13, జనవరి 2022, గురువారం

వైకుంఠ ద్వారా దర్శనంకు ఎందుకు అంత ప్రాధాన్యత?

 #శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారా దర్శనంకు ఎందుకు అంత ప్రాధాన్యత?


పదిరోజులు పాటు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం ఎందుకు కల్పిస్తారు?


ఏ రోజు దర్శనం చేసుకుంటే మంచి ఫలితాలు సిద్దిస్తాయి?


మానవులుకు 365 రోజులు…దేవతలకు ఒక్కరోజుతో సమానం.


మానవులుకు 6 నెలల కాల సమయం….దేవతలకు 12 గంటల సమయం.


దేవతలకు 12 గంటల రాత్రి సమయాని దక్షిణాయం అని….పగలు 12 గంటల సమయాని ఉత్తరాయణం అని అంటారు.


దక్షిణాయంలో మహవిష్ణువు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు సేద తీరే సమయం…దినినే కర్కాటక మాసం అంటారు.


రాత్రి 8గంటలకు మహవిష్ణువు నిద్రకు ఉపక్రమించే సమయం…8 నుంచి 10 గంటల సమయాని సింహ మాసం అంటారు.


రాత్రి 10 నుంచి 12 గంటల మధ్య మహవిష్ణువు ప్రక్క తిరిగి పడుకునే సమయం….ఈ కాలం మానవులుకు కన్యా మాసం. 


అర్దరాత్రి 12గంటల నుంచి వేకువజాము 2 గంటల వరకు మహవిష్ణువు గాడ నిద్రలో వుండే సమయం….

మానవులుకు తులామాసం.


మహవిష్ణువు నిద్రలేచే సమయం వేకువజాము 2 గంటల 40 నిముషాలకు….ఉదయం 2 నుంచి 4 గంటల సమయాని మానవులుకు వృశ్చికమాసం.


మహవిష్ణువు నాలుగు గంటల నుంచి నాలుగు గంటల నలభై నిముషాల వరకు ముక్కోటి దేవతలకు దర్శనభాగ్యం కల్పిస్తారు…ఉదయం 4 నుంచి 6 గంటల కాలాని దనుర్మాసంగా పిలుస్తారు.


దేవతలకు ఒక్క గంట సమయం ….మానవులుకు 15.2 రోజులుతో సమానం.


దేవతలకు 40 నిముషాల సమయం….మానవులుకు 10 రోజులుతో సమానం.


ఈ 10 రోజులు కాలమే….శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరిచే పదిరోజులు….


దినితో వైకుంఠ ఏకాదశి నుంచి పది రోజులు వ్యవధిలో ….ఏ రోజు దర్శనం చేసుకున్నా….ఉత్తమ ఫలితాలే భక్తులుకు సిద్దిస్తాయి...


#సమాచారం అందించిన వారు:


#ప్రోఫసర్ రాణి సదాశివామూర్తి,

సంస్కృత విధ్యాపిఠం

తిరుపతి...

12, జనవరి 2022, బుధవారం

అమ్మ గది🌷

🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹

           🌷అమ్మ గది🌷

                🌷🌷🌷

బంధుమిత్రులు, అతిథుల రాకపోకలతో వామనరావు ఇల్లంతా ఒకటే హడావిడి. మూడ్రోజుల కిందటే వాళ్ళీ కొత్తింట్లోకి వచ్చారు. గృహప్రవేశానికి వచ్చి ఇంకా ఉన్న బంధువులు, అప్పుడు రాలేక, ఇప్పుడొచ్చి శుభాకాంక్షలు చెప్తున్న వాళ్ళతో ఆ కొత్తిల్లు కళకళలాడుతోంది. వామనరావు, ఆయన భార్య పరిమళ మొహాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. వచ్చిన వాళ్లందరికీ తమ ఇల్లు చూపిస్తూ వారిరువురూ సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు. 


"ఈ ప్లోరింగ్ మార్బుల్స్ రాజస్థాన్ నుంచి తెప్పించాం. ఇది కన్సీల్డు కిచెన్. ఇది మాస్టర్ బెడ్ రూమ్, పక్కది చిల్డ్రన్ బెడ్ రూమ్, ఆ తరువాత గెస్ట్ రూమ్, అది పూజ గది, మూలగా ఉన్నది స్టోర్ రూమ్, పైన లెఫ్ట్ కార్నెర్లో జిమ్, రైట్ సైడ్ పెట్ కార్నివాల్, టాప్ లో పెంట్ హౌస్, ఇది సిటౌట్, లోపల కారిడార్, సైడ్ లో డ్రాయింగ్ రూమ్, ఇది చేపల ఎక్వైరియం ప్లేస్" ఇలా అన్నీ చూపిస్తూ మురిసిపోతున్నారా భార్యా భర్తలు. 


వామనరావు చూపుల్లో విజయ దరహాసం, పరిమళ మాటల్లో దర్పం స్పష్టంగా కనబడుతున్నాయి. లిప్ట్, పనిమనిషికి ఔట్ రూమ్, స్విమ్మింగ్ ఫూల్, విశాలమైన గార్డెనింగ్... వీటితో ఆ మూడంతస్తుల పాలరాతి కట్టడం నిజంగానే ఓ అద్బుత కళా ఖండంగా మెరిసిపోతోంది. 


వామనరావు ఆధాయ పన్నుల శాఖలో ఉన్నతోద్యోగి. పరిమళది ధనిక కుటుంబ నేపథ్యం. గత పదిహేనేళ్ల నుంచీ అద్దిళ్ళల్లో ఉంటున్న వాళ్ళకీ యిల్లు కలల సౌధం.

వారం రోజులు గడిచాయి. హడావిడి సద్దుమణిగింది. 


"ఇక వెళ్ళొస్తాన్రా!" అంటూ తన చేతి సంచీ తీసుకుని బయలుదేరాడు వామనరావు మేనమామ, గంగయ్య. "ఇంకో రెండ్రోజులుండి వెళ్దువు గాని మామయ్యా!" అన్నాడు వామనరావు. "నేనిక్కడ ఉండి చేసే పనేముంది? ఇప్పటికే వారం రోజులయింది. నేనెళ్ళకపోతే అక్కడ చేనెండిపోతుంది" అన్నాడు మామయ్య. "మధ్యాహ్నం భోజనం చేస్తే గాని వెళ్లడం కుదరదు, ససేమిరా!" అని మొహమాట పెట్టేసింది పరిమళ. ఆమె మాటను కాదనలేకపోయాడు గంగయ్య. 


గంగయ్య వామనరావు తల్లి వేణమ్మకి స్వయానా అన్నయ్య. పేదవాడైనా అతనిది ఉన్నతమైన సంస్కారం, మంచి మనస్సు. వాళ్ళది ఒక చిన్న పల్లెటూరు. ఆయన్ని ఊళ్ళో అందరూ బాగా గౌరవిస్తారు. వాళ్ళ ఊళ్ళో ఉండే ఓ మోతుబరి రైతుకు నమ్మిన బంటుగా ఉండి పొలం చూసుకుంటున్నాడు గంగయ్య. 


వారం రోజుల ముందే గంగయ్య ఇక్కడకొచ్చి చిన్నా, పెద్దా పనులు చక్కపెడుతూ వచ్చాడు. ఇల్లు కడిగించడం, మామిడి తోరణాలు కట్టడం, ఆవు, దూడని తెచ్చి గృహప్రవేశానికి ఇల్లంతా తిప్పడం, వచ్చిన అతిథులకి ఏ లోటూ రాకుండా చూసుకోవడం వంటి ఎన్నో పనులు మామయ్యే దగ్గరుండి చూసుకున్నాడు. మామయ్య చిన్నప్పటి నుంచీ వామనరావు కుటుంబానికి పెద్ద ఆసరా. 


అమ్మమ్మ ఇంటికెళ్లినప్పుడు భుజాల మీద ఎక్కించుకుని పొలం తీసుకెళ్లి తియ్యటి తాటి ముంజలు, తేగలు వంటి ఎన్నో రుచులు పంచేవాడు. వచ్చినప్పుడల్లా బోలెడు తినుబండారాలు తెచ్చేవాడు. అందుకే ఇప్పటికీ

తనకీ, చెల్లికీ మామయ్యంటే ఓ మధురమైన బంధం, ఆత్మీయ భావం.


మధ్యాహ్నమైంది. భోజనం ముగిసింది. ఊరికి వెళ్లేందుకు ఉపక్రమించాడు మామయ్య. వెళ్తూ, వెళ్తూ హాల్లో ఆగాడు, "బాబూ ఓ చిన్న మాట" వామనరావుని పిలిచాడు. "చెప్పు మామయ్యా!" అన్నాడు వామనరావు. "ఇల్లు చాలా బాగా కట్టేవు... అందరూ నీ యింటి గురించి చెప్పుకుంటుంటే... ఇది మా మేనల్లుడిల్లని చాలా పొంగిపోయాను... కాకపోతే..!?" అని ఆగి సందేహిస్తుండగా, "చెప్పు! మామయ్యా! ఫర్వాలేదు!" అన్నాడు వామనరావు. 


"అసలున్నాడో ? లేడో ? తెలియని దేవుడికి ఈ ఇంట్లో ఓ గదుంది. చిన్న పిల్లలకు, రాబోయే అతిథులకీ గదులున్నాయి. పనిమనుషులకి, ఆఖరికి పెంపుడు కుక్కకీ, చేపల తొట్టికీ కూడా గదులున్నాయి... కానీ, నిన్ను కన్న నీ తల్లి కోసం ఎక్కడా ఓ చిన్న గది కూడా కనిపించడం లేదయ్యా?" అన్నాడు. ఆ విషయం గురించి అంతగా ఆలోచించని వామనరావు మామయ్య మాటలకి షాకయ్యాడు. 


"లంకంత ఇంటిలో ఆమె పడి మీదే తుంగ చాపేసుకుని పడుకుంటోంది. మీ కోసం ఎవరైనా వస్తే కనిపించకుండా తలుపెనకాలో, దొడ్డివైపు సందులోకో వెళ్ళిపోయి మరుగు చేసుకుంటోంది. తనకంటూ స్థిరమైన గదిలేక అది 'గడీలాటలో మప్పీలా గడియకో చోటుకి మారుతోంది'. దాని అవస్థ చూస్తుంటే పూర్వమున్న తాటాకింట్లోనే  స్వేచ్ఛగా ఉందనుకుంటున్నాను. అసలు ఈ లోకంలో ఏమీ ఆశించకుండా అన్నీ త్యాగం చేసి ఇచ్చేది ఒక్క తల్లేరా ! నీ యంత చదువు, జ్ఞానం నాకు లేకపోయినా, వయసిచ్చిన అనుభవంతో చెబ్తున్నాను. నేను తప్పు మాట్లాడుంటే మరోలా అనుకోవద్దు", వామనరావు మస్తిష్కంలో ఆలోచనలు నింపి వెళ్ళిపోయాడు మామయ్య.


మామయ్య మాటలు మనస్సు లోతుల్లో ఎక్కడో గుచ్చుకుని, సోఫాలో చతికిల పడ్డాడు వామనరావు. తనను తాను సరిపెట్టుకోలేని నిస్సహాయతేదో అతన్ని ఆవరించింది. కాసేపటికి తేరుకుని, కిటికీలొంచి అమ్మకోసం చూశాడు. సందులోంచి ప్రహారీ అవతలున్న ఇరుగూ పొరుగుతో కొడుకు, కోడలు కట్టుకున్న ఇంటి గురించి గొప్పలు తెగ చెప్పేస్తోంది. వామనరావుకి కన్నీళ్లాగలేదు. "ఈ లోకంలో ఏమీ ఆశించకుండా అన్నీ ఇచ్చేది తల్లి ఒకత్తేరా !", మామయ్య మాటలు చెవుల్లో గింగురుమంటున్నాయి, "మామయ్య చెప్పింది నిజమే కదా !". 


వామనరావుకు తన చిన్నతనం, అమ్మ తన కోసం జీవితమంతా పడిన కష్టం గుర్తుకొచ్చి కళ్ళవెంబడి నీళ్ళు బొటబొటా కారాయి. చిన్నప్పుడు వర్షానికి తాటాకింట్లో పై కప్పు నుంచి నీళ్లు కారుతుంటే తమకు మైకా సంచి కప్పి, రాత్రంతా తాను తడుస్తూ కూర్చుంది. కాలేజీ వాళ్ళు పొరుగు రాష్ట్రాలకు టూర్ పెడితే తనను కూడా పంపించింది. తరువాత తెలిసిన నిజం... అందు కోసం తన పెళ్లినాటి జరీ పట్టు చీర అమ్మేసిందని. తన రక్తాన్ని మరిగించినా, కండలు కరిగించినా తమ కోసమే కదా... అనుకుంటూంటే కళ్ళల్లో నీళ్లు ధారాపాతమౌతున్నాయి. కళ్ళు ఒత్తుకున్నాడు వామనరావు.


వామనరావుకి ఆరేళ్ళు, చెల్లికి మూడేళ్ల వయసులో పొద్దున్నే చద్దన్నం తిని పనికెళ్ళిన నాన్న మోటారు విద్యుత్ తీగ మృత్యువై కబళించగా శవమై ఇంటికి వచ్చాడు. వేణమ్మ దుఃఖసాగరంలో మునిగిపోగా, ప్రపంచం తెలియని వయస్సులో ఆ అమాయక పిల్లలు బిత్తర చూపులు చూస్తూండిపోయారు. 


