25, అక్టోబర్ 2023, బుధవారం

శ్రీదేవీ భాగవతము

 శ్రీదేవీ భాగవతము



.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||




జనమేజయా! రావలసిన సందేహమే వచ్చింది. దీనికి జవాబు దొరుకుతుంది. ముందు కథ

విను. వీరిణీదక్షులను ప్రజాసృష్టి చెయ్యమని బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించాడు. ఆ దంపతులకు

అయిదువేలమంది సంతానం కలిగారు. ఈ అధిక సంతానాన్ని చూసి నారదుడు పరిహసించాడు.

వీరిణీదక్షులారా! భూగోళం ఏపాటి ఉందో తెలుసుకోకుండా మీరు ఇలా సంతానాన్ని వృద్ధి

పరిస్తే ఎలాగ? చివరికి నవ్వులపాలవుతారు గమనించండి. నా మాటవిని, ముందుగా పృథివీ ప్రమాణాన్ని

తెలుసుకోండి. అటుపైని సంతానోత్పత్తి చెయ్యండి. అందరూ హర్షిస్తారు. ఏ ఇబ్బందులూ ఉండవు.

లేకపోతే చిక్కునబడతారు సుమా!

భువః ప్రమాణమఙ్ఞాత్వా స్రష్టుకామాః ప్రజాః కథమ్ |

లోకానాం హాస్యతాం యూయం గమిష్యథ న సంశయః ॥

పృథివ్యా వై ప్రమాణం తు ఙ్ఞాత్వా కార్యస్సముద్యమః ।

కృతో ఽసౌసిద్ధిమాయాతి నాన్యథేతి వినిశ్చయః ॥

(1-21, 22)

నారదుడు ఇలా హెచ్చరించేసరికి దక్షసుతులు అవునుసుమా అనుకున్నారు. భూమండలం

ఎంత ఉందో తెలుసుకువద్దామని అందరూ తలొకవైపూ బయలుదేరారు. అయిదువేలమందీ వెళ్ళిపోయారు.

దక్షప్రజాపతికి బెంగ పట్టుకుంది. ఇల్లు బావురుమంటోంది. ఏమీ తోచడంలేదు. సరేనని మరికొందరు

పుత్రుల్ని సృష్టించాడు. వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళై తామూ సంతానాన్ని ఉత్పత్తి చెయ్యడం ఆరంభించాడు.

అదొక ఉద్యమంగా సాగుతోంది.

వారదుడు మళ్ళీ వేళాకోళం చేశాడు. మీరంతా మూర్ఖుల్లాగా ఉన్నారు. చెబుతోంటే

వినిపించుకోరేమి? భూగోళం ఎంత ఉందో తెలుసుకోకుండా సంతానాన్ని ఉత్పత్తి చేస్తారేమిటి? అవి

విసుక్కున్నాడు. నిజమేకదా అని ఈ దక్ష సుతులుకూడా తమ అన్నయ్యల్లాగానే తలోదిక్కుకి వెళ్ళారు.

ఈసారి దక్షుడి పుత్రవిరహం కోపంగా పరిణమించింది. నారదుణ్ణి శపించాడు. వా పుత్రుల్ని

వాశనం చేశావు కనక నువ్వూ నాశనమైపో. దుర్బుద్ధితో ఇంతటి పాపకార్యం చేశావు కనక గర్భవాస

దుఃఖాన్ని అమభవించు. అదికూడా నాకు పుత్రవిరహాన్ని కలిగించావు కాబట్టి నాకే పుత్రుడుగా ఆవిర్భవించు

- అంటూ శాపం విసిరాడు దక్షప్రజాపతి.

బ్రహ్మదేవుడి ఉత్పంగంనుంచి అయోనిజుడై ఆవిర్భవించిన నారదుడు ఈ శాపం కారణంగా

గర్భవాపఠేశాన్ని అనుభవించి వీరిణీదక్షప్రజాపతులకు తనయుడుగా జన్మించాడు.

కామెంట్‌లు లేవు: