7, ఆగస్టు 2021, శనివారం

హనుమంతుని బలపరాక్రమాలు

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁

రాముడు అగస్త్యునితో 'ఓ మహర్షీ! రావణుడు, వాలి ఇద్దరూ మహాశక్తమంతులైన వీరులనటంలో సందేహం లేదు. కానీ హనుమంతుని బలపరాక్రమాలు వారినిద్దరిని అధిగమించినవని నాకు అనిపిస్తోంది. నిజానికి నా లంకా విజయం సందర్భంగా అతనొక్కడే నాకు ఘనవిజయాన్ని చేకూర్చపెట్టి నేను సీతను తిరిగి పొందగోరేటట్లు చేశాడు. నా అనన్యసేవకులలో సర్వోత్తముడు అయిన హనుమంతునికి నేను ఎంత ఋణపడి ఉన్నానో సముచితంగా నేను వ్యక్తం చేయలేను. ఓ మహార్షీ! ఇప్పటికీ నాలో ఉన్న ఒక సందేహాన్ని తీర్చవలసిందిగా నిన్ను ప్రార్ధిస్తున్నాను. వాలి, సుగ్రీవుల మధ్య వైరము ఉన్నప్పుడు హనుమంతుడు వాలిని నిర్జించకుండా ఉండటానికి కారణం ఏమిటి? హనుమంతునికి స్వీయ బలపరాక్రమాలు గురిఓచిన యెఱుక లేదనుకుంటాను, లేకుంటే సుగ్రీవుడు వెతలు పడుతుంటే అతను నిష్క్రియునిగా ప్రక్కనే నిలిచి చూస్తూ ఎలా ఉండిపోయాడు? ఓ ఋషీశ్వరా! నిగూఢ సత్యాలన్నీ ఎరిగినవాడవు కనుక దయచేసి హనుమంతుని యొక్క దివ్యలీలను వివరించి నా సందేహాన్ని నివారించగలవు'అన్నాడు శ్రీరామచంద్రమూర్తి.

        ఆ సమావేశంలో హనుమంతుడు కూడా ఉపస్థితుడై సంభాషణను ఆలకిస్తూ ఉన్నాడు. రాముని మాటలను వినటంతోనే అమితమైన దివ్యానందాన్ని అనుభవించాడు. అంతట అగస్త్య మహార్షీ ఇలా సమాధానం ఇచ్చారు.' శక్తిలోగానీ, వేగంలో గానీ, మేదస్సులోగానీ మారుతికి సాటిరాగలవారు ఎవరూ లేరనేది యథార్థం. అయితే తన వాస్తవికమైన బలపరాక్రమాలు గురించి అతను విస్మరించటం జరుగుతుంది. దీనికి కారణం వివరించటానికై అతని జీవిత కథను తెలియజేస్తాను.

       మేరు పర్వతాన నివసిస్తూ ఉండే ఒక వానర ముఖ్యుడైన కేసరి యొక్క పత్నియైన అంజనకు వాయుదేవుని వలన జన్మించినవాడు హనుమంతుడు. బిడ్డను ప్రసవించిన మీదట అంజన అతని కోసం కొన్ని ఫలాలను సేకరించుకొని రావటానికి వెళ్ళింది. అయితే ఆమె లేచి సమయంలో ఆకలిగొన్న శిశువు రోధించనారంభించాడు. ఆ సమయంలో సూర్యుడు ఉదయించసాగాడు. కాంతివంతమైన ఆ అరుణ గోళాన్ని చూచిన వానరశిశువు దానినొక ఫలంగా భావించి దానిని అందుకోవటానికై ఆకస్మికంగా పైకెగిరాడు.

        వాయునందనుడు గాలిలో అమితవేగంగా ఎగురుతుండటం చూచిన దేవతలు ఆశ్చర్యచకితులై 'మనస్సు లేదా గరుడుడు కూడా అంత వేగంగా పోలేరు. శిశువుగా ఉండగానే ఈ వానరుడు ఇంత సామర్థ్యం ప్రదర్శిస్తే అతను పెద్దవాడైన తర్వాత ఇంకెలా ఉంటాడో అన్నారు.

       మండిపోతున్న సూర్యుని తాపాన్ని తన పుత్రుడు ని రక్చించటానికై వాయుదేవుడు అతని వెంట వెళ్ళాడు. అంతట వానర శిశువు తనను సమీపించగా సూర్యుడు అతని శైశవపు అమాయకత్వం ను భవిష్యత్తులో రాముని తరపున అతను నిర్వహించనున్న మహాకార్యాన్ని ద్రుష్టిలో ఉంచుకుని అతనిని దగ్ధం చేయకుండా ఊరుకున్నాడు. అందువలన వాయునందనుడు రథ మీద సూర్యుని ప్రక్కనే ఆశీనుడు కాగలిగాడు.

        సరిగ్గా అదే సమయంలో సూర్యభగవానునిపై దాడి చేయటానికి రాహువు రావటం తటస్ధించింది. వెంటనే ఆ వానర శిశువు రాహువు ని దొరకబుచ్చుకున్నాడు. కానీ గ్రహ నియంత్రకులందరిలో అధముడైన రాహువు మరుక్షణంలోనే అతని పట్టునుంచి జారుకున్నాడు. రాహువు భయంతో ఇంద్రుణ్ణి సమీపించి 'నా క్చుద్బాధను తీర్చుకునే సాధనంగా సూర్యచంద్రులు ని నాకు కేటాయించినప్పటికీ, నాకు దక్కవలసిన భాగాన్ని వేరొకరు వశం చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు నేను సూర్యుణ్ని సమీపించినపుడు వేరొక రాహువు అతనిమీద దాడి చేస్తుండటాన్ని చూచాను' అంటూ ఆరోపణ చేశాడు.

       ఈ విషయం విని ఇంద్రుడు మిక్కిలి ఆశ్చర్యపడ్డాడు. అందువల్ల ఐరావతాన్ని అధిరోహించి సూర్యుని దిశగా బయలుదేరాడు. రాహువు ముందుగా వెళ్ళాడు. అతని రాకను గమనించిన వాయునందనుడు అతణ్ణి ఒక బ్రుహత్ ఫలంగా భావించి అతనిని పట్టుకోవటానికై సూర్యుని రథం మీద నుంచి ఎగిరాడు. రాహువు తక్షణమే ఇంద్రుని రక్షణ కోసం ఆర్తనాదం చేస్తూ పారిపోసాగాడు. ఆ సమీపానికి స్వర్గాధిపతి అతనికి అభయమిచ్చాడు.

          అంతట ఆకలిగొన్న శిశువు ఐరావతాన్ని చూడగానే ఆ గజాన్ని ఒక బ్రుహత్ శ్వేతఫలంగా భావించి దానివైపు దూసుకువెళ్ళాడు. వాయునందనుడు సమీపిస్తుండటాన్ని చూచిన ఇంద్రుడు తక్షణమే తన వజ్రాయుధం ను వదిలాడు. దాని దెబ్బకు వానరశిశువు ఒక పర్వతంపై కూలిపడి దవడవిరిగి ప్రాణం విడిచాడు. దీనితో క్రుద్దుడైన వాయుదేవుడు తన తనయుడుని తీసుకుని ఒక పర్వత గుహలోకి వెళ్లిపోయాడు. శ్వాస వాయువుగా తన క్రియాకలాపాలను వాయుదేవుడు నిలిపివేయడంతో సకల ప్రాణులు ఊపిరాడకపోవటం వల్లను, మలమూత్రబంధనం వల్లనూ విలవిల్లాడసాగారు. కడుపుబ్బరంతో దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి ఆత్రుతగా తమ దైన్యస్థితిని ఆయనకు విన్నవించుకున్నారు. అంతట బ్రహ్మ దేవుడు 'ఓ దివ్య లారా! వాయుదేవుని వాయుదేవునికి ఆగ్రహం కలగటం చేతనే మీరిపుడు వేదన చెందుతున్నారు. వాయుదేవుని ప్రాముఖ్యత ఎలాంటిదో కొంచెం అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. ద్రుగ్గోచరమైన భౌతిక దేహమంటూ ఆయనకు లేనప్పటికీ స్రుష్టిలోని సకల ప్రాణుల దేహాల్లోను అంతర్గతంగా ఆయన సంచరిస్తూ ఉంటాడు. వాస్తవానికి వాయువు లేకుంటే భౌతిక దేహం ఒక కాష్టమే అవుతుంది తప్ప అంతకు మించి మరేమీ కాదు. అందువల్ల సకల జగత్తుయొక్క శ్రేయస్సు నిమిత్తం వాయుదేవుని వద్దకు వెళ్లి ఆయనను శాంతింపచేద్దాం సరేనా? అన్నాడు. (ఇంకా ఉంది) ఇది సేకరణ మాత్రమే 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

శ్రీ_సనవే_ప్రజ్ఞ_శ్రీ

 



#ఈమె_ఒక_ఫ్యాషన్_డిజైనర్ 

కొందరికి సహాయం చెయ్యండిరా అంటే చచ్చిపోతారు ఈమె ఏడాది #సంపాదన_10కోట్లు.అన్నీ వదిలేసి

ఈ సన్యాసం స్వీకరించే ఈమె ఎవరో మీకు తెలుసా? 

వందల కోట్ల సంపాదన ఈమె సొంతం...

కోటీశ్వరి గా #అమెరికాలో ప్రకాశవంతమైన ఫ్యాషన్‌ విభాగాలలో ఒకరు. ఆమె పేరు #నిషా_కపాషి. ఈమె సంపాదన ఏడాదికి పది కోట్లు

ఒక వేతనంగా మాత్రమే సంపాదిచేవారు అనే విషయం గుర్తుంచుకోండి .. ఇప్పుడు వారు అన్నింటినీ వదిలిపెట్టి, 

చెప్పులు లేకుండా అడుక్కుంటూ, 

భారతీయ సంస్కృతి ఐన సన్యాసంలో మునిగిపోయారు ...


 నిషా వంటి సన్యాసుల ద్వారా ఆరాధించే భారతీయ సంప్రదాయం కానీ మన చుట్టూ ఉన్నవారికి సహాయం చేయడం ప్రపంచంలోని ప్రతి మూలకు చేరుతుంది.


#రాంచీలోని

#ఆచార్య_విజయ్_కీర్తియాష్_సురీశ్వర్_మహారాజ్ సమక్షంలో 2015 జనవరి 14 న మకర సంక్రమ నాడు నవోద ధరించి, ఆమె సాధ్వి #శ్రీ_సనవే_ప్రజ్ఞ_శ్రీ అనే పేరును స్వీకరించింది మరియు ఆమె పూర్వాశ్రమం నుండి విముక్తి పొంది సన్యాసం దీక్ష కొనసాగిస్తోంది..


నిషా తండ్రి మనోజ్ భాయ్, తల్లి, సోదరుడు మరియు బంధువులతో సహా 100 మందికి పైగా పరాస్నాథ్‌లో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. సురీశ్వర్ మహరాజ్ సమక్షంలో అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి.


 భారత సంతతికి చెందిన నిషా తండ్రి రూబీ కోచ్ ఫ్యాక్టరీ యజమాని.అతను తన కుమార్తె నిర్ణయాన్ని స్వాగతించాడు మరియు సన్యాసినిగా మారడానికి ఆమెను ఆమోదించాడు. అమెరికాలో జన్మించిన నిషా తన విద్యను భారతదేశంలో పూర్తి చేసింది. ఆ తర్వాత ఆమె న్యూయార్క్ వెళ్లారు.  


అక్కడ #ఫ్యాషన్_డిజైనర్ అయ్యారు. నాలుగు సంవత్సరాల పాటు, ఆమె నెలవారీ జీతం $ 1మిలియన్ లేదా సుమారు $ 75 మిలియన్‌ వరకు పని చేసింది. అప్పటి నుండి, ఆమె న్యూయార్క్ మరియు ఇటలీలోని ఫ్యాషన్ డిజైనర్ల నుండి సంవత్సరానికి అదనంగా రూ .7.5 కోట్లు సంపాదించడం ప్రారంభించింది.


కొన్ని సంవత్సరాలుగా ధర్మపరమైన కార్యక్రమాలకు హాజరు కావడానికి క్రమం తప్పకుండా భారతదేశానికి వస్తుండేది ... సాధ్వి ప్రష్మీ తశ్రీ మార్గదర్శకత్వంలో, ఆమె సాధ్వి జీవితాన్ని స్వయంగా సాధన చేసి సాధ్వీగా మారింది ..

 భాస్కరన్ నాయర్ అజయన్

SP Ram

వాట్సాప్ నుండి సేకరణ :-..

🚩"ఎ ఆవ్ రా బా వా "🤣

 🚩"ఎ ఆవ్ రా బా వా "🤣

💥

👉ఒకసారి శ్రీకృష్ణ దేవరాయలు తన ఆస్థాన కవులందరికీ ఒక పరీక్ష పెట్టాడు.

" మీరు ఐదు అక్షరాల పదం ఒకటి రూపొందించాలి. ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క భాషలో పుండాలి. ఆ ఒక్కొక్క అక్షరానికి ఆ భాషలో ఏమి అర్థమో మిగిలిన నాలుగు భాషల్లో కూడా అదే అర్థం వుండాలి.

