23, జనవరి 2023, సోమవారం

మాఘ స్నానం విశిష్టత

 *🙏🙏మాఘ మాసం ప్రారంభం సందర్భంగా... 🙏🙏*


*🌺 మాఘ స్నానం విశిష్టత🌺*


*మాఘ మాసం మహత్మ్యం*


హిందూ సంప్రదాయాల్లో ప్రతి నెల కూడా పవిత్రమైందే. ప్రతి మాసానికి ఓ విశిష్టత ఉంది. చాంద్రమానం ప్రకారం పదకొండవ మాసమైన మాఘమాసం ప్రారంభమవుతుంది. కార్తీక మాసంలో దీపానికి ఎంత ప్రాముఖ్యం ఉంటుందో మాఘమాసంలో స్నానానికి అంత ప్రాముఖ్యం ఉంటుంది.


ఈ నెలలో పరమేశ్వరుడు లింగ రూపం ధరించాడని పౌరాణిక గాధ. అంతేకాకుండా, చదువుల తల్లి సరస్వతి జన్మించినంది కూడా వసంత పంచమి అయిన మాఘ మాసంలోనేని నమ్ముతారు. సూర్యభగవానుడు తన రథంపై సంచారానికి బయలుదేరుతాడని కూడా విశ్విసిస్తారు. మాఘ మాసం పుణ్యస్నానాలకు పెట్టింది పేరు.


ఈ మాసంలో మకర లగ్నంలో సూర్యభగవానుడు ఉండే సమయంలో చేసే స్నానాలకు విశిష్టత ఉది. ఈ జలమంతా హరి పరిపూర్ణుడై ఉంటాడని, ఆ విధంగా విష్ణుమూర్తి దయకు పాత్రులవుతామని చెబుతారు. ఈ మాసమంతా తెల్లవారు జామున లేచి స్నానం ఆచరించడమనేది నిత్య కృత్యమంటారు.


*మాఘ శుక్ల త్రయోదశి నుంచీ మూడు రోజులు ' మాఘీ ' అంటారు.. కనీసము ఆ మూడురోజులయినా నదీ/ సముద్ర స్నానము చేయాలి.*


*మాఘ స్నానమున నియమములు*


స్నానం చేయకుండా అగ్ని దగ్గర కూర్చోరాదు. స్నానం చేయకుండా అగ్ని సేవనము తగదు. హోమము కొరకు వహ్నిని సేవించాలేకానీ శీతము కొరకు వద్దు. 

ప్రతి రోజు చక్కెర తో కూడిన నువ్వులను దానము చేయాలి. మూడు భాగములు నువ్వులు , ఒక భాగము చక్కెర ఉండాలి.


వ్రతమందున్నవాడు నెలమొత్తము అభ్యంగనస్నానము లేకుండా గడపాలి. వహ్నిహోమము చేసి ఏకాశనుడు కావాలి. భూశయ్య , బ్రహ్మచర్యము వీని యందు శక్తుడైనవాడు స్నానం చేయాలి. 

అశక్తుడు అంతట స్వేచ్చగా ఉండొచ్చు. అట్లాగే తిలల స్నానము. తిలలు ( నువ్వులు ) వంటికి రాచుకోవడము , తిల హోమము , తిలతర్పణము , తిలభోజనము , తిలదానము.--ఈ ఆరు రకముల తిలలు పాప నాశకములు. 

స్నానము తర్వాత కట్టెవలె మౌనము గానుండి నమస్కరించి పురుషోత్తముని పూజించాలి.


*దానములు*


నూనె , ఉసిరికాయలు వీటిని ప్రతిరోజు తీర్థమందు ఇవ్వాలి. బ్రాహ్మణుల సేవనము కొరకు అగ్నిని ప్రజ్వలింపజేయాలి. భోజనాలు తృప్తి వరకూ ఏర్పాటు చేయాలి. 

వస్త్ర భూషణములతో అలంకరించి ద్విజ దంపతులను భుజింపజేయాలి. కంబలము , జింక చర్మము , రత్నములు, వివిధ వస్త్రములు , రవికలు , కప్పుకొనుటకు వస్త్రాలు ఇవ్వాలి. 

చెప్పులు గుల్మ మోచకములు మరియు పాపమోచకములు కాబట్టి వానిని ఇవ్వాలి.


శక్తి కొద్దీ అన్నదానము చేయాలి. వేదవిద్వాంసునకు గుంజెత్తు అయినా బంగారమివ్వాలి. మాఘమాసాంతమందు షడ్రస భోజనమాచరించాలి.


నిజానికి ప్రాతఃస్నానము పుష్య మాస శుక్ల పక్ష ఏకాదశిన మొదలు పెట్టి మాఘ శుక్ల ద్వాదశిన గానీ , పౌర్ణమి యందు గానీ సమాప్తి చేయాలి. రోజు భూమిపై పరుండాలి ( మంచము వదలి ) నెలరోజులు మితాహారుడై , లేదా నిరాహారుడై త్రికాలములయందు స్నానము చేసి , భోగములను వదలి , జితేంద్రియుడై త్రికాలాలలోను విష్ణువును అర్చించాలి.


*దుఃఖ దారిద్ర్య నాశాయ శ్రీ విష్ణోః తోషణాయ చ*

*ప్రాతః స్నానం కరోమ్యద్య మాఘే పాప వినాశనం ॥*

*మకరస్థే రవౌ మాఘే గోవిందాచ్యుత మాధవ*

*స్నానేనానేన మే దేవ యథోక్త ఫలదో భవ ॥*

ప్రతి రోజు సూర్యార్ఘ్యమివ్వాలి.


మాఘస్నానాలు సకల పాపాలను హరిస్తాయని భారతీయుల విశ్వాసం. మాఘస్నాన మహాత్యాన్ని బ్రహ్మాండ పురాణం పేర్కొంటోంది. 

మృకండుముని మనస్వినిల మాఘస్నాన పుణ్యఫలమే వారి కుమారుడైన మార్కండేయుని అపమృత్యువును తొలగించిందని పురాణ కథనం. కల్యాణ కారకమైన ఈ మాసంలో చేసే స్నానం పరమ పవిత్రంగా భావిస్తారు. పాపరాహిత్యం కోసం నదీస్నానాలు చేయడం మాఘమాస సంప్రదాయం.


*మాఘస్నాయీ వరారోహు దుర్గతిం వైవ పశ్యతి |*

*తన్నాస్తి పాతకం యత్తు మాఘస్నానం న శోధయేత్‌ |*

*మారిన  అగ్ని ప్రవేశాదధికం మాఘస్నానం న శోధయేత్‌ |*

*జీవితా భుజ్యతే దుఃఖం మృతేన బహుళం సుఖమ్‌ |*

*ఏతస్మాత్కారణేద్భద్రే మాఘస్నానం విశిష్యతే*


మాఘ స్నానానికి ఒక ప్రత్యేకత ఉంది. చాలామంది మాఘమాసం కోసం ఎదురుచూస్తుంటారు.  దీనికి కారణం ఈ మాఘస్నానాల వెనుక ఉన్న ప్రత్యేకత, ప్రయోజనాలే. మాఘమాసం స్నానానికి ప్రసిద్ది. మాఘస్నానం ఇహపరదాయకం. 

సూర్యుడు ఉదయించే సమయంలో స్నానం చేస్తే మహాపాతకాలు నశిస్తాయని  కమలాకర భట్టు 

రచించిన నిర్ణయ సింధులో చెప్పారు.

22, జనవరి 2023, ఆదివారం

మాఘ పురాణం*_ _*1 వ అధ్యాయము*

 🌴🌹🌷🌞🛕🌞🌷🌹🌴

*ఆదివారం 22 జనవరి, 2023*


      _*మాఘ పురాణం*_

    _*1 వ అధ్యాయము*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*మాఘ మాస మహిమ*


☘☘☘☘☘☘☘☘


*శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |*

*ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||*

*వ్యాసం వశిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం |*

*పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ ||*

*వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే |*

*నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః ||*

         ప్రపంచదేశములన్నిటిలోను భారతదేశము కర్మ ధర్మ ధ్యాన పరాయణమై సర్వోత్తమమైన విశిష్ట స్థానాన్ని కలిగివుంది. అట్టి భారతదేశంలో హిమాలయాది పర్వతములు , గంగాది నదులూ నైమిశం మొదలైన అరణ్యములూ మరింత పవిత్రమైనవిగా చేసిన పూజ మొదలైనవానికి అనేక రెట్లు ఫలితాన్నిచ్చేవిగా ప్రసిద్ధి చెందినాయి. వైశాఖం , ఆషాడం , కార్తీకం , మాఘం మొదలైన పవిత్రములైన పుణ్యదాయకములైన కాలములో చేసే స్నానం , జపం , తపం మొదలైన వాని వలన వచ్చే పుణ్యం బహు గణ్యమైనది అంటే యింత అని లెక్కకురానిది.


పూర్వం మహర్షులు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లి *'స్వామీ ! స్నానానికీ , ధ్యానాధికమైన తపస్సుకీ ప్రశాంతమూ , పావనమూ , సిద్దిప్రదమూ అయిన ప్రదేశాన్ని మాకీ భూమండలంలో నిర్దేశింపుడని ప్రార్థించినారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వారితో మహర్షులారా ! నేను నా చక్రాన్ని విసురుతాను అది యెక్కడ పడుతుందో ఆ ప్రదేశం తృణకాష్ఠజల సమృద్ధమైన తపో యోగ్యమైన ప్రదేశంగా గుర్తించండీ , అని చెప్పి తన చక్రాన్ని విసిరినాడట , ఆ మహావిష్ణువు యొక్క చక్రనేమి పడిన ప్రదేశాన్ని నైమిశారణ్యమని వ్యవహరిస్తూ శౌనకాది మహర్షులు అక్కడ స్థిర నివాసమేర్పరచుకొన్నారు. వారక్కడ నివసిస్తూ యజ్ఞయాగాదులు చేస్తూవుంటే భూమండలంలో వివిధ ప్రాంతంలోని ఆయా ఆశ్రమాలలోని మహర్షులూ చూడడానికి వస్తూవుండేవారు. అలాగే రోమహర్షుణుడో , ఆయన కుమారుడు సూతమహర్షియో అందరిలా ఆ యాగాన్ని చూడడానికి విచ్చేసారు. యాగం చేసే మునులు వాళ్ళని ప్రార్థించి విరామకాలంలో పుణ్యకరములైన కథలని , విశేషాలని చెప్పించుకునేవారు అంటే నైమిశారణ్యంలోని ఆ ఆశ్రమంలో జపహోమాదులూ లేనప్పుడు పుణ్యకథాప్రవచనాలు అందరికీ ఆనందాన్ని మనస్థైర్యాన్ని భగవద్భక్తిని పెంపొందించేవి.


ఇలా ఒకప్పుడు శౌనకాది మహర్షులు చిరకాలం జరిగే యాగము నొకదానిని ప్రారంభించారు. ఆ యాగం కొన్ని సంవత్సరాలు జరుగుతుంది. అటువంటి యాగాన్ని చూడాలని చాలా మంది మునులు దేశం నలుమూలలనుండి ఆసక్తితో వచ్చారు. అలా వచ్చిన వారిలో *సూతమహర్షి* వున్నారు. శౌనకాది మునులు ఆయనకెదురు వెళ్ళి సగౌరవంగా తీసికొని వచ్చారు. తగిన ఆసనంపై కూర్చుండబెట్టి అతిధి సత్కారాలు చేశారు. ఆయనతో ఇలా అన్నారు. సూతమహర్షి ! మీ తండ్రిగారు రోమహర్షణులవారు పురాణప్రవచనంలో ధర్మవిషయాలను వివరించడంలో సాటిలేని వారు. శరీరము పులకించి ఆనంద పారవశ్యంచే రోమములు కూడా పులకరించేటట్లు చేయగల సమర్థులు , రోమములకును హర్షము కలిగించువారు కనుగ రోమహర్షణులని సార్థక నామధేయులైనారు. వారి కుమారులైన మీరు కూడ ఆయన అంతటివారై ఆయనకు తగిన పుత్రులని అనిపించుకున్నవారు. మా అదృష్టవశం వలన మీరీ యాగ సందర్శనకు వచ్చినారు. విరామ సమయంలో మాకు పుణ్యకరములైన విషయాలని వినడం మరింత ఫలప్రదం అవుతుంది కదా దయవుంచి మాకు పుణ్య కథలని వినిపించండి అని ప్రార్థించారు.


