18, జూన్ 2024, మంగళవారం

దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

     🍁 *మంగళవారం* 🍁 

   🌹 *జూన్ 18, 2024*🌹

     *దృగ్గణిత పంచాంగం*                

 *స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః* 

*జ్యేష్ఠమాసం - శుక్లపక్షం*

*తిథి : ఏకాదశి* ఉ 06.24 వరకు ఉపరి *ద్వాదశి*

వారం :*మంగళవారం*(భౌమవాసరే)

*నక్షత్రం : స్వాతి* మ 03.56 వరకు ఉపరి *విశాఖ*

*యోగం : శివ* రా 09.39 వరకు ఉపరి *సిద్ధ*

*కరణం : భద్ర* ఉ 06.24 *బవ* రా 07.01 ఉపరి *బాలువ* 

*సాధారణ శుభ సమయాలు* 

*ఉ 09.00 - 12.00  మ 02.00 - 03.00*

అమృత కాలం :*ఉ 06.22 - 08.06*

అభిజిత్ కాలం :*ప 11.42 - 12.35*

*వర్జ్యం : రా 09.52 - 11.34*

*దుర్ముహుర్తం : ఉ 08.13 - 09.05 రా 11.03 - 11.47*

*రాహు కాలం :మ 03.25 - 05.04*

గుళిక కాలం :*మ 12.09 - 01.47*

యమ గండం :*ఉ 08.52 - 10.30*

సూర్యరాశి : *మిధునం* 

చంద్రరాశి : *తుల*

సూర్యోదయం :*ఉ 05.35* 

సూర్యాస్తమయం :*సా 06.42*

*ప్రయాణశూల :‌ ఉత్తర దిక్కుకు ప్రయాణం పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం :*ఉ 05.35 - 08.13*

సంగవ కాలం :*08.13 - 10.50*

మధ్యాహ్న కాలం :*10.50 - 01.27*

అపరాహ్న కాలం :*మ 01.27 - 04.05*

*ఆబ్ధికం తిధి : జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి*

సాయంకాలం :*సా 04.05 - 06.42*

ప్రదోష కాలం :*సా 06.42 - 08.53*

నిశీధి కాలం :*రా 11.47 - 12.31*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.08-04.52*

______________________________  

           🌷 *ప్రతినిత్యం*🌷

 *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


🍁 *కష్ట నివారణ పంచముఖ*🍁 

🌹 *హనుమాన్ స్తోత్రమ్.!*🙏


*రం రం రం రక్తవర్ణం దినకర వదనం తీక్ష్ణా దంష్ట్రా కరాళం*

*రం రం రం రమ్య తేజం గిరిచలనకరం కీర్తి పంచాది వ్యక్తం*


*రం రం రం  రాజయోగం సకల శుభ నిధిం సప్తభేతాళ భేధ్యం*

*రాక్ష సాంతం సకల దిశ యశం రామదూతం నమామి*


*ఖం ఖం ఖం  ఖడ్గ హస్తం విష జ్వర హరణం వేద వేదాంగ దీపం*

*ఖం ఖం ఖం ఖడ్గ రూపం త్రిభువన నిలయం దేవతా ప్రకాశం*


*ఖం ఖం ఖం కల్ప వక్షం మణి మయ ముకుటం మాయ మాయా స్వరూపం*

*ఖం ఖం ఖం కాల చక్రం సకల దిశ యశం రామదూతం నమామి*


*ఇం ఇం ఇం ఇంద్రవంద్యం జల నిథి కలనం సౌమ్య సామ్రాజ్య లాభం*

*ఇం ఇం ఇం  సిద్ధి యోగం నత జన సదయం ఆర్య పూజ్యా పూజ్యార్చితాంగం*


*ఇం ఇం ఇం  సింహనాదం అమృత కరతలం ఆది అంత్య ప్రకాశం* 

*ఇం ఇం ఇం  చిత్స్వరూపం సకల దిశ యశం రామదూతం నమామి*


*సం సం సం సాక్షి భూతం వికసిత వదనం పింగలాక్షం సురక్షం*

*సం సం సం సత్యగీతం సకల మునినుతం శాస్త సంపత్కరీయం*


*సం సం సం సామవేదం నిపుణ సులలితం నిత్య తత్వ స్వరూపం*

*సం సం సం సావథానం సకల దిశ యశం రామదూతం నమామి*


*హం హం హం  హంసరూపం  స్పుట వికట ముఖం సూక్ష్మ  సూక్ష్మ అవతారం*

*హం హం హం   అంతరాత్మo  రవి శశి నయనం రమ్య గంభీర  భీమం*


*హం హం హం అట్టహాసం సురవర నిలయం ఊర్ధ్వ రోమం  కరాళం*

*హం హం హం హంస హంసం సకల ది*🌷🙏🍃


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹

  🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

అసలు యజమాని ఎవరు?

 

అసలు యజమాని ఎవరు?


ఒక సారి ఒక సామంతరాజు బీర్బల్ తెలివితేటల గురించి విని ఆయనని చూడాలని ఒక రైతు వేషం ధరించి గుర్రం మీది రాజధాని వైపు బయలుదేరాడు.