ఆ హాఠాత్పరిణామం ఇంటిల్లిపాదినీ కృంగదీసింది. వేణమ్మ రోజులు గడుస్తున్నా బాధ నుంచి కొలుకోలేకపోతోంది. మొదట్నుంచీ భర్తా, పిల్లలకి వండి పెట్టడం తప్ప ఆమెకు మరో వ్యాపకం తెలియదు, సంపాదించడం రాదు. క్రమంగా ఇంట్లో అన్నీ నిండుకుని, రోజు గడవడమే కష్టమైంది. ఇరుగూ పొరుగూ సాయం ఎంతకాలం ? కూర్చుని తింటుంటే కొండలాగుతాయా ? కరెంటు, పాలు కట్, బియ్యం డబ్బా ఖాళీ. అప్పు తీర్చక, కిరాణా కొట్టులో సామాను ఇవ్వక, రేపు అన్నదే ప్రశ్నార్థకంగా మారింది. అటువంటి సమయంలో ఆత్మహత్యకు కూడా ప్రయత్నించి, పిల్లల్ని చూసి విరమించిందని పక్కింటి వాళ్ళు అనుకుంటుండగా విన్నాడు వామనరావు.


ఒకరోజు టిఫిన్ తెచ్చుకోవడానికి వీధి చివరున్న హోటల్ కి వెళ్ళిన పిల్లలిద్దరూ అవి అయిపోయాయని బిక్కమొహల్తో తిరిగి వచ్చినప్పుడు ఓ మెరుపులాంటి ఆలోచన వచ్చి, కార్యరంగంలోకి దిగి, వాళ్ళింటి దగ్గరే టిఫిన్ సెంటర్ మొదలుపెట్టింది వేణమ్మ. కాలం కలిసి వచ్చి వేణమ్మకి డబ్బులు చేయి తిరగడంతో భర్త చేసిన పాత బాకీలన్నిటినీ తీర్చేయాలనుకొంది.


"నాన్న ఎప్పుడో చేసిన బాకీలు ఇప్పుడెవ్వరూ అడగట్లేదుగా? ఇక తీర్చడమెందుకు ?" అమ్మతో అన్నాడు వామనరావు. "రుణ శేషం, శత్రు శేషమన్నారు పెద్దలు. మనం బాకీలుండిపోతే వచ్చే జన్మల్లో తీర్చగలమో, లేమో" అంది అమ్మ. నాన్న చేసిన అప్పులన్నీ వడ్డేతో సహా తీర్చేసింది అమ్మ. తల్లి శ్రమకు ప్రతిఫలంగా అన్నట్టు తామిద్దరూ కష్టపడి చదువుకుని ప్రయోజకులయ్యారు. 


వేణమ్మ మంచి పెంపకంలో పెరిగిన వామనరావు గుణగణాలు, ఉద్యోగం చూసి ఏరికోరి మరీ వాళ్ళమ్మాయి పరిమళనిచ్చి వివాహం చేశాడు మామగారు. వామనరావు భార్యా పిల్లల్నేసుకుని చాలా ఊళ్లు తిరిగినా, వేణమ్మ మాత్రం తన ఊరు, తన ఇల్లు, తన పని వదిలిపెట్టలేదు, తమ దగ్గరికి రమ్మని కొడుకు అభ్యర్ధించినా... 


వామనరావు పదోన్నతుల్లో పెద్ద స్థాయి ఉద్యోగంతో నగరానికి చేరుకుని, అక్కడే స్థిరపడాలని అనుకుంటే, ఇల్లు కట్టు కోవడానికి పరిమళ వాళ్ల నాన్నగారు కూడా ఆర్ధికంగా సాయపడ్డాడు. వామనరావు అమ్మను కూడా ఒప్పించి ఈ ఇంటికి తీసుకొచ్చేశాడు. అనుకున్నట్టుగా అన్నీ సక్రమంగా జరిగే సమయంలో మామయ్య తన బాధ్యతని గుర్తు చేయడంతో తన ఆలోచన్ని పరిమళ ముందుంచాడు. 


వెంటనే, ఓ గది ఖాళీ చేసి, అమ్మా, నాన్న తాలూకు ఫోటోలన్నిటినీ ఆ గదిలో అలంకరించి, అమ్మ నులక మంచం, నాన్న వాడిన మడత కుర్చీ, ట్రంకు పెట్టి, బేట్రీ లైటుతో సహా ఆ గదిలో సర్దేశారు.

 

పడి మీద కూర్చున్న వేణమ్మను పరిమళ, వామనరావు చేరొక చేయి పట్టుకుని ఆమె గది దగ్గరకు తీసుకొచ్చారు. గుమ్మం పైన *అమ్మ గది* అని పెద్ద అక్షరాలతో రాసి వుంది. అమ్మ కళ్ళల్లో ఆనంద భాష్పాలు. భర్త స్మృతుల్ని తలపిస్తూ గదిలో ఉన్న ఆమె తాలూకూ వస్తువులను చూస్తూ పరవసించిపోయింది. కొంతసేపు ఆమె కన్నీళ్లే మాట్లాడాయి. "ముసిలి దాన్ని... ఏ పడి మీద తల దాచుకున్నా రోజెళ్లిపోతుంది. ఇదంతా నాకెందుకురా బాబూ" అంది.


వామన రావుకి మామయ్య మాటలు మళ్ళా గుర్తోచ్చాయి, *లోకంలో ఏమీ ఆశించకుండా అన్నీ ఇచ్చేది అమ్మ ఒకత్తే !*. 


నాటినుంచీ వామనరావు అందరికీ చెప్తూనే వున్నాడు ఇంట్లో పూజగది కంటే ముందుగా ఉండాల్సింది *అమ్మ గది* అని...

కులం' అనే పదంతో రాసిన పదకేళి*

 ✍️

  *'కులం' అనే పదంతో రాసిన పదకేళి* 


బాల్యంలో *బాలకులం* 

యవ్వనంలో *యువకులం* 

వృద్ధాప్యంలో *పండుటాకులం* 

రాలిపోయే *ఎండుటాకులం* 


         ఎవరూ లేకుంటే *ఏకాకులం* 

         ప్రేమలో ఉంటే *ప్రేమికులం* 

         పెళ్ళైతే సంసారికులం

         కాకుంటే *బ్రహ్మచారికులం* 


రక్షిస్తే *రక్షకులం* 

భక్షిస్తే *భక్షకులం* 

దేశ *సైనికులం* 

సమాజ *సేవకులం* 


      ప్రయాణిస్తే *ప్రయాణికులం* 

      నిత్య వాహన *చోదకులం* 

      యాత్రలు చేస్తే *యాత్రికులం* 

      మాయలు చేస్తే *మాంత్రికులం* 


ఉపన్యసిస్తే *ఉపన్యాసకులం* 

హాస్యం పండిస్తే *విధూషకులం* 

పాడితే *గాయకులం* 

సభలో ఉంటే *సభికులం* 

సినిమా హాల్లొ *ప్రేక్షకులం* 

టీవీ ల ముందు *వీక్షకులం* 


      చదివింది *గురుకులం* 

      అభ్యసిస్తే అభ్యాసకులం 

      బోధిస్తే *బోధకులం* 

      వృత్తిరీత్యా *అధ్యాపకులం* 

      పత్రికల *పాఠకులం* 

      నేర్పించే *శిక్షకులం* 


కొందరితో ఉంటే *సామాజీకులం* 

అందరితో ఉంటే *అనేకులం* 

ఫలానోల్ల కుటుంభీకులం

ఆ వంశ సంబంధీకులం


మేం

        ధనముంటే *ధనికులం* 

        లేకుంటే *బీదకులం* 

        దేవుణ్ణి నమ్మితే *ఆస్తికులం* 

        నమ్మకుంటే *నాస్తికులం* 

 

మేమే 

        నాగరికత నేర్పిన నాగరికులం

        జాతకాలు నమ్మే అమాయకులం

        మూఢత్వంపోని మూర్ఖులం


మేమే మేమే

         సమానత్వ సాధకులం

         మతాలను గౌరవించే *లౌకికులం* 

         ఎల్లలు లేని దేశ ప్రేమికులం


మేమే

          కష్టపడే *కర్షకులం* 

          నిరంతర *శ్రామికులం* 

          పరిశ్రమించే *పారిశ్రామికులం* 

          కర్మాగారాల్లోని *కార్మికులం* 

          నిజాలు చెప్తే *వాస్తవికులం* 

          చెప్పకుంటే అపద్దీకులం


మేమవుతాం

           కొందరికి *పూర్వీకులం* 

           మరికొందరికి *సమకాలికులం* 

           ప్రస్తుత వర్తమానికులం

           కొందరికి *స్ఫూర్తిదాయకులం* 

           మరికొందరికి *మార్గదర్శకులం* 


    మేం

          మార్పు కోరే *పరివర్తకులం* 

          వినూత్న *ఔత్సాహికులం* 

          కొత్త కొత్త *ప్రయోగకులం* 

          సరికొత్త *ఆవిష్కర్తకులం* 

          వ్యాపారాలు చేసే *వర్తకులం* 

          సంస్థల,సంఘాల వ్యవస్థాపకులం


మేం

         పరిపాలిస్తే *పాలకులం* 

         పాలించబడితే ఎలీకులం

         వంచిస్తే వంఛకులం

         పంచుకుంటే భాగస్వామికులం


మొత్తానికి

           బాల్యంలో *చిగురుటాకులం* 

           కుర్రతనంలో *బాకులం* 

           యవ్వనంలో *చాకులం* 

           మధ్య వయస్సులో *మేకులం* 

           చరమాంకంలో *రేకులం* 

           రాలిపోయే *ఆకులం* 


విదేశాల్లో మేము *ఒకే దేశకులం* 

పక్క రాష్ట్రాల్లో మేము ఒకే *ప్రాంతీకులం* 

పరబాషల వారికాడ ఒకే *భాషకులం* 

ఒకే భాష వారికాడ ఫలానా యాసకులం

మొత్తానికి అవుతాం ఈ *దేశంలో ఏదో ఒకకులం* 

 

నిత్యం కులం పేరుతో తిట్టుకుంటాం,

కొట్టుకుంటాం , కానీ బేధాలెన్ని ఉన్నా,

నిలబెట్టుకుంటాం మా దేశాన్ని ,

అయినా అంటిపెట్టుకునే ఉంటాం కులాన్ని ,

అది ఇచ్చే బలాన్ని , ఎందుకంటే ........ !

      

             *మేమే భరత జాతి వంశీకులం* 

             *భావి భారత రథసారథికులం* ...

7, జనవరి 2022, శుక్రవారం

పాశురము

 *🚩రేపటి తిరుప్పావై ఇరవై రెండో రోజు పాశురం🚩*_ 


🚩 *తిరుప్పావై 22 వ ప్రవచనం*🚩


🕉🌴🌿🌹🌷🌿🌴🕉️


*☘పాశురం☘*


*అఙ్గణ్ మాఞాలత్తరశర్, అబిమాన*

*బఙ్గమాయ్ వన్దు నిన్ పళ్లిక్కటిల్ కీళే*

*శఙ్గమిరుప్పార్ పోల్ వన్దు తలైప్పెయ్ దోమ్*

*కిఙ్గిణివాయ్ చ్చెయ్ ద తామరై ప్పూప్పోలే*

*శెఙ్గణ్ శిఱిచ్చిణిదే యెమ్మేల్ విళియావో;*

*తిఙ్గళు మాదిత్తియను మెళున్దాఱ్పోల్* 

*అఙ్గణిరణ్డు ఙ్గొణ్డు ఎఙ్గళ్ మేల్ నోక్కుదియేల్* 

*ఎఙ్గళ్ మేల్ శాబ మిళిన్దులో రెమ్బావాయ్.*


*🌿భావం :-🌿*


ఈ సుందర సువిశాలమైన భూమిని ఏకఛత్రాధిపత్యముగ నేలిన రాజులందరును తమ కెదురెవ్వరు లేరను అహంకారమును వీడి, అభిమానులై నీ శరణు జొచ్చిరి. అనన్య శరణాగతిని చేయుచు నీ సింహాసనము క్రింద గుంపులు గుంపులుగా చేరినట్లు మేమును అనన్య ప్రయోజనులమై వారివలె నీ శరణుజొచ్చినాము. మాకు నీవు దక్క వేరు దిక్కులేదు స్వామీ! చిరుమువ్వలు నోళ్ళు తెరచినట్లుగను, సగము విరిసిన తామరపూవువలెను మెల్లమెల్లగా విప్పారిన నీ సుందర నేత్రాలనుంచి జాలువారు వాత్సల్య కరుణారస దృక్కులను మాపై ప్రసరింపనిమ్ము. సూర్యచంద్రులుదయించెయనునట్లు కనిపించు నీ కన్నుదోయి నుంచి జాలువారే కరుణ వాత్సల్యం రసదృక్కులు మాపై ప్రసరించినచో మా కర్మ బంధములన్నీ తొలగిపోవును కనుక మా కర్మబంధములు తొలగగనే మేము నిన్ను చేరుకొందము కద! మా వ్రతమునకు పొందవలసిన ఫలము గూడ యిదియేగదా! యని ఆండాళ్ తల్లి కర్మ బంధం. తొలగితే ముక్తి లభిస్తుందని' తెలియజేస్తోంది. 