సూతమహర్షి వారి ఆతిధ్యాలను స్వీకరించి సుఖాసనంపై కూర్చుని వారి మాటలను విన్నాడు. వారందరికీ నమస్కరించి చిరునవ్వుతో మీకు నా మీద వున్న అభిమానానికి కృతజ్ఞణ్ణి , పుణ్యకార్యాలు జరిగే చోట పుణ్యప్రదమైన విషయాన్ని చెప్పడం కూడా ఒక అదృష్టమే. అది కూడ యజ్ఞంలా పవిత్రమైన కార్యమే. ఈ రూపంగా నన్నూ ఈ పుణ్యకార్యంలో యిలా అన్వయించేటట్లు చేసే మీకు నేను కృతజ్ఞణ్ణి. మా తండ్రి గారి వలన విన్నదాన్ని అనుసరించి , వ్యాసమహర్షుల వారి దయా విశేషం చేత , నాకు తెలిసిన విషయాన్ని , మీ అనుగ్రహం చేత స్పురింపజేసుకొని యధాశక్తి వినిపించి మీ ఆనందాశీస్సులనీ , భగవత్కృపను పొంద ప్రయత్నిస్తున్నాను , మీ ఆజ్ఞయేమిటి అని సవినయంగా అడిగెను. అప్పుడు మునులు *'సూతమహర్షి లోగడ వైశాఖమాసం , కార్తీకమాసం వైశిష్ట్వాన్ని ఆయా మాసాల్లో చేయవలసిన, వ్రతానుష్టాలని వివరించి మాకానందం కలిగించారు. ప్రస్తుతం మాఘమాస మహిమను వివరింపుడని'* కోరారు.

అప్పుడు సూతమహర్షి క్షణకాలం కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉండి తండ్రిగారిని గురువులను తలచుకొని నమస్కరించి కనులు తెరచి మునులకు మరల నమస్కరించి యిలా ప్రారంభించాడు. మహర్షిసత్తములారా ! మీరు అడిగిన ప్రశ్న సారవంతమైనది విశేషించి సామాన్య ప్రజానీకానికి మరింతగా ఉపయోగించేది. చదువుకొన్నవారు కొద్దిమంది అయినా , యజ్ఞయాగాలు జపతపాలు చేసి పాపం పోగొట్టుకొని పుణ్యం సంపాదించుకుంటారు. పై విధంగా చేసే సావకాశం లేనివారు తరించడానికి ఈ విషయం బాగా ఉపకరిస్తుంది. పూర్వం ఒకప్పుడు జగన్మాత అయిన పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి యిదే విషయాన్ని అడిగింది. గృత్నమదమహర్షి మొదలైనవారు చెప్పిన విషయాలని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన విషయాలతో బాటు చెప్పెదను వినండి.


పార్వతీదేవి పరమేశ్వరునితో *"విశ్వాత్మకా ! సర్వలోకేశ్వరా ! సర్వభూతదయానిధీ ! ప్రాణేశ్వరా ! మీ మాటలు అమృతముకంటే మధురాతి మధురములై నా చెవులకు మరింత యింపుగానున్నవి. మాఘ మాస మహిమను వివరింప గోరుచున్నానని"* ప్రశ్నించెను. అప్పుడు పరమేశ్వరుడు *"కళ్యాణీ ! జగన్మంగళా ! నీవు అడిగిన విషయము మిక్కిలి నిగూఢమైనది. గంభీరమైనది నాకిష్టురాలవైన నీకు చెప్పరానిదేమియందును ? తప్పక చెప్పెదను , వినుము. సూర్యుడు మకర రాశిలో నుండగా మాఘమాసమున ప్రాతఃకాలస్నానము చేసినవారు పాపవిముక్తులై ముక్తినొందుదురు. గోవుపాదం మాత్రం మునిగియే జలప్రవాహంలోనైనా చేసిన స్నానం అధిక పుణ్యప్రదం. మొదటి స్నానం వాని సర్వపాపములను పోగోట్టును.

రెండవస్నానము వానికి వైకుంఠలోక ప్రాప్తిని కలిగిస్తుంది. మూడవస్నానం అతనికి శ్రీమహావిష్ణువే ఋణగ్రస్తుడయేటట్లు చేస్తుంది. ఇట్టి పుణ్యాత్మునికి నేనేమి యివ్వాలని శ్రీమహవిష్ణువే ఆలోచనలోపడును. *ప్రయాగలో మాఘమాసంలో గంగాస్నానం చేసిన వానికి పునర్జన్మ వుండదు*. మాఘ మాసంలో ఉదయాన్నే నది ప్రవాహంలోగాని సరస్సులో గాని స్నానం చేసినవారికి ముక్తి కలుగుతుంది. ఊరికి వెలుపలనున్న సరస్సు , నూయి , కాలువ మొదలైనవానిలో చేసిన స్నానం పాపనాశకం మోక్షదాయకం సుమా , తెలిసికాని , తెలియకకాని , బలవంతంగాకాని మాఘ మాసమున ఒకమారు స్నానమైనను సూర్యోదయమునకు ముందుగా చేసినచో వాని పాపములన్నియును పోవును. భక్తి భావముతో నెలాంతయు చేసినచో విష్ణులోకము చేరును. స్నానము చేసి పురాణము విన్నచో అతడు ఋషియై జన్మించును.


మాఘస్నానమును మాని , విష్ణువునర్చింపక , దానము చేయక పురాణమును వినక మాఘమాసమును గడిపిన వానికి మనోవాక్కాయ సంబంధములైన పాపములెట్లుపోవును ? అతడు భయంకరమైన కుంభీపాక నరకమున బాధలు పడును. మదగర్వముచే మాఘస్నానము మానిన అధముడు , నీచజన్మలను పలుమార్లుపొందును. చలికి భయపడి స్నానము చేయనివారిని చూడరాదు. అట్టివారిని జూచిన పాపము పోవలెనన్నచో సూర్యుని చూచి నమస్కరించవలెను. ప్రాతః కాల మాఘస్నానము చేయని వారు పెక్కుమార్లు నీచజన్మలనొందుదురు సుమా , దరిద్రులైనను , బాలురైనను ప్రాతఃకాల స్నానముచేసిన శ్రీ మహావిష్ణువు దయనుపొందెదరు. చిన్నపిల్లలు , అశక్తులైన వృద్ధులు హరినామస్మరణ చేయుచు ముమ్మారు జలబిందువులను శరీరముపై చిలుకరించుకొన్నను పుణ్యమే. నీచుడైనను మాఘస్నానము చేసిన పాపములను వీడి పుణ్యాత్ముడగును.


ఎట్టి పాపకర్మలు ఆచరించిన వాడైనను , మాఘమాస ప్రాతఃకాలమున మాయందు స్నానమాడినచో వాని పాపములను మేము నశింపజేయుదుమని జలములు ఘోషించుచున్నవి. మాఘస్నానము చేసినవానికి సంసార భయము లేదు. ఆడంబరము కొరకుగాని , భయముచే గాని , బలవంతముగా గాని , మాఘస్నానము చేసినవాడు పాపవిముక్తుడై పుణ్యాత్ముడగును. అశక్తుడు తాను మాఘస్నానము చేయలేకపోయినచో స్నానము చేసినవానికి దక్షిణనిచ్చి వానినుండి స్నానఫలమును పొందవచ్చును. ఈ మాసమున నిరుపేదలకు వస్త్రదానముగాని కంబళదానముగాని చేసిన స్నానఫలమునొంది పుణ్యవంతులగుదురు. బలవంతముగా స్నానము చేసిన వారికిని , చేయించిన వారికిని పుణ్యముకల్గును. ఈ స్నానమును అన్ని వర్ణములవారును చేయవలెను. మాఘస్నానము చేయువారిని నిందించినను, పరిహసించినను , నివారించినను మహాపాపములు కలుగును.


పార్వతీ ! మాఘస్నానము సద్యోముక్తిప్రదము దానికి సాటిలేదు. శక్తిలేనివారు కాలు చేతులను కడుగుకొని , ఆచమనముచేసి పురాణమును విన్నను వారికి స్నానఫలము కలుగును. అన్ని మాసములలో మాఘమాసము ఉత్తమము. శ్రీవారిదేవతలందరిలో ఉత్తముడు. అన్నిమాసములలో మాఘమాసము ఉత్తమము. వృక్షములలో అశ్వత్తవృక్షము ఉత్తమము. తేజోస్వంతులందరిలో సూర్యుడు ఉత్తముడు. శాస్త్రములన్నిటిలో వేదములు ఉత్తమములు. కావున మాఘమాస స్నానము చేయువారిని , నిందించినను , నివారించినను మహాపాపములు కలుగును. నాలుగువర్ణముల వారిలో బ్రాహ్మణుత్తముడు. పర్వతములలో మేరుపర్వతముత్తమము. కావున మాఘమాస స్నానమునంత పుణ్యప్రదము సుమా.


దిలీపుడను మహారాజు పెక్కుయాగములను చేసిన పుణ్యాత్ముడు. ఉత్తముడైన ప్రజాపాలకుడు. ఈతడోకనాడు వేటకుపోయెను. అనేక మృగములను వేటాడి అలసిపోయెను. మనోహరమైన సరస్సునొకదానిని చూచి అచట కొంతకాలము విశ్రమించి తన నగరమునకు ప్రయాణమయ్యెను. అప్పుడు వృద్ధ బ్రాహ్మణుడొకడా మహారాజునకు కనిపించెను. రాజు వానికి నమస్కరించి ఆశీస్సులనందెను. ఆ బ్రాహ్మణుడు *'మహారాజా ! పరమపవిత్రమైన మాఘమాసమున నీ సరస్సున స్నానము చేయకుండపోవుచున్నావేమి. మాఘమాసమున చేయు నదీస్నానముకాని , సరస్స్నానము కాని మిక్కిలి పుణ్యమునిచ్చునని యెరుగవా ? యని ప్రశ్నించెను. రాజు మాఘస్నానమహిమను చెప్పుడని కోరగానతడు. రాజా నీ విప్పుడీ సరస్సున తప్పక స్నానము చేసిపొమ్ము మాఘమాస స్నాన మహిమను మీ గురువగు వశిష్ఠమహర్షివలన తెలిసికొనుమని చెప్పి తన దారిన పోయెను.*


దిలీపమహారాజు మాఘమాసస్నాన మహిమ తెలిసికొనవలయునని తమ కులగురువైన వశిష్టమహర్షి యాశ్రమమునకు వెళ్లెను. గురువును దర్శించి నమస్కరించి మాఘమాసస్నాన మహిమను తెలుపగోరెను. వశిష్టమహర్షి దిలీపుని యాశీర్వదించి యిట్లనెను. నాయనా దిలీపా ! నీకోరిక విశిష్టమైనది. మాఘమాసము చాలా విశిష్టత కలిగినది. మాఘమాసము శివకేశవ ప్రీతికరమైనది. ఆ నెలలో చేసిన పుణ్యకార్యములు యితర దినములలో చేసిన పుణ్యకార్యములకంటే ఎక్కువ పుణ్యము నిచ్చును. మాఘమాసమున ప్రాతఃకాలమున చేసిన స్నానమే సర్వపాపములను పోగోట్టి అక్షయములైన పుణ్యఫలములనిచ్చును. స్నానమే యింత అధికమైన పుణ్యము నిచ్చునో పూజ పురాణ శ్రవణాదులవలన నెంతటి ఫలముండునో యూహించుకొనుము. మాఘస్నానము వలన సర్వ దుఃఖములను పోగొట్టుకొని శుభలాభములను పొందిన కొందరి వృత్తాంతములను వివరింతును. దానిని బట్టి మాఘమాస వైశిష్ట్యమును తెలిసికొన యత్నింపుము. 


పూర్వమొకప్పుడు భయంకరమైన క్షామము (వానలు లేకపోవుట పంటలు పండకపోవుట మొదలైన లక్షణముగల కరువు) వింధ్య - హిమాలయ పర్వతముల మధ్యనున్న భూమిలో కలిగెను. దీనివలన సామాన్యజనులు , ప్రభువులు , మునులు , మహర్షులు , పశువులు , పక్షులు , సర్వప్రాణులు మిక్కిలి బాధపడినవి , అట్టివారిలో భృగుమహర్షి యొకడు అతడును ఆ ప్రాంతమును విడుచుటకు యిష్టములేకున్నను కైలాస పర్వత ప్రాంతముకడకు చేరి తనకునచ్చిన ప్రదేశమునందు ఆశ్రమమును నిర్మించుకొని తపమాచరించు కొనుచుండెను. పవిత్రము మనోహరము అయిన ఆ దివ్యప్రదేశమునకు గంధర్వులు యక్షులు , కిన్నరులు మున్నగు దేవజాతులవారును వచ్చుచుండిరి అచట విహరించి ఉత్సాహమును పొందుచుండిరి.


ఒకనాడు గంధర్వుడోకడు భార్యాసమేతుడై ఆ ప్రదేశమునకు వచ్చెను. అతడు భృగుమహర్షికి నమస్కరించెను. అతని శరీరము మిక్కిలి సుందరమైన గంభీరమై మనోహరమై విచిత్రమై యుండెను. వాని మొగము మాత్రము పులిమొగమై యుండును. ఇందువలన అతడుయెంత చక్కగానున్నను పులిమొగము వలన విచిత్రముగా భయంకరమై యుండును. అతడు భృగుమహర్షికి నమస్కరించిన తరువాత మునీశ్వరా ! నాకు భోగభాగ్యములన్నియునున్నవి. ఈ నా భార్యను చూసితిరికదా ! ఈమె సౌందర్యము గుణసంపద నిరుపమానములు , నేను గంధర్వుడను మానవులకంటే దివ్యశక్తులు కొన్నియున్నవి. కాని భయంకర వికారమైన ఈ పులిమొగము నాకు బాధాకరముగనున్నది. దీనిని పోగట్టు కొనుటయెట్లో తెలియరాకున్నది. ఈ వికారమువలన నాకు గల సుఖములు భోగములు నన్ను సంతోషపరచుటలేదు. దయయుంచి నాకీ వికారరూపము పోవునుపాయమును చెప్పుడని ప్రార్థించెను.