దారిలో ఒక కుంటి వ్యక్తి రహదారులను సహాయమడుగుతూ కనిపించాడు. సామంతరాజు జాలి పడి ఆ వ్యక్తికి సహాయం చేయాలని నిశ్చయించుకున్నాడు. ఆగి ఆ కుంటి వ్యక్తిని పలకరించాడు. అతను రాజధాని వెళ్ళాలని చెప్పాడు.

సామంతరాజు వెంటనే కుంటి వ్యక్తిని గుర్రం యెక్కించి తను నడవ సాగాడు.

రాజధాని చేరాక ఆ కుంటి వాడు దిగడానకి ఇష్టపడలేదు. కేకలూ అరుపులూ మొదలపెట్టాడు. సామంతరాజు నిర్ఘాంతపోయి చూస్తుండగా చుట్టూర పది మంది చేరారు.

కింటివాడు చేరిన జనానికి తనదే గుర్రమని, ఆ రైతు వేశం లో వున్న సామంతరాజును కేవలం అతని పనివాడని చెప్పాడు. సామంతరాజు, కాదు, గుర్రం అతనిదని, సహాయం చేస్తే ఇలా ఇరుక్కున్నట్టు చెప్పాడు.

ఇద్దరు కలిసి అక్బర్ చక్రవర్తి దర్బారుకి న్యాయంకోసం వచ్చారు.

అక్బర్ బీర్బల్ను న్యాయం చెప్ప మన్నాడు.

బీర్బల్ గుర్రాన్ని గుర్రపుశాలలో కట్టేయమని ఆదేశించి, వీళ్ళిద్దరిని మరునడు మళ్ళి దర్బారుకి రమ్మన్నాడు.

తెల్లవారింది.

ఇద్దరు దర్బారులో హాజరయ్యారు. బీర్బల్ ఇద్దరిని గుర్రపుశాలకి తీసుకువెళ్ళి, కుంటాడిని, “నీ గుర్రం తీసుకో”, అన్నాడు.

అక్కడ అన్ని గుర్రల మధ్య తనదని వాదించిన గుర్రం తెలుసుకోలేక, బిక్క మొహం వేశాడు.

అదే సామంతరాజు వెంటనే తన గుర్రాన్ని గుర్తుపట్టేడు. గుర్రం కూడ యజమానిని చూసి సంతోశంగా సెకిలించింది.

వెంటనే బీర్బల్ కుంటాడిని శిక్షించమని, గుర్రానికి అసలు యజమాని సామంతరాజు అని, అక్బర్ కి నివేదించాడు.

సామంతరాజు ఎంతో సంతోశంతో తనెవరో చెప్పి బీర్బల్ని ప్రశంసించి  మళ్ళి తన రాజ్యానికి బయలుదేరాడు.

విద్య ద్వారా ధర్మం.

 *సరైన విద్య ద్వారా మాత్రమే ధర్మం.*

ధర్మం మాత్రమే మన జీవితంలో నిజమైన ఆనందాన్ని ఇస్తుంది. అదెలా వస్తుంది ?విద్య ద్వారా. వినయంతో కూడిన విద్యవున్నప్పుడే మాత్రమే గౌరవం, గుర్తింపు రెండూ లభిస్తాయి మనకు. కేవలం గౌరవం లేకుండా సంపాదించిన ధర్మాన్ని, జ్ఞానాన్ని విద్యగా పరిగణించరు. సరైన విద్య ద్వారా సంపాదించిన సంపద మనల్ని ధర్మ మార్గంవైపు నడిపిస్తుంది. అది మనకు శాశ్వత సుఖాన్ని, ఆనందాన్ని ఇస్తుంది.

సంస్కృతంలో తండ్రిని పిత అంటారు. ఒక తండ్రిని మాత్రమే సంస్కృతంలో అలా ఎందుకు పిలుస్తారు. అంటే,?! తన కొడుకును ఎవరైతే చాలా జాగ్రత్తగా, భద్రతతో, సరైన మార్గంలో నడిపిస్తారో వారే పిత కనుక. తల్లిదండ్రులు తమ పిల్లలకు సరైన భద్రత కల్పించేత శ్రద్ధ వహిస్తున్నారో లేదో తమకు తాము ఆత్మావలోకనం చేసుకోని చూడాలి. ఎందుకంటే అది వారి పిల్లలకు నిజమైన ఆనందాన్ని,భద్రతను ఇస్తుంది. పిల్లలకు సంరక్షణ, క్షేమం లేకుండా, విద్య ద్వారా జ్ఞానాన్ని అందించడం అనేది ఆ పిల్లలకు వారిని డబ్బు సంపాదించే ఒక సాధనంగా చేస్తుంది తప్ప, అలాంటి విద్య తండ్రి ఇచ్చే నిజమైన భద్రత కాదు. తల్లిదండ్రులు తమ పిల్లలకు అలాంటి సంస్కృతిని నేర్పించబడినప్పుడు, తరువాతి రోజుల్లో, ఆ పిల్లలు తమ తల్లిదండ్రులను పట్టించుకోకపోవచ్చు. డబ్బు కోసం వెంపర్లాడటం మాత్రమే ఆ పిల్లలు పెరిగేటప్పటికి వారికి జీవన విధానం అవుతుంది.

