19, అక్టోబర్ 2022, బుధవారం

శ్రీమదాంధ్ర మహాభారతము

 శ్రీమదాంధ్ర మహాభారతము 


కవి నన్నపార్యుని ఘనపద్య కవితతో 

             గౌతమీ తటమున గణుతికెక్కి 

కవిబ్రహ్మ తిక్కన కమనీయ గంటాన 

             నెల్లూరు సీమలో నెగడి కీర్తి 

శివదాసు డెఱ్ఱన  శ్రీకర కవితతో 

             పరిపూర్ణ యుతముగా పరిఢవిల్లి 

పదునెన్మిదైనట్టి పర్వమ్ములనునొప్పి 

             యితిహాసరాజమై యిలను వెల్గి 

అఖిల కావ్యమ్ము లందున శిఖర మయ్యు 

నిఖిల ధర్మసూక్ష్మంబుల నిలయ మయ్యు 

సకల వేదాంత ఉపనిషద్ సార మయ్యు  

ప్రథితి పొందెను శ్రీ మహాభారతంబు 


గోపాలుని మధుసూదనరావు

కామెంట్‌లు లేవు: