19, మార్చి 2023, ఆదివారం

మనస్సుద్వారా

 .


              _*సుభాషితమ్*_


𝕝𝕝 శ్లో𝕝𝕝 

*యన్మనసా ధ్యాయతి తద్వాచా వదతి!* 

             *యద్వాచా వదతి తత్కర్మణా కరోతి*! 

             *యత్కర్మణా కరోతి తదపి సంపద్యతే!!*


తా𝕝𝕝 *ఏదైతే మనం మనస్సుద్వారా ఆలోచన (ధ్యానం ) చేస్తున్నామో, అదే వాక్కు ద్వారా వచించాలి*..... *ఏదైతే వాక్కు ద్వారా వచిస్తున్నామో, అదే కర్మ-పని ద్వారా చేయాలి. ఏదైతే కర్మ ద్వారా చేస్తున్నామో ఆ సత్ కర్మ ఫలాలను సత్యదృష్టితో దర్శించి సర్వజనుల సౌఖ్యాన్ని ఆకాంక్షించాలి*.......


*:ఒక మంచి విషయము:*


పాపములు:-   పరులకు కీడుదలచుట మనస్సు చేసిన పాపము; పరులను పరుష వాక్యములు పలుకుట నోరు చేసిన పాపము; పరధనమును అపహరించుట చేతులు చేసిన పాపము; పరుల శ్రమమునెంచని వాని వద్దికి తిరుగుడట కాళ్లుజేసిన పాపము, పరనిందవినుట చెవులు చేసిన పాపము, ప్రీతిలేని అన్నము తినుట నాలుక చేసిన పాపము, పరస్త్రీలను ఆలింగనము చేయుట దేహము చేసిన  పాపము.

సటికా వ్రుక్షాయుర్వేధం



: సటికా వ్రుక్షాయుర్వేధం - ప్రాచీన వృక్ష వైద్య గ్రంధం .


 * వృక్ష జాతులు అనగా తిన్త్రిని మామిడి మొదలగు చెట్లు ను తీగలుగా మార్చుట 


  బియ్యపు పొడి 1 భాగము , మినుముల 1 బాగము , నలగ దంచిన వడ్ల పిండి 1 భాగము , నువ్వుల పిండి 1 భాగము, వీటిని మాంసము కడిగిన నీళ్లలో కడిగి పసుపు పొడి పోగవేసి పాటి మట్టి నేలలో నాటితే అవి తీగలుగా మారును.


 చెట్లు అప్పటికి అప్పుడే పెరిగి చిగుర్చుట - 


 * అంకోల తైలము లొ యే చెట్టు యెక్క బీజములు నైనా నూరు మాట్లు తడిపి వడగండ్లతో కలిపి పాటిమట్టి లొ నాటితే అప్పటికప్పుడే చెట్టు మొలిచి పండ్లు, పువ్వులు ఇచ్చును.


 బీజములు తొందరగా మొలుచుటకు - 


 ఆయా పండ్లు కాచే సమయమున వాటి విత్తనాలు సేకరించి వాటిని బాగుగా ఎండించి పాలలో తడిపి అయిదు దినములు ఎండనించి వాయు లవంగాల కషాయముతో కలిసిన నేతితో పోగవేసి పంచాంగం, బృహతి, నిప్పుల బూడిద ను పాలలొ కలిపి ఆ విత్తనాలను దీనితో పిసికి ఆ ప్రకారము అయిదు రోజులు అయిన పిమ్మట ఆ బీజములు ఆవు పేడతో , ఆవు మూత్రములో ఒక్కో దినము నానబెట్టి విత్తిన మొక్కలు తొందరగా మొలుచును . 

 చెట్లకు విపరీతముగా పువ్వులు , పండ్లు కాచుటకు 

 * చేప మాంసమును , ఆవు పేడతో కలిపి చెట్లకు వేసి యావలు, నువ్వులు , మిణుములు, పెసలు, వులవులు ఈ ఐదింటిని సమబాగాలుగా కలిపి నీళ్లు పోసి వుడకపెట్టి ఆ నీళ్లు చల్లార్చి రెండు దినములు వరసగా చెట్లకు చల్లితే చెట్లు విశేషముగా ఫలించును. 


 * మామిడి చెట్లకు నక్క మాంసం , ఉడుము మాంసం లేదా లేడి, పంది మాంసం , రావి చిగుల్లు, మర్రి చిగుల్లు , అత్తి చిగుల్లు, మామిడి చిగుల్లు, నేరేడు చిగుల్లు, కషాయం పెట్టి చల్లార్చి పాదులో పొసిన మంచి పండ్లు పండును. 

 * మామిడి చెట్టు వేరు దగ్గర చుట్టు గొడ్డలితో కొంచం కాటు చేసి కషాయం పొసిన విశేషమైన ఫలములు ఇచ్చును.


 * పెసలు , మినుములు ఉడక పెట్టి చల్లార్చి ఆ నీళ్లు తేట వంచి ఆ గుజ్జు కొబ్బరి చెట్టు వేళ్ళకు పట్టించి ఉప్పు నిండా వేసి ఆ నీళ్లు పోస్తే పెద్ద పెద్ద కాయలు కాయును , కాయలు రాలవు.


 * పోక చెట్లకు ప్రతి సంవత్సరం వర్షాకాలంలో పైన ఎండిపోయిన మట్టలు కోసి చెట్ల చుట్టు త్రవ్వి పైన చెప్పిన కషాయము పొస్తే అధికముగా పండును.


 * అరటి చెట్టు కు ఏనుగు దంతపు పొట్టు కాల్చిన నిప్పులోగాని, పంది పెంటికలు, గుర్రపు పెంటికలు కాల్చిన నిప్పులో గాని ఇనప సలాకు ఎర్రగా కాల్చి చెట్టు మొదట వేరులో గుచ్చితే చాలా గొప్ప ఫలితాలు ఇచ్చును.


 * రేగు చెట్టుకి నువ్వులు , పెసలు సమబాగములు గా చేర్చి దానితో కొంచం అతిమధురం వేసి చెట్టు చుట్టు వేసి మాంసం కడిగిన నీళ్లు పొసిన మరియు నూవుల పిండి , అతిమధురం కలిపి ఎరువు వేసిన తియ్యటి ఫలములు మరియు తియ్యటి ఫలములు ఇచ్చును. 


 * పత్తి విత్తనాలను ఆవు పేడలో , ఆవు పంచితములో చాలుమార్లు తడిపి పేడనీళ్ళు చల్లుతూ నాటిన తరువాత పందికొవ్వు, మాంసం కడిగిన నీళ్లు చల్లిన అది తన జాతిని విడిచి నిమ్మ జాతిగా మారును. 


             : ఆయుర్వేదం నందు వివరించబడిన భోజన నియమాలు - 


     "అన్నం పరబ్రహ్మ స్వరూపం" కావున నియమనిష్టలతో భోజనం చేయవలెను . ప్రస్తుత పరిస్థితుల్లో ఎటువంటి నియమ నిబంధలు పాటించకుండా మనుషులు తమ ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు. మనం చేసే ప్రతిపని కొన్ని నియమానుసారాల ప్రకారం చేసినప్పుడే ఆ పని సత్ఫలితాన్ని ఇస్తుంది. ఇటువంటి నియమనిబంధనలు మన పూర్వీకులు ఎంతో దూరదృష్టితో ఆలోచించి కొన్ని , తమ అనుభవ పూర్వకంగా కొన్ని ఏర్పరిచారు. వాటిని పాటించటం వలన మనకి మంచి ఆరోగ్యం , ఆయష్షు కలుగును. కొన్ని పురాతన గ్రంథాలు పరిశీలించి వాటిలో మీకు కొన్ని తెలియచేస్తున్నాను .


  భోజన నియమాలు - 


 * భోజనం చేయటానికి ముందే స్నానం ఆచరించి దేవతార్చన చేసి మంచి మనసుతో మంగళకరమైన వస్తు దర్శనం చేయవలెను . సూర్యుడు , అగ్ని, గోవు మొదలగు మంగళకరం అయిన వాటిని దర్శించుకొనవలెను . ఆ తరువాత చల్లని నీటితో బాగుగా కాళ్లు , చేతులు , ముఖం పరిశుభ్రం చేసుకుని తెల్లని వస్త్రం ధరించవలెను 

ఎందుకనగా యోగశాస్త్రం నందు మనుషుని యొక్క శ్వాస గతి 12 అంగుళములు అనియు భోజనకాలం నందు మనుష్యుని యొక్క శ్వాసగతి 20 అంగుళములు అని తెలుపబడినది. అతిశ్వాస ఆయుఃయుక్షీణం .శ్వాసగతి తగ్గిన యొడల ఆయుర్వృద్ధి అగును. కావున భోజనకాలం నందు హస్త, పాద , ముఖప్రక్షాళన చేయనిచో శ్వాసగతి ఎక్కువ అగును. అందుకే చల్లని నీటితో ప్రక్షాళన చేసుకుని ప్రశాంత మనస్సుతో భోజనశాల కు చేరవలెను .