ఒకరికి చాలా సంపద ఉండవచ్చు, కాని అతను తన ఆకలి కోసం ఆ డబ్బును తినలేడు. అతను తన ఆకలి కోసం ఆహారం కొనాలి లేదా సిద్ధం చేసుకోవాలి. అదేవిధంగా ఒకడు నిజమైన సుఖాన్ని, ఆనందాన్ని డబ్బు లేదా సంపద నుంచిగానీ, పేరు, కీర్తి నుండిగానీ పొందలేడు. ధర్మం ద్వారా మాత్రమే మనకు నిజమైన ఆనందం లభిస్తుంది. ఏ విద్య అయితే నిజమైన జ్ఞానం, తద్వారా సుఖాన్ని ఇస్తుందో ఆ

ధర్మాన్ని ముందు మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి.


--- *జగద్గురు శ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామివారు* .

ఆరోగ్యానికి ప్రధానం!*

 🚩🌞🌷🪷🛕🪷🌷🌞🚩

    *ఆరోగ్యానికి ప్రధానం!*             


*ఆరోగ్యమునకు కేవలం ఔషధములే ప్రధానము కాదు, మంచి మాటలు, మంచి నడత, మంచి చూపులు, మంచి తలంపులు, మంచి వినికిడి అవసరము. ఇవే దేహానికి అమృతత్వము నందించే టానిక్కులు.*


*దుర్భావములూ, దుశ్చింతలూ హృదయములో నింపుకొని ఎన్ని విలువైన ఔషధములు సేవించినప్పటికీ రోగ నివారణ కాదు.*


*సద్గుణములను అనుభవించి, సదాచారములను ఆచరించి, సచ్చింతనలను సంకల్పించుకుంటే అవి మనకు సరైన ఆరోగ్యాన్ని అందివ్వడమేగాక డాక్టర్లు ఇచ్చే మందులు అద్భుతంగా పనిచేస్తాయి. మరియు  ఆత్మానందాన్ని కూడా చేకూరుస్తాయి.*


*నేడు మానవుడు అనేక విధములైన రోగములతో వివిధ క్లేశములు అనుభవించుటకు కారణం మనస్సుకు సరైన పోషణ లేకనే. శరీరమునకు వివిధ రకములైన రుచికరమైన ఆహారమును అందిస్తున్నాడు కానీ మనస్సుకు అవసరమయ్యే ఆధ్యాత్మిక సాధన అనే ఆహారాన్ని అందివ్వడం లేదు. అది లేకనే రోగములన్నీ వచ్చి మీద పడుతున్నాయి.*


*నిత్యం భగవన్నామమును స్మరించుట, ప్రవచనాలు వినుట మున్నగు ఆధ్యాత్మిక సాధనలు సక్రమంగా చేస్తుంటే ఏ రోగము మన దరి చేరదు.*


     *సేకరించిన విషయం* *భాగస్వామ్యం చేస్తున్నాను* 

                🌷🙏🌷

             *న్యాయపతి* 

          *నరసింహారావు*

ఉండాల్సిన చెట్లు:

 *I. మనఊరిలో* ఉండాల్సిన చెట్లు:

1)రావి చెట్టు

2) మర్రిచెట్టు


*II.మనవీధిలో* ఉండాల్సిన చెట్లు:

3) వేప చెట్టు

4) బాదం చెట్టు (దేశీ బాదం)


*III. మనఇంట్లో* ఉండాల్సిన చెట్లు:

5) మునగచెట్టు

6)కరివేపాకు

7) ఉసిరి

8) జామ

9) నిమ్మ


*IV.మనతొట్టిలో* ఉండాల్సిన చెట్లు:

10) తులసి

11) అలోవెరా

12) పుదీన

13) కొత్తిమీర

14) రణపాల

15) గోధుమ గడ్డి


*మన ఇంట్లో చెట్లకి లేదా గోడలకి పాకవలసిన తీగలు:*

16) తిప్పతిగా

17) తమలపాకు 


భారతీయులారా ....

వర్షాకాలం రాబోతుంది

 ఈ చెట్లని మన ఉరిలో,

వీధిలో, ఇంట్లో ఉండేలాగా ప్రయత్నం చేద్దాం🌱🌱🌱

కర్మ ఫలం.

 *కర్మ ఫలం....(పుణ్య ఫలం)*


🙅👌 *ఈ కథ ను ప్రతీ ఒక్కరూ మిస్ అవ్వకుండా చదవాగలరని ఆశిస్తూ.....*👈👏👪

 

 ☀ *చీకటి కావస్తుండగా ప్రయాణికులతో పూర్తిగా నిండి , రద్దీగా ఉన్న ఒక బస్సు 🚌తన గమ్యస్థానానికి బయలుదేరింది.*


 👉 *ఆ బస్సు 🚌ఒక అడవి గుండా ఘాట్ రోడ్డు పై ప్రయాణిస్తుండగా అకస్మత్తుగా వాతావరణం మారిపోయి భయంకరమైన ఉరుములు, మెరుపులతో కూడిన  కుండపోత వర్షం ⛅ప్రారంభమైంది.*


 👪 *ప్రయాణికులందరు చూస్తుండగానే ఒక 🌋పిడుగుపాటు వల్ల బస్సుకు🚌 50 అడుగుల దూరంలో ఒక చెట్టు🌴 పడిపోయింది. 👴👨డ్రైవర్ చాకచక్యంతో బస్సును🚌 ఆపివేశాడు.ఆ చెట్టు మరో ప్రక్కకు ఉన్న లోయ🎫 వైపు విరిగిపడడం వల్ల వీరి మార్గానికి అడ్డు రాలేదు.*


 🏃 *కొద్దిసేపటి తరువాత మళ్లి బస్సు బయలుదేరింది. ప్రయాణికులలో భయం ప్రారంభమైంది.*

 *ప్రయాణికులందరు ఊపిరి బిగపట్టుకుని కూర్చున్నారు..*😞


 👉 *ఆ బస్సు🚌రెండు కిలోమీటర్లు వెళ్లిందో లేదో మరో మలుపు వద్ద పిడుగు 🌋బస్సుకు 40 అడుగుల దూరంలోని చెట్టుకు🌴 కొట్టింది. డ్రైవర్ 👨చాకచక్యంతో మళ్లి బస్సును ఆపివేశాడు.*


 👉 *ఇలా మూడు సార్లు జరిగింది. మూడోసారి పిడుగు 🌋30అడుగుల దూరంలోనే పడ్డది .ఇక ప్రయాణికులలో భయం తారాస్థాయికి చేరుకుంది. అరుపులు, ఏడుపులు 😤ప్రారంభమయ్యాయి.*


 👉 *ఆ బస్సులో వున్న ఒక పెద్దయన 👴 ఇలా అన్నాడు.”చూడండీ! మనందరిలో ఈ రోజు ‘పిడుగు ద్వారా మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ‘ఎవరో ఉన్నారు. అతని కర్మ మనకు చుట్టుకుని మనందరం కూడా అతనితో పాటు చావవలసి వస్తుంది.!*

        

 👉 *నేను చేప్పేది జాగ్రత్తగా వినండి!*

 

               *ఈ బస్సులో నుంచి ఒక్కొక్క ప్రయాణికుడు క్రిందికి దిగి,.....*

      *అదిగో!ఎదురుగా ఉన్న ఆ 🌴చెట్టును ముట్టుకుని మళ్లీ బస్సులో 🚌వచ్చి కూర్చోండి.*

                                      *మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ఆ చెట్టును ముట్టుకోగానే పిడుగుపాటు తగిలి*

*మరణిస్తాడు.మిగిలిన వాళ్లం క్షేమంగా వెళ్లవచ్చు!*🏃

            *ఒక్కరి కోసం అందరు చస్తారో ? అందరి కోసం ఒక్కరు చస్తారో? ఆలోచించుకోండీ! ” అన్నాడు.*😞


 👉 *చివరకు అందరూ ఒప్పుకొని ఒక్కొక్కరుగా వెళ్లి ఆ చెట్టును ముట్టుకుని రావడానికి సిద్ధపడ్డారు.మొదట గా ఆ పెద్దమనిషే  ధైర్యం చేసి భయపడుతూనే వెళ్లి ఆ చెట్టును ముట్టుకున్నాడు.ఏమీ జరగలేదు.*

*అతడు ఊపిరి పీల్చుకుని క్షేమంగా వచ్చి బస్సులో 🚌కూర్చున్నాడు….*


 👉 *ఇలా ఒక్కొక్కరు భయపడుతూనే వెళ్లి ఆ చెట్టును 🌴ముట్టుకుని వచ్చి కూర్చోసాగారు.చివరికి ఒకే ఒక ప్రయాణికుడు మిగిలాడు.ఇక మరణించేది అతడే! అని అందరూ పూర్తిగా నిశ్చయమైపోయారు.*💜


 👉 *చాలా మంది అతని వైపు అసహ్యంతో,  కోపంతో చూడసాగారు.కొందరు జాలి పడుతూ చూడసాగారు.అతను కూడా చనిపోతానేమో అనే భయం పట్టుకొని బస్సు దిగి చెట్టును🌴 ముట్టుకోవడానికి నిరాకరించాడు.*


        *కాని, బస్సులోని ప్రయాణికులందరు”నీవల్ల మేమందరం మరణించాలా? వీల్లేదు. అంటూ అతన్ని దూషిస్తూ ..బస్సు నుంచి బలవంతంగా క్రిందికి నెట్టారు.*


 👉 *ఇక చేసేది లేక ఆ చివరి వ్యక్తి వెళ్లి చెట్టును🌴 ముట్టుకున్నాడు.వెంటనే పెద్ద మెరుపులతో పిడుగు🌋 వచ్చి కొట్టింది. తరువాత భయంకరమైన శబ్దం వచ్చింది. అతను భయంతో గట్టిగా కళ్ళు ముాసుకొని దైవ ప్రార్థనలో మునిగిపోయాడు...కానీ పిడుగు వచ్చి కొట్టింది ఆ చివరి వ్యక్తిపై కాదు...!!*