భృగుమహర్షికి గంధర్వుని పరిస్థితికి జాలికలిగినది వానికి సాయపడవలయునను కొన్నాడు. నాయనా పురాకృతకర్మము యెవనిని విడువడు. గతజన్మలో చేసిన పాపము వలన నీకీస్థితి కలిగినది. పాపము , దురదృష్టము , పేదరికమూ ఇవి మూడును జీవినిబాధించును. ఇట్టి వానిని పోగట్టుకొని శుభలాభము పొందవలెనన్న పుణ్యనదుల యందు స్నానము , పవిత్రక్షేత్రములందు దేవపూజ చేసుకొనవలయును. ఇట్టి వానిని పవిత్రమైన కాలమున చేసినచో సద్యఫలము కలుగును. కాలమంతయు మంచిదే అయినను మాఘమాసము విశిష్టమైనది. ఈ నెలలో చేసిన స్నానము , పూజ , జపము , తపము జీవికి గల పాపమునుపోగట్టి శుభమును వెంటనే కలిగించును. అన్ని పుణ్యనదులలో స్నానాదికముచేసినచో వచ్చుఫలితము , మాఘమాసములో నదిలోగాని , సముద్రములోగాని , కాలువలోగాని , సెలయేరులోగాని యే స్వల్పజల ప్రవాహమైనను అందు స్నానము చేసినచో వచ్చును. అనగా మాఘస్నానమును యేప్రవాహమున చేసినను సర్వతీర్థములయందు చేసిన పుణ్యము నిచ్చునంత గొప్పది. ఏ జాతివారికైనను అనంత పుణ్యమునిచ్చును. నీ అదృష్టవశమున యిది మాఘమాస ప్రారంభముకావున నీ భార్యతో బాటు ప్రతిదినము ప్రాతఃకాలమున మాఘస్నానమును యిష్టదేవతా పూజను అచటనున్న నదిలో చేయుము అని భృగుమహర్షి ఆ గంధర్వునకు చెప్పెను. ఆ గంధర్వుడు ముని చెప్పినట్లుగా అచటి నదిలో మాఘస్నానమును , తీరమున యిష్టదేవతాపూజను విడువక మాఘమాసమంతయు చేసెను. ఆ పుణ్యవశమున వాని పులిమొగము పోయి వానికి సుందరమైన ముఖము వచ్చెను. గంధర్వుడును ఆశ్చర్యపడి మాఘమాసమహిమను కీర్తించును. కృతజ్ఞడై , మునికి భార్యతోబాటు నమస్కరించెను. అతని యాశీర్వాదమునొంది తన భార్యలో బాటు తనలోకమున కేగెను. దిలీప మహారాజా మాఘస్నాన మహిమను గమనించితివా ? మరియొక కథను చెప్పుదును వినుమని వశిష్ఠుడు మరలనిట్లు పలికెను.

*ఒకటవ అధ్యాయం సమాప్తం* 

🌴🌹🌷🌞🛕🌞🌷🌹🌴

మాఘ మాసం

 🌴 *మాఘ మాసం*🌴

     🍃_*విశిష్టత*_🍃


🔯మాఘ మాసం" ఎంతో విశిష్టమైనది. ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన తిథి *_శుక్ల పక్ష చవితి_* దీనిని *_తిల చతుర్థి_* అం టారు. దీన్నే *_కుంద చతుర్థి_* అని కూడా అంటారు. నువ్వులను తింటారు. నువ్వులతో లడ్లు చేసి పంచి పెడతారు. ఈ రోజున "డుంఢిరాజును" ఉద్దేశించి, నక్త వ్రతము పూజ చేస్తారు! డుంఢిని ఈ విధంగా పూజించడం వలన దేవతల చేత సైతం పూజలందుకుంటారని కాశీ ఖండములో తెలియజేశారు."కుంద చతుర్థి" నాడు కుంద పుష్పాలతో పరమేశ్వరుని అర్పించి రాత్రి జాగారణ చేసినవారు, సకలైశ్వర్యాలను పొందుతారని కాలదర్శనంలో చెప్పబడింది. అయితే సాయంకాలం చతుర్థి ఉంటే ఉత్తమం అని ఈ సందర్భంలో తెలుసుకోవాలి. మాఘమాసంలో ప్రాత:కాలంలో చేసే స్నాన,జప,తపములు చాలా ఉత్తమమైనవి. ఈ మాసంలో స్నానం చేసేటప్పుడు 

*_దు:ఖ దారిద్ర్య నాశాయ, శ్రీ విష్ణోతోషణాయచ! ప్రాత:స్నానం కరోమ్య, మాఘ పాప వినాశనం!_*

అని చేసిన తరువాత 


*_సవిత్రేప్రసవిత్రేచ! పరంధామజలేమమ! త్వత్తేజసా పరిబ్రష్టం,పాపం యాతు సస్రదా!_* 


అని చదవాలి. 


*_సూర్య భగవానునికి ఆర్గ్యమివ్వాలి._*


ఈ మాసాన్ని *_కుంభమాసం_*  అని కూడా అంటారు.కొంతమంది *_ఈ నెల్లాళ్ళు ముల్లంగి దుంపను తినరు_*


.ఈ మాసంలో నవ్వులను, పంచదారను కలిపి కలిపి తినాలట. నువ్వులను దానమివ్వాలట. రాగి పాత్రలో గోధుమ రంగుగా ఉన్న నువ్వులను పాత్రతో సహా దానమిస్తే మంచిది.ఈ నెలలో మరణించిన వారికి అమృతత్వం సిద్దిస్తుందట. 


*_మాఘశుద్ద పంచమి"ని శ్రీ పంచమి_* అంటారు.

ఈ పంచమి నాడే *_సరస్వతీదేవి_* జన్మించిందట. 


ఈనాడు "రతీ మన్మధులను మల్లెపూలతో పూజిస్తారు.ఉత్తర భారతంలో విష్ణుమూర్తిని, సరస్వతీదేవిని కూడా పూజిస్తారు. బ్రహ్మదేవుడు సృష్టి చేయగా చరాచర ప్రపంచం శ్మశాన నిశ్శబ్ధతతో ఉందట. అవేదనతో తన కమండలంలోని నీటిని ప్రపంచంపై చిలకరించగా చెట్లపై ఆ నీటి బిందువులు పడి ఒక శక్తి ఉద్భవించిందట. రెండు చేతులతో వీణను వాయిస్తూ మరో రెండు చేతులతో పుస్తకాన్ని మాలను ధరించి సమగ్ర రూపిణిగా దర్శనమిచ్చిందట. ఆ వగీశ్వరి వీణావాదనం ద్వారా ప్రపంచంలోని స్తబ్థతను ఉదాసీనతను తొలగించి విద్యాబుద్దులకు అదిష్టాత్రి అయింది ఆ దేవి.


అప్పటి నుండి శ్రీ పంచమి రోజున సరస్వతిని పూజించడం జరుగుతుంది. ఇక 


*_మాఘశుద్ద సప్తమి ఇదే "సూర్య సప్తమి"_* అని కూడా పిలువబడుతుంది.ఇదే రథసప్తమి. సూర్య గ్రహణదినం వలె ఇది పరమపవిత్రమైనది.ఈ రోజున *_అరుణోదయకాలంలో ఏడు జిల్లేడు ఆకులను అందులో రేగికాయలను ఉంచుకొని తలపై పెట్టుకొని స్నానం చేస్తే ఏడు విధాలైన శాపాలు నశిస్తాయట_*. స్నానికి ముందు చెరకుగడతో నీటిని కదిలిస్తారు. *_నమస్కారం ప్రియ:సూర్య:_* అన్న ఆర్య వాక్య ప్రకారం కేవలం నమస్కారం చేతనే సూర్యుడు సంతృపి చెందుతాడని తెలుస్తుంది.ఈ రోజున *_చిక్కుడుకాయలతో రథం చేసి కొత్త బియ్యంతో పాయసాన్ని వండి చిక్కుడు ఆకులలో పెట్టి సూర్యునికి నివేదన చేయడం ఆచారం_*.


సూర్యుడు తనను పూజించిన సత్రాజిత్తుకి ఈ రోజునే "శమంతకమణి" ప్రసాదించాడు. హనుమంతునికి వ్యాకరణ శాస్త్రాన్ని యజవాల్క్యునికి యజుర్వేదాన్ని బోధించాడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్న వాక్యం ప్రకారం ఆరోగ్యం కొరకు ఆదిత్య హృదయం పారాయణ చెయ్యాలి. రథసప్తమి నాటి స్నానం *_సప్త సప్త మహాసప్త ద్వీపా వసుంధరా! కోటి జన్మార్జితంపాపిం వినశ్యతితత్‌క్షణాత్_* అన్నట్లుగా పాప విముక్తి కలిగిస్తుందట. భీష్మాష్టమి "మాఘమానస్యచాష్టమ్యాం శుక్ల పక్షేచ పార్థివ!ప్రాజాపత్యేచ నక్షత్రే మధ్య:ప్రాప్తే దివాకరే!" శోభకృత నామ సంవత్సరంలో *_మాఘమాసంలో శుక్లపక్షంలో రోహిణి నక్షత్రం ఉన్న అష్టమి తిథినాడు మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తిన ప్రకాశిస్తూ ఉండగా అభిజిత్ లగ్నంలో భీష్మ పితామహుడు ధ్యాన స్థితుడై ప్రాణాలను విడిచిపెట్టాడట._* స్వచ్చంద మరణం ఆయనకి వరం. ఆయనకు తర్పణాలు విడిచి పెట్టడం నెలగంటు పెట్టినప్పటినుంచీ పెట్టిన గొబ్బెమ్మలను ఎండబెట్టి దాచి ఆ పిడకలతో పాయసాన్ని వండి నివేదన చేయడం ముఖ్యం. అష్టమినాడే దైవ సాయుజ్యం పొందినా శ్రీ కృష్ణుని సమక్షంలోనే విష్ణుసహస్రనామాలతో ఆయనను కీర్తిస్తూ మోక్షం పొందాడు. కాబట్టి ఏకాదశిని ఆయన పేరుతో ఏర్పాటు చేశారు. *_భీష్మ ఏకాదశి_* నాడు విశేష పూజలు చేయడం ఆనవాయితీ. ఇక మాఘమాసంలో వచ్చే *_ప్రతి ఆదివారాలు మహిమాన్వితాలే._* ఈ విధంగా *_మాఘమాసమంతా "శివరాత్రి"వరకూ అన్నీ పర్వదినాలే._*


🌴🌹🌷🌞🛕🌞🌷🌹🌴

 🍁 మాఘ స్నానం శ్లోకం 🍁


*దుఃఖ దరిద్ర నాశాయ*

*శ్రీ విష్ణో తోషణాయచ*

*ప్రాతః స్నానం కరోమ్యత్య*

*మాఘే పాప వినాశనం*


🌞 *సూర్యోదయం కంటే* *ముందే పై👆శ్లోకం పఠిస్తూ* 

*స్నానం చేయడం అత్యంత* 

*పుణ్యప్రదం, 🙏మహాదేవ*

🌴🌹🙏🌞🛕🌞🙏🌹🌴

సంక్రాంతి పండుగ

 2008వ సంవత్సరం నుండి సంక్రాంతి పండుగ జనవరి 15న రావడం ప్రారంభమయింది.


అంతకుముందు 1935 నుండి 2007 వరకు జనవరి 14ననే పండుగ. ఇదో 72 ఏళ్ల సమయం. ప్రతీ 72 సంవత్సరాలకు ఒకసారి పండుగ ఒకరోజు తర్వాతకు మారుతుంది.

 

1935 నుండి 2007 వరకు జనవరి 14న,

2008 నుండి 2080 వరకు జనవరి 15న,

2081 నుండి 2153 వరకు జనవరి 16న సంక్రాంతి పండుగ వస్తుంది.


ఎందుకిలా అంటే, సాధారణంగా, సూర్యుడు ధనూరాశి నుండి మకరరాశిలోకి ప్రవేశించిననాడే మకర సంక్రాంతి జరుపుకోవడం ఆనవాయితీ. ఈ రోజు నుండి మిధునరాశి లోకి ప్రవేశించేదాకా ‘ఉత్తరాయణ పుణ్యకాలం’గా వ్యవహరిస్తారు.