*🌴అవతారిక :-🌴*


పరమాత్మను పొందాలని కోరుకొనేవారు స్వామికి సంపూర్ణ శరణాగతులవ్వాలి. సంపూర్ణ ప్రపత్తిని చేయాలి. స్వామి పాదాలచెంత వ్రాలి 'నీవు దక్క మాకు దిక్కులేదు. మేము పూర్తిగా నీవారమే' అనే శరణాగతి చేసి పాదాల నాశ్రయించాలని ఆండాళ్ తల్లి బోధిస్తోంది. ఈ మాలికలో - మేము నిన్ను స్తుతిస్తుండగా నీ అతిలోక సుందరమైన రూపాన్ని - అనగా మెల్లమెల్లగా నీ సూర్యచంద్రులవంటి కన్నులను వికసింపచేస్తుండగా అందుండి నీ కరుణా కటాక్ష వీక్షణాల వాత్సల్యరసపూర్ణధారలను తనివితీరా పొంది ఆనందించాలని వచ్చామని గోపికలు తెలిపారు. కర్మల కారణంగా పరమాత్మకు బహుదూరమైన జీవులు తిరిగి కలుసుకొనేటట్లు చేసేదే యీ ధనుర్మాస వ్రతమంటుంది మన ఆండాళు తల్లి.


*🌳(కల్యాణిరాగము - రూపక తాళము)🌳*



ప.. చిరు మువ్వలు నవ్వి నటుల వికసించిన కలువల వలె - ఆ 

ఎరుపులీను కన్నుదోయి కరుణణు ప్రసరింపనీవె!


అ..ప.. సూర్యచంద్రులుదయించెనో? యట్టుదోచు కనుదోయిని 

పరమాత్మా! మా పాపములన్ని బోవ చూడరావె!


1. చ.. అహంకార మమకారములణచి వచ్చి రాజులు - నీ 

సింహాసనమునకు క్రిందగుంపు గూడియున్నట్టుల 

అహము వీడి నీ సన్నిధి నంజలి ఘటియించినాము 

మహాప్రభో! యింకనైన కటాక్షింపరావె! స్వామి 

ఎరుపులీను కన్నుదోయి కరుణను ప్రసరింపనీవె!


🙏🙏🙏🙏🙏🙏🙏🙏


_*🚩తిరుప్పావై ప్రవచనం‎ - 22 వ రోజు🚩*_ 


🌴🍃🌿🌹🌷🌿🍃🌴


*అనన్య గతిత్వం*

*ఆండాళ్ తిరువడిగలే శరణం* 


☘☘☘☘☘☘☘☘


*పాశురము*


*అంగణ్ మా ఞాలత్తరశర్, అబిమాన*

*పంగమాయ్ వందు నిన్ పళ్ళికట్టిల్ కీరే*

*శంగమ్ ఇరుప్పార్ పోల్ వందు తలై ప్పెయ్-దోమ్*

*కింగిణివాయ్ చ్చేయ్ద* *తామరై ప్పూప్పోలే*

*శెంగణ్ శిఱుచ్చిఱిదే* *యెమ్మేల్ విరయావో*

*తింగళుమ్* *ఆదిత్తియనుమ్ ఎరుందాఱ్పోల్*

*అంగణ్ ఇరండుం కొండు ఎంగళ్మేల్ నోక్కుదియేల్*

*ఎంగళ్మేల్ శాపం ఇరింద్-ఏలోర్ ఎమ్బావాయ్* 


మనిషి వస్తువులపై ఏర్పర్చుకున్న అభిమానము, ఎప్పటికీ వాటిని పట్టుకొని వ్రేలాడుటూనే ఉంటాడు ఎంత దుఃఖాల పాలైనా. అసలు ఇవన్నీ వాడివే అని ఒక మాట అనుకుంటే, ఏడవ వల్సిన అవసరము ఉండదు. ఒక మహానుభావుడు ఉండేవాడట, ఎంత సంపదలు అనుభవించేవాడంటే ఏనుగు ఎక్కి ఎప్పటికి పైకే చూసేవాడట, క్రిందకి చూడటము కూడా మరచి పోయాడట. వీడి దయకోసం రారాజులే వీడి పాదాల వద్ద వాళ్ళ కిరీటాలు ఉంచేవారట. ఇలాంటి వాడికి ఒకనాడు ఏమైందంటే వాడి రాజ్యాన్ని శత్రువులు ఆక్రమించారు. వాడు తన వాళ్ళని వదిలి వచ్చేసాడు. ఊరు దాటి బయటికి వెళ్ళలేడు, ఒక పూరి గుడిసెలో దాక్కున్నాడు. మరి ఎవరికైనా తెలిస్తే అభిమానం అడ్డొస్తుంది. తినటానికి అడుక్కోవాలంటే పగలు బయటికి రాలేడు. ఒక పెంకు ముక్కను తీసుకొని రాత్రి బయలుడేరాడు ఎవ్వరు చూడరని, అది కూడా వెలుతురు ఉండదని ఇండ్ల చూరు కింద నడుస్తూ వెళ్ళాడు. అక్కడ ఒక పిల్లలు కల కుక్క పడుకొని ఉండట, వీడేదో చేయటానికి వచ్చాడని, వీడి కాలు పట్టి కరిచిండి. అమ్మో అంటూ అరవడం మొదలు పెట్టాడు. అంతలోనే వచ్చి రాజు అని గుర్తు పట్టే సరికి వాడు అభిమానంతో తల దించుకున్నాడట. *"ఒరు నాయగమాయ్ ఓడ ఉల ఉడ ఆండవర్ కరునాయ్ కవరంద కాలర్ సిదగీన పానయర్ పెరునాడు కాన ఇమ్మయిలే పిచ్చితాన్ కరువర్"* ఏక ఛత్రాదిపతిగా పరిపాలించిన మహనీయుడే, ఒక నాడు కిరీటాలు తగిలించుకున్న కాలు, ఈనాడు కుక్క కరిచిన కాలు. ఒకనాడు బంగారు పాత్రలలో తినేవాడు, ఇప్పుడు చితికిన పెంకు ముక్క చేత పట్టుకున్నవాడు. అభిమానం పెంచుకున్న వాళ్ళ బ్రతుకులు ఇలా ఉంటాయి అని అళ్వారులు చూపిస్తారు.


మనిషి వస్తువులను సంపాదించటం, వాటిని అనుభవించటం తప్పు కాడు, అవి నావల్ల అని అనుకోవడం తప్పు. వాడిచ్చింది అనుకుంటే అన్ని మనకు సుఖంగా ఉండేట్టు చేస్తాడు, నేనార్జిస్తున్న అనుకుంటావా చుట్టు ఉండే వాటితో నిన్ను వదిలేస్తా, నీవే కాపాడుకో అని నిన్ను వదిలేస్తాడు. ఎంతవరకు అని మనం రక్షించుకోగలం కనుక. ఈ భూమి మీద అభిమానాలు అంతలా పెంచుకొని, భగవంతుడిదీ అని మరచి, బ్రతుకుతే వాడికి గతి ఉండనే ఉండదు. 


*“అంగణ్ మా ఞాలత్తరశర్”* ఈ అందమైన భుమి మీద *“అబిమాన పంగమాయ్ వందు”* అభిమానాలను వదులుకొని వచ్చి *“నిన్ పళ్ళికట్టిల్ కీరే”* నీ పడక మంచం క్రింద దాగి ఉండే రారాజుల వలె మేము వచ్చామయ్యా. మనిషి తన శరీరం పై కూడా అలాగే అభిమానం కల్గి ఉంటున్నాడే, చూస్తూ చూస్తూ ఉంటే నలుగురు అసహ్యించుకొనేలా మన శరీరం మారిపోతుందే. ఈ అభిమానాలను మనిషి వీడాలి. అన్నీ భగవంతుడు ఇచ్చినవి అని భావించాలి. ఈ దేహాల పై అభిమానాలు పెంచుకుని ఈ ప్రకృతి మండలాల్లో సంచరిస్తున్నమో ఆ అభిమానాలను అన్నీ వదులుకొని నీ పద సన్నిధి చేరామయ్యా. ఎవరైనా వదులుకొని రావాల్సిందే. మన లాంటి సామాన్యులకే అది సులభం, చతుర్ముఖ బ్రహ్మాదులకు అన్నీ లోకాలను వదులుకొని రావాలనంటె అది కష్టం, కాని తరించాలి అంటె ఆయన కూడా వదులుకు రావడం తప్పదు.


*“శంగమ్ ఇరుప్పార్ పోల్”* అయిటే వాళ్ళు ఒంటరిగా ఉంటే ఎవరైనా శంకిస్తారేమోనని గుంపులు గుంపులుగా ఎట్లా ఐతే చేరి ఉన్నారో, మేము కూడా అలాగే నీ వద్దకు చేరాము. *“వందు తలై ప్పెయ్-దోమ్”* ఈ చేరటం కూడా మాకు ఎంత ఆశ్చర్యంగా ఉంది అంటే, ఇది మా ప్రయత్నం కాదు సుమా, దురభిమానంతో మేం తప్పించుకు తిరుగుతుంటే మాపై లేని సుకృతాలు మామీద ఆరోపణ చేసి మాకు ఎంతలా ఉపకారం చేసావు, మాకు ఎక్కడో గుర్తులేని స్థితిలో మేముంటే ఒక శరీరాన్ని ఇచ్చి, ఇంద్రియాలను ఇచ్చి, జ్ఞానాన్ని ఇచ్చి, మహానుభావులను ఇచ్చి వారి ఉపదేశాలు వినేట్టు మాలో ఉండి మమ్మల్ని సంస్కరించి, మాలో నీ పై ద్వేశాన్ని తగ్గించి ని పై ప్రేమ కల్గి నీ సన్నిధికి పరుగు పరుగున వచ్చాం, ఇదంతా నీవే చేసిన ప్రయత్నం కదయ్యా. నీ కృషి ఫలించేట్టు చేయడానికి వచ్చాం. 


ఇక నీ సన్నిధి చేరాం, ఇక మాకు ఫలితం దక్కాలికదా, *“కింగిణివాయ్ చ్చేయ్ద”* చిన్నటి సిరిమువ్వ గజ్జలు ఒక గీతగా కనిపిస్తాయే, అట్లా కనిపించే ఆనేత్రాలని *“తామరై ప్పూప్పోలే”* పద్మాల్లా *“శెంగణ్ శిఱుచ్చిఱిదే”* అందముగా, మెల్లి మెల్లిగా *“యెమ్మేల్”* మాపై *“విరయావో”* ప్రసరించేట్టు చెయ్యి. *“తింగళుమ్”* చంద్రుడి చల్లటిచూపులాగా *“ఆదిత్తియనుమ్”* సూర్యుడి కాంతి వలె *“ఎరుందాఱ్పోల్”* ఇద్దరు కలిసి నట్లుగా ఉంది, ప్రేమించేవారికి ప్రేమను కురిపించేట్లు, ద్వేశించేవారికి ప్రతాపం కల్గి ఉంటాయి ఆ చూపులు. మరి ఈ రెండు ఒక్కసారి సంభవిస్తాయా అంటే సంభవిస్తాయి *“ప్రసన్నం ఆదిత్య వర్చసమ్ రామం”* అంటారు, సూర్యుడు తన మాధ్యాత్మిక కాంతిని చంద్రుడి చల్లటి చూపులలా ఇస్తె ఎలా ఉంటుందో మాకు నీ చూపులను అందించు.


తప్పు తప్పు *“అంగణ్ ఇరండుం”* ఆకళ్ళు అవే. నీ కళ్ళను పోల్చటానికి ఏ ఉపమానం లేదు, *“కొండు ఎంగళ్మేల్”* వాటిని మాపై పడేట్లు చెయ్యి. *“నోక్కుదియేల్ ఎంగళ్మేల్”* ఆచూపులు మాపై పడితే *“శాపం ఇరింద్”* మాకున్న శాపాలన్నీ తొలగుతాయి. ఆహల్యకున్న శాపం నీ పాద స్పర్షతో పోయింది-మాకూ నీ పాద స్పర్ష కావాలి, చంద్రపుష్కరిణి లో స్నానం ఆడితే దక్షుడికి శాపం పొయ్యింది- మాకూ నీ కళ్యాణగుణపుష్కరిణి లో స్నానం కావాలి, శివుడికి బ్రహ్మ తల తీసిన శాపం నీ వక్షస్పర్శచే తొలగింది-మాకూ అది కావాలి. నిన్ను ఎడబాసి ఉండడమే మాకు ఒక శాపం, నీవు అనుగ్రహించాలి. *“చకృషా తమ సౌమ్యేన పూతాస్మీ రఘునందన”* నీ చూపు నాపై పడిండయ్యా ఇక నా పాపాలన్నీ తొలగుతాయి అని శభరి అన్నట్లుగా మనవాళ్ళు ఆయన చూపులు మనపై ప్రసరింపచేయ్యమని స్వామిని కోరుతూ తమ అనన్య గతిత్వాన్ని తెలుపుతూ ఇవన్నీ ఆయన చేసుకున్నవి అని భావిస్తున్నారు. ఇక స్వామిని చేరే వరకే శాస్త్రాలు, ఇకపై ఆయనకు వీళ్ళ మాటలు వినక తప్పదు.


          🌷 *సేకరణ*🌷

      🌴 *న్యాయపతి*🌴 

    🌹 *నరసింహారావు*🌹


🙏🙏🙏🙏🙏🙏🙏🙏

ఉపవాసం

 ఉపవాసం లోని రకాలు - ఉపయోగాలు .


