10, ఏప్రిల్ 2023, సోమవారం

 

శంకరాభరణం సమూహం వారు ఇచ్చిన

సమస్య - 4390

9-4-2023 (ఆదివారం) 


ఇది...


*“జీతము లేనిదౌ కొలువుఁ జేసినవానికి మేలు సేకురున్”*


నా ప్రయత్నం ఇలా......


కొలువు చేసిన పనికి జీతమిచ్చుట వాడుక


మలుపులు తిరుగు కొలవులు మాన్యుల ఆజ్ఞపై 


నీలిమేఘశ్యాముని సేవ జీతము లేనిదౌ


కొలువుఁ జేసినవానికి మేలు సేకురున్.

:


 సమస్య(122):-


"వేడి పెరుగుచుండఁ బ్రజకు వేడుక కలిగెన్"


నా ప్రయత్నం:


మధురలో కంసుని పాలన క్రూరమయ్యాను


మధురమయ్యేను రేపల్లెలో శ్రీకృష్ణుని చేష్టలు 


మాధవుడు మధురకు వచ్చునను వార్త చేరి


అధీశుని కంస దేహవేడి పెరుగుచుండ ప్రజకు వేడుకగలిగెన్.

మూర్ఛవ్యాధి హరించుటకు

 మూర్ఛవ్యాధి హరించుటకు రహస్య యోగాలు  - 


 * రేగుగింజలలోని పప్పు , మిరియాలు , వట్టి వేళ్ళు , నాగకేసరములు ఈ వస్తువులను సమానంగా తీసుకుని చూర్ణం చేసి పూటకు రెండున్నర గ్రాములు చూర్ణం చొప్పున తేనెతో కలిపి ఇచ్చుచుండిన యెడల మూర్ఛలు హరించును . 


 * ఒక జాజికాయకి రంధ్రం చేసి పట్టుదారంతో గ్రుచ్చి కంఠము నందు కట్టుకొని తీయకుండా ధరించుచుండిన స్త్రీల మూర్చవ్యాధి , హిస్టీరియా వ్యాధి నశించును.


 * ఇనుప గంటె లో పొంగించిన అల్లపురసం గిద్దెడు తీసుకుని ముప్పై గ్రాములు పటికబెల్లం పొడి కలుపుకుని ప్రాతఃకాలం నందు నిత్యం సేవించుచున్న యెడల మూర్చవ్యాధి హరించును . 


 గమనిక - ఇనుప గంటె తీసుకుని దానిలో అల్లంరసం పోసి వేడి చేసిన వేడికి గంటె లోని అల్లం రసం పొంగును.


 *  జటామాంసి చూర్ణం 60 గ్రాములు , హారతి కర్పూరం రెండున్నర గ్రాములు , దాల్చిన చెక్క చూర్ణం 5 గ్రాములు మూడింటిని తీసుకుని కలిపి మెత్తగా నూరి ఒక గాజు సీసాలో పోసుకొని ప్రతినిత్యం భోజనమును ముందు 3 గ్రాముల చొప్పున తింటూ ఉన్న యెడల అపస్మారం హరించివేయును . దీనిని మించిన ఔషధం లేదు . 


 *  ఆవు యొక్క ఎడమ కొమ్ముని ఉంగరంలా చేసుకుని ఎడమ చేతికి ధరించిన అది చేతికి ఉన్నంతవరకు మూర్ఛ రాదు .


 గమనిక - 


 మూర్చ వచ్చి కొట్టుకుంటున్న వ్యక్తి కి సీతాఫలం చెట్టు ఆకు నలిపి ముక్కుదగ్గర పెట్టి వాసన చూపించిన వెంటనే మూర్చ తగ్గి తెలివి వచ్చును.


     రావిచెట్టు పాలు 4 చుక్కలు ముక్కులో వేసినను మూర్చ తగ్గి వెంటనే తెలివి వచ్చును. రెండు ముక్కులలో అటు 2 ఇటు 2 వేయవలెను . 


     ఇవి నా అనుభవ యోగాలు ..


          


          

కాలం, కర్మ ఎప్పటికీ మర్చిపోవద్దు

 కర్మ తలుచుకుంటే మనుషుల పరిస్థితి ఇలానే ఉంటుందేమో????


ఒక జంట భోజనం ముగించుకున్నాక ఆ ఇంటి ఇల్లాలు అన్ని సర్దుతున్నవేళ ఒక వ్యక్తి తలుపు కొట్టే శబ్దం వినిపించింది


ఎవరై ఉంటారు అని భర్త అడుగుతుంటే 

ఆకలి అంటూ ఒక వ్యక్తి అన్నం పెట్టమని అడిగాడు


దానికి భార్య మిగిలిన కూర కాస్త అన్నం అతనికి పెట్టేస్తాను అంది


ఏమీ అవసరం లేదు అవి అలాగే లోపల ఉంచేయి

రేపటికి మనకే పనికివస్థాయి అన్నాడు

 

ఇలా చిన్న చిన్న మనస్పర్థలు పెరిగి పెద్దవయ్యాయి భార్యభర్తలు ఇద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు.


అతడి పరిస్థితి తలకిందులైయింది, ఉద్యోగం పోయింది, అన్నం పెటేవారు లేరు ఇలా అతను 

కటిక దరిద్రం అనుభవిస్తున్నాడు


భార్య మాత్రం విడిపోయాక కొన్ని ఏళ్ల తరువాత ఒక వ్యక్తిని వివాహం చేసుకుని హాయిగా గడుపుతుంది


భర్తతో కలిసి భోజనానికి సిద్ధం అవుతున్న వేల ఒక బిక్షగాడు ఆకలి అంటూ అన్నం పెట్టమంటే ఆ భర్త మొదట అతడికి పెట్టేసేయ్ తరువాత మనం వండుకోవచ్చులే అన్నాడు


సరే అని ఆమె బయటకెళ్లి వచ్చి బోరున ఏడవడం మొదలుపెట్టింది ఏమైంది అని అడిగాడు ఆ భర్త


వచ్చిన ఆ బిక్షగాడు ఎవరో తెలుసా నా మొదటి భర్త అని చెప్పింది


దానికి తాను నవ్వుతు నేనెవరో తెలుసా అని అడిగాడు . నేను ఆ రోజు ఆకలి అని నీ ఇంటి తలుపులు కొట్టినవాడిని అన్నాడు


జీవతం చాలా నేర్పిస్తుంది


నాకేంలే అని అనుకుని గర్వం చూపించగానే ఆ పొగరుని అనిచే రోజొకటి మనకోసం ఎదురుచూస్తూ ఉంటుంది


అహంకారం అసలు పనికిరాదు

జీవితం తలకిందులు అవడానికి చాలా సమయం అయితే తీసుకోదు


ఎదుటి వ్యక్తి బాగుంటే చూడలేని వారిని

నేను మాత్రమే బాగుండాలి అనుకున్న ప్రతి ఒక్కరి జీవితాలతోను దేవుడు ఏదో ఒక ఆట ఆడేసుకుంటూ ఉంటాడు.


 మనం చేసిన సహాయం లేదా అపకారం మనం మర్చిపోవచ్చేమో కానీ కాలం, కర్మ ఎప్పటికీ మర్చిపోవద్దు. ఏ సమయానికి ఏది ఇవ్వాలో అది కచ్చితంగా మనకి ఇచ్చే తీరుతుంది.


 సర్వేజనా సుఖినోభవంతు 🙏🏻🙏🏻

అభిజ్ఞాన శాకుంతలం

 శ్లోకం:☝️

*సరసిజమనువిద్ధం శైవలేనాపిరమ్యం*

*మలినమపి హిమాంశోర్లక్ష్మ లక్ష్మీం తనోతి l*

*ఇయమధికమనోజ్ఞా వల్కలేనాపి తన్వీ*

*కిమివ హి మధురాణాం మండనం నాకృతీనాం ll*


భావం: అందానికి ఏ ఆభరణమైనా అలకారమే

కాళిదాసుని "అభిజ్ఞాన శాకుంతలం" నాటకంలో, వేటకోసం అడవికొచ్చిన దుష్యంతుడు మునివాటికలో వున్న శకుంతలను చూసి ఇలా అనుకుంటాడుట.

కమలం నాచులో పుట్టినా రమ్యంగానే ఉంటుంది. చంద్రునికి మచ్చ కూడా ఒక అందమే. అసలు సహజ సౌందర్యమే ఉండాలి గాని, ఎలాంటి బట్టకట్టినా బాగానే ఉంటుంది. ఈమె నారచీర కట్టినా బాగానే ఉంటుంది. మధురమైన ఆకృతిగల శరీరానికి అలంకారం కానిదేది? (ఏ వస్తువు(నగ/చీర) తొడిగినా అది అందంగానే తోస్తుంది.

మహాస్వామి

 


 మహాస్వామి - మానసిక చికిత్స


బుద్ధిమాంద్యంతో ఉన్న తమ పిల్లాణ్ణి తీసుకుని దంపతులొకరు కాంచీపురానికి వచ్చి, పిల్లవాడు చాలా దీన స్థితిలో ఉన్నాడని, అతని స్థితి బాగుపడేలాగా ఆశీర్వదించమని మహాస్వామివారితో మొరపెట్టుకున్నారు.


అప్పుడు వారికి, మహాస్వామివారికి జరిగిన సంభాషణలో నేను గ్రహించినది.


మహాస్వామి : “పిల్లాడు ఏదేని నెప్పితో బాధపడుతున్నాడా?”

తల్లితండ్రులు : “లేదు పెరియవా”


మహాస్వామి : “ఆహారం కావాలని లేదా తిననని మారాం చేస్తున్నాడా?”

తల్లితండ్రులు : “లేదు, ఏది పెడితే అది తింటున్నాడు”


మహాస్వామి : “తన ఈ స్థితి వల్ల మానసిక కృంగుబాటుకు లోనవుతున్నడా?”

తల్లితండ్రులు : “లేదు, తను అందరిలాంటి పిల్లవాడు కాదని తనకు అస్సలు తెలియదు”


మహాస్వామి : “కోరిక, బాధ, ఆకలి, ఆశ, నిరాశ లేని ఉత్తమ స్థితి కోసం మన మహర్షులు కొన్ని వందల సంవత్సరాల పాటు తపస్సు చేశారు. మీ పిల్లాడి స్థితి అటువంటిది. అది భగవంతుడు తనకి ఇచ్చిన గొప్ప వరం. అతనికి శారీరక, మానసిక సమస్యలు ఏవీ లేవు. ఆ స్థితిని పోగొట్టి అతనికి బాధను ఎందుకు కలగజేయాలని అనుకుంటున్నారు? మీరు ఇచ్చే మందులు పూర్తిగా అతడి సమస్యను తీర్చి, సాధారణ పిల్లాడిలా మార్చగలిగితే మీరు ప్రయత్నించవచ్చు. కాని అది సాధ్యం కాదని వైద్యులు తేల్చేశారు”


ఇది సాధారణ ఆలోచనలకు అతీతంగా ఉన్న విషయం. కాని సరైనది, స్థిరమైనది కూడా!


ఒకసారి పోస్ట్ మేనింజిటిక్ హెమిపరెసిస్ తో బాధపడుతున్న బిడ్డతో తల్లితండ్రులు మహాస్వామివారి వద్దకు వచ్చారు. వారు మధ్యతరగతి ఆదాయానికి చెందినవారు. చాలా బాధలో ఉన్నారు. వారు స్వామివారితో, “ఇలా మాకే ఎందుకు జరిగింది? ఏమి తప్పు చేశామని మాకు ఈ బిడ్డ బరువుని ఇచ్చారు? వేలకొలది తల్లితండ్రులకు మంచి పిల్లల్ని ఇచ్చిన భగవంతుడు మాకు మాత్రం ఇలాంటి బిడ్డను ఎందుకు ఇచ్చాడు?” అని బాధపడ్డారు.


స్వామివారు ఆ దంపతులతో, “భగవంతుడు మిమ్మల్ని శిక్షించలేదు. నిజానికి మీరు దేవునిచేత ఎన్నుకోబడ్డారు. ఏదో పూర్వజన్మ పాపకర్మ వల్ల ఈ పిల్లాడు ఇలా అనుభవిస్తున్నాడు. అంతేకాక ఈ బాధ తనకి ఎక్కువగా ఉండరాదు అని భగవంతుడు ఆలోచించాడు. ఈ పిల్లాడికి మంచి ధనవంతులైన తల్లితండ్రులను ఇచ్చుంటే, బహుశా వారు పిల్లాడి బాగోగులు చూడటానికి పనివారిని నియమించేవారు. దాని వల్ల తల్లితండ్రుల నిజమైన ప్రేమ, ఆప్యాయత, అనురాగం తనకి లభించేవి కాదు. అలాకాక, పేదవారైన తల్లితండ్రులైతే, వారికే తినడానికి తిండి లేకపోవడంతో, పిల్లాణ్ణి చూసుకోవడానికి వారికి సమయము, డబ్బు రెండూ ఉండేవి కావు. వేలమంది తల్లితండ్రులలో భగవంతుడు మిమ్మల్నే ఇతనికి తల్లితండ్రులుగా ఇచ్చాడు కావున అతను మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాడు. అతని బాధ కూడా కొద్దిగా ఉపశమనం పొందుతుంది. ఈ పనికి మీరు మాత్రమే సరైనవారని దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. భగవానుడు మిమ్మల్ని శిక్షించడంలేదు” అని తెలిపారు.


మరలా పూర్తి భిన్నమైన కోణంలో ఆలోచన, కానీ ఇదొక పూర్తిగా కొత్తదైన మానసిక చికిత్సా విధానం.


--- ప్రొ. యస్. కళ్యాణరామన్, న్యూరోసర్జన్, చెన్నై. “మూమెంట్స్ ఆఫ్ ఎ లైఫ్ టైం” నుండి


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం



గుంటూరు జిల్లా 


మంగళగిరి 


*యర్రబాలెం శ్రీనగర్ కాలనీ*


కంచి  పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి మహా స్వామి సోమవారం సాయంత్రం 5గంటలకు మంగళగిరి -తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి యర్రబాలెం శ్రీనగర్ కాలనీ లక్ష్మీ సూర్యా ఎస్టేట్స్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరై భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేయనున్నట్లు కార్యనిర్వాహక కమిటీ సభ్యులు తెలిపారు. శంకర విజయేంద్ర సరస్వతి మహా స్వామి కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం విలేకరుల సమావేశంలో కార్యనిర్వాహక కమిటీ సభ్యులు డాక్టర్ విష్ణుబట్ల సుబ్రహ్మణ్యం సలక్షణ ఘనపాటి, జి కామేశ్వర శర్మ మాట్లాడుతు కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి మహా స్వామి తెలంగాణా -ఆంధ్ర  రాష్ట్ర పర్యటనలో భాగంగా నగర పరిధిలోని యర్రబాలెంకు విచ్చేయడం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టమన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నటరాజ శర్మ, రాధాకృష్ణ, నరసింహారావు, బాబ్జి తదితరులు పాల్గొన్నారు.

ఎ పురాణంలో ఏముందో క్లుప్తంగా తెలుసుకుందా

 🔥ఎ పురాణంలో ఏముందో క్లుప్తంగా తెలుసుకుందాము🔥


1.మత్స్యపురాణం 

2.కూర్మపురాణం

3.వామనపురాణం

4.వరాహపురాణం

5.గరుడపురాణం

6.వాయుపురాణం

7. నారదపురాణం 

8.స్కాందపురాణం

9.విష్ణుపురాణం

10.భాగవతపురాణం

11.అగ్నిపురాణం 

12.బ్రహ్మపురాణం

13. పద్మపురాణం

14.మార్కండేయ పురాణం

15.బ్రహ్మవైవర్తపురాణం 

16.లింగపురాణం

17.బ్రహ్మాండపురాణం

18.భవిష్యపురాణం


ఈ పురాణాలు అన్నింటిలోకీ మార్కండేయ పురాణం చిన్నది కాగా, పద్మపురాణం పెద్దది.


🐋మత్స్య పురాణం:*

మత్స్యరూపంలో ఉన్న మహావిష్ణువు మనువనే రాజుకు చెప్పిన ఈ పురాణంలో కాశీక్షేత్ర ప్రాశస్త్యం, యయాతి, కార్తికేయుడు వంటి రాజుల గొప్పదనాన్ని, ధర్మమంటే ఏమిటో, ఆ ధర్మాన్ని ఆచరించే విధానాలేమిటో విష్ణుమూర్తి వివరిస్తాడు.


🐢కూర్మ పురాణం:*

కూర్మావతారం దాల్చిన విష్ణుమూర్తి చెప్పిన ఈ పురాణంలో ఖగోళ శాస్త్రం గురించి, వారణాసి, ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాల గురించి వర్ణన కనిపిస్తుంది.


👶వామన పురాణం:* 

పులస్త్య మహర్షి నారద మహామునికి చెప్పిన ఈ పురాణంలో శివపార్వతుల కల్యాణం, గణేశ, కార్తికేయుల జన్మవృత్తాంతాలు, రుతువుల గురించిన వర్ణనలు కనిపిస్తాయి.


🐷వరాహ పురాణం:*

వరాహావతారం దాల్చిన విష్ణువు భూదేవికి తన జన్మవృత్తాంతం, ఉపాసనా విధానం, ధర్మశాస్త్రాలు, వ్రతకల్పాలు, భూమిపై ఉన్న వివిధ రకాల పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలు ఈ పురాణంలో కనిపిస్తాయి.


🦅గరుడ పురాణం:*

గరుడుని వివిధ సందేహాలపై విష్ణువు చెప్పిన వివరణ ఇది. ఇందులో గరుడుని జన్మవృత్తాంతంతోబాటు జనన మరణాలంటే ఏమిటీ, మరణానంతరం జీవుడు ఎక్కడికి వెళతాడు, ఏ పాపానికి ఏ శిక్షపడుతుంది... వంటి విషయాలు తెలుపడం జరిగింది.


🌪వాయు పురాణం:*

వాయుదేవుడు చెప్పిన ఈ పురాణంలో ఈశ్వరుని మాహాత్మ్యం, భూగోళం, సౌరమండల వర్ణనలు కన్పిస్తాయి.


🔥అగ్ని పురాణం:*

అగ్నిదేవుడు వశిష్టునికి చెప్పిన ఈ పురాణంలో వ్యాకరణం, ఛందస్సు, వైద్యశాస్త్ర రహస్యాలు, జ్యోతిశ్శాస్త్రం, భూగోళ, ఖగోళ రహస్యాలను ఈ పురాణంలో తెలుసుకోవచ్చు.


🦚స్కంద పురాణం:* 

కాశీఖండం, కేదారఖండం, కుమారిల ఖండం, రేవాఖండం... తదితర ఖండాలుగా ఉండే ఈ పురాణాన్ని స్కందుడే చెప్పాడట. ఇంకా రామేశ్వర క్షేత్ర మహిమ, పూరీ జగన్నాథ ఆలయంతో సహా అనేక పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలుంటాయి. ఇంకా కుమారస్వామి జననం, మహిమలు, శివలీలల ఉంటాయి.


🔱లింగ పురాణం:*

లింగరూప శివ మహిమలతో బాటు, వివిధ వ్రతాలు, ఖగోళ, జ్యోతిష, భూగోళాల గురించిన సమాచారం ఉంటుంది.


🪕నారద పురాణం:*

బహ్మమానస పుత్రులైన సనక సనంద సనాతన సంపత్కుమారులకు నారదుడు చెప్పిన ఈ పురాణంలో వేదాంగాల గురించి, పలు పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలుంటాయి.


🪷పద్మ పురాణం:*

ఈ పురాణంలో మధుకైటభులనే రాక్షస వధ, రావిచెట్టు మహిమ, పద్మగంధి దివ్యగాథ, గంగా మహాత్మ్యం, గీతాసారం, నిత్యపూజా విధానాల గురించి ఉంటుంది.


☸ విష్ణు పురాణం*

పరాశరుడు తన శిష్యుడైన మైత్రేయునికి బోధించిన ఈ పురాణంలో విష్ణుమూర్తి అవతార వర్ణన, ధ్రువ, ప్రహ్లాద, భరతుల చరితామృతం ఉంటుంది.


🙏🏻మార్కండేయ పురాణం:*

శివకేశవుల మాహాత్మ్యం, ఇంద్ర, అగ్ని, సూర్యుల మాహాత్మ్యం, దేవీ మాహాత్మ్యం ఉంటాయి.


🕉 బ్రహ్మ పురాణం*

బ్రహ్మదేవుడు దక్షునికి బోధించిన ఈ పురాణంలో వర్ణధర్మాలు, స్వర్గనరకాల గురించి తెలుసుకోవచ్చు.


🪈భాగవత పురాణం :

విష్ణువు అవతారాలు, శ్రీ కృష్ణ జననం, లీలల గురించి మృత్యువుకు చేరువలో ఉన్న పరీక్షిన్మహారాజుకు శుకమహర్షి చెప్పిన పురాణమిది. దీనిని తొలుత వేదవ్యాసుడు శుకునికి బోధించాడు.


🌍 బ్రహ్మాండ పురాణం*:

బ్రహ్మదేవుడు మరీచి మహర్షికి చెప్పిన ఈ పురాణంలో రాధాకృష్ణులు, పరశురామ, శ్రీరామచంద్రుల చరిత్రలు, లలితా మహిమ్నా స్తోత్రం, ఖగోళ విజ్ఞానం గురించిన వివరణ ఉంటుంది.


🪐భవిష్య పురాణం:*

సూర్యుడు మనువుకు చెప్పిన ఈ పురాణంలో అగ్ని, సూర్యోపాసన విధులతోబాటు, భవిష్యత్తులో జరుగబోయే వివిధ విషయాల గురించిన వివరణ ఉంటుంది.


💫 బ్రహ్మావైపర్త పురాణము :

ఇందులో గోలోక ప్రశంస, భోజననియమాలు, రోగనివృత్తిసాధనాలు,తులసీ, సాలగ్రామ మహత్మ్యం ఉంటాయి...


🙏సర్వేజనాసుఖినోభవంతు🙏

జ్యోతిష్కుడు

 శ్లోకం:☝️

*అద్వేషీ నిత్యసంతుష్టః*

 *గణితాగమ పారగః ।*

*ముహూర్తగుణ దోషజ్ఞో*

 *వాగ్మీ కుశలబుద్దిమాన్‌ ।।*

*శాంతశ్చామృతవాక్సౌమ్యః*

 *త్రికాలజ్ఞో జితేంద్రియః ।*

*నిత్యకర్మరతో యో వై*

 *స దైవజ్ఞః ప్రకీర్తితః ।।*


భావం: జ్యోతిష్కుడు ఎలా ఉండాలో మన శాస్త్రాలు ఈ విధంగా నిర్దేశిస్తున్నాయి.

    ద్వేష స్వభావములేనివాడు, ప్రతినిత్యం జీవితాన్ని సంతోషముతో గడిపేవాడు, గణిత శాస్త్రంపై సంపూర్ణ అవగాహన కలవాడు, ముహూర్తము యొక్క గుణదోషాలను తెలిసియున్నవాడు, (అంటే సమయముపై మంచి అవగాహన కలిగి ఉండేవాడని అర్థం.) మంచి సంభాషణా నైపుణ్యం కలవాడు, సూక్ష్మబుద్ధి కలవాడు అయి ఉండాలి.

    ఎల్లప్పుడు ప్రశాంతమైన మనస్సు కలిగి ఉండాలి. భూత, భవిష్యత్‌ వర్తమానాలపైన మంచి అవగాహన కలిగి ఉండాలి. ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. వారికి నిర్దేశించిన నిత్యకర్మలను ప్రతినిత్యం ఆచరించేవాడై ఉండాలి. ఇటువంటి సత్సాంప్రదాయములు నిరంతరం ఆచరిస్తూ జ్యోతిషం అభ్యసించే వారిని జ్యోతిష శాస్త్ర అధిదేవత అయిన ఆ వాగ్దేవి వాక్ శుద్ధిని ప్రసాదించి వారిని అన్ని రకాలుగా కాపాడుతుంది.🙏

శూన్య హస్తాలతో వెళ్ళకూడదు.

 అగ్నిహోత్రం గృహం క్షేత్రం గర్భిణీం వృద్ధబాలకౌ

రిక్తహస్తేన నోపేయాత్ రాజానం దైవతం గురుమ్.


అగ్నిహోత్రాన్ని ప్రతిష్ఠించిన గృహానికి (యజ్ఞశాలకు), పుణ్యక్షేత్రానికి, గర్భవతి, వృద్ధులు, చిన్న పిల్లలు ఉండే ఇళ్లకు, రాజును, దైవాన్ని, గురువును దర్శించటానికి వెళ్ళేటప్పుడు శూన్య హస్తాలతో వెళ్ళకూడదు.

(వాళ్ళకేదో ఒక కానుక తీసుకు వెళ్ళాలి అని ఆర్యోక్తి )

9, ఏప్రిల్ 2023, ఆదివారం

_పురుషునికి

 🙏 *_సుభాషితము_* 👌

⛩️⛩️⛩️⛩️⛩️⛩️⛩️⛩️

*_ఆశైవ రాక్షసీ పుంసాం_*

*_ఆశైవ విషమంజరీ !_*

*_ఆశైవ జీర్ణమదిరా_*

*_నైరాశ్యం పరమం సుఖం !!_*


*_పురుషునికి ఆశయే రాక్షసి వంటిది, త్రాచుపాము వంటిది, మద్యపానము వంటిది. అట్టి ఆశను వదిలినవాడు ఎక్కువ సుఖములను అనుభవించును.!!_*

⛩️⛩️⛩️⛩️⛩️⛩️⛩️⛩️

బృందావ‌నంలో

 🕉🌺 ఆధ్యాత్మికం🌺🕉 @aadyaatmikam360°:

ప్రతి రోజూ దుప్పటి నలిగి...