ఇక, సూర్యుడు ప్రతీ సంవత్సరం మకర సంక్రమణం చేసినప్పుడు 20 నిమిషాలు ఆలస్యం అవుతోంది. స్థూలగణన ఆధారంగా ఇది మూడు సంవత్సరాలకు ఒక గంట, 72 ఏళ్లకు ఒక రోజుగా మారుతోంది.


ఈ లెక్కన, ఇంగ్లీష్‌ క్యాలెండర్‌ ప్రకారం, 72 ఏళ్లకొకసారి సంక్రాంతి తర్వాతి రోజుకు మారుతుంది. జనవరి 16న సంక్రాంతి రావడం ఎలాగూ మనం చూసే అవకాశం లేదు.


👆 పొద్దున్నే ఓ జ్ఞానగుళిక..😆😆

దేవుడే ప్రభువు

 దాస భూతమిదం తస్య జగస్థావర జంగమం

శ్రీమన్నారాయణ స్వామీ జగతాం ప్రభురీశ్వరః (పద్మ పురాణం)


"సమస్త సృష్టికి ఆ దేవుడే ప్రభువు; చర-అచర ప్రాణులు, వస్తువులన్నీ అతని సేవకులే". ప్రాపంచిక భౌతిక విషయాసక్తి - "నా దగ్గర ఉన్న వాటన్నిటికీ నేనే యజమానిని. ఇదంతా నా సుఖం కోసమే. నా ఆస్తులు పెంచుకొని ఇంకా భోగించేందుకు నాకు హక్కు ఉంది" - అనే ఆలోచనా దృక్పథం కలిగి ఉంటుంది. దీనికి విరుద్ధమే ఆధ్యాత్మిక చైతన్యం. అది ఈ విధమైన ఆలోచనా దృక్పథం కలిగి ఉంటుంది, "భగవంతుడే సమస్త జగత్తుకి స్వామి, యజమాని, భోక్త. నేను కేవలం అతని నిస్వార్ధ సేవకుడిని/సేవకురాలిని. నాకున్న దాన్ని అంతా ఆ భగవంతుని సేవలోనే వినియోగించాలి. " అని. ఆప్రకారముగా, తనే తన కర్మల ఫలములను అనుభవించేది అని అనుకోరాదు. 

ఇదే విషయాన్ని శ్రీ కృష్ణుడు భగవద్గీతలో (2-47)

కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన|

మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి||

(శాస్త్ర విహిత కర్తవ్య కర్మను ఆచరించుట యందే నీకు అధికారము కలదు. కానీ ఆ‌ కర్మ‌ ఫలములపై నీకు ఎటువంటి హక్కు లేదు. నీవే ఆ కర్మ ఫలములకు హేతువు అని ఎప్పుడు అనుకోకు. అలా అనుకుని చేయవలసిన కర్మలు మానుటయందు ఆసక్తి చూపరాదు) అని అర్జునునికి జ్ఞాన బోధ చేశారు.

విశ్వమంతా ఎవరి కడుపులో ఉందో

 శ్లోకం:☝️

*నిర్మలస్య కుతః స్నానం*

 *వస్త్రం విశ్వోదరస్య చ ।*

*అగోత్రస్య త్వవర్ణస్య*

 *కుతస్తస్యోపవీతకమ్ ।।*


భావం: సదా పవిత్రంగా ఉండేవాడికి స్నానం వల్ల ప్రయోజనం ఏమిటి? విశ్వమంతా ఎవరి కడుపులో ఉందో వాడికి బట్టలెలా కట్టాలి? గోత్రం, వర్ణం లేనివాడు యజ్ఞోపవీతం ఎలా ధరిస్తాడు. అని పరమాత్మను వర్ణిస్తోంది ఈ శ్లోకం.

21, జనవరి 2023, శనివారం

తిరుపతి వేంకట' కవుల ఒక పద్యం

 Vruddhula Kalyana Rama Rao గారు


ఓ వాం రోజుల కిందట 'తిరుపతి వేంకట' కవుల ఒక పద్యం పెట్టారు.. దాన్నిక్కడ ఏపాదానికాపాదంగా పెడుతున్నాను


1) ఏనుగునెక్కినాము ధరణీంద్రులు మ్రొక్కగ నిక్కినాము స

2) న్మానము లందినాము బహుమానములన్ గ్రహించినార మె

3) వ్వానిని లెక్కపెట్టక నివారణ దిగ్విజయం బొనర్చి ప్ర

4) జ్ఞా నిధులంచు పేరుగొని నారము నీవలనన్ సరస్వతి..!


ఈ పద్యాన్ని వారు అప్పటి

పాలమూరు జిల్లాలోని

'ఆత్మకూరు' సంస్థానంలో చెప్పారని...దీనికి సంబంధించిన

పూర్వాపరాలు రాస్తానని వారి గోడమీద కామెంట్ పెట్టాను..

వెంటనే రాయలేకపోయినా..

నా మాటకు నేను కట్టుబడి 

నాకు తెలిసిన మేరకు ఇక్కడ ఆ వివరాలు రాస్తున్నాను..


ప్రసిద్ధమైన ఆ పద్యానికి

ఓ వివాద చరిత్ర ఉంది.

ఆ పద్యం నేపథ్యం ఏమంటే..

తిరుపతి వేంకటకవులు సంస్థానాలను సందర్శిస్తూ, ఒకసారి పాలమూరు జిల్లాలోని ఆత్మకూరు సంస్థానానికి వచ్చి

కవి పండితుల సమక్షంలో

అవధానం చేశారు.. ఆ సందర్భంలో సమస్య పూరణంలో ఓ పదాన్ని ప్రయోగించారు.

(ఆ పదప్రయోగం గురించి మా మాన్న చెప్పారుగానీ, ఇప్పుడు గుర్తుకు రావడం లేదు)

ఆ పద ప్రయోగాన్ని ఆ సంస్థాన

ఆస్థాన కవి పండితులైన

'బుక్కపట్నం తిరుమల శ్రీనివాసాచార్యులు' గారు తప్పుపట్టారు.. అట్లా ఇట్లాకాదు

'ఆ ప్రయోగం సంస్కృత భాషా వ్యాకరణ విరుద్ధ' మని ఆక్షేపించారు..

అవధానంలో ఎవరైనా కాదంటే

మరోపదం వేసి సర్దుబాటు చేసుకోగలిగే వెసలు బాటుంది..

కానీ చెళ్లపిల్ల వారి స్వాభావిక

మనస్తత్వం వేరే..పక్కనే ఉన్న

దివాకర్ల వారు మరోపదమేయ్

ఎందుకీ గొడవా..? అంటున్నా

వినిపించుకోకుండా..

'అవధానాన్ని నిలిపేస్తున్నాం..

రేపు సమాధానంతో వస్తాం' అని ప్రకటించారు.. 


బసకు చేరాక..

చెళ్లపిళ్ల వారి వ్యథేమంటే..

వ్యాకరణం ప్రకారం అసాధువైన పదం నా నోట్లోంచి ఎట్లా పడింది..? అనేదే ఆయన ఆవేదన..ఆ ఇద్దరు గుర్తు చేసుకుంటే...ఆ పదానికి

తిక్కన ప్రయోగం గుర్తుకొచ్చింది


ఆ మరునాడు

ఆ సభలో నిలిచి.. మా ప్రయోగం

తప్పుకాదు..దీనికి తిక్కన ప్రయోగముందని ధీమాగా చెప్పారట..అప్పుడు

ఈ 'బుక్కపట్నం తిరుమల శ్రీనివాసాచార్య' గారిలా అన్నారట..


" మీరు చెప్పే ఆ తిక్కన మీకు ప్రమాణం కావొచ్చుగాక.. నాకెందుకు ప్రమాణం..? 

ఇంతకూ వాడెవడు..?

ఈ పదాన్ని ఇట్లా ప్రయోగించిన ఓ సంస్కృత కవి ప్రయోగం మీరు చూపించగలరా..?" అన్నారట..


ఇంకేముంది..? ఓ ఆక్షేపణ

వివాదమై ముదిరి పాకాన పడింది.. జంటకవులు షాక్ తిన్నారు.. రాజుగారు 

జోక్యం చేసుకుని

తన ఆస్థానానికొచ్చిన 

ఆ కవులతో..

మీరేం చెబుతారో చెప్పమని కోరారట..వాళ్లన్నదేమంటే


" 'తిక్కన' తప్పయితే మేమూ తప్పే..ఈ వివాదాన్ని ఇతర సంస్థానాల పండితులకు పంపండి..వారందరి

అభిప్రాయం కోరుతున్నాం.." 

అన్నారట.. వారి కోరిక మేరకు

ఆ రాజుగారు ఈ వివాదాన్ని

అన్ని రాజాస్థానాలకు పంపారు..


అదేదో తేలేవరకు చాలా రోజులు

పడుతుందిగా...? ఈలోగా మనం మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం..

అప్పటిదాకా రంకలేసి తిరిగిన

ఆ కవియువ వృషభులకు 

ముగుతాళ్లు వేసిన 

ఆ 'బుక్కపట్నం తిరుమల శ్రీనివాసాచార్యులు' ఎవరు..?


అష్టభాషావిశారదుడైన 

ఆ మనిషి వెంటకవులకు అవధాన విద్య తెలియని నాడే.. మహా అవధాని..

సంస్కృత, ప్రాకృతాలలో

యావద్భారతంలోని అన్ని సంస్థానాలలో

శతావధానాలు చేసిన ఘనుడు

'అష్టభాషా విశారదు'డని శ్రీనాథుడు చెప్పుకున్నాడు..

ఆ తర్వాత 

అలా రాజాస్థానాలు తిరిగి

'అష్టభాషా విశారద' 

అనిపించుకున్న వాడు

ఈ 'బుక్కపట్నం' వారే..

మనం చెప్పుకునే జంటకవులు 

'అటు గద్వాల ఇటు చెన్న పట్టణం' సంస్థానాలు తిరిగామని చెప్పుకున్నారు కదా..?

ఈ బుక్కపట్నం వారు 

అటు గద్వాలేమిటి..? బెనారస్, బరోడా, లాహోరు సంస్థానాలపై

అవధాన దండయాత్ర చేశారు..


వారికి అనేక సంస్థానాలు

అనేక బిరుదులిచ్చాయి..

వాటిలో 'బాలసరస్వతి' బిరుదునే వారు ఇష్టపడ్డారు

ఆ బిరుదు నామాన్ని ఆనాటి

సమకాలీన పండితులు సైతం గుర్తించారు..


ఇక్కడ వారి ప్రతిభకు

ఓ రికార్డెడ్ ఫ్రూఫ్ గా

ఓ సందర్భాన్ని చెబుతాను..

ఓసారి మద్రాసులోని

'పచ్చయప్ప' కాలేజీలో 

మహామహా పండితుల సమక్షంలో ఈ బుక్కపట్నం వారు

శతావధానం పూర్తి చేశారు.

ఆ సదస్సు సందర్భంగా..

ఆ సభకు అధ్యక్షత వహించిన

మహా పండితుడు 

'సముద్ర మథనమ్' అనే ఇతివృత్తం (వర్ణన) పై 

అష్టభాషల్లో అరగంటలో

50 పద్యాలు చెప్పగలరా..?

అని అడిగారట..

అష్ట భాషా అంటే

సంస్కృతం, మాతృభాష..

షట్ ప్రాకృతాలు అని అర్థం..


ఈ బుక్కపట్నం వారు 

సంస్కృతం/తెలుగుతోపాటు

ప్రాకృత భాషలైన

'శౌరసేనీ, మాగధి, పైశాచీ, చూళికా పైశాచీ, అపభ్రంశ, చాయ' అనే ప్రాకృతాలలో..

విధించిన 30 నిముషాలకు

ముందే 24 నిముషాల్లో 

ఎనిమిది భాషల్లో 50 పద్యాలు

చెప్పారట.. అంటే నిముషానికి

రెండు పద్యాలు చెప్పినట్టు..

ఆరోజు వారు చూపిన ప్రతిభ

1903 లో 'అర్ధఘంటా పంచాశత్' పేరుతో ముద్రితమైంది..


ఓకే భాషైతే.. ఆశువుగా

గంటకు నాలుగు వందలు చెప్పిన కొప్పరపు కవులున్నారు..

8 భాషల్లో నిముషానికి రెండు చొప్పున అంత వేగంగా చెప్ప గలిగిన అవధాని మనకెవడూ లేడుకాక లేడు.. దటీస్

'బుక్కపట్నం తిరుమల శ్రీనివాసాచార్య'..

(వారు ఆరోజు చెప్పిన 50లో 

8 పద్యాలు నా దగ్గరున్నాయి.

పోస్ట్ నిడివి పెరుగుతుందనే భయంతోనే వాటిని ఇక్కడ పెట్టడం లేదంతే)


మళ్లీ ఆ వివాద సందర్భంలోకి

వద్దాం..ఆ జంటకవుల్లో

చేళ్లపిల్ల నైజం వేరు..

తగ్గడం ఆయన జన్మతహః

స్వభావం కాదు..దివాకర్ల వారు

సత్వ గుణులు..చెళ్లపిళ్ల వారు

రజోగుణులు అదీ సంగతీ..