అంతేకాక ఆ ఐదక్షరాల పదంకూడా

అర్థవంతంగా వుండాలి.

దీనికి సమాధానం రేపు సభాముఖంగా నాకు చెప్పండి."

కవులలో కలకలం బయలుదేరింది.

విచిత్రమైన సమస్య అనుకుని ఎవరింటికి వారు బయల్దేరి వెళ్లారు.

మన తెనాలి రామకృష్ణ కు నిద్రపట్టడం లేదు. తన బావమరిది ఇంటికెళ్ళి అక్కడ పశువుల పాకలో మంచంవేసుకుని దీర్ఘాలోచనలో మునిగిపోయాడు‌. అర్థరాత్రి అయినది. ఆ సమయానికి పశువులశాలలో ఒక ఆవు దూడను ప్రసవించినది. వెంటనే రామ కృష్ణుడు " బావా! బావా! ఆవు ఈనింది‌" అని కేకలు వేశాడు. నిద్రమత్తులో నున్న బావమరిది ఆ మాటలు విని " ఏ ఆవ్ రా బా వా " అని అడిగాడు. రామకృష్ణకు వెంటనే ఏదో స్ఫురించింది. ఎగిరి గంతేసాడు.

మరునాడు మహారాజు సభ తీర్చాడు.

" అందరూ సిద్ధంగావున్నారా" రాయలవారి మాట విన్న కవులు ఏమీ మాట్లాడలేదు. కాని రామకృష్ణుడు మాత్రం లేచి " నేను సిద్ధమే" అన్నాడు.

మహారాజు: ఏదీ ఆ పదం చెప్పు!

రామకృష్ణుడు: " ఎ ఆవ్ రా బా వా "

'ఏ' అనగా మరాఠీలో 'రా' అని అర్థము.

'ఆవ్ ' అనగా హిందీలో ' రా' అని అర్థము.

'రా' అనగా తెలుగులో 'రా' అనే కదా అర్థము!

'బా' అనగా కన్నడ భాషలో 'రా' అని అర్థము.

' వా' అనగా తమిళంలో 'రా' అని అర్థము.

ఈ అయిదు అక్షరాలూ అయిదు భాషలకు చెందినవి. ఈ అయిదు అక్షరములు కలిసిన పదం " ఏ ఆవ్ రా బా వా" ఇదికూడా అర్థవంతమైన పదమే!

తెనాలి రామకృష్ణుడి వివరణతో మహారాజుకు మహదానందం కలిగింది. రామకృష్ణునికి భూరి బహుమానాలు లభించాయని వేరే చెప్పాలా !

😊😊😊😊😊🤣🤣🤣🤣🤣🤣🤣

అదే ఆఖరి మాటా .. ?*

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

*నాకు నచ్చిన విజయ వెంకట కృష్ణ సుబ్బారావు పొన్నాడ గారి హాస్య కథనం.*

                 🌷🌷🌷   


*అంతేనా ... అదే ఆఖరి మాటా .. ?* 

రొక్కించి మరీ అడిగాను . 

ఒళ్ళు మండిపోతోంది. తను అడిగింది ఏనాడైనా కాదన్నానా? వేలకు వేలు పోసి ఏదడిగితే అది క్షణాల్లో తీసుకొచ్చి ఒళ్లో పోయలేదూ .. అదే అదే ఒళ్లో పెట్టలేదూ ? 

పాతికేళ్ళ ' కాపడం ' లో నాకంటూ ఏనాడన్నా ఏమైనా .. కొనుక్కున్నానా ? ఒహ వేళ ఒహటో అరో కొనుక్కున్నానే అనుకోండి ..అదన్నా నా ఇష్టప్రకారం ఏదన్నా సాగిందా హంఠ?

షష్టి పూర్తి మహోత్సవం దగ్గర కొచ్చేస్తోమ్దీ .. హేదో .. సరదాగా .. ఆ ఒక్కటీ .. కొనుక్కుంటా కాంతం ... హన్నా ... ! హంతే ! 

పోయిన ఎలక్షన్లలో రాబోయే రిజల్ట్స్ లో డిపాజిట్ కూడా రాదు సుమీ హని .. సర్వేలో చెప్పిన వాడి మీద దూకి పీక పిసకడానికి తయారైనట్లు హెంత ఆర్భాటం చేసిందీ ?

గుండె గుభేల్ మంది. హేదో .. అలవాటైన ప్రాణంకాబట్టీ తట్టుకుని కొట్టుకుంటోంది !

తను హెన్ని వెండి, బంగారు నగలూ నట్రా చేయిన్చుకోలేదూ?

హేదో ... ' తీరని కోరిక తీయ తీయగా ' అనే పాత పాట గుర్తుకొచ్చి .. మనసులోని కోరిక బయటికి తీయగా, తీయగా ... ,

' నో ... కుదరదు కాక కుదరదు అని ఘీంకరించడమే కాకుండా , హెవరన్నా వింటే నవ్వి పోతారు హంటుందా? హేంతటి అవమానం? హేంతటి అవహేళన? 

దుర్యోధనుడి ఏక పాత్రాభినయనం లో అనేకానేక సత్కారాలందుకున్న ఈ అభిమాన ధనుడికా, ఈ ఘోరాతి ఘోర హవమానం ! 

చండ ప్రచండ భానుడి తీక్షణాతి తీక్షణమైన అగ్ని కిరణాలను కూడా లెక్క చేయకుండా, పట్టుకుని, చుట్టుకుని, తట్టుకుని నిలబడ్డ ఈ మకుటం లేని మారాజు తలకట్టుని ఉన్న పళాన ఓ ప్రక్కకి నెట్టేసి తీసి గోడకి కొట్టేసినట్టు ఖాదూ? 

హెంతటి అవహేళన?  

హెంతటి అప్రదిష్ట?

'న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి' అని మహానుభావుడు మనువు ఊరికే చెప్పాడంటారా? 

ఏ పెళ్ళానికీ ... స్వాతంత్ర్యం కూడదు ! 

హదీ మనకి సలహాలు చెప్పే విషయంలో అస్సలు ఖూడదు!

ఆలీ ..... న సలహా దేనా పడేగా!

హన్తే ... మనకి కోపం నషాళానికి అంటినప్పుడు .. హిలా , రాని హిందీలో వాయించేయాలి!

బంగారం విష్యం పక్కన పెట్టేద్దాం!

వెండివి .. ఎన్ని వస్తువులు కొన్నాను?

హెన్ని ఆభరణాలు చేయించాను?

పెళ్లి రేపనఘా .. కాలి పట్టీలు హివ్వలేదూ? హిప్పుడే ఇవన్నీ హెందుకూ ... మా హమ్మ తిడుతుంది బాబూ .. అంటూ .. వయారాలు పోతూనే ... ఈ పట్టీ సరిగ్గా పట్టడం లేదు ఓ సారి చూడండి అంటూ ... నా చేత ఆ పట్టీ పెట్టిన్చుకోలేదూ? 

అదే సమయానికి హేక్కడినుండి ఊడిపడ్డాడో వాళ్ళ మావయ్య ' , " అక్కా , బావ గారూ రండి రండి .. ఈ వింత చూడండి ... మన అమ్మడిని ... అల్లుడి గారితో హప్పుడే కాళ్ళు వత్తిన్చేసుకుంటోంధీ '" అంటూ నానా రభసా చేసి నన్ను నవ్వుల పాలు చేయలేదూ ? 

వాళ్ళ వాళ్ళందరూ ... మాతల్లె , మా హమ్మే హేంత హెదిగి పోయావే .. ' హింక హప్ప గింతలప్పుడు , అనవసరంఘా ఏడవక్కర్లేకుండా చేసావ్ ..గోదారికి టైం సరిపోతుందో లేదో అనుకుంటున్నాం సుమీ .అని హెంత ఆనందపడి గెంతలేదూ ?

పిచ్చి సన్నాసిని సంసారమనే ఊబిలో పెళ్లి కి ముందే కాలేసి దిగబడి పోయాననే విషయం హప్పుడు అర్ధం అయి ఏడవ లేదు ! 

హిప్పుడేడ్చి లాభం ఏమిటి గనుఖ !!

సరే అయితే ... చేయించుకోవడం మానేస్తాలే ... హన్నా ! 

అదీ కీచు గొంతుకతో !

దానిఖీ ఒప్పుకోదే .... !

అస్సలు , మీ కేమన్నా బుద్దుందా ? హంది !

బుద్దుంటే ... నిన్నెందుకు ..... ( ధైర్యం చాలక ... మాటలు మింగేసా ) !

హేమిటీ ... బుద్దుంటే ... హన్టున్నారూ అని గదమాయించి పారేసింది ..!

అదే .. బుద్దుంటే .. ఆ కోరిక ఇప్పుడెందుకు కోరతానూ ... హన్నా ! ... అన్నా !

అస్సలు ఆ బట్టతల మీద ఉన్నవే ... గుప్పెడు వెంట్రుకలు ... పెళ్ళికీ , అవే , ఇప్పుడూ అవే ..! ( అవే ఎందుకుంటా య్ .. హెన్ని సార్లు మ్రొక్కు తీర్చుకోలేదూ .. హెన్ని సార్లు క్రొత్త వెంట్రుకలు రాలేదూ ... ? అందామనుకున్నా ఖానీ హెందు కొచ్చిన తల చిక్కు లని ఊరుకున్నా )

'ముక్కుసూటిఘా ఉందే .. 'కన్నీ ' , నిజాయితీ పరుడిలా నే ఉన్నాడు కుర్రాడు ... ఆ కళ్ళు , ఆ చూపూ చూస్తుంటే వట్టి అమాయఖ ప్రాణిలా ఉన్నాడు ! నువ్ చెప్పిందల్లా చేసేట్లానే ఉన్నాడే .. చేసేసుఖో ... అని మా వాళ్ళంతా గోలెడితే ఖాదూ మిమ్మల్ని చేసుకున్నదీ ? అంది !

అప్పటికి హేదో నన్ను ఉద్ధరించడానికే నా చేత తాళి కట్టించుకున్నట్లు !

ఆ గొడవంతా ... హిప్పుడెందుకులే హన్నా ... బుద్ధి తక్కువై !

' గొడవా .... అదీ ... నేను చేస్తున్నానా ' అని మీద పడి నంత పని చేసింది ...!

పక్కకు తప్పుకుని హమ్మయ్య అనుకుని , ఊపిరి పీల్చుకున్నా !!

ఓ నిముషం ఆగి .. నెమ్మదిగా హన్నా ... అయితే ... ఊరుకోనా , అదే ... అది చేయించుకోవడం మానేయనా ... అని .... అంతే ! 

' మళ్ళీ అదే పాట !! ఆ బోడి గుండు మీద ఉన్న నాలుగు వెంట్రుకలనీ సవరించడానికి మీకు .. ' వెండి దువ్వెన ' కావాల్సి వచ్చిందీ ? నవ్వి పోతారు ఎవరన్నా వింటే ... మీ అమ్మ గారు ... , నాకు ఆవిడ గారి ' బంగారు జడ గంటలు ' ఇచ్చారనేఘా మీ బాధ ! నా జడ చూసి , మెచ్చుకుని అవి నాచేత్తో పెట్టారు ... !

మీకూ యద్దనపూడి సులోచనా రాణి గారి నవలా నాయకుడిలా ... గిరజాల జుట్టు ఉండి ఉంటే , నేనే చేయిన్చేదాన్ని వెండివేం ఖర్మ .. బంగారం దువ్వేన్లనే ఓ డజను ... వెండి దువ్వెన కావాల్సి వచ్చిందంట .. వెండి దువ్వెన !! 

ఆ సణుగుడు ఆపి, వెళ్లి .. పుల్ల మామిడి కాయలు తెండి ఓ డజను ... పులిహారావ ఖాయ ' వేస్తాను ... మా మావయ్య వస్తా నన్నాడు .... తనకి అదంటే చాలా ఇష్టం , అని కూరల సంచీ ... ముఖాన కొట్టింది !

ఎవడితో చెప్పుకోను ... నా బాధ !! 

ఆ గోవిందు డితో తప్ప .. ఈ ఉన్న నాలుగు వెంట్రుకలనీ కూడా , ఆనందంగా మ్రొక్కు రూపంలో తీసుకునేది హాయనేఘా !! ఖానీ మళ్ళా ఆ నాలుగింటి నే ప్రసాదిస్తావేం స్వామీ ? ఈ సారన్నా గుండు నిండుగా గుత్తులు గుత్తులుఘా గిరజాల జుత్తు ని ప్రసాదించు స్వామీ ..... " అని అడిగేయాలి ... !

గోవిందా ! గోవింద !

లాభం లేదు...ఆ జటాఝాటధారినే అడగాలి .. ఓ ఝూటాన్ని మొలిపించమనీ ... ఒంటికాలిమీద నిలబడి తపస్సు చేసైనా సరే !

ఇప్పటినుంచే మొదలెట్టేస్తే పోలే ....