    ఉపవాసం అనగా ఏమి తినకుండా కేవలం మంచినీరు తాగి ఉండటమే ఉపవాసం . దీర్ఘ ఉపవాసం చేయువారు రసాహారము తీసికొనవలెను. కొందరు దేవునికి ఒకపొద్దు ఉంటున్నాం అని ఆ తరువాత అరడజను అరటిపళ్ళు, 10 ఇడ్లిలు, అరకిలో ఉప్మా లాగించేస్తారు . అన్నం మాత్రం తినరు.బహుశా వారి దృష్టిలో ఇదో రకం ఉపవాసం కావొచ్చు.కాని అలా చేయడం ఉపవాసం అనిపించుకోదు.


         ఉపవాసం చేయడం వలన ముఖ్య ఉపయోగం శరీరంలోని మాలిన్యాలను బహిష్కరింపచేసి వ్యాధి నిర్మూలనం అవుతుంది. పొట్ట , కన్ను, వ్రణములు , జ్వరములు, జలుబు మొదలగు వ్యాదులను కనీసం 5 రోజులపాటు ఉపవాసం చేసి వ్యాధి తగ్గించుకోవచ్చు. ఏ వ్యాధిలోనైనా ఉపవాసం చేయుట వలన వ్యాధి తొందరగా తగ్గించుకోవచ్చు . లేనిచో ఒకపూట ఉపవాసం ఉండి తరువాత ఆ వ్యాధికి సంబంధించిన పథ్యకరమైన ఆహారం తీసుకోవచ్చు.


          ఉపవాసంలో 4 రకాలు ఉన్నాయి అవి 


           1 - నిర్జలోపవాసం .


           2 - జలోపవాసం .


           3 - రసోపవాసం .


           4 - ఫలోపవాసం .


 * నిర్జలోపవాసం -


          మంచినీరు కూడా ముట్టకుండా చేయు ఉపవాసమును నిర్జలోపవాసం అంటారు. ఈ ఉపవాసం ముఖ్యంగా శరీరంలో నీరు ఎక్కువ చేరినప్పుడు అనగా శరీరం వాచినప్పుడు రెండు లేదా మూడు దినములు ఈ ఉపవాసం చేయవలెను . మూడురోజులకు మించి ఈ ఉపవాసం చేయరాదు .


 * జలోపవాసం -


          కేవలం మంచినీరు మాత్రమే తాగి చేయు ఉపవాసమును జలోపవాసం అందురు. దీనిని మూడురోజుల నుంచి ఏడు రోజుల వరకు మాత్రమే చేయవలెను . అంతకు మించి చేయరాదు . శరీరంలో మాలిన్యాలు అధికంగా చేరి ఏ రసాహారమును కూడా జీర్ణం చేసుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు కేవలం మంచినీరు తాగించి ఉపవాసం చేయించవలెను. అనగా సుమారు రెండులీటర్లు మంచినీరు త్రాగించవలెను.


 * రసోపవాసం -


           ఈ రసోపవాసమును సాధారణంగా ప్రకృతిచికిత్సాలయాల్లో రసోపవాసం చేయిస్తారు. కేవలం పండ్లరసాలతో చేయు ఉపవాసమును రసోపవాసం అంటారు. ఈ ఉపవాసం వారం రోజులు మొదలుకుని నెలరోజులు వరకు కూడా చేయవచ్చు . రసోపవాసంలో ముఖ్యంగా నిమ్మరసం , పలుచని నారింజరసం , బత్తాయిరసం , కమలారసం , తేనెనీరు, కొబ్బరినీరు , బార్లినీరు మొదలగునవి రోజుకు మూడుసార్లు నుండి అయిదుసార్లు లోపలికి తీసుకోవచ్చు .


 * ఫలోపవాసం -


        ఉపవాసం చేయలేనివారు ఫలోపవాసం చేయవచ్చు . కేవలం రసము నిండిన ఫలములు మాత్రమే ఆహారంగా తీసికొనవలెను . అరటిపండు తీసుకోకూడదు . ఎక్కువ బత్తాయి, నారింజ, కమలా , ద్రాక్షా, అనాస , దానిమ్మ, మామిడి, పుచ్ఛ మొదలగు పండ్లు తినవచ్చు . 


        ఈ ఉపవాసం రోగిని అనుసరించి పది నుంచి నలుబది రోజుల వరకు అనుసరించవచ్చు.


 * ఉపవాసం చేయుట వలన వివిధ అవయవాలలో కలుగు మార్పులు -


 జీర్ణక్రియకు మంచి విశ్రాంతి లభించి అజీర్ణం తొలగిపోయి ఆకలివృద్ధి అగును.


  మలాశయంలో మురికి బహిష్కరింపబడి అజీర్ణం తొలగించబడి క్రిములను, బాక్టీరీయా నాశనం చేయబడును.


  మూత్రపిండాలలోని విషపదార్ధాలు, రాళ్లు బహిష్కరింపబడును.


  ఊపిరితిత్తులలోని నంజు, నీరు బహిష్కరించబడి ఆయాసం నివారించబడును. శ్వాసక్రియ చక్కగా జరుగును.


  గుండెచుట్టు , లోపల చేరిన కొవ్వు, నీరు తగ్గి గుండె చక్కగా కొట్టుకొనును. గుండెజబ్బులలో రసోపవాసం మంచిది.


  లివర్ మరియు స్ప్లీన్ ఆహారం జీర్ణం అగుటకు ఇవి చక్కగా పనిచేయాలి. ఈ ఉపవాసం చేయుట వలన వీటికి విశ్రాంతి దొరుకును . వాటిలోని మాలిన్యం తొలగించబడి జీర్ణక్రియ వృద్ది అగును.


  శరీరంలో రక్తప్రసారం చురుకుగా ఉండును. ఉపవాసం చేయుట వలన రక్తదోషములు నివారించబడును. తిమ్మిర్లు, మంటలు , నొప్పులు కూడా తగ్గును.


  కీళ్లలో పేరుకుపోయిన కొవ్వు, నీరు, మాంసము వంటి మాలిన్యాలు తొలగించబడి వ్యాధి నివారణ అగును.


  నాడీమండలం శుభ్రపరచబడును.


  జ్ఞానేంద్రియాలలో మాలిన్యాలు అన్ని పోవును .


  చర్మం కాంతివంతం అగును. చర్మవ్యాధులు హరించును . శరీరానికి చక్కటిరంగు వచ్చును.


    మనస్సు ప్రశాంతంగా ఉండి కోపం వంటివి మన అదుపులో ఉండగలవు.


 * ఉపవాసం చేయకూడని వారు -


       చాలా బలహీనంగా ఉన్నవారు, గుండెజబ్బులు కలవారు , బాలురకు, వృద్దులకు గర్భిణీస్త్రీలకు , బాలింతలకు , క్షయ మరియు రక్తహీనత కలిగిన రోగులు , మధుమేహంతో ఉన్నవారికి ఎక్కువ రోజులు ఉపవాసం చేయకూడదు .


 * ఉపవాసం చేయదగిన వారు -


       స్థూలకాయులు , ఉబ్బసం, సంధివాతం, రక్తపుపోటు,చర్మవ్యాధులు మొదలగు దీర్ఘకాలిక రోగులకు ఉపవాసం చేయుట మంచిది.


    ఉపవాసం ముగించిన వెంటనే ఘనాహారం తీసుకోకూడదు . ఉపవాసం తరువాత ఎక్కువ ఆహారం తీసుకొకూడదు. క్రమేపి ఆహారాన్ని పెంచుకుంటూ రావలెను. కారం , మసాలా పదార్దాలు , పిండివంటలు పచ్చళ్ళు తినకూడదు. అలా తీసుకున్నచో విరేచనాలు , వాంతులు , కడుపులో మంట, నొప్పి వస్తాయి

క్షమ - పగ

 *😊క్షమ - పగ😡*

🕉️🌞🌏🌙🌟🚩


*మన మనసులో రెండు వైరుధ్య భావా లుంటాయి. ఒకటి క్షమించడం, రెండోది పగ తీర్చుకోవడం. ఈ రెంటికీ సదా సమరం జరుగుతూ ఉంటుంది. క్షమ గెలిస్తే హృదయం ఆనంద మయం అవుతుంది. మనసులో అంతు లేని సంతోషం కలుగుతుంది. మనలో ఉండే ప్రేమ ఎప్పుడూ 'క్షమించు క్షమించు' అని చెబుతూనే ఉంటుంది. ప్రేమిస్తే ప్రేమ ను పొందుతాం. ద్వేషిస్తే ద్వేషాన్నే తిరిగి పొందుతాం.*



*గుండెలో పగ దాచు కోవడం అంటే 'పామున్న ఇంటిలో ఉండటమే' అంటుంది భారతం. పగ వల్ల పగ పోదనీ.. ఏ విధంగా చూసి నా పగని అణచడం లెస్స అనీ..భారత మహేతి హాస ఉద్బోధ...!!!*



*'నా కన్ను నువ్వు పొడిస్తే..నీ కన్ను నేను పొడుస్తా' అని 'కన్ను'కు కన్ను... పన్నుకు పన్ను' సిద్ధాంతం తో అందరూ ముందుకు దూకితే- లోకం అంతా..గుడ్డి వాళ్ల తో..బోసి నోటి వాళ్ల తో నిండి పోతుంది.*

 


*ప్రతీకారం అనే విష చక్రం నుంచి బయట పడాలంటే "క్షమించడం" ఒక్కటే ఉపాయం. ఇందు వల్ల రెండు లాభాలున్నాయి. ఒకటి- క్షమించే వారు, ఆదర్శ వ్యక్తులుగా గౌరవం పొందుతారు. రెండోది- క్షమ పొందేవారు, తమ జీవితాలను సరి దిద్దుకుంటారు.*



*క్షమా గుణం శత్రువును సైతం మిత్రుడి గా...మార్చేస్తుంది. 'పొరపాటు' అనేది. మానవ సహజ గుణం. క్షమ దైవ విశిష్ట గుణం' అని ఆంగ్ల సామెత.*



*మహా భక్తుల జీవితాలన్నీ...ప్రేమ మయాలు.*



*ఏక నాథుడు పాండు రంగడి భక్తుడు. ప్రశాంత చిత్తుడు. సదా స్వామి సేవలో, భజన లో కాలం గడిపే వాడు. ప్రజలందరూ ఆయన్ని ప్రశంసించడం చూసి కొందరు ఈర్ష్య పడ్డారు. ఎలా గైనా ఏక నాథుడికి కోపం తెప్పించాలని ప్రయత్నించ సాగారు. ఒక దుష్టుడికి డబ్బు ఆశచూపి, ఆ పనికి నియోగించారు.*

 


*ఏక నాథుడు రోజూ తెల్లవారు జామునే నది లో స్నానం చేసి వచ్చేవాడు. ఆ సమయం లో ఆ దుష్టుడు ఏక నాథుడి పై ఉమ్మి వేశాడు. ఏక నాథుడు ప్రశాంత చిత్తంతో చిరు నవ్వు చెరగ నీయ కుండా మళ్ళీ... వెనక్కి వెళ్లి నదీ స్నానం ఆచరించాడు..*



*ఇలా మొత్తం నూట ఏడు సార్లు జరిగింది.*

 


*ఏకనాథుడు ఏమాత్రం నిగ్రహం వీడ కుండా మందస్మిత వదనం తో అన్ని సార్లూ మరల మరల స్నానం చేసి వస్తున్నాడు.*



*దీంతో ఆ కుటిలుడి హృదయం చలించి పోయింది!*



*ఆయన ఏక నాథుడి కాళ్లపై పడ్డాడు. 'స్వామీ, మీరు నిజం గా దైవ స్వరూపులు. మీ నిగ్రహం చెడ గొట్టి, ఎలా గైనా మీకు కోపం తెప్పించాలని కొందరు నన్ను పురమా యించారు. మీకు ఆగ్రహం తెప్పించ గలిగితే నాకు ధనం ఇస్తా మని ఆశ చూపారు. "మీ క్షమాగుణం" తెలియక నేను ఈ నీచ కృత్యానికి అంగీకరించాను!' అన్నాడు ఆ వ్యక్తి పశ్చాత్తాపం తో.*



*ఏకనాథుడు అతడికి నమస్కరిస్తూ ఇలా అన్నాడు. 'నాయనా, నీవు నా కెంతో మేలు చేశావు. నా చేత నూట ఎనిమిది సార్లు పవిత్ర నదీ స్నానం చేయించిన మహాను భావుడివి నువ్వు! నేను నీ మేలు ఎన్నటికీ మరచి పోను!'* 



*ఏక నాథుడి పలుకులు విని అవతలి వ్యక్తి నిర్విణ్ను డయ్యాడు.* 



*ఆ భక్తా గ్రేసరుడి "క్షమాగుణం' ఆ ఉమ్ము వేసిన వ్యక్తి హృదయాన్ని ప్రక్షాళనం గావించింది. పశ్చాత్తాపం తో అతడు కన్నీరు కార్చాడు.*



*క్షమ అంటే భూమి. భూమి ఓర్పు గల తల్లి కను కనే మనం ఎంత బాధ పెట్టినా భూ మాత మన పై పగ తీర్చు కోవాలను కోదు. క్షమించే గుణం ఉన్నది కదా అని మనం భూమాతను అదే పనిగా హింసించ కూడదు.*

 


*క్షమా గుణానికీ హద్దులుంటాయని గుర్తుంచు కోవాలి! క్షమాగుణం పురాణాలకు, ప్రాచీన ఇతి హాసాలకే పరిమితం కాదు.* 



*ఇటీవలి చరిత్రలో క్షమాగుణం తో చరితార్థు లైన మహాపురుషు లెందరో ఉన్నారు.*



*ఆర్య సమాజ స్థాపకు లైన మహర్షి దయానంద నిష్కాపట్యం, నిర్భయత్వం సమాజం లో అనేకులకు కంట గింపైంది.* 