 👉 *ఆ బస్సుపై…అవును.. 🚌బస్సుపై పిడుగు🌋 పడి అందులో వున్న ప్రయాణికులందరూ మరణించారు.*😞


 👉 *నిజానికి ఈ చివరి వ్యక్తి 👨ఆ బస్సులో ఉండడం వల్లనే ...ఇంతవరకు ఆ బస్సుకు ప్రమాదం జరగలేదన్న సత్యాన్ని గ్రహించని ఆ బస్సులో వున్నవారు, వారి వారి స్వార్థం వల్ల..... ఇతను తప్ప అందరూ మరణించడం జరిగింది. ఇంతసేపు అతను వారితో కలసి వుండడం వల్ల ,.. ఇతని పుణ్యఫలం, దీర్ఘాయుస్సు వారినందరిని కాపాడింది. అదే ఎప్పుడైతే అతను బస్సును వీడాడో మరుక్షనం మారంత మృత్యువాత పడడం జరిగింది.*👏

"*కర్మ ఫలం"(పుణ్య ఫలం)అంటే ఇదే కాబోలు..*🙏

 

👉 *ఈ కథలో లాగానే మనం జీవితంలో సాధించిన విజయాలలో కానీ, ఆపదల నుండి రక్షించబడిన సందర్భాలలో కానీ, ఆ క్రెడిటంతా మనదే అని అనుకుంటాము.*👈


👉 *కాని, ఆ పుణ్యఫలం మన*

  👨‍👩‍👦‍👦తల్లిదండ్రులది కావచ్చు!

 👸జీవిత భాగస్వామిది కావచ్చు!

 👷పిల్లలది కావచ్చు!

 👧తోబుట్టువులది కావచ్చు!

 👦మన క్రింద పని చేసే వారిది కావచ్చు! లేదా

 👨 *మన శ్రేయస్సును కోరే స్నేహితులది – బంధువులది కావచ్చు!*

 *మనం ఈ రోజు ఇలా ఉన్నామంటే అది మన ఒక్కరి కృషి ఫలితమే కాదు. ఎంతో మంది పుణ్య ఫలితం, ఆశీర్వాద బలం, వారు వారి అదృష్టాన్ని పంచడం కూడా కారణమై ఉండవచ్చు.*💜


 👉 *ఒక సినిమాలో* *చెప్పినట్లుగా*”

*బాగుండడం” అంటే 'బాగా'.. ఉండడం కాదు.* *👪అందరితో కలిసి ఆనందంగా కలసి ఉండడం అని అర్థం....*👧👸🏃


     🙏🏻,*ALLWAYS BELIEVE  IN GOD*

            *STAY HOME--STAY SAFE🙏🏻*

అనుమానం పెనుభూతం!*

 1302.b-8.0103c-6.180624-5.