ఓం హర హరా .... ఓం నమః శివాయః 

      🌺🌺🌹💐🌹🌺🌺

 *డా. పొన్నాడ*

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*పొల్లుపోని మాట..*


శ్రీ స్వామివారితో మా తల్లిదండ్రుల పరిచయాని కంటే ముందుగానే శ్రీ చెక్కా కేశవులు గారికి సాన్నిహిత్యం ఉండేది..మాలకొండలో శ్రీ స్వామివారు తపోసాధన చేసే రోజుల్లో..శ్రీ స్వామివారికోసం ఒక మంచం, దోమతెర ఇత్యాదులు తీసుకొచ్చి ఇచ్చారు..శ్రీ కేశవులు గారు అత్యంత భక్తిగా శ్రీ స్వామివారిని కొలిచేవారు..తరువాత కాలంలో మా తల్లిదండ్రులు శ్రీ స్వామివారిని నమ్మి కొలవడం..అదే క్రమం లో చెక్కా కేశవులు గారు కూడా మా అమ్మా నాన్న గార్లతో పరిచయం పెంచుకొనడం జరిగిపోయాయి..శ్రీ స్వామివారు ఆశ్రమం నిర్మించుకోవడానికి శ్రీ కేశవులు గారు విజయవాడ వద్ద స్థలం ఇస్తామన్నారు.. కానీ శ్రీ స్వామివారు సున్నితంగా తిరస్కరించారు..మొగలిచెర్ల లోని ఫకీరు మాన్యాన్ని తన ఆశ్రమ వాసానికి అనువైనది అని నిర్ధారించుకొని..అక్కడ ఆశ్రమం నిర్మాణం చేశారు..ఆశ్రమ నిర్మాణానికి శ్రీ బొగ్గవరపు మీరాశెట్టి దంపతులు ఆర్ధిక సహకారం అందించారు..


శ్రీ స్వామివారు మొగలిచెర్ల లో ఆశ్రమం లో స్థిరపడ్డ తరువాత..శ్రీ కేశవులు గారు తరచూ మొగలిచెర్ల వచ్చేవారు..మా ఇంట్లోనే బస చేసేవారు..అలానే శ్రీ మీరాశెట్టి దంపతులు కూడా వచ్చి వెళ్లేవారు.. నావరకూ నాకు, అటు కేశవులు గారివద్ద కానీ...ఇటు మీరాశెట్టి గారి వద్ద కానీ బాగా చనువు ఉండేది..వాళ్ళూ నన్ను ఆదరించేవారు..ఎప్పుడైనా మొగలిచెర్ల లోని మా ఇంటివద్ద నుండి శ్రీ స్వామివారి ఆశ్రమానికి వెళ్ళడానికి మా తల్లిదండ్రులకు వీలు కుదరని పక్షంలో..కేశవులు గారితో కలిసి నేను ఆశ్రమానికి వెళ్ళేవాడిని..కేశవులు గారికోసం నాన్నగారు గూడుబండి (ఎడ్ల బండి) సిద్ధం చేయించేవారు..మీరాశెట్టి గారు వాళ్ళ ఊరు నుండి వచ్చే దారిలోనే శ్రీ స్వామివారి ఆశ్రమం ఉండేది కనుక..వారు వస్తూ వస్తూ నే శ్రీ స్వామివారి ఆశ్రమం వద్ద కలిసి వచ్చేవారు..మీరాశెట్టి దంపతులు ఎన్నడూ ఎడ్లబండి ఎక్కేవారు కాదు..ఆ దంపతులిద్దరూ కాలినడకనే (సుమారు పదకొండు కిలోమీటర్లు రానూ..మళ్లీ అంతే దూరం పోనూ..) వచ్చి వెళ్లేవారు..


ఒకసారి శ్రీ కేశవులు గారు శ్రీ స్వామివారిని దర్శించుకోవడానికి మొగలిచెర్ల వస్తూ ఉండగా..కందుకూరు లో వారికొక మనిషి పరిచయం అయ్యాడు..మాటల సందర్భం లో అతనికి వివాహం జరిగి ఏడు సంవత్సరాలైందనీ..సంతానం కలుగ లేదనీ..తాను తన భార్యా దిగులు చెందుతున్నామనీ చెప్పాడు..(1975 నాటి ముచ్చట ఇది)..అతని పేరు హరి చౌదరి.. శ్రీ కేశవులు గారు తాను మొగలిచెర్ల లో తపస్సు చేసుకుంటున్న శ్రీ దత్తాత్రేయ స్వామివారిని కలవడానికి వెళుతున్నాననీ..తనతో పాటు వచ్చి, ఆ స్వామివారి దగ్గర ఆశీర్వాదం పొందితే..ఫలితం ఉంటుందనీ చెప్పారు..అతనూ సరే నన్నాడు..ఇద్దరూ కలిసి, మొగలిచెర్ల బస్ ఎక్కి వచ్చేసారు..మా ఇంటికి వచ్చిన తరువాత..శ్రీ కేశవులు గారికోసం నాన్నగారు బండి కట్టించారు..కేశవులు గారు నన్నూ తనతో రమ్మన్నారు..నేనూ ఉత్సాహంగా బయలుదేరాను..కేశవులు గారు, వారితోపాటు హరి చౌదరి, వీళ్లద్దరితో పాటు నేనూ ముగ్గురం శ్రీ స్వామివారి ఆశ్రమానికి సాయంత్రం ఐదు గంటలకు చేరాము..శ్రీ స్వామివారు ధ్యానం లో వున్నారు..గది తలుపులు వేసి ఉన్నాయి..గంట గడిచింది..రెండు గంటలు పూర్తి అయ్యాయి..శ్రీ స్వామివారు బైటకు రాలేదు..చీకటి పడింది..ఆశ్రమం లో ఉన్న వంట గదిలోంచి లాంతరు తీసుకొచ్చి వెలిగించాను..మరో గంట గడిచింది..శ్రీ స్వామివారు రాలేదు..ఇక ఈరోజుకు శ్రీ స్వామివారిని కలిసే అవకాశం లేదని ముగ్గురమూ వెనక్కు వచ్చేసాము..


ఆరోజు రాత్రికే హరి చౌదరి తనకు శ్రీ స్వామివారి వద్ద ఆశీర్వాదం పొందే ప్రాప్తం లేదని..పైగా తెల్లవారి అత్యవసర పనులున్నాయనీ..రాత్రికే ఆఖరి బస్ కు కందుకూరు వెళ్ళిపోయాడు..తెల్లవారింది..మళ్లీ శ్రీ కేశవులు గారు ఆశ్రమానికి వెళ్ళొస్తానన్నారు..బండి సిద్ధం కాగానే..కేశవులు గారు, నేనూ ఇద్దరమూ ఆశ్రమానికి వచ్చాము..చిత్రంగా శ్రీ స్వామివారు ఆశ్రమ బైట నిలబడి వున్నారు..శ్రీ కేశవులు గారిని చూడగానే..

"కేశవులు గారూ..నన్ను ప్రశ్నలు చెప్పేవాడిగా మారుద్దామనుకుంటున్నారా?..తలరాతను నేను మార్చగలనా?..." అన్నారు..


కొంచెం సేపు కేశవులు గారు మౌనంగా వుండి.."స్వామీ..అతను చాలా బాధపడుతుంటే..చూడలేక మీ వద్దకు తీసుకొచ్చాను..మీరు ఆశీర్వదిస్తే..అతనికి సంతానం కలుగుతుందని నేనే నచ్చ చెప్పాను..తీరా ఇక్కడికొస్తే..మీరు ధ్యానం లో వున్నారు.." అన్నారు..


స్వామివారు పెద్దగా నవ్వి.."నేను చేసేదేముంది..అతనికి సంతానయోగం ఉంది..మరో ఏడాది కి పిల్లలు పుడతారు..ఆ మాటే చెప్పండి మీరు..పిల్లలు పుట్టిన తరువాత ఈ ఆశ్రమానికి వచ్చి ఆశీర్వాదం పొందమని చెప్పండి.." అన్నారు..ఆ తరువాత కేశవులు గారితో దాదాపు గంటసేపు ఇతర విషయాలు మాట్లాడారు..కేశవులు గారు కూడా ఎంతో సంతోషం తో, తృప్తితో..శ్రీ స్వామివారికి నమస్కారం చేసుకున్నారు..నేనూ శ్రీ స్వామివారి పాదాలకు నమస్కారం చేసాను..

"చదువుకోసం ఎప్పుడు కనిగిరి కి పోతున్నావు?.." అని నన్ను అడిగారు.."వచ్చే ఆదివారం దాకా సెలవులున్నాయి..ఆదివారం మధ్యాహ్నం వెళతాను.." అన్నాను.."వెళ్లేముందు రోజు మీ అమ్మానాన్న తో పాటు ఇక్కడకు రా!" అన్నారు..సరే అన్నాను..


శ్రీ కేశవులు గారు ఆరోజు తిరిగి విజయవాడ వెళ్లిపోయారు ..పోతూ పోతూ కందుకూరు లో హరిచౌదరి కి శ్రీ స్వామివారు చెప్పిన మాట చెప్పి వెళ్లారు..ఆ ప్రక్క సంవత్సరం అనగా 1976, మే 6వతేదీ శ్రీ స్వామివారు సిద్ధిపొందారు..తరువాత ఆగస్ట్ నెలలో హరి చౌదరి కి మొదటి సంతానంగా అమ్మాయి పుట్టింది..మరో మూడు నెలలకు హరి చౌదరి దంపతులు బిడ్డనెత్తుకొని శ్రీ స్వామివారి మందిరానికి వచ్చి..శ్రీ స్వామివారి సమాధి వద్ద బిడ్డను పడుకోబెట్టి..కన్నీళ్లు పెట్టుకున్నాడు..


శ్రీ స్వామివారు చెప్పిన మాట పొల్లుపోలేదు.."సంతానం కలిగిన తరువాత ఆశ్రమానికి వచ్చి ఆశీర్వాదం పొందమని " చెప్పారే కానీ..తాను నేరుగా కలుస్తానని చెప్పలేదు..హరి చౌదరి తన కూతురికి "దత్త లక్ష్మి" అని పేరు పెట్టుకున్నాడు..


శ్రీ కేశవులు గారు మొగలిచెర్ల వచ్చినప్పుడు..ప్రతిసారీ ఈ సంఘటన గుర్తు చేసుకునే వారు..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).

ప్రక్కవాళ్ళ పూలతో పూజ చేస్తే ఏమొస్తుంది....

 *ప్రక్కవాళ్ళ పూలతో పూజ చేస్తే ఏమొస్తుంది.....*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*రోజూ ఉదయమే చాలా మంది పూజ కోసమని ప్రక్కవాళ్ళ దొడ్లో పూలు కోసేస్తూ కనపడుతుంటారు. కొంత మంది ఐతే వాకింగ్ కి అని వెల్తూ కూడా ఒక కవరు పట్టికెళ్ళి దారిలో కనపడ్డ మొక్కల పువ్వులన్నీ కోసేస్తుంటారు. ఒకవేళ ఆ ఇంటివాళ్ళు వద్దన్నా.. లేదా వీళ్ళకేసి చూస్తున్నా.. వీళ్ళు వాళ్ళ కేసి చాలా సీరియస్ గా పాపాత్ములని చూసినట్టు చూస్తూ చాలా బిల్డప్ ఇస్తుంటారు. ఇవన్నీ రోజూ మనకి కనపడే దృశ్యాలే...*


*మరి నిజంగా ప్రక్కవాళ్ళ పూలు కోసి చేసే పూజకి ఏమి ఫలితం వస్తుంది, దీని గురించి శాస్త్రాలు ఏమంటున్నాయి ???*


*నిజానికి ఆ మొక్కల యజమానికి కూడా మొత్తం పూలు కోసే అధికారం లేదు. దేవుని పూజకోసమని మొక్కని ప్రార్దించి.. కొద్ది పూలు మాత్రమే కోసుకోవాలి. మొత్తానికి అన్నీ కోసేసి బోసి మొక్కల్లా ఉంచడం మహా పాపం.*


*ప్రక్కవాళ్ళని అడగకుండా పూలు కోసేయడం దొంగతనం క్రిందకి వస్తుంది. అందుకు శిక్షగా మళ్ళీజన్మలో వారు భయంకరమైన అడవిలో కోతిలా పుడతారు. కోసినప్పుడల్లా అడిగి కోస్తుండాలి. ఒక వేళ వాళ్ళు ఒప్పుకుంటే, అప్పుడు కూడా మొక్కల యజమానికి పూజలో సగం పుణ్యం వెళ్ళీపోతుంది.. ఈ విషయాలు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు స్వయంగా తన మాటలుగా గరుడ పురాణంలో గరుడునికి చెప్పారు. ఈ శ్లోకం చూడండి...*


*తాంబూల ఫల పుష్పాది హర్తాస్యా ద్వానరో వనే |*

*ఉపానతృణ కార్పాసహర్తాస్సా న్మేష యోనిషు ||*


*తాత్పర్యం...*


*తాంబూలము, ఫలములు, పుష్పములు మొదలగు వానిని అపహరించినవాడు అడవిలో కోతిగాను. పాదుకలు, గడ్డి, ప్రత్తి మొదలగు వానిని అపహరించినవాడు మేక జన్మముగాను పుట్టుచుందురు.*