అవధానంలో ఓ పదం పడితే

ఆక్షేపించినపుడు మరో పదం

వేస్తే గొడవే ఉండదుగా..అని

మనం అనుకుంటాం గానీ

ఆయన నైజం అదికాదు మరి..


ఆ స్వభావానికి మరికొంత

జోడిస్తా..కొప్పర కవులేకాదు,

ఎందరితోనో ఈ జంటకవులు కయ్యానికి కాలుదువ్వారు..

ఆ వాగ్యుద్ధాలకంతా సూత్రధారి

ఈ 'చెళ్లపిళ్ల' వారే..పద ప్రయోగం మీద ఆయనకెంత పట్టుందనే

దానికన్నా..ఆయన పట్టుదలకు

అబ్బుర పోకుండా ఉండలేం..!!


చెళ్లపిళ్ల వారి స్వాభావిక నైజానికి

ఓ ఉదాహరణగా...

90 ఏళ్లకింద చెళ్లపిళ్ల వారు 'భారతి' లో 

ఓ వ్యాసం రాశారు.. అందులో 

ఓ పదాన్ని పట్టుకుని

శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రిగారు

వివాదానికి దిగారు..

నిజానికి చెళ్లపిళ్ల వారికి 

ఆయన గురువులు కూడా...

వారిదగ్గరే ఈయన యవ్వనంలో

'కుమారసంభవం, మేఘసందేశం' చదువుకున్నారు..

అయినా.. వాదం వాదమేగా..?


చెళ్లపిళ్ల వారు ఆ సందర్భంలో

" గురుడేమి లెక్క.. ఆ హరుడే

కాదాడ వాదాడెదన్' అని బదులిచ్చారు.. అదీ ఆయన నైజం..నాకు తెలిసి వారి పద్యాలలో ప్రసిద్ధమైన 'దోసమంటం చెరింగియు' పద్యం

ఈ ఆస్థానంలోనే చెప్పారని

అనుకుంటున్నా..అయినా కాకపోయినా..చెళ్లపిళ్ల వారి టెంపరిమెంట్ కు ఇదో మచ్చుతునక..


శాస్త్రం ప్రకారం వైదిక బ్రాహ్మడు

మీసం పెంచకూడదు.

దివాకర్ల వారికి మీసం లేదు

ఈ చెళ్లపిళ్ల మీసాల వారు


నిండు సభలో దాన్ని 

కొందరు ఆక్షేపించారు..

అప్పుడు వారినోటి నుంచి

వచ్చిన సమర్థనా పద్య మిది..


"1) దోసమటం చెరింగియు దుందుడు కొప్పగ పెంచినార మీ

2) మీసము రెండు బాసలకు మేమే కవీంద్రులమంచు తెల్పగా

3) రోసము కలిగినన్ కవివరుల్

మము గెల్వుడు, గెల్చిరేని యీ

4) మీసము తీసి మీ పద సమీపములం తలలుంచి మ్రొక్కమే.."


(సంస్కృతాంధ్రాల్లో మమ్మల్ని

ఎవరు గెలిచినా ఆ రెండు మీసాలను తీసి మీ పాదాల ముందుంచి మొక్కమా..!!?)

ఆక్షేపిస్తే..సవాలు విసరడం

వీరినుంచే నేర్చుకోవాలి మనం..


పైకి చూస్తే ఈ పోకడ 'అహంకారం' గా కనిపిస్తుంది గానీ.. తరచి చూస్తే..

చదువని వాడి అహం 'అహంకారం' 

చదివినవాడి అహం

'అహమహ అలంకారం'..

(ఆ అహమహాలంకారులు ఎందరో ఉన్నారు..వారి గురించి మరోసారి రాస్తాను)


మళ్లీ మనం ఆ పండిత సభ

వివాదంలోకి వద్దాం..

అన్ని సంస్థానాల పండితుల

అభిప్రాయాలొచ్చాయి..

" జంటకవులు తెలుగులో అవధానం చేస్తున్నపుడు ఆపదం

సంస్కృత వ్యాకరణ విరుద్ధమైనా 'తిక్కన ప్రయోగంబు గ్రాహ్యంబు' " అని

ఈ జంటకవులను సమర్థించారు.

'బాలసరస్వతి' బుక్కపట్నం వారికి ఈ పండిత తీర్పు సంతృప్తికరంగా లేదు.

మౌనం వహించి సభలోంచి వెళ్ళిపోయారు..


ఇక్కడో విషయం చెప్పుకోవాలి

పండితుల అభిప్రాయం వచ్చే వరకు వాళ్లక్కడే ఉండిపోవాల్సి

వచ్చింది..ఆ మధ్యకాలంలో

ఖాళీగా ఉండకుండా..రాజావారి

కోరికమేరకు ఆ జంటకవులు

హొసదుర్గం శ్రీనివాసాచార్యులు

సంస్కృతంలో రాసిన 'శ్రీనివా విలాస' కావ్యాన్ని తెలుగులోకి

అనుదించారు.. 

ఈ 'హొసదుర్గం' వారు ఎవరోకాదు.. అప్పటికి వందేళ్ల కింద ఈ ఆస్థానం కవి పండితుడు..

అలా పండితాభిప్రాయం వచ్చాక

బాలసరస్వతి బిరుదాంకితులైన

బుక్కపట్నం ఆచార్యుల వారు

కినుక వహించి సభలోంచి

వెళ్లిపోయినా...రాజావారు మాత్రం ఆ యువకవులను ఘనంగా సత్కరించాలనుకున్నారు..

ఆ రోజు ఆత్మకూరు సభాస్థానం

కోలహలంతో నిండి పోయింది..

ఈ జంటకవులు 

ఊహకందని గజారోహణంతో పాటు, కనివిని ఎరుగని

సన్మానాలను, బహుమానాలను

అందుకున్నారు.. వారెక్కిన ఏనుగు ఆత్మకూరు పురవీధుల్లో

ఊరేగింపుగా తిరుగుతోంది..చెళ్లపిళ్ల వారు

బుక్కపట్నం వారి ఇంటిముందు

ఏనుగును ఆపమని ఆదేశించారట..

అలాగే మావటి వాడు ఆపాడు

వారు ఏనుగు దిగారు.. ఆ 

ఊరేగింపు వెంటనున్న సంస్థానం అధికారులు, ఆ సంస్థానంలోని ఇతర పండిత కవుల్లో 

గుబులు పుట్టింది..మళ్లీ ఏపేచీ వస్తుందనని వారిభయం..


ఆ ఇద్దరూ ఆ ఇంట్లోకి

ప్రవేశించారు..ఆ సమయానికి

ఆచార్యులవారు పడక కుర్చీలో

కూర్చొని ఉన్నారు..

ఏనాడూ శిరసొంచని 

ఈ జంటకవులు నేరుగా

ఆయనకు పాదాభివందనం చేశారట..! నిజానికి బుక్కపట్నం వారు వయసులో వారికంటే 

40 ఏళ్ల పెద్దవాడు..అప్పటి ఆయన కోపతాపాలు, కినుక వగైరాలు

చిటుకలో కరిగిపోయి..వారిని

ఆత్మీయంగా హత్తుకున్నారట..!

'పెద్దల కోపం పాద నమస్కారంతో సరి' అనే మనపెద్దలమాటకు ఇంతకు మించిన నిదర్శనం మరొకటి ఉండదు..


ఆ సందర్భంలో ఆ జంటకవుల నోట వెలువడినదే ఈ పద్యం..


1) ఏనుగు నెక్కినాము ధరణీంధ్రులు మ్రొక్కగ నిక్కినాము స

2) న్మానములందినాము బహుమానములన్ గ్రహించి నార మె

3) వ్వానిని లెక్కపెట్టక అనివారణ దిగ్విజయం బొనర్చి ప్ర

4) జ్జానిధులంచు పేరు గొనినారము నీవలనన్ సరస్వతీ..!!


బాల సరస్వతి బిరుదాంకితులైన

బుక్కపట్నం వారికీ...చదువుల తల్లి సరస్వతి కి అన్వయం కుదిరేలా...అలా ఆ సందర్భంలో

వారు చెప్పిన పద్యమే

ఈ సుప్రసిద్ధ పద్యం..

నిజానికి ఆనాడు ఆ 'బాలసరస్వతి' గారు వీరిని నిలదీయకపోయుంటే...వారు 

ఏనుగు ఎక్కేవారే కాదు..

ఈ పద్యం పుట్టేదే కాదు కదా..!!ఏమైతేనేం, ఓ వివాదం కథ అలా సుఖాంతమైంది..


ఆక్షేపించిన ఆస్థాన కవే

వారిని కౌగలించుకున్నాక

ఆ రాజు ఆనందానికి అవధులుండవు గదా..?!

మరికొన్నాళ్లు ఉండమని

 రాజుగారు కోరారు..

' ప్రేమ లేకపోతే అదో కష్టం

ప్రేమ మరీ ఎక్కువైతే అది మరింత కష్టం' కదా..?!

అది బంగారు పంజరమైనా

ఎగిరే చిలుకలకు బంధిఖాన కదా..!


తిరుపతి వేంకట కవులు

ఆత్మకూరు సంస్థానానికొచ్చి

ఈ వివాదం వల్ల అక్కడ 

చాలా రోజులు వారుండాల్సి

వచ్చిందనడానికి ఆ సభలోనే వారు చెప్పిన 

ఈ పద్యమే సాక్షం..తమకు సెలవిప్పించమని వారెంత సుతిమెత్తగా అడిగారో వినండి..


" 1) వేసవి దగ్గరాయె, మిము

వీడుటకున్ మనసొగ్గదాయె, మా

2) వాసము దూరమాయె, పరవాసమొనర్చుట భారమాయె, మా

3) కోసము తల్లిదండ్రులు లిదిగోనదిగో నని

చూచుటాయె, వి

4) శ్వాస మొలర్పవే సెలవొసంగిన పోయెదమయ్య భూవరా..!!

ఆ పద్యంలో విన్నపం ఎంతమెత్తగా ఉందో, భార్యాపిల్లలు అనకుండా తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారనడం మరింత మెత్తగా గుండెకు తాకుతుంది..


మిత్రులారా..!

చివరిగా ఓమాట..వారిప్రజ్ఞ 

ఆ ఇద్దరికే పరిమితం కాలేదు..

వారి శిష్య, ప్రశిష్యులలో 

'ప్రజ్ఞానిధులంచు పేరుగొనిన' ప్రసిద్ధులు దాదాపు 30మంది దాకా ఉన్నారు...మా నాన్నగారు కూడా వారి ప్రథమ శిష్యులు వేలూరి శివరామ శాస్త్రిగారి శిష్యులు.. అలా ఆ జంటకవుల విద్యాకుటుంబంపై మరోసారి రాస్తాను..

(నాకు తెలిసిన నాలుగు విషయాలను మీతో పంచుకోవడానికి ప్రేరణ అయిన నాకు అగ్రజుడు Vruddhula వారికి ఈ పోస్ట్ అంకితం)

క్రియా శీలకత్వమే లక్ష్మీదేవి

 క్రియా శీలకత్వమే లక్ష్మీదేవి నివాసాలు ఇది వినటానికి ఆశ్చర్యంగా కనిపిస్తున్నది కదా కానీ ఇది ముమ్మాటికీ నిజం. ముందుగా త్రిమూర్తులను గూర్చి తెలుసుకుందాము. మొదటగా బ్రహ్మగారు ఆయనగారు సృష్టి రచన చేస్తారు అది మనందరికీ తెలుసు. ఆయన ధర్మపత్ని సరస్వతీదేవిగారు అమ్మగారు చదువుల తల్లి. సృష్టి రచనచేయటానికి కావలసింది జ్ఞ్యానం అందుకే ఆయనకు సహధర్మచారిణిగా వున్న తల్లి చదువుల తల్లి,  తరువాత విష్ణుమూర్తిగారు ఆయన స్థితికారకుడు అంటే బ్రహ్మ సృష్టించిన సృష్టిని నిర్వహించే (మేనేజ్)  దేముడు ఒక సంస్థానిర్వహించాలంటే కావలసింది ధనం అంటే సంపద కాబట్టి ఆయనగారి ధర్మపత్ని లక్ష్మీదేవిగారు ఆ తల్లి సకల సంపదలకు కారకురాలు. ఇక మూడవ దేవుడు పరమశివుడుగారు ఆయన పని లయకారకుడు అనగా సృష్టిని నశింపచేయటం అట్లా చేయాలంటే కావలసింది శక్తీ శక్తిలేకుండా వినాశనం జరగదు అది మనందరికీ తెలుసు అందుకే ఆ దేవదేవుడు పత్ని పార్వతీదేవి ఆ తల్లి శక్తి స్వరూపిణి. ఇటువంటి క్రమాన్ని మనకు అందించిన వేదాలు, మన మహర్షులు ఎంతటి మేధావులొకదా 

యతిభావం తత్ భవతి అనే ఆర్యోక్తి ననుసరించి మనం ఏ దేవుడిని లేక ఏదేవతను ఆరాధిస్తామో ఆ దేవీదేవతలు మనకు ప్రసన్నలై వారి ఆధిపత్యంలో వున్న శక్తిని మనకు  ప్రసాదిస్తారు. అంటే చదువు కొరకు సరస్వతి అమ్మవారిని, సంపదలకొరకు లక్ష్మి అమ్మవారిని అదేవిధంగా శక్తికొరకు పార్వతి తల్లిని మనం కొలవటం కద్దు. 