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀



       *అనుమానం పెనుభూతం!*

                 ➖➖➖✍️

```

అనుమానం పెనుభుతం అనడానికి మహాభారతంలో జరిగిన సంఘటన...



మహాభారతంలో..   పాండవులకు కౌరవులకు మధ్య యుద్ధం మొదలవబోతుందని తెలిసిన కృష్ణుడు మధ్యవర్తిత్వం చేయాలని యుద్ధాన్ని ఆపే ప్రయత్నంగా దుర్యోధనుడి దగ్గరకు వెళ్తాడు.


ఎందుకంటే యుద్ధం మొదలైతే కౌరవుల పక్షంలో భీష్ముడు, ద్రోణుడు ఆయన కొడుకు అశ్వద్దాముడు, కర్ణుడు లాంటి చాలా మంచి యోధులు ఉన్నారని కృష్ణుడికి బాగా తెలుసు. అందులోనూ అశ్వద్దాముడు మరణం లేని వరం పొందినవాడని ‘చిరంజీవి’ అని తెలుసు...  కౌరవుల పక్షంలో అశ్వద్దాముడు కనుక సైన్యాధిపతిగా నియమించబడితే పాండవులు గెలవలేరని తలచిన కృష్ణుడు ఒక ఆలోచనను పన్నాడు.


అది అమలుపరచేందుకై హస్తినాపురం చేరుకున్న కృష్ణుడు. సభలోని అందరికి నమస్కరించి అశ్వద్దాముడిని మాత్రం ఒంటరిగా తీసుకెళ్లి మాట్లాడే ప్రయత్నం చేయగా దుర్యోధనుడు ఇది గమనించసాగాడు.


అపుడు కృష్ణుడు అశ్వద్దాముడి క్షేమసమాచారాలు అడుగుతూనే తన చేతి వేలికి ఉన్న ఉంగరాన్ని కిందకు జారవిడిచాడు. అలా ఉంగరం పడిపోవటం చూసిన అశ్వద్దాముడు వంగి నేల పైన ఉన్న ఉంగరాన్ని తీసి ఇవ్వబోగా కృష్ణుడు ఆకాశాన్ని చూపెట్టి మాట్లాడడం మొదలుపెట్టాడు. కృష్ణుడు ఏమి చూపిస్తున్నాడా అని ఆకాశం వైపు చూసిన తరువాత అశ్వద్దాముడు కృష్ణుడి వేలికి కింద పడ్డ ఉంగరాన్ని తొడిగాడు.


ఇదంతా గమనిస్తున్న దుర్యోధనుడు, అశ్వద్దాముడు “నేను కౌరవుల పక్షంలో ఉన్నా పాండవుల గెలుపుకు తోడ్పడతానని   ఆ నింగి నేల సాక్షిగా ప్రమాణం చేసి మాటాయిస్తున్నాను!” అన్నట్లు అర్థం చేసుకున్నాడు.


ఈ అనుమానం తోనే చివరివరకు అతన్ని యుద్ధంలో సైన్యాధిపతిగా నియమించలేదు దుర్యోధనుడు.


కుఱుక్షేత్రం17వ రోజు యుద్ధంలో దుర్యోధనుడు భీముడి దెబ్బకు కాళ్ళు విరిగి పడిపోయిన సమయంలో అశ్వద్దాముడు దుర్యోధనుడి వద్దకు వచ్చి ఇలా అడుగుతాడు...


”నేను చిరంజీవి వరం పొందినవాడిని అని తెలుసు కదా...  నన్ను గనక సేనాధిపతిగా నియమించి ఉంటె యుద్ధంలో మనం గెలిచేవారం కదా!” అని అడగగా...


అప్పుడు దుర్యోధనుడు... “నువ్వు పాండవులకు సహాయం చేస్తానని ఆ కృష్ణుడికి మాట ఇచ్చావు కదా!” అని అంటాడు.


దీనికి బదులుగా… “ఎవరు మాట ఇచ్చింది?” అని అశ్వద్దాముడు అడగగా అక్కడ జరిగింది అతను అర్థం చేసుకున్నది దుర్యోధనుడు వివరించగా ఆ మాటలు విన్న అశ్వద్దాముడు ముందు విరక్తితో నవ్వి.. “ఆ రోజు కృష్ణుడి ఉంగరం జారిపడిపోతే అది తీసి ఇచ్చాను, కానీ నేను ఎటువంటి మాట ఇవ్వలేదు. నాపైన నీకు కలిగిన అనుమానంతో,  నీ ఓటమికి నువ్వే కారణం అయ్యావు. అప్పుడే నన్ను ఈ విషయం అడిగి ఉంటె నీకు నిజం తెలుసుండేది, ఇది కూడా ఆ పరమాత్మ పాండవులను గెలిపించటానికి ఆడిన నాటకమే అయి ఉంటుంది!” అని చెప్పాడు అశ్వద్దాముడు.



నిజమే!  అనుమానం వస్తే  వెంటనే అడిగేయడం ఉత్తమం. అంతే కానీ మనసులో దాచుకుని దానిని పెంచుకుంటూ పోతే జీవితాల్లో దుర్యోధనుడిలా మనకు ఓటమి తప్పదు.


’అనుమానం పెనుభూతం’ అనే మాట నిజమే అనడానికి మంచి ఉదాహరణ భారతంలోని ఈ ఘట్టం.✍️```


.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


  🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

ఇలాటి మంచి విషయాలకోసం...