*మరి పూజ చేస్తే పుణ్యం రావాలి, దానివల్ల మోక్షం, ముక్తి కలగాలి. లేదా కనీసం వచ్చే జన్మలో ఇంకా మంచి పుణ్యవంతమైన జీవితం కలగాలి. నిజానికి మానవ జన్మ యొక్క ఏకైక లక్ష్యం ముక్తిని పొందడమే.. ఇక జన్మలనేవే లేని విధంగా ఆ భగవంతుని శాశ్వతమైన వైకుంఠం చేరుకొంటాం. అది కేవలం మనిషి జన్మలో మాత్రమే సాధ్యం, ఇక ఏ ఇతర జన్మలలోనూ సాధ్యమే కాదు.*


*మరి ప్రక్కవాళ్ళ పూలు కోసేసి చేసే పూజలు వల్ల పుణ్యం సంగతి అటు ఉంచి వచ్చే జన్మలో జంతువుగానే పుట్టాల్సివస్తొందే.. ఒక్కసారి మానవ జన్మ తప్పిపోతే మళ్ళీ ఎన్నో వేల జన్మల తర్వాత గానీ మనిషిగా పుట్టే అవకాసమే రాదే.. మరి ఇలాంటి పూజలు మనకి అవసరమా.. ఒక్కాసారి ఆలోచించండి. తెలియని వారికి తెలియచేసి వారికి సాయం చేయండి...*


*హరే కృష్ణ*💐💐___________________________________

👉 *ఈ గ్రూపులో(మన సనాతన ధర్మ పరిరక్షణ)* 

1.భగవద్గీత, 2.భాగవతం,3.మహాభారతం, 4.ధర్మానికి సంబందించిన సమాచారం, 

5.గురు వాక్యాములు,7.గురు సందేశము (పరంపరలో ఉన్న ఆచార్యుల నుండి) 6.ఉదయం భగవంతుని శృంగార దర్శనము, 

7.రాత్రి శయన దర్శనములు, 

8.ధర్మ సూక్తులు మొదలగునవి....... ఇలా ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మీకు మా బృందం ఎప్పుడు పంపుతూ ఉంటుంది సహకరించండి.

___________________________________

👉ఇవన్నీ 

*మన సనాతన ధర్మ పరిరక్షణలో* గ్రూపులో పొందవచ్చును.

మీరు మన గ్రూపులో చేరండి పది మందికి పంచండి.మీరు ఆధ్యాత్మికముగా వృద్ధి అవ్వాలి.

------------------------------------------------------

🕉️ *మన సనాతనధర్మాన్ని గురించి తెలుసుకుందాం, ఆచారిద్దాం, ప్రపంచ శాంతిని కోరుకుందాం* 🕉️

☘️మీ సేవలో ఎప్పుడు

 *మహేశ్వర్ దాస్* మరియు *బృందము* 🙏 

_____________________________________

శ్రీమద్భాగవతము

 *06.08.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2222(౨౨౨౨)*


*10.1-1323-వ.*

*10.1-1324-*


*మ. కరిదంతంబులు మూఁపులందు మెఱయన్ ఘర్మాంబువుల్ మోములన్*

*నెరయన్ గోపకు లంతనంత మెలయన్ నిత్యాహవస్థేము లా*

*హరిరాముల్ చనుదెంచి కాంచిరి మహోగ్రాడంబరాపూరితా*

*మర మర్త్యాది జనాంతరంగము లసన్మల్లావనీరంగమున్.*



*_భావము: ఆపై రక్తసిక్తమైన ఆ దంతాలతోనే మావటిలను కూడా యమపురికి పంపి, చెమటబిందువులు ముఖమండలముమీద మెరుస్తుండగా, ఆ దంతాలను భుజాన వేసుకుని, యుద్ధములో స్థిర పరాక్రమము గల బలరామకృష్ణులు వస్తున్నారు. గోపాలకులచే పరివేష్టింపబడి వేంచేస్తున్న ఆ అపూర్వ సోదరులు యుద్ధభేరీ ధ్వనులతో దేవతలకు, మానవులకు కూడా ఆందోళన కలిగించే మల్లరంగస్థలిని చూశారు._* 🙏



*_Meaning: Balarama and Sri Krishna finished off those defiant mahouts using the bloody tusks and along with the beaming cowherds, the victorious pair entered the wrestling arena with the tusks on their shoulders and sweat shining on those beautiful faces. The wrestling ring and the surroundings are reverberating with horrid continuous din of noise emanating from trumpets and other instruments and creating dread and fear in the men and other celestial beings._* 🙏🏻



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan Kumar (9347214215).*

ముకుందమాల స్తోత్రమ్ శ్లోకం : 11

 ॐ मुकुन्दमाला स्तोत्रम्   

           ముకుందమాల స్తోత్రమ్ 

       Mukunda Mala Stotram    


                                   శ్లోకం : 11      

                           SLOKAM : 11  

                                                

माभीर्मन्दमनो विचिन्त्य बहुधा यामीश्चिरं 

                                         यातनाः      

नामी नः प्रभवन्ति पापरिपवः स्वामी 

                                    ननु श्रीधरः ।  

आलस्यं व्यपनीय भक्तिसुलभं ध्यायस्व       

                                       नारायणं     

लोकस्य व्यसनापनोदनकरो दासस्य 

                                    किं न क्षमः ॥ ११॥


మాభీర్మందమనో విచింత్య బహుధా 

                    యామీశ్చిరం యాతనా:  

నామీ న: ప్రభవంతి పాపరిపవ: 

                        స్వామీ నను శ్రీధర: I 

ఆలస్యం వ్యపనీయ భక్తిసులభం 

                    ధ్యాయస్య నారాయణం 

లోకస్య వ్యసనాపనోదనకరో 

                        దాసస్య కిం న క్షమః ॥     


ఓ మూఢమైన మనసా! 

    యమ యాతనలను పలువిధముల చిరకాలము చింతించి భీతినొందకుము. 

    మన ప్రభువగు శ్రీహరి ఉండగా ఈ పాపములనెడి శతృవులు మనలను ఏమియూ చేయలేవు.    

    కావున భక్తిచే సులభముగా పొందదగు నారాయణుని జాగుచేయక ధ్యానింపుము.    

   లోకములో అందరి ఆపదలను తీర్చువాడు, తనదాసుని ఆపదలు తొలగింపలేడా !


O foolish mind!    

    stop your fearful fretting about the extensive torments imposed by Yamarāja. 

    How can your enemies, the sinful reactions you have accrued, even touch you?    

    After all, is your master not the Supreme Lord, the husband of Goddess Śrī?    

    Cast aside all hesitation and concentrate your thoughts on Lord Nārāyaṇa,    

    whom one very easily attains through devotional service. 

    What can that dispeller of the whole world’s troubles not do for His own servant?  


https://youtu.be/ZTs6tcgm0lE  


                                        కొనసాగింపు  


                    =x=x=x=    


    — రామాయణంశర్మ    

             భద్రాచలం

శ్రీ దేవరాహా బాబా ( దేవరియా బాబా ) చరిత్ర - 1

 🌹🤘🌹🤘🌹🤘🌹🤘🌹🤘🌹

*శ్రీ పాద రాజం శరణం ప్రపద్యే*

_"ఓం దేవరాహాయ దిగంబరాయ మంచాసీనాయ నమో నమః."_

*బ్రహ్మర్షి శ్రీ దేవరాహా బాబా ( దేవరియా బాబా ) చరిత్ర - 1 వ భాగం*


అనంత శక్తి సంపన్నమూ, ఆధ్యాత్మిక వైభవోపేతమూ అయిన పవిత్ర ధరిత్రి ఈ భరతభూమి. మహాత్ములకు, సిద్ధులకు, మహిమాన్వితులకు ఆవాసమిది. వివిధ కాలములలో వివిధ సంప్రదాయములకు చెందిన మహనీయులు ఉద్భవించి- తమ శక్తితో, సామర్థ్యముతో విశ్వమునకు శాంతిని ప్రబోధించారు. అయితే ఇందులో కాలాతీతులు అనిర్వచనీయ శక్తి సంపన్నులు అయిన మహా యోగులు కొంతమంది. వారిలో _*సుప్రసిద్ధులు బ్రహ్మర్షి యోగిసామ్రాట్ శ్రీ దేవరాహా బాబా 🤘*_ ఒకరు.


రాధాకృష్ణుల పవిత్ర పాదస్పర్శతో పునీతమైన ప్రాంతము బృందావనము. సుందర యమునా నదిలో ఒక సుందర మందిరమున దర్శకులందరి చూపు ఒక భవ్యమైన, దివ్యమైన మూర్తి పై ఉన్నాయి అది విగ్రహమే కానీ అందరికీ అభయప్రదానము చేస్తూ ఉన్న సజీవ మూర్తియా అన్నట్లు ఉన్నది. ఆ దివ్య మందిరము మరెవరిదో కాదు ... *శ్రీ దేవరాహా బాబా సమాధి మందిరము*. _అది విగ్రహం కాదు సాక్షాత్తు శ్రీ దేవరాహా బాబాయే._


జ్ఞాన వృద్ధుడిగా, గొప్ప యోగ సాధకునిగా, కల్పాంతర యోగిగా, ఆశ్రితులకు ఆనంద ప్రదాతగా, ఆర్తత్రాణ పరాయణుడిగా, భక్తుల పాలిటి భగవంతునిగా లోకంలో ఆరాధనలను అందుకుంటున్న దివ్య భవ్య స్వరూపం శ్రీ దేవరాహా బాబా. 

*జననమన్నదే లేని శరీరంతో దాదాపు 900 సంవత్సరాలు ఆర్తులనందరినీ అనుగ్రహించిన ఆ మహనీయుని జీవితంలోని అద్భుత విశేషాలను, ఆశ్చర్యపరిచే అనుభవాలను ఆస్వాదించి, ఆనందిద్దాం....!*🙏

*అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త*


🌹🤘🌹🤘🌹🤘🌹🤘🌹🤘🌹

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*పొల్లుపోని మాట..*


శ్రీ స్వామివారితో మా తల్లిదండ్రుల పరిచయాని కంటే ముందుగానే శ్రీ చెక్కా కేశవులు గారికి సాన్నిహిత్యం ఉండేది..మాలకొండలో శ్రీ స్వామివారు తపోసాధన చేసే రోజుల్లో..శ్రీ స్వామివారికోసం ఒక మంచం, దోమతెర ఇత్యాదులు తీసుకొచ్చి ఇచ్చారు..శ్రీ కేశవులు గారు అత్యంత భక్తిగా శ్రీ స్వామివారిని కొలిచేవారు..తరువాత కాలంలో మా తల్లిదండ్రులు శ్రీ స్వామివారిని నమ్మి కొలవడం..అదే క్రమం లో చెక్కా కేశవులు గారు కూడా మా అమ్మా నాన్న గార్లతో పరిచయం పెంచుకొనడం జరిగిపోయాయి..శ్రీ స్వామివారు ఆశ్రమం నిర్మించుకోవడానికి శ్రీ కేశవులు గారు విజయవాడ వద్ద స్థలం ఇస్తామన్నారు.. కానీ శ్రీ స్వామివారు సున్నితంగా తిరస్కరించారు..మొగలిచెర్ల లోని ఫకీరు మాన్యాన్ని తన ఆశ్రమ వాసానికి అనువైనది అని నిర్ధారించుకొని..అక్కడ ఆశ్రమం నిర్మాణం చేశారు..ఆశ్రమ నిర్మాణానికి శ్రీ బొగ్గవరపు మీరాశెట్టి దంపతులు ఆర్ధిక సహకారం అందించారు..


శ్రీ స్వామివారు మొగలిచెర్ల లో ఆశ్రమం లో స్థిరపడ్డ తరువాత..శ్రీ కేశవులు గారు తరచూ మొగలిచెర్ల వచ్చేవారు..మా ఇంట్లోనే బస చేసేవారు..అలానే శ్రీ మీరాశెట్టి దంపతులు కూడా వచ్చి వెళ్లేవారు.. నావరకూ నాకు, అటు కేశవులు గారివద్ద కానీ...ఇటు మీరాశెట్టి గారి వద్ద కానీ బాగా చనువు ఉండేది..వాళ్ళూ నన్ను ఆదరించేవారు..ఎప్పుడైనా మొగలిచెర్ల లోని మా ఇంటివద్ద నుండి శ్రీ స్వామివారి ఆశ్రమానికి వెళ్ళడానికి మా తల్లిదండ్రులకు వీలు కుదరని పక్షంలో..కేశవులు గారితో కలిసి నేను ఆశ్రమానికి వెళ్ళేవాడిని..కేశవులు గారికోసం నాన్నగారు గూడుబండి (ఎడ్ల బండి) సిద్ధం చేయించేవారు..మీరాశెట్టి గారు వాళ్ళ ఊరు నుండి వచ్చే దారిలోనే శ్రీ స్వామివారి ఆశ్రమం ఉండేది కనుక..వారు వస్తూ వస్తూ నే శ్రీ స్వామివారి ఆశ్రమం వద్ద కలిసి వచ్చేవారు..మీరాశెట్టి దంపతులు ఎన్నడూ ఎడ్లబండి ఎక్కేవారు కాదు..ఆ దంపతులిద్దరూ కాలినడకనే (సుమారు పదకొండు కిలోమీటర్లు రానూ..మళ్లీ అంతే దూరం పోనూ..) వచ్చి వెళ్లేవారు..