*ఆయన వద్ద వంట వాడికి లంచం ఇచ్చి, ఆహారం లో విషం పెట్టించారు.*



*దయానందులు మృత్యుశయ్యపై ఉన్నారు.*



*తన వంటవాడిని దగ్గరకు పిలిచారు. కొంత డబ్బు అతడి చేతి లో పెట్టి ఇలా అన్నారు. 'వెంటనే నువ్వు నేపాల్‌కి వెళ్లిపో! నా శిష్యులకు నువ్వు చేసిన పని తెలిస్తే నిన్ను బతక నీయరు!'*



*తనకు ప్రాణ హాని కలిగించిన వ్యక్తిని సైతం క్షమించి, అతడికి ప్రాణ దానం చేసిన మహర్షి దయానంద చరితార్థులయ్యారు.*



*క్షమాగుణం మానసిక రుగ్మతలకు మంచి మందు.*



*పగ తీర్చుకుంటే ప్రశాంతత చిక్కుతుందను కోవడం కేవలం భ్రాంతి మాత్రమే!*



*నిజానికి అభద్రత మిగులు తుంది. చిత్త వికారం ఏర్పడుతుంది. చివరకు జీవితం విషాదాంతం అవుతుంది.*



*ఒక సామెత ఇలా చెబుతుంది--*


*ఇతరులు మనకు చేసిన అప కారాలను ఇసుక పై రాయాలి. ఇతరులు మనకు చేసిన ఉప కారాలను చలువ రాయి పై చెక్కు కోవాలి!'*


🕉️🌞🌏🌙🌟🚩

*థర్డ్ wave

 *థర్డ్ wave తో జాగ్రత్త*  

 *WHO ICMR* భారతదేశాన్ని హెచ్చరించిందిట 

 దీనికి ఏకైక పరిష్కారం మిమ్మల్ని మీరు మాత్రమే రక్షించుకోవడం. *

 * కుటుంబ సభ్యులందరూ దయచేసి గమనించండి: *

 * 01 కడుపులను ఖాళీగా ఉంచకండి *

 * 02 ఉపవాసం చేయవద్దు *

 * 03 రోజూ ఒక గంట సూర్యరశ్మిని ఆస్వాదించండి.

 * 04 ఎసి ఉపయోగించవద్దు *

 * 05 వెచ్చని నీరు త్రాగండి, గొంతు తడిగా ఉంచండి *

 * 06 ముక్కుకు  ఆవ నూనె రాయండి *

 * 07 ఇంట్లో హారతి కర్పూరం కాల్చండి *

 * 08 ప్రతి కూరగాయకు అర టీస్పూన్ పొడి అల్లం జోడించండి *

 * 09 దాల్చినచెక్క వాడండి *

 * 10 రాత్రి కప్పు పాలతో ఒక స్పూన్ పసుపు త్రాగాలి 

 * 11 వీలైతే ఒక చెంచా చ్యవన్ ప్రాష తినండి.

 * 12 ఇంటిలో కర్పూరం మరియు లవంగాలతో పొగ వేయండి. 

 * 13 ఉదయం టీలో లవంగం వేసి మరిగించి తాగండి 

 * 14 పండ్లలో ఎక్కువ నారింజ మాత్రమే తినండి 

 * మీరు కరోనాను ఓడించాలనుకుంటే, దయచేసి ఇవన్నీ చేయండి. *

 * పాలలో పసుపు మీ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది

 *  

6, జనవరి 2022, గురువారం

దర్భలో జాతులున్నాయి.

 మనకున్న పవిత్రమయిన వృక్ష సంపదలలో గడ్డి జాతికి చెందిన #దర్భ ముఖ్యమయినది. ఈ దర్భలో చాలా జాతులున్నాయి. వీటిలో దర్భ జాతి దర్భను అపరకర్మలకు, కుశ జాతి దర్భనుశుకర్మలకు, బర్హిస్సు జాతి దర్భను యజ్ఞయాగాది శ్రౌత క్రతువులకు, శరము (రెల్లు) జాతి దర్భను గృహ నిర్మాణాలకు వినియోగించాలని ధర్మశాస్త్రాలు చెపుతున్నాయి.దీని ఆవిర్భావం వెనుక అనేక కథలున్నాయి. కొంతమంది దీనిని విశ్వామిత్రుని సృష్టిగా పరిగణిస్తారు. కూర్మ పురాణం ప్రకారం, విష్ణుమూర్తి కూర్మావతారంలో మందర పర్వతాన్ని (క్షీరసాగర మధనం సందర్భములో) మోస్తున్నప్పుడు, ఆ పర్వత రాపిడికి కూర్మము వంటిమీద ఉండే కేశములు సముద్రములో కలిసి అవి మెల్లిగా ఒడ్డుకు కొట్టుకొనిపోయి కుశముగా మారాయనీ, అమృతం వచ్చినప్పుడు కొన్ని చుక్కలు ఈ కుశ అనే గడ్డి మీద పడటం వలన వాటికి అంత పవిత్రత సంతరించుకుంది అనీ చెప్పబడింది.

వరాహ పురాణం ప్రకారం, ఈ దర్భలు వరాహావతారములో ఉన్న శ్రీమహావిష్ణువుశరీర కేశములని చెప్పబడింది. అందువలననే దర్భ గడ్డిని శ్రీ మహావిష్ణువు రూపములని జనులు భావించి భాద్రపద మాసంలో దర్భాష్టమి నాడు వీటికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వీటికి దేన్నయినా శుద్ధి చేసే శక్తి ఉందని నమ్మిక. ఈ నమ్మకాన్ని నిజం చేస్తూ శాస్త్రవేత్తలు వీటిని విరేచనాలు, రక్తస్రావం, మూత్రపిండాలలో రాళ్ళు, మూత్రవిసర్జనలో లోపాలు మొదలయిన వానికి మందుగా వాడుతున్నారు. 

 

అలానే ముంజ పర్వతం మీద ఉండే దర్భ అతిసారాది రోగాలకు ఔషధమని అథర్వణ వేదంలో చెప్పబడింది.అసలు దర్భ అన్న పదం వినగానే మనకు గుర్తుకొచ్చేది గ్రహణ కాలం. ఆ సమయంలో అన్నిటి మీదా దర్భను ఉంచడం మనకు అలవాటు. కానీ అలా చేయటం వెనుక ఉన్న అసలు రహస్యమేమిటంటే:సూర్య, చంద్ర గ్రహణ సమయాలలో కొన్ని హానికరమయిన విష కిరణాలు భూమి మీదకు ప్రసారమవుతాయని ఈనాటి విజ్ఞానశాస్త్రంనిరూపిస్తోంది. ఇలాంటి వ్యతిరేక కిరణాలు దర్భల కట్టల మధ్యలోంచి దూరి వెళ్ళలేకపోతున్నాయని ఇటీవల కొన్ని పరిశోధనలలో కూడా తేలింది. అందుకే ఆఫ్రికా ప్రాంతంలోని కొన్ని ఆటవిక జాతులు తమ గృహాలను పూర్తిగా దర్భగడ్డితోనే నిర్మించుకుంటున్నారు. ఈ విషయాన్ని మన సనాతన మహర్షులు గూడా గుర్తించి, గ్రహణ సమయంలో, ముఖ్యంగా సూర్యగ్రహణ సమయంలో ఇళ్ళ కప్పులను దర్భగడ్డితోకప్పుకొమ్మని శాసనం చేశారు (బహుశా అందుకనే గడ్డితో ఇంటి పైకప్పుని ఎక్కువగా కప్పుకునేవారు).కాలక్రమంలో ఆ శాసనం మార్పులు చెంది, ఇంటి మధ్యలో రెండు దర్భ పరకలు పరచుకొని తూ తూ మంత్రంలా కానిచ్చేస్తున్నారు. ఇలాకాక, కనీసం పిడికెడు దర్భలైనా ప్రతివ్యక్తీ గ్రహణ సమయాలలో శిరస్సుమీద కప్పుకొంటే, చెడు కిరణాల ప్రభావం వుండదని ధర్మశాస్త్రాలు చెపుతున్నాయి. సదాశివరావు అనే ఒక వైద్యులు ఈ దర్భ గురించిన ఎన్నో విషయాలను తెలుసుకుని, నమ్మకం కుదరక, కొన్ని దర్భలను తీసుకుని అరచేతిలో ఉంచుకుని మరీ X-Ray తీయించుకోగా, ఆయన నమ్మలేని విధంగా అరవై శాతం రేడియేషన్ ఈ దర్భ గడ్డి చేత శోషించబడిందిట. దీనికి కారణం దర్భల కొనలుతేజమును కలిగి ఉండుట.


ఇటువంటి దర్భ గురించి మరెన్నో ఆసక్తికరమయిన విషయాలున్నాయి.శుచౌ దేశే ప్రతిష్ఠాప్య స్థిరమాసనమాత్మనఃనాత్యుచ్ఛ్రితం నాతి నీచం చేలాజినకుశోత్తరంఅని భగవద్గీతలో చెప్పబడింది. అంటే ఒక మంచి, స్థిరమయిన ప్రదేశంలో, మనసుని లగ్నం చేసేందుకు సరయిన ఆసనం ఎత్తుగా కాకుండా, మరీ క్రిందకి కాకుండా, చక్కని కుశ గడ్డిని పరచి, దాని మీద జింక చర్మం వేసి ఆ పైన ఒక చక్కని వస్త్రము ఉండేటటువంటి దర్భాసనమే ధ్యానానికి ఉత్తమం అని శ్రీకృష్ణుడు చెప్తారు. అలానే తైత్తరీయోపనిషత్తులో బర్హిషావై ప్రజాపతి: అని ఉంది. అనగా బర్హిష అనే గడ్డిని పరిచి దాని పైన ప్రజలను ఉత్పన్నం చేయటం, వృద్ధి పరచటం చేసేవారని చెప్పబడింది. ఋగ్వేదంలో కూడా వీటి ప్రస్తావన ఉంది. ఈ రకమయిన గడ్డి ఎక్కువగా ఉండే ద్వీపాన్ని కుశ ద్వీపం అని కూడా అంటారు. వీటిని గూర్చి మన వేమన గారు ఏమన్నారో చూడండి..

దాతగానివాని తఱచుగా వేఁడినవాడుఁ దాతయగునె వసుధలోనఅవురు దర్భ యౌనె యబ్ధిలో ముంచినవిశ్వదాభిరామ వినర వేమ!అనగా దానము అంటే ఎరుగని వాడిని ఎన్నిసార్లు అడిగినా వాడు దానము ఇస్తాడా? దాత అవుతాడా? అదే విధముగా ఇంటిపై కప్పు గడ్డిని పవిత్రమైన సముద్రములో ముంచినంత మాత్రాన దాని రూపు మారి దర్భ అవుతుందా? అని. కానీ ఇక్కడ ఇంటిపైకప్పు గడ్డి అన్నది రెల్లు గడ్డి కాదని గుర్తుంచుకోమని మనవి. ఈ విధముగా దర్భలు ఆధ్యాత్మికతతో పాటూ సాహిత్యంలో కూడా చోటు సంపాదించుకున్నాయి.. వేద పాఠం మననం చేసుకునేటప్పుడూ, నేర్చుకునేటప్పుడూ, పఠించేటప్పుడూ దర్భ ఉంగరం కుడి చేతి ఉంగరం వేలికి ధరించాలి అని మన శాస్త్రాల్లో చెప్పబడింది. చావు సంబంధిత కర్మలకి ఏక ఆకు దర్భని, శుభప్రదమయి.

జీవన సత్యం*

 *జీవన సత్యం* 


ఒక పిల్లవాడు తాగే నీరు అమ్ముతున్నాడు.


ఒక పెద్దాయన "అరేయ్ ఇటురా..." అని పిల్లవాడిని పిలిచాడు.


"ఒక ప్యాకెట్ ఎంత?" అని అడిగాడు.


"రూపాయి" అన్నాడు.


"యాభై పైసలకు ఇస్తావా?" 


కుర్రాడు ఏమీ అనలేదు. చిన్నగా నవ్వాడు.


ముందుకు సాగిపోయాడు.

ఇదంతాచూశాడు ఒక సాధువు. 

రైలు దిగి ఆ పిల్లాడి వద్దకు వెళ్లాడు.


"ఆ పెద్దాయన అన్నదానికి ఎందుకు నవ్వావు?"


"స్వామీ... అతనికి దాహం వేయలేదు. దాహం వేసిన వాడు ముందు ప్యాకెట్ తీసుకుని నీరు తాగుతాడు. 


తరువాత ధర ఎంత అని అడుగుతాడు. అతనికి కేవలం టైమ్ పాస్ కావాలి." అన్నాడు.


"నిజమే... దేవుడిని కోరుకునేవాడు తర్కాలు, కుతర్కాలు చేయడు. ఆత్రంగా సాధన చేస్తాడు. ఆర్తితో పూజిస్తాడు తప్ప శతభిషలుండవు. 


అవసరం ఉంటే బేరం ఉండదు. అవసరం లేకుంటే బేరం తప్ప మరేమీ ఉండదు." అనుకున్నాడు

సాధువు.....


🔹🔸🔹🔸🔹🔸🔹🔸🔹


*సత్య హీనా వృధా పూజా*

*సత్యహీనో వృధా జపః*

*సత్య హీనం తపో వ్యర్థం*

*ఊషరే వపనం యథా ||*



చవిటి నేలలో(నిస్సారమైన భూమి) విత్తనములు చల్లుట వ్యర్థ మైనట్టుగా సత్యహీన మైన పూజ, జపము, తపము యివన్నీ కూడా నిరుపయోగములే.


🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

5, జనవరి 2022, బుధవారం

_వాడపల్లి వెంకన్న

 *_వాడపల్లి వెంకన్న విజయగాథ..._*


*_ఒకప్పుడు జీతాలు లేవు..._*


*_నేడు కోట్ల రూపాయల అభివృద్ధి..._*


*_దేశం నలుమూలల నుంచి భక్తజనం..._*


వాడపల్లి వెంకన్న.. ఈ పేరు తెలియనివారు దేశంలో లేరంటే అతిశయోక్తి కాదు. స్వామి వారి మహత్యం అటువంటిది. ఒకప్పుడు ఇక్కడ పనిచేసే సిబ్బందికి జీతాలు కూడా ఉండేవి కాదు.నేడు కోట్ల రూపాయల అభివృద్ధి జరుగుతోంది. ఇదంతా స్వామి మహిమే అని చెబుతారు. వివరాల్లోకి వెళితే..   

   ..తూర్పుగోదావరి జిల్లా కొనసీమలోని వాడపల్లిలో వెంకటేశ్వర స్వామి స్వయంభు స్వయంభు. కలియుగంలో 4 చోట్ల మాత్రమే వెంకన్న స్వయంభూగా వెలిశారు. ఒకటి తిరుమల తిరుపతి. రెండవది ద్వారకాతిరుమల. మూడు విశాఖ జిల్లా అనకాపల్లి సమీపంలోని ఉపమాక .ఈ మూడు చోట్ల స్వామివారు రాతి విగ్రహ రూపంలో ఉంటారు. నాలుగవది వాడపల్లి ఇక్కడ స్వామివారి విగ్రహం ఎర్రచందనం లో ఉంటుంది .అందుకే స్వామివారికి పంచామృత అభిషేకంలు చేయరు. కర్పూర తైలంతో అభిషేకం చేస్తారు.ఇది ఇక్కడ మరో మహత్యం .2000 సంవత్సరం వరకు సామాన్యంగా భక్తులు వచ్చేవారు. వచ్చిన భక్తులు మళ్ళీ మళ్ళీ వచ్చే వారు. అయితే 2000 సంవత్సరంలో ప్రతి శనివారం వచ్చే ఓ భక్తుడును చూసి ఆలయంలో పనిచేసే సూపరిండెంట్ రాధాకృష్ణ అతడిని ప్రతివారం ఎందుకు వస్తున్నారు అని ప్రశ్నించగా.. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఓ సిద్ధాంతి ఉన్నారు. ఆయన దగ్గరికి వెడితే ఈతి బాధలు పోవడానికి కోనసీమలో వాడపల్లి వెంకటేశ్వర స్వామి ని ఏడు శనివారాలు దర్శించుకుని ,ప్రతి శనివారం ఏడు ప్రదక్షిణలు చేయాలని చెప్పారని దానితో తన బాధలు తీరి పోవడంతో ప్రతివారం వస్తున్నట్లు వెల్లడించారు. ఈ విషయం ఆ గ్రామస్తులు ఆఅందరికి తెలిసింది. గ్రామస్థులు కూడా ప్రతి శనివారం ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణలు చేసి అనంతరం స్వామి దర్శనం చేసుకునే వారు. వారి కోరికలు నెరవేరాయి. దీంతో ఆనోటా ఈనోటా ప్రపంచవ్యాప్తంగా వాడపల్లి వెంకన్న మహత్యం అందరికీ తెలిసింది. 2001 నుంచి ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందుతోంది. స్వామివారికి గతంలో పెద్దాపురం మహారాజా 250 ఎకరాల భూమిని ఇచ్చారు. కొన్ని మాన్యాల కింద వెళ్ళిపోయాయి. అన్యాక్రాంతమయ్యాయి. ప్రస్తుతం 150 ఎకరాల భూములు ఉన్నాయి. ఇవి కాక హుండీ ద్వారా, టికెట్ల అమ్మకాలు, ప్రసాద విక్రయాలు, అన్నదానాలు కింద కోట్ల రూపాయలు వస్తున్నాయి. గత ఏడాది స్వామివారి వార్షిక ఆదాయం 7 కోట్ల రూపాయలకు చేరుకుంది. ప్రస్తుతం ఆలయంలో రూ 13 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి ముదునూరి సతీష్ రాజు వెల్లడించారు .చైర్మన్ రమేషు రాజు సహకారంతో భారీ ఎత్తున అభివృద్ధి పనులు చేస్తున్నట్లు తెలిపారు. 4,5 ఏళ్ల క్రితం ఈ ఆలయానికి వచ్చిన వారు ఇప్పుడు ఈ ఆలయానికి వస్తే గుర్తుపట్టలేని స్థితిలో మారిపోయింది . పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. తిరుమల, అన్నవరం , శ్రీశైలం, విజయవాడ కనకదుర్గ ఆలయ దర్శనానికి వెళ్ళేటప్పుడు భక్తులు దర్శనం కోసం మంత్రులు, ఎమ్మెల్యేల లేఖలు తీసుకెళ్తారు .అంతకంటే ఎక్కువ స్థాయిలో ప్రస్తుతం వాడపల్లి దర్శనం కోసం ప్రతి శనివారం సిఫార్సు లేఖలు వస్తున్నట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. సిఫార్సుతో వచ్చే వారి కోసం ప్రత్యేకంగా ఉదయం ఒక గంట సమయం కేటాయించి న ట్లు ఈవో సతీష్ రాజు వెల్లడించారు. కొందరు భక్తులు మూడు, నాలుగు వారాలు దర్శనం అయిన తర్వాత తమ కోరికలు నెరవేరాయని ఆనందంతో వెల్లడించి స్వామివారికి మొక్కుబడులు చెల్లించుకోవడం జరుగుతోందని ఆయన తెలిపారు. వాడపల్లి చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన పలువురు కాంట్రాక్టర్లు ముందుకు వచ్చి 54 లక్షల రూపాయలతో రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా స్వామివారి కళ్యాణానికి అధునాతన కల్యాణమండపం నిర్మించేందుకు ముందుకు వచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులు ముక్కోటి ఏకాదశి కి పూర్తవుతాయని వెల్లడించారు. స్వామి మహత్యం గురించి మీడియా, సోషల్ మీడియా, ప్రింట్ మీడియా ప్రచారం చేసిందని దీంతో ఇతర దేశాల నుంచి కూడా భక్తులు వస్తున్నారని తెలిపారు. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కాటీజీల నిర్మాణం కోసం స్థానిక ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి రెండు కోట్ల రూపాయలు మంజూరు చేయించినట్లు వివో వెల్లడించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంగమాంబ నిత్యాన్నదాన భవనం లో ఎలా అన్నదానం నిర్వహిస్తారు

 నిర్వహిస్తారో అదే స్థాయిలో ఇక్కడ ఒకేసారి 15వేల మందికి అన్నదానం జరపడం విశేషం. స్వామి వారి ఆలయం చెంతనే గోదావరి నది ఉంది. భక్తులు అక్కడ స్నానం చేసి ,మరి కొందరు అక్కడే తలనీలాలు సమర్పించి స్వామివారి ప్రదక్షిణ లో పాల్గొంటారు. ప్రదక్షిణలు పూర్తయ్యాక స్వామి దర్శనం చేసుకుని, అన్నదానం స్వీకరించి నిండుమనసుతో తిరిగి వెళతారు. కొందరైతే శుక్రవారం సాయంత్రానికి అక్కడకు చేరుకుని ఆలయ ప్రాంగణంలో నిద్రపోయి తెల్లవారుజామునే లేచి గోదావరి స్నాన మాచరించి ప్రదక్షిణలు ప్రారంభిస్తారు. అయితే ఇంత పెద్ద దివ్యక్షేత్రంలో బస చేసేందుకు ఎలాంటి సౌకర్యాలు లేవు. అందుకోసమే ఎమ్మెల్యే సహకారం తీసుకుని టీటీడీ ద్వారా రెండు కోట్ల రూపాయలతో కాటేజీలు నిర్మిస్తున్నారు. స్వామివారి కల్యాణానికి లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు .రాష్ట్ర ప్రభుత్వం అన్నవరం, అంతర్వేది, కోటిపల్లి కళ్యాణo లను స్టేట్ ఫెస్టివల్ గా గుర్తించింది .తాజాగా వాడపల్లి కళ్యాణo ని కూడా నోటిఫై చేయడంతో ఈ కళ్యాణo కోసం వచ్చే భక్తుల సంఖ్య మరింత పెరిగింది. జీతాలు ఇవ్వలేని స్థితి నుంచి కోట్ల రూపాయల నిధులు డిపాజిట్ చేసుకునే స్థాయికి ఎదిగింది. శనివారం 50 వేల నుంచి 70 వేల మంది భక్తులు వస్తారు. మిగిలిన రోజుల్లో 10 వేల మంది వరకు భక్తులు ఉంటారు. నేడు సమాజంలో భక్తి పెరిగింది .దేవుడు మహత్యంకు భక్తులు వస్తున్నారు. అలాంటిది ఏడు శనివారాల వాడపల్లి వెంకన్న దర్శనం.. ఏడేడు జన్మల పుణ్యఫలం అంటూ మార్మోగి పోవడంతో లక్షలాదిగా భక్తులు వాడపల్లికి వస్తున్నారు ఈ పుణ్యక్షేత్రం కోనసీమ తిరుమల గా ప్రసిద్ధి గాంచింది. స్వామి వారి మహత్యం ప్రపంచానికి తెలియడం లో మీడియా ముఖ్యంగా డిజిటల్ మీడియా పాత్ర ఎంతో ఉందని ఆలయ కార్యనిర్వహణాధికారి కృతజ్ఞతలు తెలిపారు.

పిప్పలాదుడు

 పిప్పలాదుడు.........!!

పిప్పలాదుడు ఉపనిషత్తును రచించిన జ్ఞాని!!

జన్మించిన 5ఏండ్ల వరకూ శని ప్రభావం ఉండకుండా చేసిన మహానుభావుడు

మహర్షి దధీచి మృతదేహాన్ని శ్మశానవాటికలో దహనం చేస్తున్నప్పుడు,ఆయన భార్య తన భర్త యొక్క వియోగాన్ని తట్టుకోలేక, సమీపంలో ఉన్న ఒక పెద్ద రావి చెట్టు రంద్రం లో తన 3 సంవత్సరాల బాలుడిని ఉంచి ఆమె స్వయంగా చితిలో కూర్చుంది.  ఈ విధంగా మహర్షి దధీచి మరియు ఆయన భార్య ఒకే చితిపై దహించుకుపోయారు.కానీ రావి చెట్టు యొక్క రంద్రం లో ఉంచిన పిల్లవాడు ఆకలి మరియు దాహంతో ఏడుపు ప్రారంభించాడు.ఏమీ కనిపించకపోవడం,ఎవరూ లేకపోవడం తో, అతను ఆ రంద్రం లో పడిన రావి చెట్టు పండ్లు తిని పెరిగాడు.  తరువాత,ఆ రావి ఆకులు మరియు పండ్లు తినడం ద్వారా, ఆ పిల్లవాడి జీవితం సురక్షితంగా ఉంది.

   

ఒకరోజు దేవర్షి నారదుడు అటుగా వెళ్ళాడు.  నారదుడు,రావి చెట్టు యొక్క కాండం భాగం లో ఉన్న పిల్లవాడిని చూసి, అతని పరిచయాన్ని అడిగాడు-

నారదుడు- నువ్వు ఎవరు?

అబ్బాయి: అదే నాకు కూడా తెలుసుకోవాలని ఉంది.

నారదుడు- నీ తండ్రి ఎవరు?

అబ్బాయి: అదే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను.

 అప్పుడు నారదుడు దివ్యదృష్టి తో చూసి ఆశ్చర్యపోయి హే అబ్బాయి!  నీవు గొప్ప దాత మహర్షి దధీచి కొడుకువి.  నీ తండ్రి అస్తిక తో  దేవతలు ఒక పిడుగు లాంటి ఆయుధాన్ని సృష్టించి(వజ్రాయుధం) రాక్షసులను జయించారు.  మీ తండ్రి దధీచి 31 ఏళ్లకే చనిపోయారు అని నారదుడు చెప్పాడు.

అబ్బాయి: మా నాన్న అకాల మరణానికి కారణం ఏమిటి?

 నారదుడు- మీ తండ్రికి శనిదేవుని మహాదశ ఉంది.

 పిల్లవాడు: నాకు వచ్చిన దురదృష్టానికి కారణం ఏమిటి?

 నారదుడు- శనిదేవుని మహాదశ.

   

ఈ విషయం చెప్పి దేవర్షి నారదుడు రావి ఆకులు మరియు పండ్లు తిని జీవించే బిడ్డకు పేరు పెట్టాడు మరియు అతనికి దీక్షను ఇచ్చాడు.

 నారదుని నిష్క్రమణ తరువాత, పిల్లవాడు పిప్పలడు నారదుడు చెప్పినట్లుగా కఠోర తపస్సు చేసి బ్రహ్మను ప్రసన్నం చేసుకున్నాడు.  బ్రహ్మాదేవుడు బాల పిప్పలాద ను వరం అడగమని కోరినప్పుడు, పిప్పలాద తన కళ్లతో ఏదైనా వస్తువును చూస్తే కాల్చే శక్తిని అడిగాడు.అలా అన్నింటినీ కాల్చివేయడం ప్రారంభించాడు.శని దేవుడి శరీరంలో మండడం ప్రారంభించాడు.  విశ్వంలో కలకలం రేగింది.  సూర్యుని కుమారుడైన శనిని రక్షించడంలో దేవతలందరూ విఫలమయ్యారు.