*“భగవంతుని విషయాలు గ్రూప్ “* లోచేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ మెసేజ్ పెట్టండి... 9440652774.

లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏

జ్యేష్ఠ శుక్ల ఏకాదశీ

 జ్యేష్ఠ శుక్ల ఏకాదశీ వైశిష్ట్యం


శుకైకాదశిని నిర్జలైకాదశి అని అంటారు. ఈ ఏకాదశినిగురించి కేదార ఖండంలో ఒక చక్కని కథ ఉన్నది. పూర్వంకుంతీ పుత్రుడు భీముడు కేదారేశ్వర దర్శనానికి వెళ్ళాడు.ఈశ్వరుడు భీమునికి ప్రత్యక్షమై రేపు జ్యేష్ఠ శుద్ధ ఏకాదశిఅనీ, ఆ రోజంతా ఆచమన జలం తప్ప, మరేమీస్వీకరించడానికి, మంచినీరు కూడా (ఆచమనానికి తప్ప)త్రాగకుండా ఉపవాసం ఉండి తనను అర్చిస్తే శాశ్వత కైవలభిస్తుందని చెప్పాడు. భీముడు భోజన ప్రియుడు. దానిగుండెలో రాయి పడినట్లయింది. అప్పటికి సరేనన్నాడు.ఏకాదశి ఉపవాసం ప్రారంభం కాగానే ఆకలికి ఓర్చుకోలేమరల శివుని ప్రార్థించాడు. శివుడు పాలు త్రాగవచ్చనిఅనుమతి నిచ్చినాడు. భీముడు పాలు త్రాగి కూడా ఆకఓర్చుకోలేక మరలా శివుని ప్రార్థించాడు. శివుడు ఫలహా(కేవలం పళ్లు మాత్రమే) చేయడానికి అనుమతిచ్చాడు. )భీముని ధర్మమా అని నిర్జలైకాదశినాడు కూడా శరీరంసహకరించని వారికి పాలు, పళ్ళు తీసుకునే అవకాశంలభించింది. ఆరోగ్యం సహకరిస్తే మాత్రమే సంపూర్ణముగాఉపవాసం ఉండి, శివుని పూజించిన వారికి ఈ లోకంలోభోగజ్ఞానాలు, అనంతరం ముక్తి లభిస్తాయి. విష్ణువునుపుష్పాలతో పూజిస్తే, ఆపై దానాలు చేస్తే సంవత్సరంలోనిఇరవైనాలుగు ఏకాదశులు ఉపవాసం ఉన్న మహాఫలంలభిస్తుంది.



జ్యేష్ఠ శుక్ల ఏకాదశీ వైశిష్ట్యమ్


శుక్లైకాదశీ నిర్జలైకాదశీ ఇతి కథ్యతే। అస్య ఏకాదశ్యాః విషయే కేదార ఖణ్డే ఏకః సున్దరః ఆఖ్యానః అస్తి। పూర్వం కున్తీపుత్రః భీమః కేదారేశ్వర దర్శనార్థం అగచ్ఛత్। భగవతః భీమాయ ప్రత్యక్షః భూత్వా అవదత్ । యది జ్యేష్ఠశుద్ధ-ఏకాదశీ దినే ఉపవాసం కృత్వా తస్య పూజాం కరోతి, ఆచమన జలం వినా కిమపి పేయం ఆహారం చ విహాయ, స్వచ్ఛజలం అపి న పిబతి, తర్హి సః శాశ్వతం మోక్షం ప్రాప్స్యతి ఇతి। 


భీమః భోజనప్రేమికః అస్తి। శివస్య ఏతాన్ వచనాన్ శ్రుతవాన్ భీమః ఏకస్మిన్ శిలయా అభవత్। తతః అపి సః స్వీకృతవాన్। ఏకాదశి-వ్రతం ప్రారబ్ధవత్ ఏవ సః పునః భగవన్తం శివం ప్రార్థయత్, క్షుధా సహితుం అసమర్థః అభవత్। భగవతః శివః క్షీరపానం కర్తుం అనుమతిం అదదత్। భీమః క్షీరపానేన అపి సహితుం న శక్తవాన్, పునః భగవాన్ శివం ప్రార్థయత్। భగవతః శివః ఫలాని ఖాదితుమపి అనుమతిం అదదత్ (కేవలం ఫలాని)।


నిర్జలైకాదశీ-దినే అపి, యదా శరీరం సహయోగం న కరోతి స్మ, తదా సః దుగ్ధం ఫలం చ గ్రహీతుం సర్వే జనాః భీమస్య సాహాయ్యేన ప్రాప్నువన్తః। యది స్వాస్థ్యేన అనుమతిః ప్రాప్తా తర్హి ఏవ ఉపవాసః కరణీయః। ఏవం భగవతః శివస్య పూజకాః అస్మిన్ జగతి భోగం జ్ఞానం చ ప్రాప్య మోక్షం ప్రాప్నుయుః । భగవతః విష్ణుం పుష్పైః పూజ్య తతః దానం కుర్వన్ వర్షస్య చతుర్వింశతి ఏకాదశీనాం ఉపవాసస్య మహాన్ పరిణామః భవతి।

18.06.2024. మంగళవారం

 *Jai Sriram 🚩🚩శుభోదయం*


18.06.2024.       మంగళవారం


*శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు*


సుప్రభాతం.......


ఈరోజు జ్యేష్ట మాస శుక్ల పక్ష *ఏకాదశి* తిథి ఉ.06.24 వరకూ తదుపరి ద్వాదశీ తిథి, *స్వాతీ* నక్షత్రం మ.03.56 వరకూ తదుపరి *విశాఖ* నక్షత్రం , *శివం* యోగం రా.09.39 వరకూ తదుపరి *సిద్ధ* యోగం, *భద్ర(విష్టీ)* కరణం ప.06.24 వరకూ, *బవ* కరణం రా.07.01 వరకూ తదుపరి *బాలవ* కరణం  ఉంటాయి.