ఒకసారి శ్రీ కేశవులు గారు శ్రీ స్వామివారిని దర్శించుకోవడానికి మొగలిచెర్ల వస్తూ ఉండగా..కందుకూరు లో వారికొక మనిషి పరిచయం అయ్యాడు..మాటల సందర్భం లో అతనికి వివాహం జరిగి ఏడు సంవత్సరాలైందనీ..సంతానం కలుగ లేదనీ..తాను తన భార్యా దిగులు చెందుతున్నామనీ చెప్పాడు..(1975 నాటి ముచ్చట ఇది)..అతని పేరు హరి చౌదరి.. శ్రీ కేశవులు గారు తాను మొగలిచెర్ల లో తపస్సు చేసుకుంటున్న శ్రీ దత్తాత్రేయ స్వామివారిని కలవడానికి వెళుతున్నాననీ..తనతో పాటు వచ్చి, ఆ స్వామివారి దగ్గర ఆశీర్వాదం పొందితే..ఫలితం ఉంటుందనీ చెప్పారు..అతనూ సరే నన్నాడు..ఇద్దరూ కలిసి, మొగలిచెర్ల బస్ ఎక్కి వచ్చేసారు..మా ఇంటికి వచ్చిన తరువాత..శ్రీ కేశవులు గారికోసం నాన్నగారు బండి కట్టించారు..కేశవులు గారు నన్నూ తనతో రమ్మన్నారు..నేనూ ఉత్సాహంగా బయలుదేరాను..కేశవులు గారు, వారితోపాటు హరి చౌదరి, వీళ్లద్దరితో పాటు నేనూ ముగ్గురం శ్రీ స్వామివారి ఆశ్రమానికి సాయంత్రం ఐదు గంటలకు చేరాము..శ్రీ స్వామివారు ధ్యానం లో వున్నారు..గది తలుపులు వేసి ఉన్నాయి..గంట గడిచింది..రెండు గంటలు పూర్తి అయ్యాయి..శ్రీ స్వామివారు బైటకు రాలేదు..చీకటి పడింది..ఆశ్రమం లో ఉన్న వంట గదిలోంచి లాంతరు తీసుకొచ్చి వెలిగించాను..మరో గంట గడిచింది..శ్రీ స్వామివారు రాలేదు..ఇక ఈరోజుకు శ్రీ స్వామివారిని కలిసే అవకాశం లేదని ముగ్గురమూ వెనక్కు వచ్చేసాము..


ఆరోజు రాత్రికే హరి చౌదరి తనకు శ్రీ స్వామివారి వద్ద ఆశీర్వాదం పొందే ప్రాప్తం లేదని..పైగా తెల్లవారి అత్యవసర పనులున్నాయనీ..రాత్రికే ఆఖరి బస్ కు కందుకూరు వెళ్ళిపోయాడు..తెల్లవారింది..మళ్లీ శ్రీ కేశవులు గారు ఆశ్రమానికి వెళ్ళొస్తానన్నారు..బండి సిద్ధం కాగానే..కేశవులు గారు, నేనూ ఇద్దరమూ ఆశ్రమానికి వచ్చాము..చిత్రంగా శ్రీ స్వామివారు ఆశ్రమ బైట నిలబడి వున్నారు..శ్రీ కేశవులు గారిని చూడగానే..

"కేశవులు గారూ..నన్ను ప్రశ్నలు చెప్పేవాడిగా మారుద్దామనుకుంటున్నారా?..తలరాతను నేను మార్చగలనా?..." అన్నారు..


కొంచెం సేపు కేశవులు గారు మౌనంగా వుండి.."స్వామీ..అతను చాలా బాధపడుతుంటే..చూడలేక మీ వద్దకు తీసుకొచ్చాను..మీరు ఆశీర్వదిస్తే..అతనికి సంతానం కలుగుతుందని నేనే నచ్చ చెప్పాను..తీరా ఇక్కడికొస్తే..మీరు ధ్యానం లో వున్నారు.." అన్నారు..


స్వామివారు పెద్దగా నవ్వి.."నేను చేసేదేముంది..అతనికి సంతానయోగం ఉంది..మరో ఏడాది కి పిల్లలు పుడతారు..ఆ మాటే చెప్పండి మీరు..పిల్లలు పుట్టిన తరువాత ఈ ఆశ్రమానికి వచ్చి ఆశీర్వాదం పొందమని చెప్పండి.." అన్నారు..ఆ తరువాత కేశవులు గారితో దాదాపు గంటసేపు ఇతర విషయాలు మాట్లాడారు..కేశవులు గారు కూడా ఎంతో సంతోషం తో, తృప్తితో..శ్రీ స్వామివారికి నమస్కారం చేసుకున్నారు..నేనూ శ్రీ స్వామివారి పాదాలకు నమస్కారం చేసాను..

"చదువుకోసం ఎప్పుడు కనిగిరి కి పోతున్నావు?.." అని నన్ను అడిగారు.."వచ్చే ఆదివారం దాకా సెలవులున్నాయి..ఆదివారం మధ్యాహ్నం వెళతాను.." అన్నాను.."వెళ్లేముందు రోజు మీ అమ్మానాన్న తో పాటు ఇక్కడకు రా!" అన్నారు..సరే అన్నాను..


శ్రీ కేశవులు గారు ఆరోజు తిరిగి విజయవాడ వెళ్లిపోయారు ..పోతూ పోతూ కందుకూరు లో హరిచౌదరి కి శ్రీ స్వామివారు చెప్పిన మాట చెప్పి వెళ్లారు..ఆ ప్రక్క సంవత్సరం అనగా 1976, మే 6వతేదీ శ్రీ స్వామివారు సిద్ధిపొందారు..తరువాత ఆగస్ట్ నెలలో హరి చౌదరి కి మొదటి సంతానంగా అమ్మాయి పుట్టింది..మరో మూడు నెలలకు హరి చౌదరి దంపతులు బిడ్డనెత్తుకొని శ్రీ స్వామివారి మందిరానికి వచ్చి..శ్రీ స్వామివారి సమాధి వద్ద బిడ్డను పడుకోబెట్టి..కన్నీళ్లు పెట్టుకున్నాడు..


శ్రీ స్వామివారు చెప్పిన మాట పొల్లుపోలేదు.."సంతానం కలిగిన తరువాత ఆశ్రమానికి వచ్చి ఆశీర్వాదం పొందమని " చెప్పారే కానీ..తాను నేరుగా కలుస్తానని చెప్పలేదు..హరి చౌదరి తన కూతురికి "దత్త లక్ష్మి" అని పేరు పెట్టుకున్నాడు..


శ్రీ కేశవులు గారు మొగలిచెర్ల వచ్చినప్పుడు..ప్రతిసారీ ఈ సంఘటన గుర్తు చేసుకునే వారు..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).

సామెతలు

 🌼🌷🌼209. సామెతలు.🌞. మీకోసం 

👍మరుగున(మడుగున)పడుతున్న.

  కొన్ని తెలుగు సామెతలు.

-Please Share all Telugu People


1. అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు

2. అంబలి తాగే వారికి మీసాలు యెగబట్టేవారు కొందరా

3. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ

4. అత్తలేని కోడలుత్తమురాలు కోడల్లేని అత్త గుణవంతురాలు

5. అనువు గాని చోట అధికులమనరాదు

6. అభ్యాసం కూసు విద్య

7. అమ్మబోతే అడివి కొనబోతే కొరివి

8. అయితే ఆదివారం కాకుంటే సోమవారం

9. ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం

10. ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత

11. ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు

12. ఇంట గెలిచి రచ్చ గెలువు

13. ఇల్లు పీకి పందిరేసినట్టు

14. ఎనుబోతు మీద వాన కురిసినట్టు

15. చెవిటి వాని ముందు శంఖమూదినట్టు

16. కందకు లేని దురద కత్తిపీటకెందుకు

17. కత్తిపోటు తప్పినా కలంపోటు తప్పదు

18. కుక్క కాటుకు చెప్పుదెబ్బ

19. కోటి విద్యలూ కూటి కొరకే

20. నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు

21. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం

22. పిట్ట కొంచెం కూత ఘనం

23. రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు

24. వాన రాకడ ప్రాణపోకడ ఎవరి కెరుక

25. కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదు

26. మింగమెతుకులేదు మీసాలకు సంపంగి నూనె

27. ఆడబోయిన తీర్థము యెదురైనట్లు

28. ఆడలేక మద్దెల వోడు అన్నట్లు

29. ఆది లొనే హంస పాదు

30. ఏమీ లేని యెడారిలో ఆముదము చెట్టే మహా వృక్షము

31. ఆకలి రుచి యెరుగదు నిద్ర సుఖమెరుగదు

32. ఆకాశానికి హద్దే లేదు

33. ఆలస్యం అమృతం విషం

34. ఆరే దీపానికి వెలుగు యెక్కువ

35. ఆరోగ్యమే మహాభాగ్యము

36. ఆవులింతకు అన్న ఉన్నాడు కాని తుమ్ముకు తమ్ముడు లేడంట

37. ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా?

38. అబద్ధము ఆడినా అతికినట్లు ఉండాలి

39. అడగందే అమ్మైనా అన్నము పెట్టదు

40. అడ్డాల నాడు బిడ్డలు కాని గడ్డాల నాడు కాదు

41. ఏ ఎండకు ఆ గొడుగు

42. అగ్నికి వాయువు తోడైనట్లు

43. ఐశ్వర్యమొస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమంటాడు

44. అందని మామిడిపండ్లకు అర్రులు చాచుట

45. అందితే జుట్టు అందక పోతే కాళ్ళు

46. అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుడి నోట్లో శని ఉన్నట్లు

47. అన్నపు చొరవే గాని అక్షరపు చొరవ లేదు

48. అప్పు చేసి పప్పు కూడు

49. అయ్య వారు వచ్చే వరకు అమావాస్య ఆగుతుందా

50. అయ్యవారిని చెయ్యబొతే కోతి బొమ్మ అయినట్లు

51. బతికుంటే బలుసాకు తినవచ్చు

52. భక్తి లేని పూజ పత్రి చేటు

53. బూడిదలో పోసిన పన్నీరు

54. చాదస్తపు మొగుడు చెబితే వినడు,

గిల్లితే యేడుస్తాడు

55. చాప కింద నీరులా

56. చచ్చినవాని కండ్లు చారెడు

57. చదివేస్తే ఉన్నమతి పోయినట్లు

58. విద్య లేని వాడు వింత పశువు

59. చేతకానమ్మకే చేష్టలు ఎక్కువ

60. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు

61. చక్కనమ్మ చిక్కినా అందమే

62. చెడపకురా చెడేవు

63. చీకటి కొన్నాళ్ళువెలుగు కొన్నాళ్ళు

64. చెరువుకి నీటి ఆశ నీటికి చెరువు ఆశ

65. చింత చచ్చినా పులుపు చావ లేదు

66. చింతకాయలు అమ్మేదానికి సిరిమానం వస్తే,

ఆ వంకర టింకరవి యేమి కాయలని అడిగిందట

67. చిలికి చిలికి గాలివాన అయినట్లు

68. డబ్బుకు లోకం దాసోహం

69. దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడు

70. దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళ వాన

71. దాసుని తప్పు దండంతో సరి

72. దెయ్యాలు వేదాలు పలికినట్లు

73. దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు

74. దొంగకు దొంగ బుద్ధి, దొరకు దొర బుద్ధి

75. దొంగకు తేలు కుట్టినట్లు

76. దూరపు కొండలు నునుపు

77. దున్నపోతు మీద వర్షం కురిసినట్లు

78. దురాశ దుఃఖమునకు చెటు

79. ఈతకు మించిన లోతే లేదు

80. ఎవరికి వారే యమునా తీరే

81. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు

82. గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపడితే, ఒంటె అందానికి గాడిద మూర్ఛ పోయిందంట

83. గాజుల బేరం భోజనానికి సరి

84. గంతకు తగ్గ బొంత

85. గతి లేనమ్మకు గంజే పానకం

86 గోరు చుట్టు మీద రోకలి పోటు

87. గొంతెమ్మ కోరికలు

88. గుడ్డి కన్నా మెల్ల మేలు

89. గుడ్డి యెద్దు చేలో పడినట్లు

90. గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు

91. గుడినే మింగే వాడికి లింగమొక లెఖ్ఖా

92. గుడిని గుడిలో లింగాన్నీ మింగినట్లు

93. గుడ్ల మీద కోడిపెట్ట వలే

94. గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నాడట

95. గుర్రము గుడ్డిదైనా దానాలో తక్కువ లేదు

96. గురువుకు పంగనామాలు పెట్టినట్లు

97. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్లు

98. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు

99. ఇంటి పేరు కస్తూరివారు వీధిలో గబ్బిలాల కంపు

100. ఇంటికన్న గుడి పదిలం

101. ఇసుక తక్కెడ పేడ తక్కెడ

102. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందంట

103. కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు

104. కాగల కార్యము గంధర్వులే తీర్చినట్లు

105. కాకి ముక్కుకు దొండ పండు

106. కాకి పిల్ల కాకికి ముద్దు

107. కాలం కలిసి రాక పోతే కర్రే పామై కాటు వేస్తుంది

108. కాలు జారితే తీసుకోగలము కాని నోరు జారితే తీసుకోగలమా

109. కాసుంటే మార్గముంటుంది

110. కడుపు చించుకుంటే కాళ్ళపైన పడ్డట్లు

111. కలకాలపు దొంగ ఏదో ఒకనాడు దొరుకును

112. కలి మి లేములు కావడి కుండలు

113. కలిసి వచ్చే కాలం వస్తే, నడిచి వచ్చే కొడుకు పుడతాడు

114. కంచే చేను మేసినట్లు

115. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా !

116. కందకు కత్తి పీట లోకువ

117. కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం

118. కీడెంచి మేలెంచమన్నారు

119. కొండ నాలికకి మందు వేస్తే ఉన్న నాలిక ఊడినట్లు

120. కొండల్లే వచ్చిన ఆపద కూడా మంచువలే కరిగినట్లు

121. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు

122. కొన్న దగ్గిర కొసరే గాని కోరిన దగ్గర కొసరా

123. కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరిచిందిట

124. కూటికి పేదైతే కులానికి పేదా

125. కొరివితో తల గోక్కున్నట్లే

126. కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్లు

127. కొత్తొక వింత పాతొక రోత

128. కోటిి విద్యలు కూటి కొరకే

129. కొత్త అప్పుకు పొతే పాత అప్పు బయటపడ్డదట

130. కొత్త బిచ్చగాడు పొద్దు యెరగడు

131. కృషితో నాస్తి దుర్భిక్షం

132. క్షేత్ర మెరిగి విత్తనము పాత్ర మెరిగి దానము

133. కుడుము చేతికిస్తే పండగ అనేవాడు

134. కుక్క వస్తే రాయి దొరకదు రాయి దొరికితే కుక్క రాదు

135. ఉన్న లోభి కంటే లేని దాత నయం

136. లోగుట్టు పెరుమాళ్ళకెరుక

137. మెరిసేదంతా బంగారం కాదు

138. మంచమున్నంత వరకు కాళ్ళు చాచుకో

139. నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది

140. మంది యెక్కువయితే మజ్జిగ పలచన అయినట్లు

141. మనిషి మర్మము.. మాను చేవ...

బయటకు తెలియవు

142. మనిషి పేద అయితే మాటకు పేదా

143. మనిషికి మాటే అలంకారం

144. మనిషికొక మాట పశువుకొక దెబ్బ

145. మనిషికొక తెగులు మహిలో వేమా అన్నారు

146. మంత్రాలకు చింతకాయలు రాల్తాయా

147. మీ బోడి సంపాదనకుఇద్దరు పెళ్ళాలా

148. మెత్తగా ఉంటే మొత్త బుద్ధి అయ్యిందట

149. మొక్కై వంగనిది మానై వంగునా

150. మొరిగే కుక్క కరవదు కరిసే కుక్క మొరగదు

151. మొసేవానికి తెలుసు కావడి బరువు

152. ముల్లును ముల్లుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతొనే కొయ్యాలి

153. ముందర కాళ్ళకి బంధాలు వేసినట్లు

154. ముందుకు పోతే గొయ్యి వెనుకకు పోతే నుయ్యి

155. ముంజేతి కంకణముకు అద్దము యెందుకు

156. నడమంత్రపు సిరి నరాల మీద పుండు

157. నేతి బీరకాయలో నెయ్యి యెంత ఉందో నీ మాటలో అంతే నిజం ఉంది

158. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా

159. నవ్వు నాలుగు విధాలా చేటు

160. నీ చెవులకు రాగి పొగులే అంటే అవీ నీకు లేవే అన్నట్లు

161. నిదానమే ప్రధానము

162. నిజం నిప్పు లాంటిది

163. నిమ్మకు నీరెత్తినట్లు

164. నిండు కుండ తొణకదు

165. నిప్పు ముట్టనిదే చేయి కాలదు

166. నూరు గొడ్లు తిన్న రాబందుకైనా ఒకటే గాలిపెట్టు

166. నూరు గుర్రాలకు అధికారయినా, భార్యకు యెండు పూరి

167. ఆరు నెళ్ళు సావాసం చేస్తే వారు వీరు అవుతారు

168. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు

169. ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకొని బ్రతకవచ్చు

170. బతికి ఉంటే బలుసాకు తినవచ్చు

171. ఊరంతా చుట్టాలు ఉత్తికట్ట తావు లేదు

172. ఊరు మొహం గోడలు చెపుతాయి

173. పనమ్మాయితొ సరసమ్ కంటే అత్తరు సాయిబు తో కలహం మేలు

174. పాము కాళ్ళు పామునకెరుక

175. పానకంలో పుడక  

176. పాపమని పాత చీర ఇస్తే గోడ చాటుకు వెళ్ళి మూర వేసిందట

177. పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనపడినట్లు

178. పండిత పుత్రః పరమశుంఠః

179. పనిలేని మంగలి పిల్లి తల గొరిగినట్లు

180. పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం మేలు

181. పట్టి పట్టి పంగనామం పెడితే, గోడ చాటుకు వెళ్ళి చెరిపేసుకున్నాడట

182. పెదవి దాటితే పృథ్వి దాటుతుంది

183. పెళ్ళంటే నూరేళ్ళ పంట

184. పెళ్ళికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకు వెళ్ళినట్టు

185. పేనుకు పెత్తనమిస్తే తలంతా గొరికిందట

186. పెరుగు తోట కూరలో, పెరుగు యెంత ఉందో, నీ మాటలో అంతే నిజం ఉంది

187. పిచ్చి కోతికి తేలు కుట్టినట్లు

188. పిచ్చోడి చేతిలో రాయిలా

189. పిల్లి శాపాలకు ఉట్లు తెగుతాయా

190. పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం

191. పిండి కొద్దీ రొట్టె

192. పిట్ట కొంచెము కూత ఘనము

193. పోరు నష్టము పొందు లాభము

194. పోరాని చోట్లకు పోతే , రారాని మాటలు రాకపోవు

195. పొర్లించి పొర్లించి కొట్టినా మీసాలకు మన్ను కాలేదన్నదడట

196. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు

197. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు

198. రాజు గారి దివాణంలో చాకలోడి పెత్తనము

199. రామాయణంలో పిడకల వేట

200. రామాయణం అంతా విని రాముడికి సీత యేమౌతుంది అని అడిగినట్టు

201. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదలనట్లు

202. రెడ్డి వచ్చే మొదలెట్టు అన్నట్టు

203. రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు

204. రౌతు కొద్దీ గుర్రము

205. ఋణ శేషం శత్రు శేషం ఉంచరాదు

206. చంకలో పిల్లవాడిని ఉంచుకుని ఊరంతా వెతికినట్టు

207. సంతొషమే సగం బలం

208. సిగ్గు విడిస్తే శ్రీరంగమే

209. శివుని ఆజ్ఞ లేక చీమైనా కుట్టదు.

*ఏది శాస్త్రం? ఏది అజ్ఞానం

 *శాస్త్రజ్ఞానులకు పదిహేను కీలక ప్రశ్నలు… సైన్స్ ఇప్పుడొక పెద్ద దందా…*


*ఏది శాస్త్రం? ఏది అజ్ఞానం? జవాబు చెప్పాల్సిన ప్రశ్నలు 15…*


*రచయిత: Dr. Sriram (Ph D & Postdoctoral) Expert (Public Policy & Governance)*


నా చిన్నప్పటి నుంచీ సైన్స్ ను నికరంగా నమ్మే నేను, కొన్ని జీవితానుభవాల ద్వారా చేసుకున్న అవగాహన, ఆలోచనల్లో నుంచి వచ్చిన కొన్ని సందేహాలు.. . అసలైన శాస్త్రీయ విజ్ఞానాన్ని మాత్రమే నమ్మే వ్యక్తి గా కొన్ని ప్రశ్నలు. (వ్యాపారం కోసం ఒక సైన్స్ ను సృష్టించి, రోగాలపైన రీసెర్చ్ పేరుతో కొత్త విజ్ఞానాన్ని సృష్టించి, లాభాల కోసం సృష్టించిన దాన్ని నమ్మే వ్యక్తి కాదు నేను) ఇక్కడే ఉంది కిటుకు. ఆ కిటుకు తెలుసుకోకుండా వ్యాపార, కార్పొరేట్ వర్గాలు స్పాన్సర్ చేసి ఆర్ & డి చేసి, లాభాల కోసం ఒక రీసెర్చ్ ను సృష్టించి, అదే సైన్స్ అంటే, దాన్నే విజ్ఞానమని నమ్మితే, మూఢ నమ్మకాలు నమ్మేవారికి మీకు ఏమీ తేడా లేదు. మూఢ విశ్వాసాలను నమ్మే వారికీ – వ్యాపారమ్ కోసం ఒక సైన్స్ ను సృష్టిస్తే దాన్నే శాస్తీయ విజ్ఞానమని నమ్మి, ప్రచారం చేసే వారికీ ఎలాంటి తేడా లేదు. ఇక మీరు జవాబు ఇవ్వాల్సిన ప్రశ్నలు.


1. గత 50 ఏళ్లుగా వైద్య, చికిత్సా రంగంలో జరుగుతున్న రీసెర్చ్ విజ్ఞానం చాలావరకు ఖచ్చితమైనది కాదు. వారానికి ఒకసారి ఒక టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది అని రీసెర్చ్ లో వెల్లడైతే, అదే టాబ్లెట్ ను రోజుకు 3 సార్లు వేసుకోవాలని రీసెర్చ్ లో చెప్పించి, లాభాలు చేసుకునేవి కంపెనీలు. డాక్టర్ల తో సెమినార్లలో అలాగే చెప్పించి, పేపర్లు పబ్లిష్ చేస్తే అదే సైన్స్ అని నమ్మితే అంత కంటే మూర్ఖత్వం లేదు.


2. గత 50 ఏళ్లలో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. మరి జబ్బులు, రోగులు ఎందుకు పెరుగుతున్నారు? రోగాలు వస్తున్నాయా లేక రోగులను సృష్టిస్తున్నారా ? రోగాలను నయం చేస్తున్నారా ? రోగులను దోచుకుంటున్నారా?


3. ఈ దేశంలో అయొడైజ్డ్ ఉప్పు అవసరం లేదు (ఒక్క హిమాలయ ప్రాంతాలకు తప్ప). గత పాతికేళ్లలో అయొడైజ్డ్ ఉప్పు అందరికీ రుద్ది, ప్రతి ఇంటా ఒకరు లేదా ఇద్దరు థైరాయిడ్ రోగులను సృష్టించింది ఎవరు మరి? అయొడైజ్డ్ ఉప్పు వాడితే మంచిదే ఐతే కోట్లకు కోట్ల రోగులు ఈ దేశంలో ఎందుకు థైరాయిడ్ రోగులు సృష్టించబడి, జీవితాంతం మందులు వాడేలా చేసింది ఏ రీసెర్చ్? ఏ సైన్స్? సైన్స్ పేరుతో అయొడైజ్డ్ ఉప్పును కోట్ల రూపాయల బిజినెస్ గా ఎలా మారింది? (కొందరు సినిమా ప్రచారకులు కూడా అయొడైజ్డ్ ఉప్పు మాత్రమే వాడాలని ఊకదంపుడు ప్రచారం చేసినట్టు గుర్తు ఆ రోజుల్లో. కోట్లకు కోట్ల థైరాయిడ్ కేసులు ఇండియాలో పెరగడానికి వారు కూడా కారణమేనా?)


4. మారుమూల గిరిజన ప్రాంతాల్లో, అయొడైజ్డ్ ఉప్పు వాడనివారిలో థైరాయిడ్ కేసులు ఎందుకు తక్కువగా ఉన్నాయి ?


5. నెలకొక యాంటీ బయోటిక్ రిలీజ్ చేస్తూ, ఒకదాన్ని మించిన శక్తి ఇంకోటి, ఒక కంపెనీని మించి ఇంకో కంపెనీ, అసలు ఇప్పుడు యాంటీ బయటిక్ ఏదీ పనిచేయడం లేదు, రెసిస్టన్స్ పవర్ బాక్టీరియాకు పెరిగి. అసలు దీనితో కొత్త రోగాలు వచ్చినా ఇంకా కొత్తగా ఎలాంటి మందు వచ్చినా పనిచేయని దీన స్థితికి వచ్చి, అసలు మానవాళి భవిష్యత్తు ప్రమాదంలో పడడానికి కారణం సైన్సు వ్యాపారంగా మారడం కాదా?