 * తడిసిన పాదములతో భోజనం చేయవలెను దీనివల్ల ఆయుర్వృద్ధి కలుగును. తడిసిన పాదములతో శయనించిన ఆయష్షు క్షీణించును. దీనికి ముందు పితృదేవతలను , అతిధులను , శిశువులకు , గర్భిణి స్త్రీలకు , పెంచుకున్న పశుపక్ష్యాదులకు మొదట ఆహారం మొసంగి తృప్తిపరుచుట మరువకూడదు . 


 * ఆహారము మనస్సుకి, తృప్తిని , బలం, ఆయష్షు , తేజస్సు , ఉత్సాహం , జ్ఞాపక శక్తి , రోగనిరోధక శక్తి కలిగించును.


 * ఆయష్షు కోరువాడు భోజనం తూర్పుముఖంగా , యశస్సు కోరువాడు దక్షిణముఖంగా కూర్చొని భుజించవలెను .


 * ఉత్తరాభిముఖంగా కూర్చుని భుజించిన యెడల విద్యుత్ శక్తి నరముల ద్వారా అత్యంత తీవ్రంగా ప్రవహించును. అందువలన ఉత్తరాభిముఖంగా కూర్చుని భుజించరాదు . 


 * పితృదేవతలు దక్షిణదిశ యందు ఉండుటచే దక్షిణదిశకు అభిముఖంగా కూర్చుని భుజించటం వలన యశస్సు లభించును.


 * భోజనం పగలు దినములో ఎనిమిదో వంతు కాలం అనగా ఉదయం 9 గంటల నుంచి 12 గంటల మధ్య చేయవలెను . 


 * ఉదయం 9 గంటలలోపు భుజించినచో ధాతువులు పూర్తిగా జనించవు . 12 గంటల తరువాత భుజించినచో బలం క్షీణించును. కావున ఉదయం 9 నుంచి 12 గంటల మధ్యనే భుజించవలెను . 


 * రాత్రి భోజనం 8 గంటల లోపు ముగించవలెను . అదికూడా తేలికైన సులభంగా జీర్ణం అయ్యే విధంగా ఉండును.రాత్రి సమయాన మన శరీరంలో మెటబాలిజం రేటు బాగా తగ్గును. కావున తిన్న ఆహారం శక్తిగా మారక కొవ్వుగా మారును . రోగులు ముఖ్యంగా 

ఆస్తమా రోగులు 7 గంటలకే ఆహారాన్ని భుజించవలెను .


 * భోజన విషయంలో సమయపాలన గురించి నీతిశాస్త్రం చెప్తున్న విషయం మీకు తెలియచేస్తున్నాను . " నీకోసం వందమంది కాచుకుని కూర్చున్నను సమయం అయితే వారిని విడిచి భోజనం చేయాలి . వెయ్యి మంది కూర్చున్నను వదిలివెళ్ళి స్నానం చేయవలెను . లక్షమంది వద్దన్నా వెళ్లి దానం చెయ్యాలి . కోటిమంది కాదన్నా వెళ్లి భగవంతుడి ధ్యానం చేయాలి " అన్నది నీతిశాస్తం వివరించింది.


 * మలమూత్రములు బాగుగా వెడలి , హృదయం నిర్మలమై , వాతాది దోషములు చక్కగా ప్రవర్తించుచు లోగడ భుజించిన ఆహారం జీర్ణమైనట్టు త్రేపులు వచ్చి బాగుగా ఆకలిపుట్టి , వాతం క్రిందివైపు పయనించి సంచరిస్తూ జఠరాగ్ని బాగా ప్రజ్వరిల్లుతూ ఇంద్రియములు వినిర్మములై శరీరం తేలికగా ఉన్నప్పుడు కాలం అతిక్రమించకుండా నియమం ప్రకారం ఆహారం భుజించవలెను .


 * ఆకాలంలో అతిస్వల్పంగా భుజించినను అది విషంగా మారి రోగాలకు కారణం అవుతుంది. ఎల్లప్పుడు సకాలంలోనే భుజించవలెను .


 * ఉదయం , సాయంకాలం నందు మాత్రమే మనుష్యులు భోజనం చేయాలని వేదం చెప్తుంది .ఆయుర్వేదం ప్రకారం "ఏకభుక్త్తోమహాయోగి , ద్వీభుక్తో మహాభోగి, త్రిభుక్తో మహారోగి " అనగా రోజుకి ఒకసారి భోజనం చేసేవాడు మహాయోగి , రోజుకి రెండు సార్లు భోజనం చేసేవాడు మహాభోగి , రోజుకి మూడుసార్లు భోజనం చేసేవాడు మహారోగి అని అర్థం .కావున రోజుకి రెండుసార్లు మాత్రమే భోజనం చేయడం శ్రేష్టం అని మన సాంప్రదాయం చాటుతుంది. 


 * రెండు భోజనాల మధ్య ఫలహారం అనగా పండ్లు తినవచ్చు. జీర్ణక్రియ అయ్యే సమయంలో మరలా భుజించరాదు . అది రోగాలకు ముఖ్యకారణం . అప్పుడప్పుడు జీర్ణ అవయవాలకు విశ్రాంతి ఇవ్వవలెను.లేనిచో అవి బలహీనం చెందును 


 * చిన్నపిల్లలకు అన్నకోశం పెరిగి ఉండదు కనుక వారు శరీరంకి కావలసిన ఆహారం ఒక్క మారు తీసుకొనలేరు . వారు ఆటపాటలతో ఎగురుచుందురు. వారు ఒకటికి రెండు సార్లు తినినను తప్పులేదు . కష్టం చేయు శ్రామిక వర్గం వారు జఠరాగ్ని ఎక్కువుగా ఉండును. కావున వారు మూడొవసారి భోజనం చేయవచ్చు . 


 * మీరు తినవలసినంత మాత్రమే తినవలెను .ఎక్కువ తిన్నచో అజీర్ణం రోగం కలుగును. ఒకపూట ఎక్కువుగాను ఒకపూట తక్కువుగాను సేవించుటయు ఒక దినం తిని మరుదినం నిరాహారంగా అనగా ఏమి తినకుండా ఉండరాదు. 


 * మానవుడు తన పొట్ట యందలి స్థలముని నాలుగు భాగాలుగా విభజించి అందు రెండు భాగములు ఘనద్రవ రూపములు భక్ష్యములు 

అనగా నమిలి తినదగినవి , భోజ్యమనగా నమలాక చప్పరించి తినతగినవి . లేహ్యం అనగా నాలుకతో చప్పరించి తినదగినట్లు కొంచెం ద్రవరూపంగా ఉండునది , పేయం అనగా మిక్కిలి ద్రవరూపం అయి త్రాగదగినది ఈ విధంగా నాలుగు రకాల ఆహారముల చేత ఒక భాగం నీటిచేత నింపి మిగిలిన ఒక భాగం వాయు సంచారం కొరకు అనగా జీర్ణక్రియ జరుగుటకై వదిలినచో ఆహారం బాగుగా జీర్ణం అగును.


 * ప్రత్యేక పర్వదినములలో తీపి , నెయ్యి, నూనె పదార్దములు , సెనగ పిండితో తయారగునవి ఉపయోగించినప్పుడు మిగతా 

భోజనం తగ్గించి చివర పెరుగును వాడకుండా ముఖ్యంగా చారు, మజ్జిగలతో భోజనం ముగించుట ఉత్తమం . 


 * భోజనం చేయుటకు తూర్పు ముఖం అలా వీలుకానిచో దక్షిణాభిముఖంగా ఉన్నతంగా , సమప్రదేశమున పీట లేక చాప మీద కూర్చొనవలెను. ఆకులమీద , ఇనుపమేకులు వేసిన పీటల మీద కూర్చుని భోజనం చేయకూడదు . ఇత్తడి మేకులు వేసిన పీటల మీద కూర్చుని తినటం ఆచారం .


 * ఒక వస్త్రంని మాత్రమే ధరించి భోజనం చేయరాదు . కావున ఉత్తరీయం పైన కప్పుకొనవలెను . దానివలన శరీరం నకు బాహ్యవాయువులు తగలక సురక్షితంగా ఉండును.అది పట్టువస్త్రం అయితే మరింత మంచిది . తలపాగా ధరించి భోజనం చేయరాదు . టేబుల్ మీద భోజనం శాస్త్ర విరుద్ధం . 


 * ఆహారం భుజించు సమయం నందు అధికంగా మాట్లాడకుండా , అతిగా నవ్వకుండా మనుజుడు తన శరీరం నకు అనుకూలం అయిన మరియు తేలిక అయిన స్నిగ్ధగుణము , ఉష్ణగుణము కలిగి ద్రవప్రమాణం అయి మధుర , ఆమ్ల , లవణ, కటుతిక్త కషాయములు అను ఆరు రసములు గల ఆహారంను మిక్కిలి తొందరగా కాకుండా మిక్కిలి మెల్లగా కాకుండగా భుజించవలెను .


 * ఆకలిగొన్నవారు, రోగులు , హీనులు , దరిద్రులు , బిక్షగాండ్రు వీరి యొక్కయూ కుక్క, కోడి మొదలగు వాని యొక్క దృష్టి భోజన కాలము న తగలకూడదు.కావున భొజనశాలకు వీరిని దూరంగా ఉండునట్లు చేయవలెను . 


 * బంగారు పాత్ర యందు భోజనం మంగళకరం మనోదోషములు పొగొట్టును. జఠరాగ్నిని వృద్ధిపరుచును. మంచి చూపుని ఇచ్చును.


 * వెండిపాత్రల యందు శ్లేష్మాన్ని హరించును మూత్రరోగముని హరించును . ఆరోగ్యకరం . వెండి పళ్లెం మధ్యలో బంగారం తాపడం చేయుంచుట మంచిది . 


 * కంచుపాత్రలో భోజనం చేయుట నోటివెంట రక్తం పడు రోగముని నయం చేయును . శుభ్రంగా మరియు రుచికరంగా ఉండి నేత్రరోగములు హరించును . బుద్దిని పెంచును. అగ్నివృద్ధి పెంపొందించి శరీరానికి కాంతి ని ప్రసాదించును. ఎముకలు వృద్ది అగుటకు తోడ్పడును. హృదయ రోగములను నిగ్రహించును.


  * స్టీల్ పాత్రలో భోజనం చేసిన పాండురోగం తగ్గును. కామెర్ల వ్యాధిని హరించును . 


 * అల్యూమినియం పాత్రయందు వండిన భోజనము వండుచున్న మరియు తినుచుండిన అతిసార వ్యాధి కలుగును. 


 * గాజు పాత్రలో ఆహారం తీసుకోవడం వలన ఉపయోగం ఏమియును లేదు . కేవలం దోషాలు మాత్రం కలగవు. ఆమ్లములు ఇందు ప్రభావం చూపించలేవు . 


 * అరటి ఆకు నందు భోజనం మిక్కిలి పరిశుభ్రం అయి శ్రేష్ఠంగా ఉండును. శరీరకాంతి , సంభోగశక్తిని పెంచును. ఆకలి దంతకాంతిని పెంచును. క్రిమినాశనకారి , ఉదరం నందు పుండ్లను తగ్గించును . 


 * మోదుగ ఆకుల యందు భుజించుటచే గుల్మరోగం , మహోదరం , క్రిమిరోగం , రక్త, పిత్త రోగాలు నయం అగును.మోదుగ చంద్రుడికి సంబందించిన వృక్షం . సాత్త్విక గుణాలు కలిగించును.


 * మర్రి ఆకుల యందు భుజించటం వల్ల క్రిమిరోగం నివారణ అగును. నేత్రదోష నివారణ జరుగును.


 * రావియాకు విస్తరి యందు భుజించిన పిత్త నివారణ జరుగును. అగ్నివృద్ధిని కలిగించును. జననేంద్రియ దోషాలు నివారణ అగును. విద్యార్జనకు మనస్సు పుట్టించును.


 * పనస ఆకుల యందు భుజించిన అగ్నివృద్ది, పిత్తాన్ని హరించును .


 * తామరాకు లో భోజనం విషహరంగ ఉండును. సరస్సులో ఉన్న తామరాకు పనిచేయదు . 


          

18, మార్చి 2023, శనివారం

ఈ పద్యం చదవగలరేమో

 *మీరు తెలుగు వారేనా అయితే ఈ పద్యం చదవగలరేమో ట్రై చెయ్యండి.*


టటకిట టట్టకిట్టటట కిట్టటటట్ట టకిట్టటట్టకి 

ట్టటకిట టట్టకిట్టట కిటట్టట టోన్ముఖటంకృతి స్ఫుటో 

త్కటపటహాదినిస్వన  వియత్తలదిక్తటతాటితార్భటో

ద్భట పటుతాండవాటన, "ట"కారనుత బసవేశ పాహిమాం!


డమరుగజాత డండడమృడండ

మృడండ మృడండ మృండమృం

డమృణ మృడండడండ మృణడండడ

డండ మృడం డమృం డమృం

డమృణ మృడండడంకృతి

విడంబిత ఘూర్ణిత విస్ఫురజ్జగ

త్ర్పమథన తాండవాటన 

"డ"కారనుత బసవేశ పాహిమాం!


ఢణ ఢణ ఢం మృఢం మృఢణఢం

మృణఢంమృణ ఢంఢణోద్ధణం

ధణనటన త్వదీయడమరూత్థ

మదార్భట ఢంకృతి ప్రజృం

భణ త్రుటితాభ్రతార గణరాజ 

దినేశముఖగ్రహప్రఘర్

క్షణగుణతాండవాటన

"ఢ"కారనుత బసవేశ పాహిమాం!


ణణ్మృణ ణణ్మృణ ణ్మృ ణణ ణణ్మృణ

ణ ణ్మృణ ణణ్మృణ ణ్మృణ

ణ్ణ ణ్మృణ నృత్త్వదీయసుఖ

విక్రమ జృంభణ సంచలన్నభో

ణ్ణ ణ్మృణ ది క్క్వణ ణ్మృణణ 

ణణ్మృణ ణణ్మృణ ణణ్మృణ స్వన

ణ్ణ ణ్మృణ తాండవాటన 

"ణ"కారనుత బసవేశ పాహిమాం!


*మహాకవి శ్రీ పాల్కురికి సోమనాథుడు* *"అక్షరాంకపద్యముల" నుండి సేకరణ*.


*రాలేదా అయితే ఈ  వీడియో లో వినండి.*

ప్రజా ప్రయోజనాలపై

 శ్లోకం:☝️

*ప్రజాసుఖే సుఖం రాజ్ఞః*

 *ప్రజానాం చ హితే హితం ।*

*నాత్మప్రియం హితం తస్య*

 *ప్రజానాం తు ప్రియం హితం ।।*

  - అర్థశాస్త్రం


భావం: రాజుకు తన సొంతానికంటూ సుఖము, సంతోషము ఉండవు. ప్రజల సుఖమే రాజుకు సుఖం మరియు ప్రజల సంతోషమే రాజుకు సంతోషం. అతనికి ప్రజా ప్రయోజనాలపై మాత్రమే ఆసక్తి ఉంటుంది (ఉండాలి). అతనికి ఇష్టమైనది గాని ప్రయోజనకరమైనది ఏమీ ఉండదు. ప్రజలకు ఏది హితమో, ఏది ప్రయోజనకరమైనదో అదే అతనికి ఇష్టమైనది, దానియందే అతనికి ఆసక్తి (ఉండాలి - అంటున్నాడు చాణక్యుడు అర్థశాస్త్రంలో).

అవధూత లీల*

       *అవధూత లీల*


      శ్రీ వెంకయ్యస్వామి వారి జీవితం


                 అధ్యాయం 8

                 అమృతవాక

                  భాగము 03



ఒకప్పుడు గుత్తా నరసమ్మకు మోకాలు నొప్పి చేసి బాధ పెట్టింది. కాలు ముడవలేక పోయింది. శ్రీస్వామివారి విభూతి పూసినా తగ్గలేదు. 'స్వామీ! మనకు అన్నం వండే సరసమ్మకు మోకాలు నొప్పి చేసి వంచలేకుండా ఉన్నది. అని శ్రీస్వామివారికి చెబితే 'ఇంకెప్పటికీ రాకుండా చీటి వ్రాసి ఇవ్వండయ్యా!! అన్నారు. శ్రీస్వామివారి సేవకులు అలాగే చీటి వ్రాసి ఆమెకు ఇచ్చారు. అది మొదలు ఆమెకు బాధ పూర్తిగా నివారణైంది.


ఒకరోజు శ్రీస్వామివారు తనకు మంత్రించమని గోలచేస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్న శ్రీస్వామివారు అలా ఎందుకు అంటున్నారో భక్తులకర్థం కాలేదు. కొంతసేపటికి తూపిలి పిచ్చెమ్మకు పాము కరచి శ్రీస్వామివారి దగ్గరకు తీసుకువచ్చారు. సర్వజ్ఞులైన శ్రీస్వామివారు తన భక్తురాలి బాధను తొలగించుటకే మంత్రించమన్నారని అందరూ గుర్తించారు. ఏ మందూ లేకుండా శ్రీస్వామివారి విభూతితోనే నయమైంది.


గొలగమూడి కరణం సుబ్బారావు గారి భార్య శకుంతలమ్మ గారు చాలా కాలం ఉబ్బసంతో బాధపడుతుండేది. ఎందరో డాక్టర్ల దగ్గర వైద్యం చేయించారు. వేలకొద్ది డబ్బు ఖర్చు చేశారు. ఈషణ్మాత్రం తగ్గలేదు. ఇక లాభం లేదని ఆంజనేయస్వామికి ప్రదక్షిణలు చేయించాలని అనికేపల్లి నుండి గొలగమూడి వచ్చి శ్రీ వెంకయ్యస్వామివారికి విన్నవించుకున్నారు.


'20 రోజులలో తగ్గిపోతుంది. మీరు గొలగమూడిలో నివసించే ఇల్లు వదలి పోవద్దు. మీ స్థిరనివాసమైన అనికేపల్లి పదలి గొలమూడిలోని పూరిపాకలోనే స్థిరంగా ఉండండి. నేను చెప్పినదాకా గట్టి ఇల్లు కట్టవద్దు. అని చెప్పారు శ్రీస్వామివారు. అలానే చేస్తే శ్రీస్వామివారు చెప్పిన టైముకు అన్ని సంవత్సరాలు బాధించిన ఉబ్బసం అంతులేకుండా పోయింది.


1981వ సంవత్సరంలో తుఫాను వల్ల గొలగమూడిలోని ఆ పూరిపాక కూలిపోయింది. ఆ స్థలంలోనే ఇల్లు కట్టే ప్రయత్నంలో శ్రీస్వామివారికి చెప్పకుండానే ఇల్లు వేసుకున్నదాకా అనికేపల్లిలోని వారి పాత మిద్దెలో తాత్కాలికంగా ఉండేందుకు వెళ్లారు. మరలా జబ్బు చేసింది. ఈసారి ఆపరేషన్ చేయించవలసివచ్చింది. మరలా శ్రీస్వామివారికి చెప్పుకుంటే 'ఈ పూరింటిలోనే ఉండండి. ఆరోగ్యం బాగుంటుంది'. అని వ్రాయించి ఇచ్చారు. వారు అలానే చేశారు. శ్రీస్వామివారి కృపవలన మరలా ఆ జబ్బు కనిపించలేదు. కనుకనే కృతజ్ఞతతో ప్రతినిత్యం పూజాద్రవ్యములు తెచ్చి స్వామివారు దేహత్యాగం చేసినచోట శ్రీస్వామివారు ప్రతిష్టించిన పాదుకలను పూజిస్తుంటారు. అట్లా నియమంగా భక్తి శ్రద్ధలతో ఉండేటట్లు చేయాలంటే అది ఒక్క సద్గురునికే తగును కదా!


పెద్ద గోపారం నుండి 1979 ప్రాంతంలో ఒకామె శ్రీస్వామివారి దర్శనార్థం వచ్చింది. ఆమెకు 22 సం||ల కుమారుడుండేవాడు. అతనికి 2 సం॥లకు పూర్వం మనస్సు స్థిమితం తప్పి పిచ్చిపట్టింది. ఆ యువకుని తమ వద్ద ఉంచమని ఆజ్ఞాపించారు. క్రమేణా పిచ్చి తగ్గి స్వస్థుడయ్యాడు. ఆమె ఈనాటికి తన ఇంటిలోనే శ్రీస్వామివారికి నిత్యం దీపారాధన చేసి పూజిస్తుంది... మిగిలిన భాగము రేపటికి...


*గ్రంథం:* : భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామివారి దివ్య చరిత్ర

అనధూత లీల

*రచన:* శ్రీ పెసల సుబ్బరామయ్య మాష్టర్ 

శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామి వారి పాదుకలను శరణు కోరుతూ 


🙏 *ఓం నారాయణ -ఆది నారాయణ* 🙏


🌹🌹🌹🌹🌹🌹🌹🌹


*గ్రంథం:-నేను దర్శించిన మహాత్ములు*

*శ్రీ ఆనందమాయి అమ్మ దివ్య చరిత్ర*

*రచన:-*

*శ్రీఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు*


   అఖండానందస్వామి నన్ను ఆశీర్వదించక ముందు ఆ క్షేత్రంలో నా ముఖం చూచిన వాడే లేడు. అన్నం తిన్నానో లేదో, నేను ఎక్కడ రాత్రి నిద్రించానో అడిగినవాడే లేడు. ఈ ఆదరణంతా స్వామి ఆశీర్వచనం యొక్క పర్యవసానమే. కాని దానికి కారణం నేను సాయిని స్మరించడమేనా అన్న ప్రశ్న మిగిలిపోయింది. సాయంత్రమయ్యాక గదా దాని సంగతి తేలేది అని సాయికి చెప్పుకున్నాను. రాత్రికి గూడ నాకు భోజనము, వసతి లభించకపోతే ఇప్పుడు ఈ భక్తులు వలకపోసిన ఆప్యాయతంతా కేవలం కాకతాళీయమే అవుతుంది అనుకున్నాను. రోజూలాగే మధ్యాహ్నానికి ప్రవచనం ముగిసింది. ఆకలి దహించుకు పోతుంటే బిస్కెట్లు, టీలతో కడుపు నింపుకోడానికి గేటు బయటకు వచ్చాను. వాటిని తల్చుకుంటే వెగటనిపిస్తున్నది. అలాగే పోయి ఆ స్టాలు ముందు కూర్చొని టీ, బిస్కెట్లు ఇవ్వమని ఆ స్టాల్ వానిని అడిగాను. వెంటనే ఆ ప్రక్కనున్న వ్యక్తి వారించి, 'మీకు భిక్ష మా ఇంటి నుండి వస్తున్నది. ఆలస్యమేమీ లేదు' అని చెప్పాడు.


**********************************

ఆన్లైన్ లో చదువుటకు ఈ లింక్ ను ఉపయోగించుకోగలరు.


https://saibharadwaja.org/books/readbook.aspx?book=Sri-Aanandamai-Amma-Charitra&page=1

మండపం ఖాళీ చెయ్యండి

:


 మండపం ఖాళీ చెయ్యండి


కర్ణాటక రాష్ట్రంలో హంపికి దగ్గర్లోని తుంగభద్రా నది ఒడ్డున గల ఆనెగొందిలో పరమాచార్య స్వామివారు మకాం చేస్తున్నారు. శ్రీకృష్ణదేవరాయల సామ్రాజ్యపు ఆనవాళ్ళు మనకు ఇక్కడ ఇప్పటికి కనిపిస్తాయి. ఇక్కడే శ్రీరాముడు బాణంతో వాలిని సంహరించాడని చెబుతారు. అలాగే మధ్వులకు పరమపవిత్రమైన నవబృందావనం కూడా ఇక్కడే ఉంది. తుంగభద్రా నదీ మధ్యభాగంలో ఉన్న ఒక చిన్న రాతి ద్వీపంపై మధ్వ సంప్రదాయంలోని ఆచారపురుషులవి తొమ్మిది బృందావనాలు ఉన్నాయి. ఇది మధ్వుల కాశి. కనుక ఎక్కువ సంఖ్యలో మధ్వులు ఇక్కడకు వచ్చి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుంటారు. 


హొస్పేట్ పట్టణంలో చింతామణి మఠం ఆధ్వర్యంలో అన్నపూర్ణా ఆలయం ఉంది. పరమాచార్య స్వామివారి ఆదేశం ప్రకారం అన్నపూర్ణకు లడ్డూలతో అలంకారం చేశారు. మధ్యాహ్నం దాదాపు రెండు గంటలప్పుడు హఠాత్తుగా మహాస్వామివారు వంట చేస్తున్న మండపాన్ని అత్యవసరంగా ఖాళీ చెయ్యవలసిందని ఆదేశించారు. మొత్తంగా ఖాళీ చేసి, అన్నపూర్ణ దేవాలయం పక్కకు మార్చమని చెప్పారు. “ఆ వంట గదిలో ఒక పిల్లి దాని పిల్లలు కూడా ఉన్నాయి. వాటిని కూడా బయటకు పంపండి” అని ఆజ్ఞాపించారు. 


మండపం ఖాళీ చేసిన అరగంటలోపే కారణాంతరాల వల్ల మెల్లగా కూలిపోయింది. మహాస్వామివారు పిల్లి, పిల్లి పిల్లలతో సహా అందరినీ రక్షించారు.


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


--- టి.యన్. సుప్పిరమణి. మహా పెరియవళ్ - దరిశన అనుభవంగళ్


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం



: తిరుమల : మాడ వీధి అంటే ఏమిటి


తిరుమల మాడ వీధుల యొక్క పూర్తి వివరాలు.


తమిళంలో ఆలయానికి చుట్టూ అర్చకులు నివసించే ఇళ్ళున్న వీధులను పవిత్రంగా భావించి 'మాడాం' అని పిలుస్తారు. అదే మాడవీధులుగా మారింది


ఒకప్పుడు ఆలయం చుట్టూ స్వామి వారు వాహనంలో ఊరేగటానికి గాను సరియైన వీధులుండేవి కావు. అంచేత బ్రహ్మోత్సవాల సమయంలో ధ్వజారోహణ ఇక్కడ చేసినా మిగతా కార్యక్రమాలు, ఊరేగింపులు తిరుచానూరులో జరిపేవారు


శ్రీరామానుజుల వారు దేవాలయం చుట్టూ వీధుల నేర్పరిచి స్వామివారు ఆ వీధుల్లో ఊరేగేందుకు ఏర్పాట్లు చేశారు. తదనంతరం తి.తి.దే. మాస్టర్ ప్లాన్ లో భాగంగా వీధుల్ని మరింత వెడల్పు చేసి సుందరంగా తీర్చిదిద్దారు.


తిరుమల ఆలయం చుట్టూ నాలుగు మాడ వీధులున్నాయి.

వీటిని నాలుగు వేదాలకు ప్రతీకలుగా భావిస్తారు


1.తూర్పు మాడ వీధి.


ఆలయం తూర్పు ముఖంగా ఉంది ఎదురుగా ఉన్నదే తూర్పు మాడవీధి.

శ్రీవారి ఆలయం ముందు నుండి పుష్కరిణి వరకుండే వీధిని తూర్పు మాడ వీధి అంటారు. ఒకప్పుడు పుష్కరిణి గట్టు పైన కూడా ఇళ్ళుండేవి.


ఈ వీధిలోనే శ్రీవారి కొయ్య రథం ఉండేది శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న

(ఉండే) వీధిని సన్నిధి వీధి అంటారు


ఒకప్పుడు సన్నిధి వీధి, వేయికాళ్ళ మండపం ఉండేవి. సన్నిధి వీధికి ఇరు ప్రక్కలా అంగళ్ళుండేవి. ఈ వీధికి ప్రారంభంలో గొల్ల మండపం, చివరలో బేడి ఆంజనేయస్వామి గుడి ఉండేవి.


క్రీ.శ. 1464 నాటి శాసనం ప్రకారం ఎర్రకంప దేవకుమారుడు సాళువ మల్లయ్య దేవ మహారాయ వెయ్యి కాళ్ళ మండపం కట్టించారు.


మాస్టర్ ప్లాన్ లో భాగంగా కళా నైపుణ్యం గల చారిత్రాత్మక కట్టడం వెయ్యి కాళ్ళ మండపం తొలగించబడింది.


2.దక్షిణ మాడ వీధి


ఈ వీధిలోనే తిరుమల నంబి గుడి ఉంది.దీని పక్కనే-ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్సు నుండి గుడికి చేరే వంతెన కిందే ఒకప్పుడు గుర్రాల పాక ఉండేదట. కొండ కొచ్చిన రాజుల గుర్రాలను అక్కడ కట్టి వేసేవారట ఈ వీధి మొదట్లో (ఆగ్నేయంలో) 'ఊంజల్ మండపం' ఉంది


ఇది వరకు శ్రీవారికి ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ ఈ మండపంలోనే జరిగేవి. ప్రతిరోజూ సాయంత్రం శ్రీనివాసుడు తన ప్రియసఖులతో ఈ మండపం లోనే ఊయల ఊగుతూ భక్తులకు కనువిందు చేసేవాడు.


దీన్ని ఇటీవల ఆలయం ముందున్న విశాల ప్రాంగణంలోకి మార్చటం జరిగింది తిరుమల నంబి గుడి తర్వాత 'ఉగ్రాణం'(ప్రసాదాలు తయారీకి అవసరమైన సరుకులు నిల్వ ఉంచు చోటు )ఉంది.


3.పడమర మాడ వీధి.


ఆలయానికి వెనక వైపున ఉన్నదే పడమర మాడవీధి. ఒకప్పుడు ఎన్నో మఠాలు, సత్రాలు ఉండేవి

ప్రస్తుతం తిరుమల చిన జీయర్ స్వామి మఠం, (తిరుమల చిన్న జియ్యర్ పెద్ద జీయర్ ఏకాంగి అనే వ్యస్థను 11 వ శతాబ్దం లో రామానుజాచార్య స్వామి వారు ఏర్పాటు చేశారు) కర్ణాటక కళ్యాణ మండపం, వసంత మండపం ఉన్నాయి అనంతాళ్వారు తోట శ్రీవారి ఆలయానికి పడమర దిక్కులో ఉంది.


4.ఉత్తర మాడ వీధి.


ప్రస్తుత పుష్కరిణికి పడమటి వైపున పాత పుష్కరిణి ఉండేది అచ్యుతరాయలు 16వ శతాబ్దంలో మళ్ళీ తవ్వించి 'అచ్యుతరాయ కోనేరు' అని పేరు మార్చాడని చెబుతారు. కొందరు ఆ పేరుతో మరో కోనేరు తవ్వించాడంటారు. ఏది ఏమైనా

పుష్కరిణిగానే ప్రసిద్ధి గాంచింది.


ఉత్తర మాడ వీధి లో ఉత్తరాది వారి మఠం, తిరుమల నంబి తోళపు కైంకర్య నిలయం, అహెబిల మరం శ్రీ వైఖానస అర్చక నిలయం ఈ వీధిలోనే ఉన్నాయి

స్వామి పుష్కరిణి ఈ వీధిలోనే ఉంది. శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలో వరాహ స్వామి ఆలయం ఉంది ఈ వీధిలోనే తాళ్ళపాక వారి ఇల్లు ఉండేది

తరిగొండ వెంగమాంబ మొదట్లో ఇదే వీధిలో గల ఇంటిలో నివసించేది. ఆమె సమాధి

తరిగొండ బృందావనం - ఇదే వీధిలో అర్చకుల క్వార్టర్స్ వెనకాల గల ఉంది.


ఒకప్పుడు రాజులు విడిది చేసే అంతఃపురం కూడా ఈ వీధిలోనే ఉండేదని చెబుతారు.

ఉత్తరమాడ వీధిలోనే పుష్కరిణి ఒడ్డున శ్రీ వ్యాసరాజ అహన్నిక మంటపం, ఆంజనేయస్వామి సన్నిధి, శ్రీ విఖనస మహర్షి సన్నిధి ఉన్నాయి.వాటి కెదురుగా శ్రీ రాధాకృష్ణ దేవాలయం, శ్రీ హయగ్రీవ మందిరం కలవు.


ఆనంద నిలయం చుట్టూ ఉన్న ఈ నాలుగు మాడ వీధులు లో చేసే ప్రదక్షిణ కి మహా ప్రదక్షిణం అని పేరు.


తిరుమాడ ప్రదక్షిణ ప్రియ గోవిందా..

మహా ప్రదక్షిణ ప్రియ గోవిందా..

ఆనంద నిలయ వాసా గోవిందా ...!గోవిందా...!

హనుమాన్ చాలీసా

 హనుమాన్ చాలీసా పై ప్రశ్నలు, సమాధానములు.


🍁🍁🍁🍁🍁🍁🍁🍁


1. చాలీసా" అంటే ఏమిటి? 

జ. ఈస్తోత్రంలో 40 శ్లోకాలు ఉన్నాయి కనుక 

చాలీసా అని పేరు (చాలిస్ అంటే హిందీ లో 40 అని.)


2. హనుమాన్ అంటే  అర్థం ఏమిటి?

జ. హనుమాన్ అంటే గట్టివైన దవడలు కలవాడు 

అనే కాక హను = జ్ఞానం కాబట్టి జ్ఞానవాన్ అని అర్థం. **అజ్ఞానమును* *హననము చేయునది కనుక* *జ్ఞానమునకు హనుమ అని పేరు.* 


3. ఆంజనేయ - అర్థం?

జ. ఆంజనేయ అంటే .... సామాన్య కంటితో చూడలేని దానిని చూపించేదే అంజనం , జ్ఞానాంజనం వల్ల  మాత్రమే దొరికే పరతత్వం కనుక

ఆంజనేయుడు అని పేరు.


4. తులసీదాస్ అసలు పేరు ?

జ. *రామ్ బోల*. ఎప్పుడూ రామ నామం

స్మరిస్తూ వుండడం వల్ల ఆ పేరు వచ్చింది.


5. హనుమoతుడు బ్రహ్మచారి అయితే 

మరి సువర్చల ఎవరు?

జ. దేవుళ్ళ భార్యలను, మానవ

సంబంధాల దృష్ట్యా చూడరాదు.

భార్య అంటే దేవుని యొక్క విడదీయరాని శక్తి,         సూర్యుని వద్ద నేర్చుకున్న విద్య వల్ల

వచ్చిన తేజో వర్చస్సు యే "సువర్చల"

ఆ విద్య సూర్యుని దగ్గర నేర్చుకోవడం

మూలాన సువర్చల సూర్యుని పుత్రిక అంటారు.


6. హనుమంతుడు మనికిచ్చే అష్టసిద్ధులు ఏంటి ?

జ. బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగతా అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. 

హనుమంతుని స్మరించటం వలన

మనం పొందే అష్టసిద్ధులు ఇవే.


7. సూర్యునితో పాటు తిరుగుతూ విద్య నేర్చుకున్నాడు హనుమ.అంటారు కదా

అసలు సూర్యుడు తిరగడు కదామరి?

జ. తిరగడం అంటే ఇక్కడ, ఉదయించినప్పటి

నుండి అస్తమించే వరకు, క్షణక్షణం సూర్యుని

తేజస్సు మారుతూ ఉంటుంది దానిని నిరంతరం ఉపాసించడంగా అర్ధం చేసుకోవాలి.


8. హనుమంతుని పంచముఖములు ఏవి?

జ. హనుమ శివాంశ సంభూతుడు.

శివుని పంచముఖములు,హనుమంతునిలో

ఏ పేర్లతో చెప్పబడ్డాయో చూస్తే. .....

తూర్పున వానర ముఖం  జన్మతః

వచ్చినది అది సద్యోజాత శివవదనము.

దక్షిణం వైపు నార సింహం.

అది శివుని వామదేవ ముఖం.

రాక్షస సంహారం చేయడంలో చూపించాడు.

పశ్చిమం గరుడ ముఖం అది శివుని అఘోర రూపం.       వేగ గమనము, సర్వరోగ నివారణ చేసి చూపాడు.

ఉత్తరం వరాహ ముఖం అది శివుని తత్పురుష రూపము. సంపత్ ప్రసాదం, ఉద్ధరణ.శోక సముద్రంలో ఉన్న సీతమ్మని ఉద్ధరించడం ద్వారా దానిని ప్రకటించాడు. 

ఊర్ధ్వం హయగ్రీవ ముఖం. 

అది శివుని ఈశాన ముఖం .

వేద పారంగతుడు, సకల విద్యా కోవిదుడు. ప్రతీ ముఖానికి మూడు కళ్ళు వుంటాయి. ఈ మూర్తి పది చేతులతో వుంటాడు. వేద విద్య ,త్రిమూర్తి స్వరూపం అని సీతమ్మ  నమస్కరించిన హనుమత్ విరాట్ స్వరూపం ఇది    


9. "జయ" హనుమాన్ అని

హనుమకి జయం చెప్పడమేంటి?

జ. ఎవరైనా ఏది సాధించడానికి 

( పురుషార్థాలను) పుట్టారో అది

సాధించడమే జయం అంటే. జయం

అంటే  అన్నింటినీ మించిపోయి ఉండడం.

దేవుళ్లకు మనం జయమగు గాక అంటూ ఉంటాము అంటే నా హృదయంలో నీవు అన్నింటినీ మించి ఉండు అని అర్థము.


10. తులసీదాస్ ఎంతకాలం (వయస్సు) జీవించాడు?

జ.126 సం.జీవించాడు.


శ్రీరామదూతం శిరసా నమామిః🙏

సర్వేజనాసుఖినోభవంతు 🙏

పరమాచార్య

 పరమాచార్య వారి ఆహార నియమాలు..

పరమాచార్య వారి ఆహార, విహార నియమాలు గమనిస్తే వారి స్థిత ప్రజ్ఞత మనకు స్పష్టంగా తెలుస్తుంది.

స్వామి వారు సంవత్సరం లో సగం రోజులు ఆహారమే తీసుకొనరు.

నవరాత్రులు తొమ్మిది రోజులు కటిక ఉపవాసం.ప్రతి ఏకాదశి ఉపవాసమే కాక ఆ తరువాత రోజు సాయంకాలం త్రయోదశి అయితే అభిషేకం ఉంటుంది కాబట్టి ఉపవాసం.ఆ తరువాతి రోజు యాదృచ్చికంగా శుక్రవారం వారం వస్తే నవా వరణ పూజ ఉంటుంది కాబట్టి ఆహారం తీసికోరు. ఇవన్నీ అయిన తరువాత పౌర్ణమి వస్తుంది. ఆ రోజు అభిషేకం, నవావరణ పూజ.

ఇవన్నీ కాక నైతిక విషయాలలో కొన్ని ఉపవాసాలు ఉండేవి.1926 లోను 1953లోను కొన్ని మాసాలు ఉపవసిం చేవారు.

పోనీ విశ్రాంతి తీసుకుంటారా అంటే రాత్రి పదకొండు, పన్నిండు గంటల వరకు ఏవో కార్యక్రమాలు ఉండేవి. పడక చూద్దామంటే చాలా రోజులు మేనాలోనే పడుకునే వారు. మేనా ఎలా ఉంటుందంటే కాళ్ళు జాపు కోవడానికి వీలుండదు. దానినిండా పుస్తకాలు ఉండేవి.విశ్రాంతి లో కూడా మత్యాసనం లోనే ఉండేవారు.రెండు, మూడు గంటలకు తిరిగి వారి కార్యక్రమాలు మొదలు.

సరే.. ఇక భిక్ష స్వీకరించే రోజుల్లో సహితం పద్నాలుగు సంవత్సరాలకు ఉప్పు, చింతపండు, మిరపకాయలు వాడడం మానివేశారు. చప్పిడి భోజనం స్వీకరించేవారు.

కొన్ని రోజులు బిల్వ దళాలు, వేపచిగురు తో గడిపేవారు. కొంత కాలం మూడే మూడు గుప్పిళ్ళు అన్నం తీసుకొనేవారు.

ఆంధ్ర పర్యటన కాలంలో (1967-69)స్వామి వారు పెరుగులో నానబెట్టిన పేలాలు తీసుకొనేవారు. ఇలా ఉండగా అత్యుత్సాహం ప్రదర్శించే ఒక సన్యాసి పేలాలు కూడా జీవహీంసే కదా. (బీజాన్ని వేయిస్తున్నారు కదా ) అని ఆక్షేపించేసరికి పేలాలు కూడా మానేసి అరటిపండ్ల పొడి ఆవు పాలతోనో, పళ్ళ రసం తోనో కలిపి ఇడ్లీ ల వలె ఉడకపెట్టి స్వీకరంచే వారు.

చివరి సంవత్సరాలలో ఇదే స్వామి వారి భిక్ష. ఒక్క అన్న ద్వాదశి నాడు మాత్రమే అన్న భిక్ష స్వీకరించేవారు.

ఎవరైనా "మీరు చాలా దుర్భలం గా ఉన్నారు "అంటే స్వామి నవ్వుతూ "పసివాడు బొద్దుగాను సన్యాసి వడలి పోయి ఉంటేనే అందం."అనేవారు

****ఆధునిక వైజ్ఞాన పరంగా ఆలోచిస్తే వారు చేసే పనికి వారు తీసుకొనే క్యాలోరిలు సరిపోవు.వారి బలం యోగికమైనది. లౌకికమైనది కాదు.

మంచి విషయాలు

 మంచి విషయాలు:-

*పుణ్యములు:* దేవునియందుభక్తిగలుగుట మనస్సు చేసిన పుణ్యము, దేవుని పూజించుట చేతులు చేసిన పుణ్యము దేవాలయమునకు బోవుట కాళ్లుచేసిన పుణ్యము, దేవుని జూచుట కన్నులు చేసిన పుణ్యము దేవుని కథలు వినుట చెవులు చేసిన పుణ్యము దేవునికి వందనము చేయుట శిరస్సు చేసిన పుణ్యము.



*దారిద్ర్యములు:* దరిద్రుని తల్లి తప్పులు చెప్పును భార్యయును లక్ష్యపెట్టదు., నోటవచ్చు మాటలన్నీ విపరీతముగాతోచును, తీరని దుఃఖముననుభవించును. సభలోకిబోవ సంకోశపడును, భాగ్యవంతుని యెదుట నిలువ భయపడును, శౌర్యము సన్నమగును, ఇంటికివచ్చిన చుట్టములు యమదూతల వలెనగుపడుదురు, పెత్తనముదక్కదు, ఎవరితోనేమి చెప్పికొనినను మారుత్తరముబుట్టదు, అందరునపహసింతురు.

 .

               _*సుభాషితమ్*_


𝕝𝕝శ్లో𝕝𝕝 

*అర్థార్థీ యాని కష్టాని*

 *మూఢోఽయం సహతే జనః।*

*శతాంశేనాపి మోక్షార్థీ*

 *తాని చేన్మోక్షమాప్నుయాత్॥*


తా𝕝𝕝 

*ఈ మూర్ఖుడైన మానవుడు ధనం సంపాదించేందుకు ఎన్ని కష్టాలు సహిస్తున్నాడో, అందులో నూరవభాగం కష్టాలనైనా మోక్షం సంపాదించేందుకై భరిస్తే తప్పక మోక్షం పొందగలడు*....."

            -:

17, మార్చి 2023, శుక్రవారం

తాంత్రిక గ్రంథాలలో

 ప్రాచీన తాంత్రిక గ్రంథాలలో వివరించిన నిధుల రహస్యాలు - 


 ప్రియమితృలకు నమస్కారం , 


       నిధి అనగానే చాలమంది బంగారం , వజ్రాలు అని మాత్రమే అనుకుంటారు. అంతకంటే విలువయిన సంపద అనగా వైద్యానికి , మంత్రశాస్త్రానికి మరియు తంత్రశాస్త్రానికి సంబంధించిన ఎన్నో విలువైన విషయాలు రాసి ఉన్న తాళపత్ర గ్రంథాలు, రాగిరేకులు పైన చెక్కినటువంటి ఎంతో విలువైన విషయాలు కొన్నికొన్ని రహస్య ప్రదేశాలలో ఈ భూగర్భంలో దాచబడి ఉన్నాయి. అవి వెలికి తీసి అందులో ఉన్న విజ్ఞానాన్ని సమాజానికి ఉపయోగిస్తే అద్భుతాలు సృష్టించవచ్చు . ధనం ను కూడా భూగర్భం నందు దాచిన దానిని కూడా నిధి అంటారు. 


            నిధులు అనేవి ముఖ్యంగా మూడు  రకాలుగా దాచబడి ఉంటాయి.  అందులో మొదటి దాని గురించి చెప్పాలి అంటే జనం దాచుకున్న సోమ్ము . ప్రాచీన కాలంలో ఇప్పటిలా బ్యాంకులు ఉండేవి కావు. ఆ సమయంలో జనం ఇళ్లల్లో , పొలాల్లో తమకు తెలిసిన ప్రదేశాలలో తమ దగ్గర ఉన్న బంగారాన్ని కుండలలో పెట్టి దాచేవారు . అదే సమయంలొ అంటువ్యాధులు చాలా తీవ్రంగా ఉండేవి . మొత్తం వూరిలో శవాన్ని తీయుటకు మనుషుల కూడా లేకుండా మరణించిన సంఘటనలు కూడా ఉన్నాయి. అలా మరణించుటకు కారణం అయ్యే వ్యాధి పేరు "కలరా" అవి అలా ఉండిపోయి అప్పుడప్పుడు బయటపడుతుంటాయి.


                 ఇక మనం రెండోవరకం నిధుల గురించి తెలుసుకుందాం . ఈ నిధులు గజదొంగలు వూర్లపైన పడి దోచుకొని కొండ గుహలలో దాచి ఉంచే నిధి . ఈ దాచి ఉంచిన స్థలం వారు మధ్యలో మరణిస్తే వారితోనే అంతం అయిపోతుంది.


          మూడో రకం నిధుల గురించి చెప్పలంటే వీటిని రాజ నిధులు అంటారు. ఇవి పూర్తి ఉద్దేశ 

పూర్వకంగా అత్యంత రహస్య ప్రదేశాలలో మంత్ర,యంత్ర పూజా సమేతంగా నిక్షిప్తం చేస్తారు . ఈ పూజకొరకు చాలా శక్తిమంతం గా ఉండే అస్ఖలిత బ్రహ్మచారులు ను ఉపయోగిస్తారు . ఎక్కువుగా పక్క రాజ్యాల దండయాత్రల సమయంలో ముఖ్యంగా మనదేశంలో బ్రిటిష్ వారి నుంచి తమ రాజ్య ఖజానా కాపాడుకొనుట కొరకు  రాజులు ఈ పద్దతి పాటిస్తారు. ఈ పద్దతిలో రాజు ఎక్కడో ఒకచోట ఈ నిధి గురించిన రహస్యాన్ని పేర్కొంటాడు . అటువంటి కొన్ని మ్యాప్స్ నేను పరిశీలించాను . 


         ఈ శక్తిమంతం అయిన మంత్రపూర్వకంగా దాచి ఉంచిన నిధులను మాంత్రిక , తాంత్రిక వేత్తలు 4 రకాలుగా వర్గీకరించారు  వీటి గురించి శ్రీకంఠ శంభునాథ సిద్దుడు రచించిన "నిధిప్రదీపం" అను గ్రంథం నందు చాలా వివరంగా తెలియజేశాడు . ఈ బుక్ సంస్కృతంలో 1930 లో ముద్రించబడినది.  


              శివుడు ఉపదేశించిన ప్రకారం ఈ నిధులు అనేవి 4 రకాలు .  అవి 


  *   కచ్చప .


 *    మకర .


 *    శంఖ .


 *    పద్మ .


        వీటిలో కచ్చప , మకర నిధులు మాత్రమే స్థిరంగా , అచంచలంగా ఒకేచోట ఉండును. వీటిని ప్రయత్నముచేత , శివానుగ్రహము చేత మాత్రమే పొందగలరు . 


            మిగిలిన శంఖ, పద్మ నిధులు అనేవి మానవుని శబ్దం వినపడిన వెంటనే చంచలమై వేరొక స్థానమునకు వెళ్లిపోవును .వీటిని సాధించుట అసంభవం . శివ, విష్ణు , అమ్మవారి మంత్రముల సిద్ధి పొందిన వారికి మాత్రమే అవి లభ్యం అగును. 


   నిధులు ఉన్న ప్రదేశాలను గుర్తించుటకు కొన్ని గుర్తులు  - 


 *  ఏ ప్రదేశం నందు భూమి నుంచి తామర పువ్వుల వాసన వచ్చుచుండునో ఆ స్థలం నందు నిధి ఉండును అని తెలుసుకొనవలెను .


 *  డేగలు , కాకులు , కొంగలు ఏ ప్రదేశం నందు ఎక్కువ గా సంచరించుచుండునో ఆ స్థలం యందు నిధి ఉండును.


 *  కాకులు విశేష ప్రీతితో సంభోగం చేయుచుండునో అక్కడ నిధి ఉండును. 


 *  ఒక ప్రదేశం నందు అనేక  వృక్షాలు ఉన్నను ఒకే చెట్టు పైన పక్షులు అన్నియు కలిసి నివసించుచుండిన ఆ స్థలం నందు నిధి ఉండునని తెలుసుకొనవలెను .


 *  పురాతన దేవాలయాల యందు , పాడైపోయిన చెరువుల యందు , పాడిపడిన గ్రామాల యందు నిధి ఉండును. 


 *  ప్రతినిత్యం పశువులు మేస్తున్ననూ తెల్లవారే సరికి మిగిలిన ప్రదేశం కంటే నిధి ఉన్న ప్రదెశం నందు గడ్డి తొందరగా పెరుగును . 


 *  ఆకురాలు సమయంలో మిగిలిన చెట్ల ఆకులు ఎండిపోయినను ఏ చెట్టు ఆకులు కోల్పోకుండా పచ్చగా పుష్పాలతో వికసించి ఉండునో ఆ చెట్టు క్రింద తప్పక నిధి ఉండును. 


         పైన చెప్పిన విధముగా చాలా పద్ధతులు ఉన్నాయి . స్థలాభావం వల్లన వివరించలేకున్నా . 


  భూగర్బంలో ఉన్న నిధిని కనుగొనుటకు పురాతన పద్దతి  - 


       ఒక కొత్త కుండ నిండగా గోమూత్రం తీసుకుని నిధి ఉన్నది అనుకున్న ప్రదేశం నందు గోమూత్రంతో నింపి ఉన్న కుండను పాతిపెట్టి ఉంచవలెను . 7 రాత్రులు గడిచిన తరువాత ఆ కుండ పాతిపెట్టబడిన  స్థలం నందు జాగ్రత్తగా తవ్విచూడగా ఆ కుండ యందలి గోమూత్రం హరించిపోయి  ఆ కుండ శిదిలిం అయ్యి ఉన్నచో ఆస్థానమున నిధి ఉన్నదని గుర్తించవలెను.


          

 గమనిక  - 


          ఈ నిధుల వేటలో పడి చాలా మంది కుటుంబాలు నాశనం చేసుకుంటున్నారు . దయచేసి అత్యాశకి పోకండి .మీకు దక్కాలని రాసి ఉంటే ఆ సర్వేశ్వరుడు మీకు ప్రసాదిస్తాడు .


    

  

         మరిన్ని సులభ ఆయుర్వేద చిట్కాలు మరియు ఆయుర్వేద ఔషధాల వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 


  గమనిక  -


     నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      కాళహస్తి వేంకటేశ్వరరావు 

 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


          ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

            9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .

మంచిని

 శ్లోకం:☝️

*విషాదప్యమృతం గ్రాహ్యం*

 *బాలాదపి సుభాషితమ్ l*

*అమిత్రాదపి సద్వృత్తమ్*

 *అమేధ్యాదపి కాంచనమ్ ॥*


భావం: మట్టి నుండి వచ్చిన బంగారం ఎలా ఆమోదయోగ్యమైనదో - విషం నుండి కూడా అమృతాన్ని గ్రహించవచ్చు. మంచి మాటని బాలుని నుండి కూడా తీసుకోవచ్చు. శత్రువు చేసిన మంచి పని/ప్రవర్తన కూడా అభినందనీయమే! మంచిని ఎక్కడ నుంచైనా గ్రహించవచ్చునని భావం.

మౌనం అంటే ఏమిటి?

 *శుభోదయం*

🙏💐💐🙏


*మౌనం అంటే ఏమిటి?*


మౌనం అంటే మాటలు లేని మూగతనం కాదు.. 


మౌనం అంటే భాషకు భావం లేకుండటం కాదు..


మౌనం అంటే చిత్త వృత్తులతో సతమతమవడం కాదు...

 

మౌనం అంటే మాట శబ్దాన్ని కోల్పోవడం కాదు..

.  

*మరి మౌనానికి అర్థం?* 


మౌనం అంటే మనసు మూగపోవడం.. 


మౌనం అంటే మనసులో భావం లేకుండటం...


మౌనం అంటే మనసును అంతర్ముఖం చేయడం....

 

మౌనం అంటే తనను తాను దర్శించడం...


*మౌనంలో ఏం జరుగుతుంది?*


మౌనంలో మనసు శూన్యం అవుతుంది..


మౌనంలో భాష లోని భావం మూగపోతుంది.. 


మౌనంలో చిత్త వృత్తులు నశిస్థాయి.. 



మౌనంలో ఏ భావమూ లేని, ఏ శబ్దమూ లేని,  శాశ్వత మైన పరమాత్మ తత్వం ఎరుక కలుగుతుంది... 



ఆ ఎరుక కోసమే ఎందరో ఎన్నో దారులలో ప్రయాణించారు... 


*మౌనం కూడా అందులో ఒక దారి...* 


ప్రయాణించి చూద్దామా?... 

మౌనిగా ఉండిపోదామా..?


🙏🙏🙏🙏

ఎవరికివారే బాధ్యులు

: *ఆత్మానమేవ మన్యేత కర్తారం సుఖ దుఃఖయోః|*

*తస్మాత్ శ్రేయస్కరం మార్గం ప్రతిపద్యేతనత్రచేత్||*

                                 

ఆరోగ్యంగా ఉండడానికైనా, రోగాలబారిన పడడానికైనా ఎవరికివారే బాధ్యులు. అందుచే, శ్రేయస్కరమైన దారిని వెతుక్కోవాలి. అప్పుడే, ఆరోగ్యాన్ని గురించిన చింత ఉండదు. 


*🙏🙏సర్వే జనాః సుఖినోభవంతు 🙏🙏*

:

 ఈశ్వరుడు అష్టవిధ మూర్తి. కాళిదాస మహాకవి ఈశ్వరుడి అష్టమూర్తి తత్త్వాన్ని ఇలా స్తోత్రం చేశాడు. యా సృష్టిః స్రష్టురాద్యా వహతి విధి హుతాం యా హవిర్యా చహోత్రీ యే ద్వే కాలం విధత్తః శ్రుతి విషయగుణా యా స్థితా వ్యాప్య విశ్వమ్|| యామాహుః సర్వభూత ప్రకృతిరితి యయా ప్రాణినః ప్రాణవనః ప్రత్యక్షాభిః ప్రపన్నస్తనుభిరవతు వస్తాభిరష్టాభిరీశః || 'నేల, అగ్ని, నీరు, గాలి, ఆకాశం అనే పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, 'నేను' అనే యజమాని- ఈ ఎనిమిది రూపాలలో ఈశ్వరుడు విరాజిల్లుతున్నాడు. విశ్వరూపుడు, మహత్తర శక్తి కలిగిన పరమాత్మ అయిన రుద్రుడిని ఏకాదశ రుద్రాభిషేకాలతో ప్రసన్నుడిని చేయడం వల్ల ప్రకృతి ప్రశాంతత పొందుతుంది' అని వివరించాడు కాళిదాస కవి.

స్నేహితుని సహాయం


ఈ రథయాత్ర అప్పుడే మరొక భక్తుడు తనకు జరిగిన సంఘటనను కూడా అక్కడున్నవారితో పంచుకున్నాడు. ఈ సంఘటన పరమాచార్య స్వామివారి అపార కరుణకు నిదర్శనం.


పేదరికం అతణ్ణి ఎన్నో కష్టాలపాలు చేసింది. అదే సంవత్సరం 1984లో పరమాచార్య స్వామివారు తిరుమంగలక్కుడిలో మకాం చేస్తున్నప్పుడు, ఈ పేదవాడు రోజూ ఆ చోటుకు వెళ్ళేవాడు. ఇతనికి పరమాచార్య స్వామివారు ఎవరని కాని, మహాస్వామి వారి గొప్పతనం కాని తెలియదు. కనుక అతనికి స్వామివారిపై ప్రత్యేకమైన భక్తి ఏమీ లేదు. కాని పేదరికం వల్ల రోజూ కనీసం ఒక్కపూట భోజనం కూడా లేకపోవడంతో, కేవలం ఉదర పోషణార్థం అతను అక్కడకు వెళ్ళేవాడు. అక్కడకు వెళ్ళడం వల్ల కడుపు నిండినా పేదరికం పోలేదు.


మహాస్వామివారు అక్కడినుండి వేరోక్కచోటుకు వెళ్తే, అతనికి ఆ ఒక్కపూట భోజనం కూడా దొరకదు. అయిదు మంది ఉన్న కుటుంబాన్ని పోషించలేక, అప్పులు ఎక్కువై, ఆదాయం లేక చివరకు ఆత్మహత్య తప్ప వేరొక దారి లేదని నిశ్చయించుకున్నాడు.


నిర్ణయం తీసుకుని చివరిసారిగా చనిపోయే ముందు అందరూ గొప్పగా చెప్పుకునే కంచి పరమాచార్య స్వామివారి దర్శనం చేసుకుందామని వెళ్ళాడు.


అంజలై లాగే ఇతను కూడా నమ్మకంతి కాకుండా ఊరికే స్వామివారిని చూసి తరువాత చనిపోదామని కంచి చేరుకున్నాడు.


ఏమి మాట్లాడకుండా పరమాచార్య స్వామి వారి ముందర నిలబడ్డాడు.

అందరినీ చూసే కరుణాపూరితమైన చూపులతో స్వామివారు అతణ్ణి చూశారు. సర్వజ్ఞులైన స్వామివారు అతణ్ణి ఒక ప్రశ్న అడిగారు, “నీ తరువాతి కార్యక్రమమ ఏమిటి?”.


జీవితం చివర్లో నిలబడియున్న ఆ నిరుపేద ఏమని సమాధానం చెబుతాడు. తాను జీవితాన్ని చాలించాలని నిశ్చయించుకున్నట్లు చెప్పగలడా? “ఏమి చెయ్యాలో నాకు తెలియదు సామి! నేను నా స్థానాన్ని చేరుకోవాలి” అని జీవితం పైన ఆశ చచ్చిపోయిన స్వరంతో, నిరాశ నిస్పృహలు తొంగిచూస్తున్న మాటలతో చెప్పాడు.

“నేను నీకు బస్సుకు డబ్బులు ఏర్పాటు చేస్తాను. నేరుగా నీ ఊరికి వెళ్ళవద్దు. ఇక్కడి నుండి సరాసరి మద్రాసుకు వెళ్ళు. అక్కడ ప్యారీస్ కార్నర్ లో బస్సు దిగి, అక్కడి నుండి మీ ఊరికి బస్సులో వెళ్ళు” అని ఆజ్ఞాపించారు స్వామివారు.

అక్కడే ఉన్న శిష్యులకు ఇక్కడి నుండి మద్రాసుకు, అక్కడి నుండి తన ఊరికి సరిపడా డబ్బులు ఇవ్వమని ఆదేశించారు.


ఎందుకు ఈ సామి పడమరన వేలూరుకు దగ్గరలో ఉన్న తన ఊరికి వెళ్ళడానికి తూర్పున ఉన్న మద్రాసుకు వెళ్లి మరలా అక్కడి నుండి ఊరికి వెళ్ళమని చెబుతున్నారో అతనికి అర్థం కాలేదు. కాని స్వామివారి ఆదేశం కాబట్టి పాటించాడు.


చెన్నైలో ప్యారీస్ కార్నర్ లో దిగి తన ఊరికి వెళ్ళే బస్సు కోసం వెతుకుతున్నాడు. భగవంతుడు పంపినట్టుగా అప్పుడే అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు. అతను ఇతని స్నేహితుడే! చాలా కాలం తరువాత ఇతన్ను చూడడంతో అతను చాలా సంతోషించాడు. దగ్గరలో ఉన్న హోటలుకు తీసుకునివెళ్ళి ఆహారం ఇప్పించాడు. చాలా అకాలితో ఉండడంతో సంతోషంగా తినేశాడు. తన గురించి, కుటుంబం గురించి అడగడంతో, ఇక తట్టుకోవడం చేతకాక ఏడుస్తూ తన గోడు వెళ్ళబోసుకున్నాడు.


ఇతను సాక్షాత్తు పరమేశ్వరుడు పంపిన స్నేహితుడు కదా మరి. అతణ్ణి ఓదార్చి మంచి మాటలతో అనునయించాడు. అతని అప్పులన్నీ తీర్చి, కొద్దిగా ధన సహాయం కూడా చేసి కుటుంబాన్ని కూడా ఆదుకుంటానని మాటిచ్చాడు.

అంతటి దీనస్థితి నుండి స్నేహితుని సహాయం వల్ల బయటపడి, ఉద్యోగం కూడా పొంది ఇరవైఅయిదేళ్ళ తరువాత కుమార్తె వివాహం కూడా చేశాడు. పరమాచార్య స్వామివారి ఇప్పుడు రథయాత్రలో శిలా రూపంలో ఇటు రావడంతో కృతజ్ఞతతో కళ్ళ నీరు కారుస్తూ, తన కథను చెప్పుకున్నాడు.


అంతటి కరుణారూపమైన ఈ భగవంతునిపై మనకున్న భక్తి చేత స్వామివారే మనల్ని ఆశీర్వదించి, మనలను కాపాడి, అన్ని సౌఖ్యాలు కలగజేస్తారు.


--- “శ్రీ శ్రీ శ్రీ మహాపెరియవా మహిమై” పత్రిక నుండి


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

సాక్షీభూతులుగా

 .


         _*సుభాషితమ్*_


శ్లో.

*సూర్యస్సోమో యమఃకాలో*

*మహాభూతాని పఞ్చచ|*

*ఏతేశుభాశుభస్యేహ*

*కర్మణో నవసాక్షిణః||*


భావము:

*సూర్యుఁడు, చన్ద్రుఁడు, యముఁడు, కాలపురుషుఁడు, పఞ్చభూతములైన..నిఙ్గి, నీరు, నిప్పు, భూమి, వాయువు, ఇహములో మనుజుఁడు ఆచరించే *శుభాఽశుభ కర్మలకు ఈ తొమ్మండుగురు సాక్షీభూతులుగా వర్తిస్తారుట*....