ప్రతి పురుషుని ప్రయోజకత్వంలో తన ధర్మపత్ని సహాయసహకారాలు ఉంటాయి అంతేకాదు నడిపేశక్తి కేవలం అంటే కేవలం స్త్రీమూర్తిదే అదే మనం మనదేవుళ్ల ద్వారా తెలుసుకోవచ్చు. 

ఇక విషయానికి వస్తే క్రియాశీలత్వము అంటే ఒక కార్యం చేయాలనే భావన ఆ భావనే మనం లక్ష్మి అమ్మవారుగా భావించవచ్చు అదెట్లాగో తెలుసుకుందాం. 

నీవు నీ ఇంటిని వదిలి ఏదో ఊరుకు వెళ్లి కొంతకాలం తరువాత తిరిగి వచ్చావు అప్పుడు తలుపు తీయంగానే ఇల్లు మొత్తం దుమ్ము దూళితో పేరుకొని వుంది నీ శ్రీమతి వెంటనే మీరు కాసేపు బయట వుండండి ముందు ఇల్లు ఊడుస్తాను అని అనటం పరిపాటి.  ఇల్లు ఊడవాలి అనే భావనే క్రియాశీలత్వం దానిని అమలు చేసినతరువాతే అంటే ఊడ్చిన తరువాతే ఇల్లు పరిశుభ్రంగా వున్నది. ఇటువంటివి కోకొల్లలుగా మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అందుకే మనధర్మంలో గృహిణిని గృహలక్ష్మి అని పేర్కొన్నారు అని అనిపిస్తుంది. 

ఫలానా వారి అబ్బాయికి పెండ్లి అయిందిగా వాళ్ళ కోడలిని చూసావా యెట్లా ఉంటుంది అని ఒకామె అడిగితె దానికి ఆమె స్నేహితురాలు ఇచ్చే జవాబు అమ్మాయి చక్కగా వుంది సాక్షాత్తు లక్షిం దేవిలా వుంది అనటం మనం చూస్తూ ఉంటాము.  నిజానికి ప్రపంచంలో ఎవ్వరు లక్ష్మి అమ్మవారిని చూడలేదు మరి ఎలా అలా అంటారు అంటే మనం లక్ష్మి అమ్మవారికి కొన్ని గుణాలను ఉంటాయి అని తెలుసుకున్నాము కాబట్టి అటువంటి సద్గుణాలు వున్న స్త్రీలను ఆ తల్లితో పోలుస్తూవుంటాము. 

ప్రతి గృహస్తు తన దైనందిక జీవితాన్ని సుఖవంతంగా గడపటానికి ఏ ఉద్యోగమో, వ్యాపారమో చేయక తప్పదు. గడియారం ముల్లులాగా పరిగెత్తక తప్పదు అందుకే లక్ష్మీదేవిలాంటి సహధర్మచారిణి లభించి ప్రతి విషయంలోనూ తన క్రియాశీలకత్వాన్ని చూపెడితే ఆ పురుషుడు పురుషార్ధాలను సాధించగలడు. 

భర్త ఏదైనా కార్యార్థిగా వెళుతుంటే తన కార్యం సఫలంకావాలనే ఆపేక్షతో పత్నిని ఎదురు రమ్మనటం మన సాంప్రదాయం దానికి అర్ధం తన భార్య లక్ష్మి దేవిలాగా చక్కగా నుదిటిన కుంకుమ దిద్దుకొని, కురుల పువ్వులు పెట్టుకొని చేతులకు గాజులు వేసుకొని మనోహారిగా ఉన్న భార్య ముఖకమలం చూసి తన కార్యోన్ముఖుడు అయితే ఆ రోజంతా మనస్సు ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉండి తానూ చేసే పనిమీద మనసు లగ్నాత చేయగలడు. తత్వారా కార్యసిద్ధి కలుగుతుంది. మన సాంప్రదాయంలో స్త్రీలకు మహోన్నత స్థానాన్ని ఇచ్చారు 

యత్ర నార్యంతు పూజ్యతే, రమంతే తత్ర దేవత..' అంటే ఎక్కడ నారీ మణులు పూజింప బడుతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని.. భారత్‌లో పురాణాలు, ధర్మ శాస్త్రాలు చెప్పాయి. మన భారతీయ సంస్కృతీ స్త్రీ శక్తిని వేదకాలంలోనే పేర్కొన్నాయి. పురుషుని అభివృద్ధికి స్త్రీమూర్తే కారణం అదేవిధంగా స్త్రీ పౌభాగ్యానికి పురుషుడు కారకుడు. 

లక్ష్మి నివాసాలు 

గురు భక్తి .దేవ భక్తి .మాతాపితృ భక్తి .కలవారిలో లక్ష్మీ కటాక్షం ఉంటుంది.
అతి నిద్ర లేని వారిలో. ఉత్సాహం .చురుకుదనం. ఉన్నవారిలో లక్ష్మీకళ ఉంటుంది.
ముగ్గు. పసుపు .కుంకుమ. పువ్వులు .పళ్ళు .పాలు లక్ష్మి స్థానాలు.
దీపం .ధూపం .మంగళ ద్రవ్యాలు .ఆ తల్లికి నివాసాలు.
పాత్ర శుద్ధి శుభ్ర వస్త్రధారణ కలిగిన ఇల్లు అమ్మవారి నివాస స్థలం.
బుద్ధి .ధైర్యం .నీతి .శ్రర్థ.గౌరవించే స్వభావం .శాంతి. లక్ష్మి ని పెంచే శక్తులు.
సంతృప్తి లక్ష్మికి ప్రధాన నివాసం.

దీనిని పట్టి మనకు అర్ధం అయ్యేది ఏమిటంటే లక్మి దేవి మంగళకారిని సకల శుభాలకు కారణం లక్షి అమ్మవారి ఆ తల్లి అంటే చురుకుదనం, ఉత్సాహం, సత్వగుణం, శాంత స్వభావం, నిజాయితీ, ధర్మాచరణ ఇటువంటి గుణాలు అంటే ఇవ్వన్నీ కూడా క్రియాశీలకత్వమే కానీ వేఱొక్కటి కాదు. భార్గవశర్మ చెప్పేది ఏమిటంటే ప్రతి వారు క్రియాశీలకత్వాన్ని పెంపొందించుకుంటే జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించగలరు.  

ఓం తత్సత్

ఓం శాంతి శాంతి శాంతిః  

మీ భార్గవ శర్మ

 


వెల్లుల్లితో వైద్యం

 వెల్లుల్లితో వైద్యం - 


 లక్షణాలు - 


     దీని రసం కారంగా ఉండును. వేడి చేయును . దీనిని లొపలికి తీసుకున్న మిక్కిలి వేడి చేయును . 


 ఉపయోగాలు - 


 * శరీరములో కఫముని పొగొట్టును. 


 * శ్లేష్మంని పొగొట్టును.


 * వాతము , బాలింతలకు వచ్చే సూతికా రోగము , టైఫాయిడ్ జ్వరం పొగొట్టును.


 * దేహము అంతా చల్లబడే మహావాతం ను పొగొట్టును. 


 * పాతకాలం నుంచి ఉండు జ్వరం పొగొట్టును. 


 * వాతనొప్పులు , కీళ్లనొప్పులు , పక్షవాతం ని నిర్మూలించును. 


 * ఊపిరి తీసుకుంటున్నప్పుడు వచ్చే ఊపిరిగొట్టు నొప్పి పొగొట్టును. 


 * అజీర్ణం , అజీర్ణం వలన వచ్చే కడుపునొప్పి పొగొట్టును.


 * శరీరం యొక్క ఉబ్బుని నిర్మూలించును. 


 * కడుపులో ఏర్పడే బల్లలు నివారించును. 


 * గుల్మము , మూలవ్యాధి , కుష్టు , క్షయ ని నివారించును. 


 * నోటికి రుచి లేకపోవటం , హుద్రోగము , ఆస్తమా , తలనరములకు సంబంధించిన రోగములు నివారించబడును. 


 * బ్రాంకైటిస్ , ఒంటినొప్పులు నివారించబడును. 


 * దేహము పచ్చబరుచునట్టి జ్వరముని నివారించబడును. 


 * విరిగిన ఎముకలను అతుక్కోనున్నట్టు చేయును . 


 * మూత్రము , చెమటని శుభ్రపరచును. 


 * కంఠస్వరం ని బాగుగా చేయును . 


 * చేతులు , కాళ్లు వణికే రోగమును పొగొట్టును .


 * మూత్రపు సంచిలో పుట్టెడు రాయిని కరిగించును. 


 * స్త్రీలకు పాలు ఉత్పత్తి అయ్యేలా చేయును . 


 * అంజూరా , అక్రోటుతో తినిన విషము విరుచును. 


 * వెల్లుల్లిపాయల రసముని , వెల్లుల్లి పాయలు వేసి కాచిన నూనె గాని చెవిలో పోసిన చెవుడు , చెవినొప్పి మాయం అగును. 


 * వెల్లుల్లిపాయలలో పసుపువేసి నూరి పక్షవాతం వచ్చిన అంగములకు పట్టించిన పక్షవాతం నివారణ అగును. 


 * వెల్లుల్లిపాయలు నూరి కట్టిన గోరుచుట్టు , కణుపు మీద పుట్టిన గడ్డ , గడ్డలు నివారణ అగును. 


 * ఒకే రెక్క కలిగిన వెల్లుల్లిపాయ ని రెండుముక్కలుగా కోసి ఒక ముక్కని పాము కరిచిన చోట అంటించిన విషము హరించును . విషము పీల్చడంలో దీనిని మించినది లేదు . 


 * పచ్చి వెల్లుల్లిపాయని ప్రతిరోజు తినుచుండిన అతిమూత్ర వ్యాధి కట్టును . మోతాదు పూటకు 1 రెబ్బ నుంచి 8 రెబ్బలు వరకు పెంచుకుంటూ వెళ్లవలెను . ఇలా రెండు పూటలా తినవలెను .


 * ఆవనూనెలో వెల్లుల్లిపాయలు వేసి కాచి వడగట్టి ఆ నూనె పూసిన గజ్జి , చిడుము మానును . 


  దీనిని అతిగా వాడటం వలన కలుగు నష్టాలు -


 

 * శరీరం నందు మిక్కిలి వేడి చేయను.


 * రక్తము నందు పైత్యంని హరించును . 


 * తలనొప్పిని కలుగజేయును .


 * కండ్లకు హానిచేయును .


 * స్ప్లీన్ , ప్రేవులకు హానిచేయను . 


 * గర్భిణీ స్త్రీలు వాడరాదు. 


 * రక్తవిరేచనాలు కలిగించును.


 * రక్తపోటు పెంచును. 


 * వేడి శరీరం గలవారు అతితక్కువ మోతాదులో వాడవలెను . 


 * దాహము కలిగించును. 


     దీనికి విరుగుళ్లు నెయ్యి , దానిమ్మ రసం , పులుసు , పాలు , బాదము నూనె 


 గమనిక - 


         ఈ మధ్య చాలామంది వెల్లుల్లిపాయని ఎటువంటి అనుపానం లేకుండా తీసుకుంటున్నారు. అలా తీసుకొవడం వలన విపరీత ఫలితాలు కలుగుతాయి . 


       వెల్లుల్లి రెబ్బలని అన్నం ఇగురుతున్నప్పుడు 

దానిలో గుచ్చి అన్నంతోపాటు తినవలెను . కారం లేకుండా ఉడికి ఉంటాయి.


      వెనిగర్ లో నానబెట్టి కొన్ని దినముల తరువాత ఉపయొగించవలెను .  


      పైన చెప్పిన పద్ధతులని ఉపయోగించి వెల్లుల్లి ని తీసుకోవడం వలన అద్భుత ఫలితాలు వస్తాయి . రక్తనాళాలోని కొవ్వుని కూడా నివారిస్తుంది.


  

       ఏయే సమస్యలకు ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి మరియు రోగములకు చేయవల్సిన చికిత్సలలో అత్యంత సులభమైనవి అన్నింటిని నేను రచించిన గ్రంథాలలో సంపూర్ణముగా ఇవ్వడం జరిగింది. వాటిని పరిశీలించగలరు.


   

 గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      కాళహస్తి వేంకటేశ్వరరావు 

 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


          ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్ 

                   

            9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .

సాధారణ చర్మరోగాలు

 సాధారణ చర్మరోగాలు నశింపచేయు సులభ యోగాలు  -


 *  వావింటి చెట్టు సమూలం నీటిలో నూరి ముద్దచేసి నువ్వుల నూనె లో ఉడికించి ఆ నూనెని రాయుచున్న సాధారణ చర్మరోగాలు అన్నియు నశించును.