పట్టీల శబ్దం వినిపించే పుణ్యక్షేత్రం ఇదే  నిధివన్  🌺


.    🌿 శ్రీకృష్ణ లీల‌ల గురించి తెలియ‌నివారు ఉండ‌రు. 


🌿బృందావ‌నంలో శ్రీకృష్ణుడు గోపిక‌ల‌తో క‌లిసి చేసిన రాస‌లీల‌లు కోకోల్ల‌లు. అలాంటి క‌థే బృందావ‌నంలోని నిధి వ‌న్ తో ముడిప‌డి ఉంది. 


🌿ఉత్తర ప్రదేశ్ లోని మధుర జిల్లాలో బృందావన్ ఉంది. ఇక్కడే మన నిధివన్ ఉంటుంది. 


🌿మధుర నుంచి బృందావన్ కు 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది లో ఉన్న నిధి వ‌న్ లో ఇప్ప‌టికీ రాత్రిపూట శ్రీకృష్ణడు గోపిక‌ల‌తో క‌లిసి రాస‌లీల‌లు ఆడతాడ‌ట‌. 


🌿అందుకే ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కే ఈ నిధి వ‌న్ ప్ర‌వేశం ఉంటుంది. సంధ్యా స‌మ‌యం కాగానే నిధి వ‌న్ ను మూసేస్తారు. 


🌿ఆ త‌ర్వాత ఎవ్వ‌రూ అక్క‌డ ఉండ‌రు. చివ‌ర‌కు నిధి వ‌న్ లో ఉండే ప‌క్షులు కూడా సంధ్యా స‌మ‌యం కాగానే అక్క‌డ్నుంచి వెళ్లిపోతాయి.  


🌿ఒక‌వేళ ఎవ‌రైనా నిధి వ‌న్ లో రాత్రి పూట ఉండి శ్రీకృష్ణ రాస‌లీల‌ల‌ను దొంగ‌త‌నంగా చూడాల‌ని ప్ర‌య‌త్నిస్తే వారి సంగ‌తి అంతేనట‌. 


🌿ప‌దేళ్ల కింద జ‌య‌పూర్  కు చెందిన ఓ కృష్ణ భ‌క్తుడు ఎక్క‌డ ఏం జ‌రుగుతుందో చూడాల‌ని దొంగ‌త‌నంగా అక్క‌డే ఉండిపోయాడ‌ట‌. 


🌿రాత్రి ఏం జ‌రిగిందో తెలియ‌దు కానీ తెల్లారేస‌రికి నిధివ‌న్ ప్ర‌వేశ‌ద్వారంలో అత‌ను అచేత‌న అవ‌స్థ‌లో ప‌డి ఉన్నాడు. ఆ త‌ర్వాత అత‌ను పిచ్చివాడిగా మారిపోయాడ‌ట‌.  

          


🌿నిధి వ‌న్ లోప‌ల రంగ మ‌హ‌ల్ ఉంది. ఇక్క‌డ రోజూ రాత్రిపూట శ్రీకృష్ణుడు, రాధ క‌లిసి వ‌స్తార‌ట‌. 


🌿అందుకే రంగ్ మ‌హ‌ల్ లో ఉండే గంధ‌పు మంచాన్ని ప్ర‌తిరోజూ సాయంత్రంలోపే అలంక‌రిస్తారు. 


🌿మంచ‌ప‌క్క‌నే ఒక చెంబులో నీరు, రాధ కోసం అలంకార సామాగ్రి పెట్ట‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. 


🌿అంతేకాదు ఇక్క‌డి మ‌రో విశేషం ఏంటంటే తెల్ల‌వారగానే రంగ్ మ‌హ‌ల్ లోని మంచంపైన దుప్ప‌ట్లు అస్త‌వ్య‌స్తంగా ఉంటాయ‌ట‌. అలాగే చెంబులోని నీరు ఖాళీ అయిపోతుంది. 


🌿దీని వెన‌క‌ ర‌హ‌స్య‌మేంటో ఎవ‌రూ క‌నిపెట్ట‌లేకపోయారు. 


🌿అందుకే దీన్ని శ్రీకృష్ణ‌లీల‌గానే భావిస్తారు.  

                     

🌿గోపిక దప్పిక తీర్చడానికి Image source ఇక్కడ వనంలో ఉన్న కొలనును విశాఖ కుండ్ అని అంటారు. 


🌿విశఆఖ అనే కోపిక దప్పిక తీర్చడానికి కృష్ణుడు తన పిల్లనగోవితో ఈ కొలనును సృష్టించారని చెబుతారు. 


🌿నిధివన్ కు వెళ్లినవారు ప్రధాన ఆలయమైన రంగమహల్ లోని రాధకృష్ణుడి విగ్రహాలతో పాటు విశాఖ కుండ్ ను దర్శించుకుని వస్తారు. 


          🌿నిధి వ‌న్ లో మ‌రో వింత ఏంటంటే.. ఎక్క‌డైనా చెట్లు పైకి ఎదుగుతాయి. 

🌿ఇక్క‌డ మాత్రం చెట్లు కింద‌కు పెరుగుతాయి. 

అంటే భూమిలోకి... ఇక నిధివ‌న్ లో అన్నీ తుల‌సి చెట్లే ఉంటాయి. 

అవి కూడా జంట‌గా క‌లిసి ఉంటాయి. ఏ చెట్టును చూసి ఇలానే జంట‌గా ఉంటాయి. 


🌿ఇంత‌కు దీని వెన‌క విశేషం ఏంటంటే ఈ తుల‌సి చెట్లే గోపిక‌ల‌ట‌. 


🌿సాయంత్రం కాగానే తులసిచెట్ల‌న్నీ గోపిక‌ల రూపంలో మారిపోతాయ‌ట‌. 


🌿ఉదయం కాగానే ష‌రామామూలుగానే తిరిగి తులసి చెట్ల రూపంలోకి వెళ్లిపోతాయ‌ట‌. 


🌿అందుకే నిధి వ‌న్ నుంచి తుల‌సిమొక్క‌ల‌కు చెందిన చిన్న ఆకును కూడా తీసుకుపోనివ్వ‌రు. ఒక‌వేళ అలా తీసుకుపోయినా అరిష్ట‌మ‌ట‌.  