సూర్యుడు కూడా తన కళ్ల ముందు కాలిపోతున్న కొడుకుని చూసి బ్రహ్మదేవుడిని రక్షించమని వేడుకున్నాడు.చివరికి బ్రహ్మదేవుడు పిప్పల ముందు ప్రత్యక్షమై శనిదేవుడిని విడిచిపెట్టడం గురించి మాట్లాడాడు కానీ పిప్పలాదుడు సిద్ధంగా లేడు.బ్రహ్మాదేవుడు ఒకటి కాకుండా రెండు వరాలు ఇస్తాను అన్నాడు. అడగటానికి  అప్పుడు పిప్పాలాదుడు సంతోషించి ఈ క్రింది రెండు వరాలను అడిగాడు-


 1- పుట్టినప్పటి నుండి 5 సంవత్సరాల వరకు ఏ పిల్లల జాతకంలో శని స్థానం ఉండకూడదు.తద్వారా మరెవ్వరూ నాలా అనాథ కాకూడదు.


 2- అనాథ అయిన నాకు రావి చెట్టు ఆశ్రయం ఇచ్చింది.  కావున సూర్యోదయానికి ముందు రావి చెట్టుకు నీరు సమర్పించే వ్యక్తికి శని మహాదశ బాధ ఉండకూడదు.

 

దానికి   బ్రహ్మాదేవుడు 'తథాస్తు' అని వరం ఇచ్చాడు.అప్పుడు పిప్పలాదుడు తన బ్రహ్మదండంతో ఆయన పాదాలపై పడి మండుతున్న శనిని విడిపించాడు.శనిదేవుని పాదాలు దెబ్బతినడం వల్ల అతను మునుపటిలా వేగంగా నడవలేకపోయాడు.అందుకే శని

 "శనిః చరతి య: శనైశ్చరః" అంటే మెల్లగా నడిచే వాడు శనైశ్చరుడు అని, శని నల్లని శరీరం కలవాడు. మంటల్లో కాలిపోవడంతో అవయవాలు కాలిపోయాయి.

        శని యొక్క నల్లని విగ్రహాన్ని మరియు రావి చెట్టును పూజించడం యొక్క ఉద్దేశ్యం ఇదే.తరువాత పిప్పలాదుడు ప్రశ్న_ఉపనిషత్తును రచించాడు, ఇది ఇప్పటికీ విస్తారమైన జ్ఞాన భాండాగారంగా ఉంది.

4, జనవరి 2022, మంగళవారం

మహాస్వామి వారి చిత్రపటం

 మహాస్వామి వారి చిత్రపటం


చిత్రకారుడు సిల్పి (పి.యమ్. శ్రీనివాసన్) తను చేస్తున్న ఒక పనికోసం నెలరోజులుగా నిరీక్షించిన పరమాచార్య స్వామి వారి దర్శనం లభించిన రోజది. ఆ గొప్ప చిత్రకారుడి జీవితాన్ని పూర్తిగా మలుపుతిప్పిన రోజు. రాత్రి చాలా పొద్దు పోయిన తరువాత, ప్రపంచం మొత్తం గాఢనిద్రలోకి జారుకున్న సమయాన ఇద్దరి మధ్య సంభాషణ జరిగింది.


ఒకరు జగద్విఖ్యాతి చెందిన మహాపురుషులైన సన్యాసులు కాగా, మరొకరు ప్రపంచానికి అంతగా తెలియని గొప్ప చిత్రకారుడు. ఆ పరమపవిత్రమైన గదిలో, నూనెదీపపు వెలుగులో ఆ చిత్రకారునికి ఒక రహస్యాన్ని చెప్పడానికి ఆ సన్యాసి కళ్ళు అత్యంత తెజోవంతములై మెరిశాయి.


“ఇప్పటిదాకా నువ్వు ఎన్నో జన్మలు ఎత్తావు. అన్ని జన్మలలో భగవంతుణ్ణి ఎంతో భక్తితో సేవించావు. క్రిందటి జన్మలలో ఎన్నో దేవాలయాలకు స్థపతివై ఎన్నో దైవీ శక్తులు కలిగిన శిల్పాలను మలిచావు. ఇది నీకు చివరి జన్మ. నీకు సంప్రాప్తమైన ఈ దైవకళను వ్యర్థం చెయ్యకు. ఇప్పటినుండి కేవలం దేవతా రూపాలను మాత్రమె చిత్రిస్తానని వాగ్దానం చెయ్యి. నీ ప్రతిభ ఆసాదారణమైనది. నీకు జన్మతః శిలా శాస్త్రము, సాముద్రికా లక్షణము తెలుసు. ఇక వేరే చదువు నీకు అక్కరలేదు. నీ దైవదత్తమైన కళ ద్వారా దైవిత్వాన్ని అన్ని ఇళ్ళల్లో ఆవిష్కరించే లక్ష్యంతో రేపు ఉదయాన్నే ప్రపంచంలోకి వెళ్ళు” అని ఆదేశించారు.


ఆ చిత్రకారుడు శ్రీవారి వద్ద సెలవు తీసుకుని, బాహ్య ప్రపంచానికి తెలియని ఎన్నో మారుమూల దేవాలయాలకు వెళ్లి అక్కడ ఉన్న వివిధ మూర్తులను తన క్యాన్వాసుపై చిత్రిచసాగాడు. అది అంత సులువైన పని కాదు, అత్యంత నియమనిష్టలతో, భక్తిశ్రద్ధలతో ఉన్నవారికి మాత్రమె కుదిరే కార్యం.


“నీ ఊహలను ఎంతమాత్రమూ చిత్రించారాదు. శిల్ప శాస్త్రాన్ని అనుసరించి, సాముద్రికా లక్షణంలో తెల్పిన ప్రకారం వివిధ శక్తులతో ఉన్న దేవతా మూర్తులను నువ్వు ఎలా చూస్తున్నావో అలాగే చిత్రించాలి. కొత్తగా వెలుగును ఏర్పాటు చేసుకోకుండా, పరిమితమైన దీపపు వెలుగులో, నువ్వు చిత్రించే సమయంలో నీకు ధ్యానస్థితిలో అగుపించే విశేషాలను మాత్రమె చిత్రించు. నీ కుంచె కదిలికలవల్ల ఆ మూర్తి యొక్క శక్తిని, తేజస్సును కూడా నీ చిత్రాలలో చిత్రించగలుగుతావు” అని స్వామివారు చెప్పిన విషయాలను ఎన్నడూ మరువలేదు.


తనకు గురువు, దైవం, మార్గదర్శకులు చెప్పినట్టుగా కొత్త జీవితాన్ని ప్రారంభించి, జీవితాంతం స్వామివారు ఆశిస్సులే ఊపిరిగా బ్రతికాడు. సిల్పి సంసారస్థుడు. తన భార్య పరమాచార్య స్వామివారికి పెద్ద భక్తురాలు. ఆమె వయోభారం చేత మఠానికి వెళ్లి పరమాచార్య స్వామి దర్శనం చేసుకుని ఆశీస్సులు తీసుకోవడానికి కుదరడంలేదు. అందుకనే ఆమె పరమాచార్య స్వామివారి చిత్రపటాన్ని చిత్రించి ఇంటిలో ఉంచుకుంటే జీవితాంతం వారిని ఆరాధించుకుంటానని తన భర్తని కోరింది. 1956లో తన భార్య కోసం స్వామివారిని చిత్రించడానికి సిల్పి వెళ్ళాడు.


కాని స్వామివారు అతనికి సహకరించడం తప్ప అన్నీ చేస్తున్నారు. అటూ, ఇటూ కదులుతూ సిల్పి సహనాన్ని, భక్తిని పరీక్షిస్తున్నారు. చివరికి అంతా ముగిసిన తరువాత సిల్పి చేతిలో ఒక గొప్ప కళాఖండం రూపుదాల్చుకుంది. తన భక్తికి పరాకాష్టలా మహాస్వామివారి కాలివేలి గోళ్ళు మొదలుకుని వారి నుండి వెలువడే దివ్యకాంతి వరకు ఆ చిత్రపటంలో నిండి నిబిడికృతమైంది.


అది చాలా ప్రత్యేకమైన చిత్రపటం. మహాస్వామివారి చూపులను అత్యంత సూక్ష్మమమైన రంగుల్లో అందంగా చిత్రించాడు. వేసుకున్న బిల్వమాలలోని బిల్వ దళాలు తాజాగా ఉంటాయి. ఏ ఫోటో కూడా తనలో నింపుకోలేని తేజస్సును తన కుంచె ద్వారా ఆవిష్కరించాడు. ఆ గదిలో స్వామివారి పాదాల వద్ద వెలిగించిన ఒకేఒక్క దీపం స్వామివారి వెలుగులో చిన్నబోయింది. ఇంత అద్బుతంగా ఎప్పుడూ ఎవ్వరూ స్వామివారిని చిత్రించలేదు. ఆ గదిలో కదలకుండా కూర్చుని చిత్రకారుని గమనించి, పూర్తైన తరువాత ఆశీస్సులు అందించి మన పుణ్యవశమున దాన్ని బయలుపరిచారు.


చిత్రకారుడు సిల్పి క్యాన్వాసుపై కంచి పెరియవ శ్రీ జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఇప్పటికి సజీవంగా ఉన్నారు. 1956లో సిల్పి కుంచె నుండి జాలువారిన మహాత్తరమైన స్వామివారి చిత్రపటం ఇదే.


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

ఏమి నేర్పింది

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

 *🌷ఆ కాలం ఏమి నేర్పింది?🌷* 


పొలం గట్లపై నడిపించి, తడబడకుండా *నిలదొక్కుకోవటం* నేర్పింది.


వాగు పక్కన నీటి చెలిమలు తీయించి, *శోధించే తత్వం* 

నేర్పింది.


*సీతాఫలాల కోసం చెట్ల చుట్టూ తిరిగించి, *అన్వేషణ* నేర్పింది.


*తుమ్మ ముల్లు, పల్లేరు గాయాల గుచ్ఛులతో, *జీవితం* పూలపాన్పు కాదని నేర్పింది.


*చిన్న చిన్న దెబ్బలు తగిలితే,

నల్లాలం ఆకు పసరు పోయించి,

చిన్న చిన్న ఇంటి వైద్యం *చిట్కాలు* నేర్పింది.


చెట్టుమీద మామిడికాయ

గురిచూసి కొట్టడం, లక్ష్యాన్ని 

*ఛేదించడం* నేర్పింది.


*నిండు బిందెను నెత్తి మీద పెట్టి, 

నీళ్లు మోయించి, జీవితమంటే 

బరువు కాదు, *బాధ్యత* అని నేర్పింది.


*బావి నుండి బొక్కెనతో నీళ్లు తోడించి, బాలన్స్ గా *బరువు* 

లాగటం నేర్పింది.


*ఇంటి ముంగిటకు అతిథి దేవతలు

హరిదాసులు గంగిరెద్దులను రప్పించి, ఉన్న దాంట్లో కొంత *పంచుకునే* గుణం నేర్పింది.


*విస్తరిలో, అన్నం అంచులు దాటి కింద పడిపోకుండా తినే *ఒద్దికను* నేర్పింది.


ఒక్క పిప్పర్మెంట్ ను, బట్ట వేసి కొరికి ముక్కలు చేసి,

కాకి ఎంగిలి పేరుతో స్నేహితులతో

*పంచుకోవటం* నేర్పింది.


ముళ్ళు గుచ్చుకోకుండా, ఒక్కటొక్కటిగా రేక్కాయలు తెంపే *ఓర్పును* నేర్పింది.


దారంతో విల్లును చేయించి, వస్తు తయారీ *మెళకువలు* నేర్పింది.


*అత్తా, మామా, అన్నా వదినా, అమ్మమ్మా, నాయనమ్మా, తాతయ్యా వరుసలతో,

ఊరు ఊరంతా ఒక కుటుంబమనే *ఆత్మీయత* నేర్పింది.


ధైర్యంగా బ్రతికే పాఠాలను నేర్పిన

మన బాల్యానికి జీవితాంతం 

రుణపడి ఉందాం.

శ్వాస - పంచప్రాణాలు

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

శ్వాస - పంచప్రాణాలు........!!

శ్వాస రూపంలో మనం తీసుకున్న వాయువు నాసికా రంధ్రాల గుండా ప్రవేశించగానే ఐదు భాగాలుగా విడిపోయి....

1. ప్రాణము 2. అపానము 3. వ్యానము 4. ఉదానము 5. సమానము అను ఐదు ప్రాణములుగా మారిపోతుంది.


1.ప్రాణము:- అనంతాకాశంలో నుంచి ఎవరి శక్తి మేరకు వారు లోనికి తీసుకొని వాయువు.

2. అపాన వాయువు:- బయటికి వస్తున్న వాయువును అపాన వాయువు అని అంటారు. ఈ వాయు సహాయంతోనే మల మూత్ర విసర్జనలే కాక శరీరంలోని సమస్య మాలిన్యాలను బయటకు నెట్టబడుతున్నాయి.

3. వ్యాన వాయువు:- మన శరీరానికి మానవాకృతి నివ్వడానికి సహకరించే వాయువు. ఈ వాయువు యొక్క దోషం వల్ల అంగవైకల్యం, మానసిక ఎదుగుదల లోపం, శారీరక ఎదుగుదల లోపం (మరుగుజ్జుతనం) ప్రాప్తించును.