 *  వేపచెట్టు బెరడు కషాయం సేవించుచున్న చర్మరోగాలు నయం అగును.


 *  మెట్టతామర ఆకు పసరు , నిమ్మకాయ రసం కలిపి పూసిన సాధారణ చర్మరోగాలు నయం అగును.


 *  నేలవేము కషాయం సేవించుచున్న సాధారణ చర్మరోగాలు తగ్గును.


 *  మోదుగ విత్తనాలు నిమ్మరసంతో కలిపి అరగదీసిన సాధారణ చర్మరోగాలు నయం అగును.


 *  నల్ల ఉమ్మెత్త రసం రాసిన చర్మరోగాలు నయం అగును.


 *  కొబ్బరినూనెలో గంధకం పొడిని కలిపి పూసిన చర్మరోగాలు నశించును.


 *  పచ్చగన్నేరు వేరు పైన చర్మం నేతిలో వేసి కాచి ఆ తైలమును రాసిన చర్మవ్యాదులు నశించును.


 *  ఎర్రగన్నేరు వేరు నేతిలో వేసి మరిగించి ఆ తైలమును పూసిన చర్మరోగాలు నయం అగును.


 *  కసివిందాకు రసం రాసిన గజ్జి , చిడుము వంటి చర్మరోగాలు నివారణ అగును.


 *  జిల్లేడాకు రసం, ఆవనూనె , పసుపు కలిపి రాయుచున్న చర్మరోగాలు నశించును.


 *  నల్లజీలకర్ర, నీలి ఆకులు మెత్తగా నూరి చర్మంపైన పూయుచున్న చర్మరోగాలు నశించును.


 *  పనస చెట్టు ఆకులు నూరి చర్మవ్యాధులు పైన రాయుచున్న చాలా రకాల చర్మవ్యాదులు నశించును.


 *  తాటి కల్లుతో బియ్యపు పిండి కలిపి పులియబెట్టి వ్రాస్తుంటే దూరదతో ఉండే చీముపొక్కులు నశిస్తాయి . 


      పైన చెప్పిన యోగాలలో మీకు ఏది సులభముగా అనిపిస్తే దానిని ప్రయత్నించండి. నా గ్రంథాలలో ఇంకా వివరణాత్మకంగా ఇచ్చాను. ప్రతివ్యాధికి హెడ్డింగ్ పెట్టి కింద చిట్కాలు ఇచ్చాను.


       ఏయే సమస్యలకు ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి మరియు రోగములకు చేయవల్సిన చికిత్సలలో అత్యంత సులభమైనవి అన్నింటిని నేను రచించిన గ్రంథాలలో సంపూర్ణముగా ఇవ్వడం జరిగింది. వాటిని పరిశీలించగలరు.


   

 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      కాళహస్తి వేంకటేశ్వరరావు 

 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


          ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

            9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .

బాలాజీ దయ

 ఓ అర్చకుడి కధ 


హై దరాబాద్   లో  గుడికి పోవాలి అని నాకు అనిపిస్తే ముందుగా  వెళ్ళేది హైదరాబాదు శివార్లలోని  చిలుకూరు బాలాజీ దేవాలయానికి. అక్కడ కూడా భక్తుల  హడావిడి ఎక్కువే. కానీ హుండీ కనపడని ఆలయం అది. వీ.ఐ.పీ. బ్రేకులు, టిక్కెట్ల మీద ప్రత్యేక దర్శనాలు లేని దేవాలయం అది. పెద్దవాళ్లు, చిన్నవాళ్లు, ఉన్నవాళ్లు, లేనివాళ్లు  అనే తేడా లేకుండా అందరూ వరుసగా వెళ్లి దైవదర్శనం చేసుకోవడానికి వీలైన గుడి అది.  అందుకే నాకు ఆ గుడి అంటే మక్కువ ఎక్కువ. గర్భగుడిలో వున్న బాలాజీకి  వీసా దేవుడు అనే పేరుంది. అక్కడికి పోయి పదకొండు ప్రదక్షిణలు తర్వాత దర్శనం చేసుకుని మనసులో  కోరుకుంటే  అమెరికన్ వీసా దొరుకుతుంది అనే నమ్మకం ఆ గుడి విషయంలో వుంది అని విన్నాను.  కోరిక తీరిన వాళ్ళు మళ్ళీ ఆ గుడికి వెళ్లి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి మొక్కు తీర్చుకుంటారు అంటారు.

సువిశాల ప్రాంగణంలో  అనేక ఏళ్ళుగా నిద్రాణంగా ఉండిపోయిన ఆ దేవాలయానికి  ఇంతగా ప్రాచుర్యం లభించడానికి కారణం సౌందర రాజన్ అనే పెద్దమనిషి. ఉన్నత చదువులు అభ్యసించారు. కామర్స్ లెక్చరర్ నుంచి ఉస్మానియా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ స్థాయికి ఎదిగారు. చిలుకూరు గుడికి అనువంశిక ధర్మకర్త. రిటైర్ అయిన తర్వాత  అదే దేవాలయంలో ప్రధాన అర్చక వృత్తి స్వీకరించారు. దేవాలయాలు ప్రభుత్వ అధీనంలో ఉండరాదని దశాబ్దాలుగా సాగిస్తున్న ఉద్యమానికి ఆయన వన్ మ్యాన్ ఆర్మీ. 

అనేక ఆధ్యాత్మిక  విషయాలు చర్చిస్తూ వుండేవారు. ఆయన కుమారుడే  సౌందర రాజన్ రంగరాజన్. ఈ వ్యాసానికి స్పూర్తి.

తండ్రిలాగే ఆయన కూడా విద్యాధికుడు. ఎప్పుడైనా ఆ గుడికి వెళ్ళినప్పుడు తండ్రీ కొడుకులతో మాట్లాడడం నాకు ఓ వ్యాపకంగా మారింది. పెద్ద చదువులు చదివి ఈ వృత్తిని ఎంచుకోవడంలో ఏదైనా కారణం ఉందా అని అడిగినప్పుడు రంగరాజన్ ఎన్నో విషయాలు చెప్పుకుంటూ పోయారు. అవి ఆయన మాటల్లోనే.

“మా ఇంట్లో ముగ్గురం అబ్బాయిలమే. నేను నడిమివాణ్ణి. నేను చదువుకున్నదంతా క్రైస్తవ మిషనరీ బడుల్లోనే. అక్కడి దేవుని ప్రార్థనా గీతాలు అలవోకగా పాడేవాణ్ణి. టీచర్లు నా చేత సంస్కృత శ్లోకాలు చెప్పించుకుని ఆనందించేవాళ్లు. నుదిటిమీద పెద్దగా నామాలు పెట్టుకునే బడికి  వెళ్లేవాణ్ణి. క్రైస్తవ పాఠశాలలైనాసరే ఈ విషయంలో అక్కడెవరూ నన్ను ఆక్షేపించింది లేదు. ఆ పరమత సహనమే నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిందని చెప్పాలి.

“ఇంజినీరింగ్ పూర్తయ్యాక చెన్నైలో ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం. అక్కడ పనిచేస్తున్నంతకాలం చిలుకూరు గుడికి దూరమవుతున్నాననే బాధ పీడిస్తూనే ఉండేది. ఆరేళ్లు గడిచాయి. ఇక ఉండబట్టలేక ఉద్యోగం మానేస్తానని చెప్పాను. దాంతో నాకోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ప్రాంతీయ కార్యాలయం ఒకటి తెరిచారు.

“దక్షిణాది మొత్తానికి నన్ను హెడ్‌గా నియమించారు. 1999 లోనే సంవత్సరానికి పది లక్షల రూపాయల జీతం! 

“అప్పుడు ఉమ్మడి రాష్ట్రం. 1987లో నాటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం హిందూ దేవాలయాల్లో  వంశపారంపర్య అర్చకత్వాన్ని రద్దు చేసింది.

“నాన్నగారు చట్టరీత్యా పోరాడి సుప్రీంకోర్టు నుంచి కొత్త మార్గదర్శకాలు తెప్పించుకోవడంతో పరిస్థితి కాస్త సద్దుమణిగింది. 1995 తర్వాత ఆలయానికి భక్తుల తాకిడి పెరగడంతో దేవాదాయశాఖ దీన్ని సొంతం చేసుకోవాలనుకుంది.

“మా గుడిని యాదగిరిగుట్టకి అనుబంధ ఆలయంగా మార్చాలనుకుంది. అప్పుడు నాన్నగారు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు చూపించి వాదించారు. అప్పుడు  ఓ అధికారి ఇలా అన్నారు.

‘సౌందర్‌రాజన్‌గారూ, మీ అబ్బాయిలు ముగ్గురూ ఇంజినీర్లు. వాళ్లు ఇక్కడికొచ్చి అర్చకత్వం ఎలాగూ చేయరు. ఇక దేనికండీ మీకీ వారసత్వపు హక్కుల గురించిన ఆరాటం!’ అన్నారు. ఆ మాటలు నన్ను ఓ కొరడాలా తాకాయి. ఆ రోజే నిర్ణయించుకున్నా, నాన్నగారి వారసత్వాన్ని నేనే ముందుకు తీసుకెళ్లాలని!

“నాకప్పుడు 35 ఏళ్లు. మంచి జీతం, ఇంకా మంచి భవిస్యత్తు వున్న ఉద్యోగం. ప్రేమించి పెళ్ళాడిన భార్య. చీకూ చింతాలేని సంసారం. 

‘ఇంతమంచి ఉద్యోగం వదులుకుని అర్చకత్వం చేస్తారా!’ అని నలుగురూ నవ్వారు. ఎవరేమన్నా, అర్చకుడిగా నా ఆహార్యం మార్చుకుని ఆలయంలోకి అడుగుపెట్టి హారతి పళ్లెం అందుకున్నాను.

“రోజూ దేవుడికి సమర్పించిన నైవేద్యం మాత్రమే నా ఆహారం. ఆధునిక వస్త్ర ధారణ వదిలేసి అలా మారిపోయిన నన్ను చూసి మా ఆవిడ మొదట్లో వచ్చే కన్నీళ్లని దాచుకునేందుకు విఫలయత్నం చేసేది.

“ఆదాయం లేకపోవడంతో అప్పటిదాకా ప్రైవేటు బడుల్లో చదువుతున్న పిల్లల్ని తెచ్చి కేంద్రీయ విద్యాలయంలో చేర్చాను. 

“అర్చకుడిగా మారిన తొలి రోజుల్లోనే నాన్నగారితో మాట్లాడి ఆలయంలో హుండీని తీసేయించాను. వీఐపీ దర్శనాలూ, టిక్కెట్టు  దర్శనాలు లేకుండా ఆలయానికి వచ్చే భక్తులందరూ సమానమేనని ప్రకటించాను. ఇప్పటికీ అదే తు.చ.తప్పకుండా పాటిస్తున్నాం.

“ఏ ఆదాయమూ లేదు కాబట్టి దేవాదాయ శాఖకి మా ఆలయం మీద ఆజమాయిషీ చలాయించే అవకాశం లేకుండా పోయింది.

“1990కి ముందు మా ఆలయానికి వారం మొత్తం మీద వెయ్యిమంది వస్తే గొప్ప! ఇప్పుడు వారాంతాల్లో నలభై వేల మంది దాకా వస్తున్నారు. గుడికి వచ్చేవారికి సనాతనధర్మం గొప్పతనం గురించి చెబుతుంటాం. సనాతన ధర్మమంటే మూఢాచారాలు, స్త్రీలపట్ల వివక్ష, అంటరానితనాన్ని ప్రోత్సహించడం కానేకాదు. అవన్నీ నడమంత్రంగా వచ్చిన ఆచారాలు మాత్రమే“  వాటిని పట్టుకుని వేలాడితే హిందూ మతానికే ముప్పు తప్పదు. అసలైన హిందూ ధర్మం మన చుట్టూ ఉన్న ప్రతి జీవినీ ప్రేమించడమే. మన వేదవేదాంగాలసారం అదేనని నేను నమ్ముతా. 

“ఓ దళిత సంఘం నన్నో సమావేశానికి పిలిచి ప్రసంగించాలని చెప్పింది.  దళితులని ఆలయ ప్రవేశం చేయించడం శ్రీవైష్ణవ సంప్రదాయంలో వేలాది సంవత్సరాలుగా ఉందంటూ ‘మునివాహన సేవ’ గురించి చెప్పాను.

(శ్రీరంగం దేవాలయంలో ఓ దళితుడు స్వామి దర్శనం కోసం అల్లాడుతుంటాడు. కానీ అతడికి ప్రవేశం దొరకక పోగా ప్రధాన అర్చకుడు అతడిని గులక రాయితో కొడతాడు. గుడిలోకి వెళ్లి చూస్తే స్వామి విగ్రహం నుదుటి నుంచి రక్తం స్రవిస్తూ వుంటుంది. దానితో పూజారికి జ్ఞానోదయం అవుతుంది. ఆ దళితుడిని తన భుజాల మీదకు ఎత్తుకుని దేవాలయంలోకి తీసుకువెళ్లి స్వామి దర్శనం చేయించి ప్రాయశ్చిత్తం చేసుకుంటాడు. ఇలా భుజాలకు ఎత్తుకుని దళితుల చేత దేవాలయ ప్రవేశం చేయించడాన్ని మునివాహన సేవ అంటారు) 

“అప్పుడో సభ్యుడు లేచి ‘మీరయితే ఓ దళితుణ్ని అలా భుజాలపై మోసుకెళ్తారా!’ అని సవాలు విసిరాడు. 

ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. చేసి తీరతాననే చెప్పాను. చెప్పినట్టే చేశాను. ఓరోజు ‘బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే..’ 

అని పాడుకుంటూ, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఆదిత్య అనే  ఒక  హరిజన భక్తుణ్ణి గుడిలోకి మోసుకెళ్లాను.

“ఈ విషయం మీడియాలో రావడంతో, బౌద్ధ గురువు దలైలామా ప్రశంసాపూర్వక లేఖ రాసారు. అభినందనలు అనంతంగా సాగాయి. ఇవన్నీ ఆ బాలాజీ  దయ అని నేను నమ్ముతాను.

“వీటన్నింటి వెనక నా భార్య సుధ ఇచ్చిన నైతిక మద్దతు అంతాఇంతా కాదు. లక్షల రూపాయల జీతం వదులుకుని, అర్చకత్వం స్వీకరించిన  భర్త వెంట నడవాలంటే  గొప్ప మానసిక బలం కావాలి. బాగా చదువుకుని పైకి వచ్చిన నా పిల్లల్లో ఒకరిని బాలాజీ సేవకే అప్పగించాలని నేను తీసుకున్న నిర్ణయానికి కూడా అంగీకారం తెలిపింది”

ఇదీ ఒక అర్చకుని కధ. ఆచరించాల్సిన అంశాలతో కూడిన జీవనగాధ.

ఆ అఖిలాండ బ్రహ్మాండ నాయకుడి భక్తుడు అయిన నేను ఈ పోస్ట్ ను అందరికీ షేర్ చేస్తున్నాను

మీకు తెలిసిన అన్నీ వాట్సప్ నెంబర్లకు విధిగా దయచేసి షేర్ చేయండి

84,లక్షల జీవ రాసులలో హిందూవుగా పుట్టడం ఒక వరం. అందులో అఖిలాండ బ్రహ్మాండ నాయకుని గుణగణాల

విన దానికి చెవులు చేసు కొన్న పుణ్యం।        చెప్పనలవి కాదు

ఎన్నో జన్మల పుణ్యం చూసుకుంటే గాని స్వామి పాదాలను చేరుకోలేము ఓం నమో నమోనారాయణాయః

🙏సర్వే జన సుఖినో భవన్తు🙏

పుష్య అమావాస్య

 *జనవరి 21 పుష్య అమావాస్య*


పుష్య అమావాస్యనే పౌష అమావాస్య అని కూడా అంటారు. హైందవంలో పుష్య మాసం అమావాస్యకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ మాసం పితృదేవతలకు అంకితం చేశారు. ఈరోజున పితృల పేరిట దానం చేయడంవల్ల వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విశ్వసిస్తారు.


జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పౌష అమావాస్య రోజున ఉపవాసం ఉండటంవల్ల పితృదోషం, కాలసర్ప దోషాలనుండి విముక్తి కలుగుతుంది. ఈరోజున పితృదేవతలకు శ్రాద్ధం, తర్పణం చేయడం వల్ల వారి ఆత్మకు శాంతి చేకూరుతుంది. శుభకార్యాలకు పుష్యమాసం చాలా ముఖ్యమైనది. ఈనెలంతా సూర్యుడిని ఆరాధించడం వల్ల మీకు శుభఫలితాలు కలుగుతాయి. ఈరోజున పితృదేవతలకు నైవేద్యాలు సమర్పిస్తే వల్ల వారి అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా కుటుంబంలో ఆనందం నెలకొంటుంది.


వేకువఝామునే నదీస్నానం చేసి రాగి పాత్రలో మందార పువ్వులు వేసి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. తర్వాత పూర్వీకులకు శ్రాద్ధ కర్మలు చేసి శక్తి మేరకు దానం చేయండి. ఈరోజున రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించడం వల్ల కూడా ప్రయోజనం పొందుతారు. ఈ రోజున చేపలకు పిండిని తినిపించడం శుభప్రదంగా భావిస్తారు.


పుష్య అమావాస్య రోజున చేయకూడని పనులు ఏమిటో శాస్త్రం వివరించింది. ఈ రోజున ఎవరినీ అగౌరవపరచకూడదు.


అబద్ధం చెప్పకూడదు. రాత్రిపూట ఒంటరిగా నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్లకూడదు. మద్యం, మాంసాహారం తీసుకోకూడదు. అలాగే పుష్య అమావాస్య రోజున చేయవలసిన పనులు కూడా శాస్త్రం ఈ విధంగా చెబుతోంది. ఈ రోజున శ్రీకృష్ణుని పూజించాలి. గీతా పఠనం చేయాలి. పూర్వీకులను స్మరించుకోవాలి, పేదలకు బట్టలు, ఆహారం మొదలైన వాటిని దానం చేయాలి. రావి చెట్టుకు నీరు పోయాలి. రావి చెట్టు క్రింద దీపం వెలిగించాలి. వీలైతే ఈ రోజున రామి మొక్కను నాటడం శ్రేష్టం.

సుభాషితమ్


శ్లో𝕝𝕝 స్వల్పాపి దీపకణికా బహుళం నాశయేత్తమః|

బోధస్స్వల్పో౭పి తత్ తీవ్రం బహుళం నాశయేత్తమః||


తా𝕝𝕝 "దీపము ఎంత చిన్న దైనను చీకట్లను పోగొట్టునట్లు *ఉత్తమ గురువుల బోధనలు ఎంత కొద్దిగా‌ ఉన్ననూ అంతకంటే గొప్పదైన అజ్ఞానం అనే చీకట్లను నశింప జేయును*" 


*[గ్రహించే శక్తి గల శిష్యునికే యిది వర్తించును]*

హార్ట్ ఫుల్ నెస్

 హార్ట్ ఫుల్ నెస్🌍కథతో


♥️ కథ-200♥


జీవితంలోని భౌతిక వనరులతో మనం నిజంగా హృదయపూర్వకంగా సంతృప్తి చెందుతామా?


ఆత్మ - సంతృప్తి చెందిన వ్యక్తులు


నేను మా ఊరికి వెళ్లేందుకు బస్టాండ్‌లో వేచి ఉన్నాను. బస్సు ఇంకా  రాలేదు.


నేను అక్కడ కూర్చుని పుస్తకం చదువుతున్నాను.


నన్ను చూసి, దాదాపు 10 సంవత్సరాల వయసు ఉన్న అమ్మాయి నా దగ్గరకు వచ్చి,"సార్, ఈ పెన్నులు కొనుక్కోండి, నేను మీకు నాలుగు పెన్నులు రూ.10కి ఇస్తాను, నాకు చాలా ఆకలిగా ఉంది, నాకు ఏదైనా తినడానికి ఉంటుంది."


ఆమెతో పాటు ఒక చిన్న పిల్లవాడు కూడా ఉన్నాడు, బహుశా ఆమె తమ్ముడనుకుంటాను.


నేను, "కానీ, నాకు పెన్ను అవసరం లేదమ్మా", అన్నాను.


ఆమె తర్వాత చాలా ముద్దుగా ఇలా ​​అడిగింది,"అప్పుడు మేము ఏం తింటాం?"


"నాకు పెన్ను వద్దు, కానీ నువ్వు తప్పకుండా ఏదోకటి తింటావు" అన్నాను.


నా బ్యాగ్‌ లో రెండు బిస్కెట్ల ప్యాకెట్లు ఉన్నాయి. నేను ఆ రెండు ప్యాకెట్లను తీసి, ఇద్దరికీ చెరొకటి ఇచ్చాను. కానీ ఆమె ఒక ప్యాకెట్ తిరిగి ఇచ్చేసి, "అయ్యగారు! ఒక్కటి చాలు, ఇద్దరం పంచుకుంటాం" అని చెప్పడంతో నేను చాలా ఆశ్చర్యపోయాను.


నేను మళ్ళీ " ఫర్వాలేదు, ఈ రెండూ ఉంచుకో " అన్నాను.


దానికి ఆ అమ్మాయి అడిగిన ప్రశ్న నన్ను, నా హృదయాన్ని, నా ఆత్మను కూడా కదిలించింది. 

"అప్పుడు మీరు ఏమి తింటారు?" అని అడిగింది.


కోట్లాది కోట్లు సంపాదిస్తున్న మనుషులు మానవత్వాన్ని పక్కనపెట్టి విజయం పేరుతో ప్రజలను విపరీతంగా దోచుకుంటున్న ఈ ప్రపంచంలో, ఆకలితో ఉన్న ఓ అమ్మాయి నాకు మానవత్వపు ఉన్నతమైన పాఠాన్ని నేర్పింది.


ఆత్మతో సంతృప్తి చెందేవాళ్ళు ఇలాగే ఉంటారేమో అని నాలో నేనే అనుకున్నాను... 

దురాశతో వాళ్ళ వంతు కూడా తినేసేంతగా ఎదుటివారి వద్ద నుండి తీసుకోకండి ...!!

♾️

ఒక ప్రాథమిక సూత్రం ఉంది - తీసుకునే కంటే ఎక్కువగా ఇవ్వండి. 

ఈ లక్షణాలు ఆధ్యాత్మిక సాధన, స్వీయ అధ్యయనం ద్వారా ఎదిగిన వ్యక్తిలో వ్యక్తమవుతాయి. 🌼

దాజీ


హార్ట్ ఫుల్ నెస్ ధ్యానం 💌

🙏🙏🙏

20, జనవరి 2023, శుక్రవారం

"ఏ ఆవ్ రా బా వా "

 ఒకసారి శ్రీకృష్ణ దేవరాయలు తన ఆస్థాన కవులందరికీ ఒక పరీక్ష పెట్టాడు.


" మీరు ఐదు అక్షరాల పదం ఒకటి రూపొందించాలి. ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క భాషలో పుండాలి. ఆ ఒక్కొక్క అక్షరానికి ఆ భాషలో ఏమి అర్థమో మిగిలిన నాలుగు భాషల్లో కూడా అదే అర్థం వుండాలి.


అంతేకాక ఆ ఐదక్షరాల పదంకూడాvఅర్థవంతంగా వుండాలి. దీనికి సమాధానం రేపు సభాముఖంగా నాకు చెప్పండి."


కవులలో కలకలం బయలుదేరింది.


విచిత్రమైన సమస్య అనుకుని ఎవరింటికి వారు బయల్దేరి వెళ్లారు.


మన తెనాలి రామకృష్ణకు నిద్రపట్టడం లేదు. తన బావమరిది ఇంటికెళ్ళి అక్కడ పశువుల పాకలో మంచంవేసుకుని దీర్ఘాలోచనలో మునిగిపోయాడు‌.


అర్థరాత్రి అయినది. ఆ సమయానికి పశువులశాలలో ఒక ఆవు దూడను ప్రసవించినది. వెంటనే రామ కృష్ణుడు " బావా! బావా! ఆవు ఈనింది‌" అని కేకలు వేశాడు. నిద్రమత్తులో నున్న బావమరిది ఆ మాటలు విని " ఏ ఆవ్ రా బా వా " అని అడిగాడు. రామకృష్ణకు వెంటనే ఏదో స్ఫురించింది. ఎగిరి గంతేసాడు.


మరునాడు మహారాజు సభ తీర్చాడు.


"అందరూ సిద్ధంగావున్నారా" రాయలవారి మాట విన్న కవులు ఏమీ మాట్లాడలేదు.


కాని రామకృష్ణుడు మాత్రం లేచి " నేను సిద్ధమే" అన్నాడు.


మహారాజు: ఏదీ ఆ పదం చెప్పు!


రామకృష్ణుడు: "ఏ ఆవ్ రా బా వా "


'ఏ' అనగా మరాఠీలో 'రా' అని అర్థము.*


'ఆవ్ ' అనగా హిందీలో ' రా' అని అర్థము.


'రా' అనగా తెలుగులో 'రా' అనే కదా అర్థము!


'బా' అనగా కన్నడ భాషలో 'రా' అని అర్థము.


' వా' అనగా తమిళంలో 'రా' అని అర్థము.


ఈ అయిదు అక్షరాలూ అయిదు భాషలకు చెందినవి. ఈ అయిదు అక్షరములు కలిసిన పదం " ఏ ఆవ్ రా బా వా" ఇదికూడా అర్థవంతమైన పదమే!


తెనాలి రామకృష్ణుడి వివరణతో మహారాజుకు మహదానందం కలిగింది.


రామకృష్ణునికి భూరి బహుమానాలు లభించాయని వేరే చెప్పాలా !😊😊