          

🌿ఇక నిధి వ‌న్ కు స‌మీపంలో స్థానికుల ఇళ్లు ఉన్నాయి. అయితే ఆ ఇళ్ల‌కు కిటికీలు ఉండ‌వు. ఎందుకంటే నిధి వ‌న్ వైపు వారి చూపు ఉండ‌కూడ‌ద‌ని కిటికీలు పెట్టుకోరు. 


🌿ఒక‌వేళ ఎవ‌రైనా కిటికీలు పెట్టినా వాటి నుంచి నిధి వ‌న్ వైపు రాత్రిపూట మాత్రం చూడ‌రు. 


🌿నిధి వ‌న్ లో రాత్రిపూట జ‌రిగే రాస‌లీల‌ల‌ను చూడాల‌నుకోవ‌డం పాపంగా బావిస్తారు స్థానికులు. అందుకే ఇలా కిటికీలు పెట్టుకోకుండా జాగ్ర‌త్త ప‌డ‌తారు. ఇదండీ నిధి వ‌న్ ర‌హ‌స్య‌మ‌య గాథ‌.


హరే కృష్ణ గోవిందా

🌺⛳️🌺🌿🌺🌾🌺🙏🌺


భగవంతుడు... భక్తుడు...!

మొదట్లో భక్తుడు తన మనస్సును బలవంతంగా భగవంతునిపై ఉండేటట్లు చేయాలి. 

ఆయన పాదాలపై దృష్టిని మోపాలి. 

ఊడుగు (అంకోల) గింజలు పండిపోయి నేలమీద రాలిపడి మరల వానికవియే చెట్లనంటుకుని పోతాయి. 

ఇది భక్తిలోని మొదటి దశకు ఉదాహరణ.


భక్తుని మనస్సు భగవంతునిపై నిలబడినప్పుడు భగవంతుని కృప కారణంగా భగవంతునివైపు భక్తుని మనస్సు ఆకర్షింపబడుతుంది...

సూదంటురాయి సూదిని ఆకర్షించినట్లుగా వుంటుంది...

ఇది రెండవ దశ...


భక్తుని హృదయం పూర్తిగా భగవంతునితో నిండిపోయినప్పుడు, భగవంతుడు కూడా భక్తునిపై ప్రేమను సంపూర్ణంగా ప్రదర్శిస్తాడు. 

అది పతివ్రత అయిన స్త్రీ తన పతిని అంటి పెట్టుకుని యున్నట్లు. 

అప్పుడు పతి కూడా తన పత్ని పట్ల విపరీతమైన ప్రేమను ప్రదర్శిస్తాడు. 

ఇది మూడవ దశగా మనం చెప్పవచ్చు...


నెమ్మదిగా భక్తుడు భగవంతునికి భూషణమవుతాడు...

ప్రహ్లాదుడు లేకపోతే నరసింహావతారం ఎత్తి భగవంతుడు ఈ లోకాన్ని ఆశీర్వదించేవాడు కాదు కదా...

అలా ఒకవిధంగా భక్తుడు భగవంతుని ప్రఖ్యాతిని పెంచుతాడు. 

ఒక లత చెట్టును అల్లుకునిపోయి దాని సౌందర్యాన్ని పెంచినట్లుగా ఉంటుందది. 

ఈ నాల్గవ దశ దాటిన తరువాత భక్తుడు భగవంతునితో మమైక్యమైపోతాడు.


నదులు సముద్రంలో విలీనమైపోయినట్లు... 

ఒకసారి నదులు సముద్రంలో కలిస్తే ఇక వాటికి ప్రత్యేక అస్తిత్వం ఉండదు. 

సముద్రం నుండి నదులను విడిగా చూడలేము. 

అలాగే భక్తుడు కూడా భగవంతుని నుంచి వేరుగా ఉండడు..🙏

శ్రీశైల పర్వతం మీది రహస్య మూలికా విశేషాలు

 శ్రీశైల పర్వతం మీది రహస్య మూలికా విశేషాలు  -


            ఇప్పుడు మీకు నేను వివరించబోయే విశేషాలు అన్నియు నిత్యసిద్ధనాధుడు రచించిన రసరత్నాకరం అనే ఒక ప్రాచీన గ్రంధం నుంచి తీసుకోవడం జరిగింది.


          శ్రీశైల పర్వతంలోని చెట్లు, మన్ను, దుంపలు , నీరు , రాళ్లు , ఖనిజాలు మొదలయిన వాటితో అతిశీఘ్రంగా కాయసిద్దని పొందే మార్గాలు పరమ శివునిచేత చెప్పబడి భారతీయ రసశాస్త్రాలలో మహా గోప్యంగా ఉన్న వాటిని మాత్రమే సాధకులకు భక్తులకు ముక్తి, భక్తి ప్రధములుగా వివరిస్తున్నాను అని నిత్యనాధుడు తన ముందు మాటలో వివరించాడు.


   

   ప్రస్తుత పరిస్థితులలో నిత్యనాద సిద్ధుడు తన గ్రంధంలో వివరించిన ప్రకృతి పరిసరాలు చాలా మారిపోయాయి. ప్రయత్నిస్తే కొంతవరకు కనుక్కోవచ్చు.


  *   శ్రీ మల్లిఖార్జున స్వామి సన్నిధికి ఎదురుగా ఏనుగుతో సమానం అయిన శిల ఒకటి ఉన్నది. అది రాత్రి సమయంలో ఎల్లప్పుడు గుగ్గిలం వంటి పదార్థాన్ని స్రవిస్తుంది. దానిని ముట్టుకోనుకుండా బ్రహ్మవ్రుక్షం అయిన తెల్ల మోదుగ కొయ్యతో గీకి ఎండబెట్టిన సొరకాయ బుర్రలో నిలువ చేసుకోవాలి ఆ గుగ్గిలం తో సమాన తూకంగా శుద్దిచేసిన గంధకం కలపాలి. ఆ మిశ్రమాన్ని రొజూ ఒకపూట విష్క మెత్తు మోతాదుగా భక్షిస్తూ ఉండాలి.ఇలా ఒక నెలరోజులు భక్షిస్తూ ఉంటే ఆ వ్యక్తి జరామరణాలు లేనివాడై ఆచంద్రార్కం జీవిస్తాడు.


          అదే గుగ్గిలాన్ని కరిగిన తామ్రంతో కోటికొక వంతు చొప్పున వేస్తే అది దివ్యమైన బంగారం అవుతుంది.


 *  మల్లిఖార్జున స్వామికి ఎడమ దిక్కున ఘంటా సిద్దేశ్వరుని ఆలయం ఉంది. దాని ద్వారం నందు గల ఒక కుండములో ఒక గంట వ్రేలాడుతూ ఉంటుంది. కృష్ణ చతుర్దశి నాటి రాత్రి యందు ఉపవాసమున్న ముగ్గురు సాధువులు నిరంతరంగా నిర్వికల్పంగా చేయవలసిన సాధన ఇది. అదేమంటే ముగ్గురు సాదువుల్లో ఒకడు నిరంతరంగా శివుడిని అభిషేకం చేస్తూ ఉండాలి. రెండోవాడు అలసిపోకుండా రాత్రి అంతా అభిషేకానికి నీరు అందిస్తూ ఉండాలి. మూడోవాడు విరామం లేకుండా గంట వాయిస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉంటే తెల్లవారేసరికి ఈశ్వరుడు ప్రత్యక్షం అయ్యి ఆ ముగ్గురికి అమరత్వాన్ని ప్రసాదిస్తాడు.మరియు అదృశ్య శక్తిని కూడా ప్రసాదిస్తాడు.


 *  ఘంటా సిద్దేశ్వరుని ఆలయానికి దక్షిణభాగంలో క్రోసేడు దూరంలో నేలలో తవ్వితే గోరోజనం వంటి మట్టి లభిస్తుంది. ఆ మట్టిని తులం ప్రమాణంలో పాలలో కలిపి పంచదార కలుపుకుని తాగితే 7 దినాలలో ఆ వ్యక్తికీ అమరత్వం సిద్ధించి మృత్యువుని జయించగలడు.


 *  మల్లినాదునికి పశ్చిమ దిక్కులో చంద్రోదకం అనే పేరు గల ఒక తీర్ధం ఉంది. విశాక పౌర్ణమి నాడు సాధకుడు దాని సమీపంలో ఉండి సిద్ధిని సాధించాలి. రాత్రిపూట ప్రతిరోజూ జపం చేస్తూ ఉండాలి. అర్ధరాత్రి పూట ఏ సమయంలో చంద్రుడు ఆ నీటిని తాకుతాడో అదే సమయంలో ఆ నీటిని దోసిలి పట్టుకొని తాగాలి. దానివల్ల వజ్రకాయం , శరీర పటుత్వం కలుగుతాయి. జరామరణాలు లేనివారై జీవిస్తారు.


            మరిన్ని సులభ ఆయుర్వేద చిట్కాలు మరియు ఆయుర్వేద ఔషధాల వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 


  

స్నేహభావం

 .

        _*సుభాషితమ్*_


శ్లో॥

*వైరాయతే సుహృద్భావః*

*ప్రదానం హరణాయతే|*

*దర్పభూతాభిభూతస్య*

*విద్యామౌర్ఖ్య శతాయతే||*

                          ~దర్పదలనమ్


తా॥

*గర్విష్టియైనవాడికి స్నేహభావం

 శత్రుత్వంలా అవుతుంది.... దానం దొంగతనం వలె అవుతుంది, జ్ఞానం నూరింతల మూర్ఖత్వమవుతుంది....కాబట్టి ఎట్టి పరిస్థితులలోనూ గర్వాన్ని దరిచేరనీయరాదని భావము..*

పరమాచార్య చూసుకుంటారులే

 పరమాచార్య చూసుకుంటారులే


నేను, మా చెల్లెలు అవయాంబళ్ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఇలయత్తాంగుడిలో మొదటిసారి పరమాచార్య స్వామివారిని దర్శించుకోవడమే మాకు గుర్తు. కొన్ని సంవత్సరాల క్రితం తను పూణే వచ్చి, అక్కడి నుండి బాంబేకు మరలా చెన్నైకు వెళ్ళాలని ప్రణాళిక వేసుకుంది. అంతకు ముందు రోజే ఒక ప్రముఖ రాజకీయ నాయకుని భార్య మరణించడంతో మహారాష్ట్ర పరిస్థితిని అదుపులో ఉంచడానికి బంద్ ప్రకటించడంతో బస్సులు ఆటోలు తిరగడంలేదు. నేను పూణేకు ఫోను చేసి తన ప్రయాణం వాయిదా వేసుకొమ్మని తెలిపాను. చెన్నైలో ఆరోజు తప్పక కార్యాలయానికి వెళ్ళాల్సిఉండడంతో ప్రయాణాన్ని వాయిదా వెయ్యలేనని తెలిపింది. “సంఘ వ్యతిరేక శక్తుల వల్ల సమస్యగా ఉంది. కొంతమంది వ్యక్తుల ప్రాణాలు కూడా పోయాయి” అని తెలిపాను.


దానికి ఒకే ఒక ముక్కలో, “అవన్నీ పరమాచార్య స్వామివారు చూసుకుంటారులే” అని బదులిచ్చింది. ‘ఇది నాకెందుకు స్ఫురించలేదు’ అనుకున్నాన్నేను. మరుసటి రోజు నేను కళ్యాణ్ కి వెళ్లి తనను తీసుకుని ములంద్ కు వచ్చాను. మేము బయటకు రాగానే, అంతా కేవలం పోలీసుల తలకాయలు మాత్రమే కనబడుతున్నాయి. పెద్ద ట్రంకు పెట్టె ఒక బ్యాగు మా వద్ద ఉన్నాయి. దాదాపు ఇరవై అయిదు నిముషాలు నడవాలి. ఏం చెయ్యాలో తెలియక అలా నిల్చుని ఉన్నాము.


“అమ్మా, ఇక్కడకు ఎందుకు వచ్చారు? ఇంటికి వెళ్ళాలా?” అన్న మాటలు వినబడ్డాయి. తల తిప్పి చూస్తే, వేలు కనబడ్డాడు, మా పక్క వీధిలో వార్తాపత్రికలు వేసే అబ్బాయి. ఒకట్రెండు సార్లు అతనితో మాట్లాడాను నేను. అతను ముందుకు వచ్చి, బ్యాగును ట్రంకు పెట్టెను తీసుకుని తన సైకిలు బుట్టలో ఉంచుకుని మాతోపాటుగా నడుస్తూ ఇంటి దాకా వచ్చాడు. 


--- శ్రీమతి ఇందిరా బాలసుబ్రమణియమ్, పశ్చిమ థానే, ముంబై. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 6


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

సజ్జన సాంగత్యం - కర్మ ఫలం

 *సజ్జన సాంగత్యం - కర్మ ఫలం.*


చీకటి కావస్తుండగా ప్రయాణికులతో పపూర్తిగానిండి , రద్దీగా ఉన్న ఒక బస్సు తన గమ్యస్థానానికి బయలుదేరింది.


ఆ బస్సు ఒక అడవి గుండా ఘాట్ రోడ్డు పై ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా వాతావరణం మారిపోయి భయంకరమైన ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం ప్రారంభమైంది.


ప్రయాణికులందరు చూస్తుండగానే ఒక పిడుగుపాటు వల్ల బస్సుకు 50 అడుగుల దూరంలో ఒక చెట్టు పడిపోయింది. డ్రైవర్ చాకచక్యంతో బస్సును ఆపివేశాడు. ఆ చెట్టు మరో ప్రక్కకు ఉన్న లోయ వైపు విరిగిపడడం వల్ల వీరి మార్గానికి అడ్డు రాలేదు.


కొద్దిసేపటి తరువాత బస్సు మళ్లి బయలుదేరింది. ప్రయాణికులలో భయం ప్రారంభమైంది. ప్రయాణికులందరు ఊపిరి బిగపట్టుకుని కూర్చున్నారు.


ఆ బస్సు రెండు కిలోమీటర్లు వెళ్లిందో లేదో మరో పిడుగు బస్సుకు 40 అడుగుల దూరంలోని చెట్టుకు కొట్టింది. డ్రైవర్ చాకచక్యంతో మళ్లి బస్సును ఆపివేశాడు.

ఇలా మూడు సార్లు జరిగింది. మూడోసారి పిడుగు 30అడుగుల దగ్గరలో కొట్టింది. ప్రయాణికులలో భయం తారాస్థాయికి చేరుకుంది. అరుపులు, ఏడుపులు ప్రారంభమయ్యాయి.


అందులోంచి ఒక పెద్దమనిషి ఇలా అన్నాడు.”చూడండీ! మనందరిలో ఈ రోజు ‘పిడుగు ద్వారా మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ‘ఎవరో ఉన్నారు. అతని కర్మ మనకు చుట్టుకుని మనందరం కూడా అతనితో పాటు చావవలసి వస్తుంది.


నేను చేప్పేది జాగ్రత్తగా వినండి!


ఈ బస్సులో నుంచి ఒక్కొక్క ప్రయాణికుడు క్రిందికి దిగి, అదిగో! ఎదురుగా ఉన్న ఆ చెట్టును ముట్టుకుని మళ్లి బస్సులో వచ్చి కూర్చోండి. మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ఆ చెట్టును ముట్టుకోగానే పిడుగుపాటు తగిలి మరణిస్తాడు. మిగిలిన వాళ్లం క్షేమంగా వెళ్లవచ్చు! ఒక్కరి కోసం అందరు చస్తారో ? అందరి కోసం ఒక్కరు చస్తారో? ఆలోచించుకోండీ! ” అన్నాడు.


చివరకు ఒక్కొక్కరుగా వెళ్లి ఆ చెట్టును ముట్టుకుని రావడానికి సిద్ధపడ్డారు.


మొదట ఆ పెద్దమనిషే మనుసులో చాలా భయపడుతూనే వెళ్లి ఆ చెట్టును ముట్టుకున్నాడు. ఏమీ జరగలేదు. అతడు ఊపిరి పీల్చుకుని క్షేమంగా వచ్చి బస్సులో కూర్చున్నాడు.


ఇలా ఒక్కొక్కరు భయపడుతూనే వెళ్లి ఆ చెట్టును ముట్టుకుని వచ్చి కూర్చోసాగారు. చివరికి ఒకే ఒక ప్రయాణికుడు మిగిలాడు. ఇక మరణించేది అతడే! అని అందరికీ పూర్తిగా నిశ్చయమైపోయింది.


చాలా మంది అతని వైపు అసహ్యంతో, కోపంతో చూడసాగారు. కొందరు జాలి పడుతూ చూడసాగారు. అతను కూడా భయపడుతూ బస్సు దిగి చెట్టును ముట్టుకోవడానికి నిరాకరించాడు.


కాని, బస్సులోని ప్రయాణికులందరు నీవల్ల మే మందరం మరణించాలా? వీల్లేదు అంటూ బస్సు నుంచి బలవంతంగా క్రిందికి నెట్టారు.


చేసేది లేక ఆ చివరి వ్యక్తి వెళ్లి చెట్టును ముట్టుకున్నాడు. వెంటనే పెద్ద మెరుపులతో పిడుగు వచ్చి కొట్టింది. తరువాత భయంకరమైన శబ్దం వచ్చింది. కాని పిడుగు వచ్చి కొట్టింది ఆ చివరి వ్యక్తిపై కాదు!


బస్సుపై. అవును. బస్సుపై పిడుగు పడి అందులోని ప్రయాణికులందరూ మరణించారు.


నిజానికి ఈ చివరి వ్యక్తి ఆ బస్సులో ఉండడం వల్లనే ఇంతవరకు ఆ బస్సు కు ప్రమాదం జరగలేదు. ఇతని పుణ్యఫలం, దీర్ఘాయుష్షు వారినందరిని కాపాడింది.

ఈ కథలో లాగానే మనం జీవితంలో సాధించిన విజయాలలో కానీ, ఆపదల నుండి రక్షించబడిన సందర్భాలలో కానీ, ఆ క్రెడిటంతా మనదే అనుకుంటాము.


కాని, ఆ పుణ్యఫలం


🔸మన తల్లిదండ్రులది కావచ్చు

🔸జీవిత భాగస్వామిది కావచ్చు

🔸పిల్లలది కావచ్చు

🔸తోబుట్టువులది కావచ్చు

🔸మన క్రింద పని చేసే వారిది కావచ్చు లేదా

🔸మన శ్రేయస్సును కోరే స్నేహితులది – బంధువులది కావచ్చు!


మనం ఈ రోజు ఇలా ఉన్నామంటే అది మన ఒక్కరి కృషి ఫలితమే కాదు.


ఎంతో మంది పుణ్య ఫలితం, ఆశీర్వాద బలం, వారు వారి అదృష్టాన్ని పంచడం కూడా కారణమై ఉంటాయి.🙏

శుభోదయం

 *శుభోదయం* 💐🙏


పట్టించుకుంటే ప్రపంచంగా 

కనబడే దైవం...


వదిలించుకుంటే మిథ్యగా 

కనబడే మాయ...


*ఇదే సృష్టి రహస్యం..*.


🙏🙏🙏🙏🙏