6. మీకో విషయం తెల్సా… ఐసియూలో ఎంత ప్రమాదకర బాక్టీరియా ఉంటుందో…! మార్చురీల్లో ఉండే బాక్టీరియా, ఐసియూల్లో ఉండే బాక్టీరియా దాదాపుగా ఒకటే అనే ప్రమాదకర స్థాయికి ఎందుకు వచ్చింది…


7. మూఢవిశ్వాసాలు ప్రజల్లో కొంతమందిని మాత్రమే మూర్ఖులుగా తయారు చేస్తే – వ్యాపారం కోసం సృష్టించిన సైన్స్ పరిశోధనల వల్ల అసలు మానవ, జంతు, వృక్ష జాతుల ఉనికికే ముప్పు వచ్చింది.


8. కొలెస్ట్రాల్ కు గుండె జబ్బుకు సంబంధం లేదని, అమెరికాలోని ఒక సైన్స్ జర్నలిస్టు (http://garytaubes.com/) ఏళ్ళ పాటు రీసెర్చ్ చేసి రాస్తే, అది టైం మ్యాగజైన్ కవర్ పేజీగా రాలేదా? అవన్నీ బయటకు రాకుండా ఫార్మా, మెడికల్ మాఫియా ఆ స్టడీ నొక్కిపెట్టి, వేల కోట్ల కొలెస్ట్రాల్ మాత్రల బిజనెస్ చేసుకోడం లేదా?


9. ఒకప్పుడు 150 దాకా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఉంటే, దాన్ని 90-110 కు తగ్గించి, కొత్త షుగర్ రోగులను సృష్టించింది సైన్స్ కాదా?


10. బీపీ టాబ్లెట్ వేసుకోకపోతే స్ట్రోక్ వస్తుందని ప్రచారం చేసి, బీపీ మాత్రలను వాడాలని చెపితే… దానితో సోడియం లెవెల్స్ పడిపోయి, ఐసీయూల్లో చేరడం.., 60 ఏళ్ళ తర్వాత బీపీ మందుల వల్ల పార్కిన్సన్ రోగం ఎందుకు వస్తోంది? ఇండియాలో 55 ఏళ్లకే పార్కిన్సన్ రోగులను చూడాల్సిన విషాదానికి ఎవరు కారణం?


11. 20-25 ఏళ్ళ కింద ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల్లో ఓపీ -ఓటీ (అవుట్ పేషంట్ ఆపరేషన్ థియేటర్లు) ఉండేవి. చాలా మైనర్ సర్జరీలు అక్కడే చేసి ఒక పూటలోనే ట్రీట్మెంట్ చేసి ఇంటికి పంపేవారు (అసలు ఆసుపత్రిలో ఇన్ పేషంట్ అవసరం లేకుండానే). ఇప్పుడు అలాంటి మైనర్ సర్జరీలకు కూడా స్పెషల్ వార్డులు/ఐసియూ ల్లో చేరాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి?


12. పది రూపాయలు మాత్రమే ఖర్చయ్యే మాత్ర రేటును 300 రూపాయలకు అమ్మేలా సృష్టించిన సైన్స్ నిజంగా సైన్స్ అని ఎలా నమ్మాలి? అది నిజంగా ప్రజల కోసం సైన్స్ అయినప్పుడు ప్రజలు ఎందుకు దోపిడీకి గురవ్వాలి. ఆ సైన్స్ వ్యాపారం కోసం ఐతే అది శాస్త్రీయమా?


13. క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ డాక్టర్ పథ్యం చెప్పి తే అది నాన్ సెన్స్ అని కొట్టి పడేసే ఇంగ్లీష్ డాక్టర్లు, బీపీ, షుగర్ మందులు రాసి ఉప్పు, చక్కర తగ్గించాలనే పథ్యం చెప్పడం ఏంటి ? అక్కడ నాన్ సెన్స్ ఐతే ఇక్కడ నాన్ సెన్స్ కాకుండా ఉంటదా? అజీర్ణ సమస్యలకు ఆయుర్వేదంలో ఆహార నియమాలు పాటిస్తే మందులు లేకుండానే తగ్గుతుంది. ఇది శాస్త్రీయం. ఇంగ్లీష్ డాక్టర్లు మందులు వాడు – ఇష్టం వచ్చింది తిను – జీవితాంతం రోగిగా ఉండు అనేది శాస్త్రీయమా? పైన ఇంగ్లీష్ డాక్టరు స్వీట్, ఉప్పు వద్దని చెప్పి అజీర్ణ సమస్యలకు పథ్యం ఎందుకు చెప్పరు? ఇంగ్లీష్ వైద్యం – విజ్ఞానం గత 200 ఏళ్ళ నుంచి ఉంది కానీ ప్రపంచవ్యాప్తంగా స్థానికంగా ఉన్న వైద్య పద్ధతులు అనేక వేల సంవత్సరాలు ప్రజల్ని కాపాడాయి కదా. గుడ్డిగా అశాస్త్రీయం అని మీలాంటి వాళ్ళు కూడా ముందూ వెనకా చూడకుండా నాటువైద్యమని ముద్ర వేశారు కదా! ఆధునిక విజ్ఞానం అంత శాస్త్రీయమైతే రోగాలు ఎందుకు పెరుగుతున్నాయి, రోగులు జీవితాంతం మందులు వేసుకునేలా చేసేది ఆధునిక శాస్త్రీయ వైద్యమా?


14. *రోడ్డు ప్రమాదాలు, ఇతర అత్యవసర చికిత్సలకు ఇంగ్లీష్ వైద్యమే సరైన మందు. అందులో ఎలాంటి సందేహం లేదు.* కానీ ఇతర జబ్బులకు ఇంగ్లీష్ వైద్యం ఏం చెపుతుంది అంటే, “మందులను ఆహారంగా వాడి ఆరోగ్యాన్ని కొనుక్కో, మాకు లాభాలు పండించు అని చెప్తుంది”. ఇతర ఆరోగ్య చికిత్సా పద్ధతులు ఏం చెప్తాయి అంటే ఆహారాన్ని మందుల మోతాదులో మాత్రమే తీసుకో – ఆరోగ్యాన్ని నీకు నువ్వే సంరక్షించుకో”…


15. ఇంగ్లీష్ మందుల్లో ఆహార పథ్యం లేదు అని చెప్పే డాక్టర్లు, డైటీషియన్, న్యూట్రిషనిస్ట్ లను కలవమని మరీ విధిగా చెప్తున్నారు కదా. ఇది శాస్త్రీయత అనాలా ఏమి అనాలి? నేడు, రేపు, ఎల్లుండి ఆపై కూడా నేను సైన్స్ నే నమ్ముతాను కానీ కోట్లకుకోట్ల రూపాయలతో వ్యాపారం కోసం లాభాల కోసం సృష్టించిన సైన్స్ ను కాదు. వ్యాపారం కోసం సృష్టించిన సైన్స్ ను గుడ్డిగా నమ్మేవాళ్ళు, అంధ విశ్వాసంలో వుండి మూఢ నమ్మకాలను నమ్మే వారి మధ్య ఎలాంటి తేడా లేదు…


*SOURCE: https://muchata.com/15-questions-have-no-answers/amp/*

పండిత పామరావధానులు

 "నమస్కారం గురువు గారు .... "


"ఆయుష్మాన్ భవ, చిరంజీవ, సుఖీభవ"


"ఏఁవి దీవెనలో కానీ గురువు గారు, ఉయ్యాలకోసం గొలుసు వేస్తే ఉన్న గొళ్ళెం ఊడిందట .... అలా ఉంది నా పరిస్థితి"


"అదేం దిక్కుమాలిన సామెత నాయనా? ఎప్పుడు వినలేదే .... ?"


"అన్నీ మనం వినాలని లేదుగా గురువు గారు. నాకు తోచిన సామెత చెప్పాను".


"మంచిది .... కానీ నువ్వు చెప్పిన సామెతకు నా దీవెనకు సంబంధం ఏమిటి?"


"అలా అడిగారు బాగుంది .... మీకు తెలుసుగా గురువు గారు, నాకు ఆ మధ్య గుండె ఆగిందన్న విషయం ....?"


"ఆగలేదు నాయనా. ఒక జర్క్ ఇచ్చిందంతే"


"అదేలెండి .... దానికి మందులు వాడటం వల్ల గ్యాసు సమస్య వచ్చింది .... "


"మళ్ళీ బుక్ చేసుకో నాయనా, రెండు రోజుల్లో వచ్చేస్తోందిప్పుడు .... "


"ఆ గ్యాసు కాదు గురువు గారు. కడుపులో గ్యాసు .... "


"ఓహో ,,,, మరి దానిక్కూడా మందులు ఇస్తారుగా డాక్టర్లు?"


"ఇచ్చారండి .... మనకు బి.పి., సుగరు ఉన్నాయి కదా .... ?"


"మనకు కాదు నాయనా, నీకు".


"అదేలెండి .... నాకే .... వాటికి మందులు వాడటం .... ఇలా రోజుకి పదకొండు మందులు వేయవలసి వస్తోంది".


"అన్ని వాడితే సిలిండరు పేలిపోతుంది నాయనా".


"ఏ సిలిండరు గురువు గారు?"


"నీ కడుపులో గ్యాసు ఉందన్నావు కదా! ఆ సిలిండరు".


"ఓహో .... మరి ఆ సిలిండరు పేలకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి గురువు గారు?".


"నడవాలి నాయనా .... "


"ఆయాసం వస్తోంది గురువు గారు"


"ఊపిరితిత్తులు బలహీనంగా ఉన్నాయన్నమాట .... "


"దడ వస్తోంది గురువు గారు"


"గుండె బలహీనంగా ఉందన్నమాట"


"కాళ్ళు వాస్తున్నాయి గురువు గారు"


"మూత్రపిండాల సమస్య .... "


"ఇన్ని సమస్యలతో నేనెందుకు బతికుండాలి అనిపిస్తోంది గురువు గారు"


"అదే పొరపాటు నాయనా .... "


"ఎందుకని గురువు గారు?"


"నువ్వు ఒక ఇంట్లో అద్దెకి ఉంటున్నావనుకో, ఆ ఇంటికి రిపేరొస్తే ఏం చేస్తావ్?"


"ఓనరుకి చెప్పి రిపేరు చేయించమంటాను"


"కానీ ఆ ఓనరు ఆ ఇల్లు నువ్వు బతికున్నంత కాలం అనుభవించేందుకు అనుమతిచ్చాడనుకో .... అద్దె లేకుండా, అప్పుడేం చేస్తావ్?"


"అద్దె లేకుండానా? అలాంటి వాళ్ళెక్కడ దొరుకుతారు గురువు గారు ఈ రోజుల్లో?"


"దొరికాడనుకో .... ఏం చేస్తావ్?"


"నేనే రిపేరు చేయించుకుంటాను"


"అసలు రిపేరు ఎందుకు రావాలి?"


"ఎందుకంటే .... వాడకంలో కొంచెం అటూ ఇటూ అవుతుంది కదా గురువు గారు?"


"అలా అవకుండా జాగ్రత్త పడితే ఇలా రిపేర్ల ఖర్చు ఉండదు కదా?"


"కాస్త అర్ధం అయేలా చెప్పండి గురువు గారు ....".


"అలా అడిగావు, బాగుంది. ఈ శరీరం అనేది భగవంతుడు మనకు ఇచ్చిన అద్దె కొంపలాంటిది. ఆయన ఆ కొంపను మనకు జీవితాంతం ఉచితంగా వాడుకోమని ఇచ్చాడు. కానీ ఎప్పుడైనా ఖాళీ చెయ్యమని అడగొచ్చు. నీవిలాగ దానికి రిపేర్లు చేయించి, పై పూతలు పూసి, మసి పూసి మాయ చేస్తే ఆయన ఒప్పుకుంటాడా?"


"ఒప్పుకోడు .... "


"మరి ఆ కొంపను జాగ్రత్తగా చూసుకోవాలి కదా?"


"అందులో నా నిర్లక్ష్యం ఏముంది గురువు గారు?"


"నువ్వు పుట్టినప్పుడు ఈ రోగాలన్నీ ఉన్నాయా?"


"లేవు .... "


"మధ్యలో ఎందుకొచ్చాయ్?"


"అంటే .... అది .... సమస్యలు వస్తే ఏం చెయ్యాలో అనే ఆలోచనల వల్ల .... "


"కదా? కానీ సమస్య ఉందంటే పరిష్కారం ఉన్నట్లే .... "


"అదేంటి గురువు గారు? పరిష్కారం లేని సమస్యలు ఉండవా లోకంలో?"


"ఉండనే ఉండవు. కానీ సాధ్యమైనంత వరకు సమస్యలు రాకుండా చూసుకోవాలి .... "


"నా ఉద్యోగం అలాంటిది గురువు గారు. రెవిన్యూలో ఉద్యోగం అంటే మీకు తెలియనిదేముంది చెప్పండి?"


"పైగా నువ్వు మడి కట్టుక్కూచుంటావు కూడా .... "


"అదే పెద్ద సమస్య గురువు గారు"


"సమస్య అది కాదు నాయనా. అన్ని సమస్యలకు అదే పరిష్కారం .... "


"ఇదేం ఫిట్టింగు గురువు గారు? నేను అలా మడి కట్టుక్కూచోడం వల్లే నా మీద విపరీతమైన వత్తిడి, బెదిరింపులు, బదిలీలు .... వీటన్నిటవల్ల ఆరోగ్య సమస్యలొస్తున్నాయి .... "


"వాటివల్ల రాలేదు .... "


"మరి ....?"