4. ఉదాన వాయువు:- దీని సహాయంతో మనం మాట్లాడగలుగుతున్నాము. దీని లోపం వల్ల నత్తి, నంగి, ముద్ద మాటలు, బొంగురు గొంతు సమస్యలు కలుగును.

5. సమాన వాయువు:- దీని సహాయంతోనే మనం తీసుకున్న ఆహారం శక్తిగా మారి ఏ ఏ భాగానికి ఎంతెంత శక్తి పంపిణీ చేయాలో అంతంత పంపి సమతుల్యాన్ని కలుగజేస్తుంది. దీని లోపం వల్ల శరీరం తూలి పడటం సంభవించును.


శ్వాస - చక్రాలు:-

ఈ శ్వాస ప్రతిరోజు ఉదయము సరిగ్గా 6 గంటలకు మొదలై 

➡️ మూలాధార చక్రము నందు - 600 సార్లు

➡️ స్వాధిష్ఠాన చక్రము నందు - 6000 సార్లు

➡️ మణిపూరక చక్రము నందు - 6000సార్లు

➡️ అనాహత చక్రము నందు - 6000 సార్లు

➡️ విశుద్ధి చక్రము నందు - 1000 సార్లు

➡️ ఆజ్ఞా చక్రము నందు - 1000 సార్లు

➡️ సహస్రారము నందు - 1000 సార్లు 

అనగా, రోజుకు 21600 సార్లు పయనిస్తోంది.


శ్వాస - అంగుళాలు:-

సాధారణంగా శ్వాసను సాధకుడు 12 అంగుళాలు వదులుతాడు. శ్వాసను ఎవరైతే లోతుగా - నిదానంగా - దీర్ఘంగా తీసుకొని దానిపై దృష్టి ఉంచి విడవటం చేస్తుంటే శ్వాస యొక్క అంగుళాలు తగ్గును.

➡️ శ్వాసను 11 అంగుళాలకు కుదిస్తే - ప్రాణం స్థిరమవుతుంది.

➡️ శ్వాసను 10 అంగుళాలకు కుదిస్తే - మహాకవి అవుతాడు.

➡️ శ్వాసను 9 అంగుళాలకు కుదిస్తే - బ్రహ్మానందం కలుగుతుంది.

➡️ శ్వాసను 8 అంగుళాలకు కుదిస్తే - దూరదృష్టి కలుగును.

➡️ శ్వాసను 6 అంగుళాలకు కుదిస్తే - ఆకాశగమనం చేయగలుగుతాడు.

➡️ శ్వాసను 4 అంగుళాలకు కుదిస్తే - సర్వ సిద్ధులు ప్రాప్తిస్తాయి.

➡️ శ్వాసను 2 అంగుళాలకు కుదిస్తే - కావలసిన రూపం ధరించిగలుగుతాడు.

➡️ శ్వాసను 1 అంగుళానికి కుదిస్తే - అదృశ్యం అవ్వగలరు.

   మరింత సాధన చేయగా శ్వాస అవసరమే వారికి ఉండదు. అలాంటి వారు అమరులు అవుతారు.


శ్వాస - సృష్టి వయస్సు:-

 మనము రోజుకు తీసుకునే శ్వాసలను (21600) రెట్టింపు చేసి ఒక సున్నను చేర్చిన

➡️ కలియుగం - 4,32,000 సంవత్సరాలు.

➡️ రెట్టింపు చేసిన ద్వాపర యుగం - 8,64,000 సంవత్సరాలు.

➡️ మూడు రెట్లు చేసిన త్రేతా యుగము- 12,96,000 సంవత్సరాలు.

➡️ నాలుగు రెట్లు చేసిన కృత యుగము - 17,28,000 సంవత్సరాలు.

➡️ పది రెట్లు చేసిన చతుర్ యుగము ( కలి+ద్వాపర+త్రేతా+ కృతయుగములు) - 43,20,000 సంవత్సరాలు.


శ్వాస - సాధన:-

సుఖంగా ఉండే పద్ధతిలో కూర్చొని, మృదువుగా కళ్లుమూసుకుని, మన నాశికా రంధ్రాల ద్వారా లోపలికి ప్రవేశించిన శ్వాస తిరిగి అదే నాశికా రంధ్రాల ద్వారా బయటకు వెళ్లడాన్ని గమనిస్తుండాలి. ఇలా చేయగా, చేయగా మనస్సు యొక్క పరుగు క్రమేపీ తగ్గి క్రమక్రమంగా ఆగిపోతుంది. అప్పుడు బ్రహ్మరంధ్రం ద్వారా అనంతమైన విశ్వమయప్రాణశక్తి లభ్యమౌతుంది.

     మరి ఇంతటి శక్తివంతమైన శ్వాసకు సంబంధించిన సాధన చేసుకునేందుకు మనము ఏ హిమాలయాలకు, ఏ అరణ్యాలకు వెళ్ళి పోవాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటూ, ఎలా ఉన్న వాళ్ళు అలాగే ఉంటూ, మనం చేసే పనులు ఏవి మానుకోకుండానే, ఖాళీగా ఉన్న సమయంలో ఈ అద్భుత సాధన సులువుగా చేసుకోవచ్చు. దీనిని చిన్న పిల్లల (5 సం"ల) నుండి ముసలి వారి దాకా ఎవరైనా చేయవచ్చును.

     84 లక్షల జన్మల తరువాత లభ్యమైన ఈ మానవ జీవితమును వృధా చేయకుండా, వివేకవంతులముగా దీనిని సద్వినియోగపరచుకోగలరు.

3, జనవరి 2022, సోమవారం

దుర్గా పంచరత్నం

 *దుర్గా పంచరత్నం:*

       ➖➖➖

           (పరమాచార్య గురువే నమః)


*దుర్గా పంచరత్నం* దుర్గాదేవిని స్తుతిస్తూ చేసిన మహాద్భుతమైన స్తోత్రం. 

దీన్ని మనకు అందించినది పరమాచార్య స్వామి వారు. 

ఆ స్తోత్రం ఎలా వచ్చిందో దానికి సంబంధించిన కథను చూద్దాం...


అది తేనంబాక్కంలో మహాస్వామి వారు మకాం చేస్తున్న కాలం. అప్పుడు మధ్యాహ్నం 2 గంటల సమయం. మహాస్వామి వారు ఒక కాలును నీటిలో ఉంచి చెరువు గట్టు పైన కూర్చుని ఉన్నారు. 


మహాస్వామి వారు చప్పట్లు చరచి నన్ను రమ్మని ఆజ్ఞాపించారు. ఒక కాగితం కలం తీసుకుని తన ప్రక్కన కూర్చో అని సైగ చేసి చెప్పారు. 


నేను వాటిని తీసుకుని వచ్చి వారి వద్ద కూర్చున్నాను. మహాస్వామి వారు ఒక్కొక్కటిగా సంస్కృత పదాలను చెప్పడం ప్రారంభించారు. 


ఒక్కొక్క సందర్భంలో ఒక భావాన్ని చెప్పి దానికి సరియగు సంస్కృత పదం చెప్పమనేవారు.


అలా అన్ని పదములు జతకూడిన తరువాత ఒక మహత్తరమైన స్తోత్రం వచ్చింది. 

అదే *దుర్గా పంచరత్నం* (శ్వేతాశ్వర ఉపనిషత్ సారము). 

ప్రతి శ్లోకము యొక్క చివరి పాదము... 

“మాం పాహి సర్వేశ్వరీ మోక్షధాత్రి ” అనే మకుటంతో ముగుస్తుంది. (ఈ శ్లోకాన్ని మనం కామాక్షి ఆలయ ముఖద్వారానికి ఎడమ ప్రక్కన ఉన్న గోడపై పాలరాతి శిలపైన చెక్కి ఉండటం గమనించవచ్చు.)


మహాస్వామి వారు ఈ స్తోత్రం చేస్తూ మధ్యలో “నీవే భగవద్గీతను బోధించిన దానివి” అని వచ్చింది. ఒక్క క్షణం ఇటుతిరిగి ఆలోచిస్తున్న నా వైపు చూసి, మహాస్వామి వారు “కామాక్షి గీతోపదేశం చేసింది అనునది నీకు ఎందుకు తప్పు అని అనిపిస్తోంది?” అని అడిగారు. నేను చిన్నగా నవ్వి మౌనం వహించాను.


వెంటనే వారు గీతాభాష్యం పుస్తకం తీసుకురమ్మని చేతులతో సైగ చేసి ఆదేశించారు. 


వెనువెంటనే 8 సంపుటముల గీతాభాష్యం స్వామి వారి వద్దకు వచ్చి చేరింది. వారు ఒక పుస్తకమును తీసుకుని దాన్ని తెరిచి అక్కడ తెరవబడి ఉన్న పుటములో ఒక శ్లోకమును దాని భాష్యమును చదవమన్నారు.


ఆ శ్లోకం ఇదే “బ్రహ్మణోహి ప్రతిష్ఠాహమ్”


“మార్పులేని శాశ్వతమైన బ్రహ్మానికి, శక్తి రూపమైన మాయ ప్రతిష్ఠ. అది నేను. నేను బ్రహ్మాన్ని మరియు దాని ప్రతిష్ఠను అనునది సరియగును. ఎందుకంటే దానికి భాష్యం “శక్తి శక్తిమతోః అభేదత్” అని ఉంది. శక్తి మరియు ఆ శక్తి కలిగిన వారు వేరు వేరు తత్వము కాదు. శక్తికి ఆ శక్తి ఉన్నవాడికి అభేదము.”


ఈ సంఘటన ఆ స్తోత్రం యొక్క విశిష్టతని తెలియజేస్తుంది.


|| దుర్గా పంచరత్న స్తోత్రం ||


తే ధ్యానయోగానుగతా అపశ్యన్

త్వామేవ దేవీం స్వగుణైర్ నిగూఢామ్ ।

త్వమేవశక్తిః పరమేశ్వరస్య

మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి. 1


ఓ సర్వాధిష్ఠానేశ్వరీ! ఓ మోక్షప్రదాత్రీ! నిరంతరము ధ్యానయోగమునందు మునులు యోగులు మున్నగువారు సత్వరజస్తమో గుణములచే వ్యక్తముకాకుండగానున్న సకలదేవతాస్వరూపిణియగు నిన్నే చూచుచున్నారు. ఆ పరమేశ్వరునియొక్క శక్తివి కూడా నీవే. నన్ను రక్షించు.


దేవాత్మశక్తిః శ్రుతివాక్య గీతా

మహర్షిలోకస్య పురః ప్రసన్నా ।

గుహాపరం వ్యోమ సతః ప్రతిష్ఠా

మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి. 2


ఓ సర్వేశ్వరీ! మోక్షధాత్రి ! నీవు దివ్యమగు ఆత్మశక్తిని, వేదవాక్యములచే గానముచేయబడితివి. మహర్షిలోకమును ముందుగా అనుగ్రహించితివి. అత్యంతనిగూఢమగు నివాసము నీది. సత్పదార్థమునకు అధిష్ఠానము నీవు. నన్ను రక్షించు.


పరాస్యశక్తిః వివిధైవ శ్రూయసే

శ్వేతాశ్వ వాక్యోదిత దేవి దుర్గే ।

స్వాభావికీ జ్ఞానబలక్రియాతే

మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి. 3


ఓ దుర్గా! శ్వేతాశ్వతరోపనిషద్వాక్యములచే చెప్పబడిన దివ్యరూపిణీ, నీవు పరాశక్తివి. అయినను అనేకులచే అనేకవిధములుగా చెప్పబడగా వివిధరూపములుగా వినబడుచునావు. నీయొక్క జ్ఞాన, బల సంబంధమగు క్రియారూపములోని శక్తి నీకు స్వాభావికమైనది. సర్వేశ్వరీ! మోక్షప్రధాత్రి ! నన్ను రక్షించు. 


దేవాత్మశబ్దేన శివాత్మభూతా

యత్కూర్మవాయవ్య వచో వివృత్యా

త్వం పాశవిచ్ఛేదకరీ ప్రసిద్ధా

మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి. 4


దేవాత్మశబ్దముచే చెప్పబడు నీవు, కూర్మ వాయుపురాణముల వాక్యవివరణచే శివాత్మురాలివైతివి. నీవు ఈ భవపాశములను ఛేదింపగలిగినదానిగా ప్రసిధ్ధురాలవు. ఓ సర్వేశ్వరీ! మోక్షప్రధాత్రి ! నన్ను రక్షించు


త్వం బ్రహ్మపుచ్ఛా వివిధా మయూరీ

బ్రహ్మ ప్రతిష్ఠాస్యుపదిష్టగీతా ।

జ్ఞానస్వరూపాత్మ తయాఖిలానాం

మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి. 5


అమ్మా, నీవు బ్రహ్మమే పుచ్చముగాగల వివిధరూపములనుండు మయూరివి బ్రహ్మమునకు అధిష్టానమైనదానివి. అనేక గీతలను ఉపదేశించిన దానవు. అందరిలోనుండు జ్ఞాన స్వరూపము నీవే. అందరిలోని దయాస్వరూపము నీవే. ఓ సర్వేశ్వరీ! మోక్షప్రధాత్రి ! నన్ను రక్షించు


కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్య శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి విరచితం. ప్రతిరోజు దీన్ని చదివిన వారికి మోక్షం తథ్యం.


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం॥