసంత రుతువులో వస్తుంది. సాధారణంగా ఈ కాలంలో ఆటలమ్మ, ఇతర విష జ్వరాలు ఎక్కువగా వస్తాయి. దీంతో పాటు పలు ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది. అందుకు ఉగాది పచ్చడి చాలా మేలు చేస్తుంది.
* ఉగాది రోజున ఇంటి ద్వారాలకు మామిడి ఆకులతో, బంతి పూలతో తోరణాలు కడుతాం. ఈ క్రమంలో బంతిపూలు, మామిడి ఆకులలో ఉండే యాంటీ సెప్టిక్, యాంటీ బయోటిక్ గుణాలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. బయటి నుంచి రోగ కారక క్రిములను ఇంటి లోపలికి రాకుండా చూస్తాయి.
* సాయంత్రం వేళ దేవాలయంలో జరిగే పంచాంగ శ్రవణాన్ని తప్పక వినాలని చెబుతారు పెద్దలు.
*🥭ఈ రోజు చేయాల్సిన ప్రత్యేక స్నానం*
నీటిలో గంగాదేవి, తైల (నూనె) లో లక్ష్మీదేవి ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. ఉగాది రోజున ఉదయాన్నే నువ్వుల తైలాన్ని శరీరానికి పట్టించి నాలుగు పిండితో అభ్యంగన స్నానం చేయాలి. ఇలా చేసిన వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని, వారికి ఆయురారోగ్యాలు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. కనుక ఈ రోజున ఇలా స్నానం చేయడం మాత్రం మరువకండి.
🙏🏻
🍑🏵️🍑🏵️🍑🏵️🍑
🏵️🍑🏵️🍑🏵️🍑🏵️
*_🥭ఉగాది🥭_*
_ఉగాది - భావం_
_హైందవశాస్త్రం ప్రకారం అరవై తెలుగు నామసంవత్సరాలు ఉన్నాయి, అవి ఒక క్రమంగా వస్తాయి._
_బ్రహ్మదేవుడు తన సృష్టిని చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ప్రారంభించాడు. ఆ రోజు యుగమునకు ఆది - యుగాది, నేటి ఉగాది. భారతీయ గణితవేత్త శ్రీ భాస్కరాచార్యులవారి గణనం ప్రకారం ఈ రోజున సూర్యోదయ కాలానికి కొత్త సంవత్సరం, కొత్త నెల, కొత్త రోజు వస్తాయి. వసంత ఋతువు మొదలవుతుంది. అంత వరకూ బీడు పడి ఉన్న భూమి మొలకలు ఎత్తి, కొత్త జీవితానికి నాందిలా పచ్చదనాన్ని సంతరించుకుంటుంది. పచ్చని పంటపొలాలు, ఏపైన చెట్లు, రంగు రంగుల పూలు సౌభాగ్యానికి చిహ్నంగా కనబడతాయి. ఇది తెలుగు వారి కొత్త సంవత్సరాది._
_*🥭ఉగాది పచ్చడి - ప్రాముఖ్యత:*_
_ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక. జీవితం అన్ని అనుభవములు కలిగినదైతేనే అర్ధవంతం అని చెప్పే భావం ఇమిడి ఉంది . పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్ధం ఒక్కొక భావానికి, అనుభవానికి ప్రతీక_
_బెల్లం - తీపి - ఆనందానికి సంకేతం_
_ఉప్పు - జీవితంలో ఉత్సాహమ, రుచికి సంకేతం_
_వేప పువ్వు – చేదు -బాధకలిగించే_ _అనుభవాలు_
_చింతపండు - పులుపు_ _- నేర్పుగా_ _వ్యవహరించవలసిన పరిస్థితులు_
_పచ్చి మామిడి ముక్కలు - పులుపు - కొత్త సవాళ్లు_
_మిరపపొడి – కారం - సహనం కోల్పోయేట్టు_ _చేసే పరిస్థితులు_
_ప్రొద్దునే ఇంటి_ _ఆడవారు పచ్చడి తయారు చేసి దేవునికి నైవేద్యంగా పెడతారు. ఇంట్లోవారంతా స్నానం చేసి, కొత్త బట్టలు కట్టుకొని పరగడుపున ఉగాది పచ్చడి తిని తర్వాత అల్పాహారం తీసుకుంటారు. ఆ రకంగా తమ జీవితాలు అన్ని అన్నిభావాల మిశ్రమంగా ఉండాలని ఆకాంక్షిస్తారు._
_*🥭పండగ తయారి:*_
_ఒక వారం ముందే పండగ పనులు మొదలవుతాయి._ _ఇంటికి వెల్ల వేసి, శుభ్రం చేసుకుంటారు. కొత్త బట్టలు, కొత్త సామాగ్రీ కొనడంలో ఉత్సాహం పండుగ సందడి ఒక వారం ముందే మొదలవుతుంది. పండుగ రోజున తెల్లవారుఝామునే లేచి, తలస్నానం చేసి, ఇంటికి మామిడి తోరణాలు కడతారు._ _పచ్చటి మామిడి తోరనాలకు ఈ రోజుకు సంబంధించి ఒక కధ ఉంది. శివపుత్రులు గణపతి, సుబ్రమణ్యస్వాములకు మామిడి పండ్లంటే ఎంతో ప్రీతి._ _సుబ్రహ్మణ్యుడు ఏ ఇంటికి పచ్చని మామిడి తోరణాలు కట్టి ఉంటాయో ఆ ఇంటిలో సంపద, మంచి పంట కలుగుతుందని దీవించాడని కధ._
_ప్రతీ ఇంట ముందు ఆవు పేడతో కల్లాపి జల్లి , రంగు రంగుల రంగవల్లులు తీర్చి దిద్దుతారు._ _శాస్త్రయుక్తంగా తమ ఇష్టదైవానికి పూజ చేసుకుని కొత్త సంవత్సరం అంత శుభం కలగాలనికోరుకుంటారు. ఆరోగ్య ఐశ్వర్యాలను ఆకాంక్షిస్తారు . ఈ రోజున కొత్త పనులు వ్యాపారాలు మొదలెడతారు._
_ఇంటింట ప్రత్యేక వంటకాలు తయారు చేస్తారు. పులిహోర, బొబ్బట్లు, పాయసం, అలాగే పచ్చి మామిడి కాయతో వంటకాలు విశేషం._
*_పంచాంగ శ్రవణం:_*
_ఈ రోజున ప్రత్యేకంగా పంచాంగ శ్రవణం జరుగుతుంది. సాధారణంగా సాయంత్ర సమయాన ఊరి జనాలు ఒక చోట చేరి, సిద్ధాంతి చెప్పే పంచాంగ వివరాలు, ఆ సంవత్సరరాశి ఫలాలు తెలుసుకుంటారు సిద్ధాంతి దేశ, రాష్ట్ర, వ్యక్తీ స్థితి గతులు ఎలా ఉంటాయో వివరణ చేస్తాడు._ _పంచాంగ శ్రవణం వాళ్ళ రానున్న మంచి చెడులను సమభావంతో స్వీకరించ గలరని, పంచాంగ శ్రవణం వినడం మంచిది అని మన పెద్దలు చెప్పటం జరిగింది._
*_కవి సమ్మేళనం:_*
_ఉగాదికి సాహితీవేత్తలు ప్రత్యేకంగా "కవి సమ్మేళనం"_ _నిర్వహిస్తారు. కొత్త, పాత కవులు నవభావన, పాత ఓరవళ్ళు కలిపి కొత్త పద్యాలు, కవితలు తయారు చేసి చదువుతారు. సామాజిక జీవనం, రాజకీయం, వాణిజ్యం ఇలా అన్నివిషయాలను గూర్చి ప్రస్తావిస్తారు, కవులు తమకవితలలో. ఈ విధంగా నానా రుచి సమ్మేళనంగా జరుగుతుంది ఉగాది కవి సమ్మేళనం._
_ఊరగాయల కాలం:_
_మామిడికాయలు దండిగా రావడంతో స్త్రీలు ఊరగాయలు పెట్టడం మొదలెడతారు._ _వర్షాకాలం, చలికాలానికి ఉపయోగించు కోవడానికి వీలుగా మామిళ్ళను, ఇతర కాయలను ఎండబెట్టి,_ _ఊరవేస్తారు. తెలుగు వారిళ్ళలో ప్రత్యేకంగా చెప్పుకోవలసినది "ఆవకాయ". “ఇలా_ _వివిధ విశేషాలకు నాంది యుగాది - తెలుగువారి ఉగాది”_
🙏