"వాటిని నువ్వు సమస్యలుగా భావించడం వల్ల వచ్చాయి"


"అదేంటి గురువు గారూ, అవి సమస్యలు కావా?"


"కానే కావు. నువ్వు రూలు ప్రకారం పని చేసుకెళ్తావు. ఏ వత్తిడికి లొంగవు. బెదిరింపులకు భయపడవు. బదిలీలంటావా, ఉద్యోగంలో అదొక భాగం. ఇప్పుడు చెప్పు నీకు వీటిలో సమస్య ఎక్కడుంది?"


"అలా ఆలోచిస్తే సమస్యల్లాగా కనపడవు. కానీ అలా ఆలోచించలేం కదా గురువు గారు?"


"అలాగే ఆలోచించాలి నాయనా. సమస్య అనుకుంటే సమస్య .... కాదనుకుంటే కాదు"


"మరి మందులు ఆపేయమంటారా?"


"అది పరిష్కారం కాదు. ఇప్పటికే రిపేరుకు వచ్చింది కాబట్టి మందులు వాడు. వ్యాయామం చెయ్యి. కనీసం రోజూ అరగంటైనా నడక అలవాటు చేసుకో .... పిల్లలు సెటిలయ్యారు కదా?"


"అయ్యారండి .... "


"హాయిగా నీకు నచ్చినట్లు బతుకు. ముఖ్యంగా మీ ఆవిడ మాటను పట్టించుకో. కనీసం పట్టించుకున్నట్లుండు. అప్పుడు పరిస్థితుల్లో మార్పులు వస్తాయి".


"అంటే భార్య చెప్పింది వినమంటారా? వద్దంటారా?"


"చూడు నాయనా .... జీవితం అనేది ఒక రైలు ప్రయాణంలాంటిది. అందులో మధ్యలో వచ్చి రైలెక్కేది భార్య. ఆమె ముందుగానే దిగొచ్చు లేదా నీ తరువాత దిగొచ్చు. అంటే తోటి ప్రయాణీకురాలు. అలాగే పిల్లల్లున్నూ .... "


"అదేంటి గురువు గారు, భార్య, పిల్లలు తోటి ప్రయాణీకులా?"


"అలా అనుకుంటేనే నీకు సమస్యలు రాకుండా ఉంటాయి .... "


"మరి పిల్లల్ని జాగ్రత్తగా పెంచకుండా, తోటి ప్రయాణీకులుగా భావించి వదిలేయలేం కదండీ?"


"రైల్లో బెర్తు కన్ఫమ్ అయ్యేదాకా నీ పక్కన కూర్చునే ప్రయాణీకులనుకో .... "


"ఓహో .... "


"ఇప్పుడు వాళ్ళ బెర్తులు కన్ఫమ్ అయినాయి కదా, ఇంక వాళ్ళ గురించి నీకెందుకు బెంగ?"


"మరి వాళ్ళకు ఏదైనా సమస్యలొస్తే?"


"టి.టి.ఈ. ఉన్నాడు కదా?"


"టి.టి.ఈ ఉన్నాడా? అంటే?"


"రైలు అనే జీవితానికి భగవంతుడే టిటిఈ. ఏవైనా సమస్యలొస్తే ఆయన్నే అడగాలి. అంతే కానీ రైలు చైన్ లాగి నువ్వేమన్నా చేద్దామనుకుంటే .... ఇదుగో .... ఇలాగే అవుతుంది .... "


"ఆహా .... శరీరాన్ని అద్దె కొంపతోను, జీవితాన్ని రైలు ప్రయాణంతోను పోల్చి చెప్పారు చూడండి గురువు గారు .... అద్భుతం. కానీ ఒక అనుమానం కొడుతోంది, అడగమంటారా?"


"అడుగు నాయనా?"


"ఇన్ని ఆలోచించే మీకు మీ గుండె ఎందుకు జర్క్ ఇచ్చిందంటారు?"


"జర్క్ ఇచ్చిన తరువాతే ఇవన్నీ తెలిసాయి నాయనా .... ఇక ఉంటా నాయనా .... మా ఆవిడ పెసరట్లు వేస్తోంది. చల్లారితే బాగుండవ్ .... "


"మరి అది మీకు సమస్యేగా?"


"అందుకే వేడిగా తినాలన్నది .... అదే పరిష్కారం .... "


*


పండిత పామరావధానులు

హిందూ ఋషులు జాబితా

 *హిందూ ఋషులు జాబితా*


అక్షర క్రమంలో హిందూ ఋషుల పేర్లు


*అ - ఆ - ఇ - ఈ - ఉ - ఊ - ఋ - ఎ - ఏ - ఐ - ఒ - ఓ - ఔ -* *అం - క - ఖ - గ - ఘ - చ - ఛ - జ - ఝ - ట - ఠ - డ - ఢ -* *త - థ - ద - ధ - న - ప - ఫ - బ - భ - మ -య - ర - ల - వ* *- శ - ష - స - హ - ళ - క్ష*


*దేవర్షి* దేవలోకంలో ప్రతిష్ఠి కలవారు దేవర్షులు.


*బ్రహ్మర్షి* ఉత్తమ శ్రేణికి చెందిన మహర్షులను బ్రహ్మర్షులు అంటారు.


*మహర్షి* సామాన్య ఋషి స్థాయిని దాటిని గొప్ప ఋషులను మహర్షి అంటారు.


*రాజర్షి* రాజుగా ఉంటూనే ఋషిత్వం పొందినవాడు రాజర్షి.


*అ*

అగ్ని మహర్షి

అగస్త్య మహర్షి

అంగీరస మహర్షి

అంగిరో మహర్షి

అత్రి మహర్షి

అర్వరీవత మహర్షి

అభినామన మహర్షి

అగ్నివేశ మహర్షి

అరుణి మహర్షి

అష్టావక్ర మహర్షి

అష్టిక మహర్షి

అథర్వణ మహర్షి

ఆత్రేయ మహర్షి

అథర్వాకృతి‎

అమహీయుడు

అజామిళ్హుడు‎

అప్రతిరథుడు‎

అయాస్యుడు‎

అవస్యుడు

అంబరీషుడు


*ఇ*

ఇరింబిఠి‎


*ఉ*

ఉపమన్యు మహర్షి

ఉత్తమ మహర్షి

ఉన్మోచన

ఉపరిబభ్రవుడు

ఉద్దాలకుడు‎

ఉశనసుడు

ఉత్కీలుడు


*ఊ*

ఊర్ఝ మహర్షి

ఊర్ద్వబాహు మహర్షి


*ఋ*

ఋచీక మహర్షి

ఋషభ మహర్షి

ఋష్యశృంగ మహర్షి

ఋషి


*ఔ*

ఔపమన్యవ మహర్షి

ఔరవ మహర్షి


*క*

కపిల మహర్షి

కశ్యప మహర్షి

క్రతు మహర్షి

కౌకుండి మహర్షి

కురుండి మహర్షి

కావ్య మహర్షి

కాంభోజ మహర్షి

కంబ స్వాయంభువ మహర్షి

కాండ్వ మహర్షి

కణ్వ మహర్షి

కాణ్వ మహర్షి

కిందమ మహర్షి

కుత్స మహర్షి

కౌరుపథి‎

కౌశికుడు‎

కురువు

కాణుడు‎

కలి

కాంకాయనుడు

కపింజలుడు‎

కుసీదుడు


*గ*

గౌతమ మహర్షి

గర్గ మహర్షి

గృత్సమద మహర్షి

గృత్సదుడు‎

గోపథుడు‎

గోతముడు

గౌరీవీతి

గోపవనుడు

గయుడు


*చ*

చ్యవన మహర్షి

చైత్ర మహర్షి

చాతనుడు‎


*జ*

జమదగ్ని మహర్షి

జైమిని మహర్షి

జ్యోతిర్ధామ మహర్షి

జాహ్న మహర్షి

జగద్బీజ

జాటికాయనుడు‎


*త*

తండి మహర్షి

తిత్తిరి మహర్షి

త్రితుడు

తృణపాణి


*ద*

దధీచి మహర్షి

దుర్వాస మహర్షి

దేవల మహర్షి

దత్తోలి మహర్షి

దాలయ మహర్షి

దీర్ఘతమ మహర్షి

ద్రవిణోదస్సు‎


*న*

నచికేత మహర్షి

నారద మహర్షి

నిశ్ఛర మహర్షి

సుమేధా మహర్షి

నోధా

నృమేధుడు


*ప*

పరశురాముడు

పరాశర మహర్షి

పరిజన్య మహర్షి

పులస్త్య మహర్షి

ప్రాచేతస మహర్షి

పులహ మహర్షి

ప్రాణ మహర్షి

ప్రవహిత మహర్షి

పృథు మహర్షి

పివర మహర్షి

పిప్పలాద మహర్షి

ప్రత్య్సంగిరసుడు

పతివేదనుడు

ప్రమోచన‎

ప్రశోచనుడు‎

ప్రియమేథుడు

పార్వతుడు

పురుహన్మ‎

ప్రస్కణ్వుడు

ప్రాగాథుడు

ప్రాచీనబర్హి

ప్రయోగుడు

పూరుడు

పాయు


*బ*

భరద్వాజ మహర్షి

భృగు మహర్షి

భృంగి మహర్షి

బ్రహ్మర్షి మహర్షి

బభ్రుపింగళుడు

భార్గవవైదర్భి‎

భాగలి

భృగ్వంగిరాబ్రహ్మ

బ్రహ్మస్కందుడు‎

భగుడు‎

బ్రహ్మర్షి

బృహత్కీర్తి‎

బృహజ్జ్యోతి‎

భర్గుడు


*మ*

మరీచి మహర్షి

మార్కండేయ మహర్షి

మిత మహర్షి

మృకండు మహర్షి

మహాముని మహర్షి

మధు మహర్షి

మాండవ్య మహర్షి

మాయు

మృగారుడు‎

మాతృనామ‎

మయోభువు‎

మేధాతిథి

మధుచ్ఛందుడు

మనువు

మారీచుడు

మైత్రేయ


*య*

యాజ్ఞవల్క మహర్షి

యయాతి‎


*ర*

రురు మహర్షి

రాజర్షి మహర్షి

రేభుడు


*వ*

వశిష్ట మహర్షి

వాలఖిల్యులు

వాల్మీకి మహర్షి

విశ్వామిత్ర మహర్షి

వ్యాస మహర్షి

విభాండక ఋషి

వాదుల మహర్షి

వాణక మహర్షి

వేదశ్రీ మహర్షి

వేదబాహు మహర్షి

విరాజా మహర్షి

వైశేషిక మహర్షి

వైశంపాయన మహర్షి

వర్తంతు మహర్షి

వృషాకపి

విరూపుడు‎

వత్సుడు‎

వేనుడు

వామదేవుడు‎

వత్సప్రి

విందుడు


*శ*

శంఖ మహర్షి

శంకృతి మహర్షి

శతానంద మహర్షి

శుక మహర్షి

శుక్ర మహర్షి

శృంగి ఋషి

శశికర్ణుడు

శంభు‎

శౌనకుడు

శంయువు‎

శ్రుతకక్షుడు


*స*

సమ్మిత మహర్షి

సనత్కుమారులు

సప్తర్షులు

స్థంభ మహర్షి

సుధామ మహర్షి

సహిష్ణు మహర్షి

సాంఖ్య మహర్షి

సాందీపణి మహర్షి

సావిత్రీసూర్య

సుశబ్దుడు‎

సుతకక్షుడు‎

సుకక్షుడు‎

సౌభరి

సుకీర్తి‎

సవితామహర్షి సామావేదానికి మూలము.

సింధుద్వీపుడు

శునఃశేపుడు

సుదీతి


*హ*

హవిష్మంత మహర్షి

హిరణ్యరోమ మహర్షి. *శుభమస్తు*

..........................................

*60+ Senior Citizens

 *60+ Senior Citizens* usually experience the following:-


*1. Food Choking*

*2. Neck Pain*

*3. Leg Cramps*

*4. Tingling Feet*


The self-help tips given below may help especially senior citizens, before they can get to the doctor.

FOR:-


*1. FOOD CHOKING*

U only need to "raise ur hands”.

By raising ur hands above ur head, the food stuck in ur throat will go down by itself.


*2. NECK PAIN*


Sometimes u wake up in the mornings with pain in the neck. One reason could be the use of wrong pillow. In such a situation, u only need to lift ur feet, then pull ur toes & move ur feet in a clockwise or counterclock wise direction.


*3. CRAMPS*


 When u have cramps on ur left leg, raise ur right hand high, when having cramp in ur right leg, raise ur left hand high. You will immediately feel better.


*4. TINGLING SENSATION*


When the left foot is tingling, swing ur right arm with all ur strength, when the right foot is tingling, swing ur left arm with all ur strength.

 

Don't just save this info.  


Please share with others Senior Citizens.