*సూర్య రాశి*: మిథునం (మృగశీర్ష నక్షత్రంలో)

*చంద్ర రాశి*: తుల రాశి లో.

*నక్షత్ర వర్జ్యం*: రా.09.52 నుండి రా.11.34 వరకూ

*అమృత కాలం*: ఉ.06.22 నుండి ఉ.08.06 వరకూ


( హైదరాబాద్ ప్రాంతం వారికి)

*సూర్యోదయం*: ఉ.05.42

*సూర్యాస్తమయం*: సా.06.53

*చంద్రోదయం*: మ.03.35

*చంద్రాస్తమయం*: రా.03.05

*అభిజిత్ ముహూర్తం*: ప.11.51 నుండి మ.12.44 వరకూ

*దుర్ముహూర్తం*: ఉ.08.20 నుండి ఉ.09.13 వరకూ మరలా రా.11.13 నుండి 11.56 వరకూ

*రాహు కాలం*: మ.03.35 నుండి సా.05.14 వరకూ

*గుళిక కాలం*: మ.12.17 నుండి మ.01.56 వరకూ

*యమగండం*: ఉ.09.00 నుండి ఉ.10.39 వరకూ.


ఈ రోజు *స్మార్త,మాధ్వ,వైష్ణవ నిర్జల ఏకాదశి*. *భీమ ఏకాదశీ* అని కూడా పిలుస్తారు. బ్రహ్మ వైవర్త పురాణము ప్రకారం, పాండవులలో రెండవవాడు అయిన భీముడు మంచి తిండి పుష్టి కలవాడు,ఆకలికి తాళలేని వాడు. ప్రతి 15 రోజులకు వచ్చే ఏకాదశీ తిథి రోజు అందరూ ఉపవాసం ఉంటుంటే,ఆకలికి తాళలేక తాను మాత్రం ఉపవాసం ఉండేవాడు కాదుట. గమనించిన వేద వ్యాసుడు, సంవత్సరంలో వచ్చే ,24 ఏకాదశీ ఉపవాసాలు ఆచరించక పోయినా ఈ జ్యేష్ఠ శుక్లపక్ష ఏకాదశి ఒక్కరోజు ఉపవాసం ఉండమని,ఈ ఒక్క రోజు ఉపవాసం ఉంటే... సంవత్సరం లో వచ్చే 24 ఏకాదశి రోజుల్లో ఉపవాసాలు ఉన్న ఫలితం ఉంటుందని భీమసేనుడుకి నచ్చచెప్పి ఉపవాసం ఉండేలా చేసాడుట.అందుకని ఈ ఏకాదశి ని *భీమసేనీ ఏకాదశీ* అని కూడా పిలుస్తారు. కాబట్టి సంవత్సరంలో వచ్చే అన్నీ ఏకాదశీ ఉపవాసాలు ఉండలేని భక్తులు కనీసం ఈ నిర్జల ఏకాదశీ ఉపవాసం ఉండి వ్రతం ఆచరించడం వలన, సంవత్సరంలో అన్నీ ఏకాదశీ వ్రతాలను ఆచరించిన ఫలితం దక్కుతుంది అని నమ్మకం. ఈ రోజు ఉపవాసం ఉన్న వారికి పారణ సమయం రేపు సూర్యోదయం నుండి ఉ.07.28 వరకూ ఉంటుంది.


ఈ రోజు *శ్రీ ఆది శంకరాచార్యుల కైలాస గమనం*. జగద్గురువులు శ్రీ శంకర భగవత్పాదుల వారు మోక్షం పొంది కైలాసం చేరుకున్న రోజు అని భక్తుల నమ్మకం.


ఈ రోజు *రామ లక్ష్మణ ద్వాదశీ*.రామాయణ కథల ప్రకారం సంతానం కోసం ఈ ద్వాదశీ రోజున దశరథ మహారాజు వ్రతాన్ని ఆచరించారని, ఫలితంగా రామ లక్ష్మణులు జన్మించారు అని కథనం. సంతానం లేని దంపతులు ఈ రామలక్ష్మణ ద్వాదశీ ని పరిపూర్ణ శ్రద్ధతో,కఠిన ఉపవాస దీక్ష తో వ్రతం చేయడం వలన పుత్ర సంతానం కలుగుతుంది,జన్మ సార్థకత ఏర్పడుతుంది అని నమ్మకం.


*త్రి పుష్కర యోగం* ఈరోజు మ.03.56 నుండి రేపు సూర్యోదయం వరకూ ఉంటుంది. (మంగళవారం, ద్వాదశీ తిథి, విశాఖ నక్షత్రం కలయిక). ఈ యోగ సమయం లో చేసే ప్రతీ పనీ జీవితం లో మరలా మూడు పర్యాయాలు చేయవలసిన సందర్భాలు ఏర్పడతాయి.అందువలన ఈ సమయం లో ఎటువంటి తొందరపాటు,అశుభ నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయం లో బంగారం,వెండి, వజ్రాలు, స్థిర ఆస్తులు, వాహనాలు, కొనుగోలు చేయటానికి అనుకూలం. కానీ ఈ సమయంలో న్యాయ చట్ట పరమైన చర్యలు తీసుకోవడానికి, చిన్న చిన్న  అనారోగ్య లక్షణాలకు ఆసుపత్రిలో చేరడానికి, అప్పుల గురించి ప్రయత్నాలు చేయడానికి అనుకూలం కాదు.


 నారాయణ స్మరణం తో....సమస్త సన్మంగళాని భవంతు..శుభమస్తు..నమస్కారం.....సభక్తికం గా.....మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్.

ఫోన్ నంబర్: 6281604881.

వేద ఆశీర్వచనం.

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - గ్రీష్మ ఋతువు - జే‌ష్ట మాసం - శుక్ల పక్షం  -‌ ఏకాదశి / ద్వాదశి  - స్వాతి -‌‌  భౌమ వాసరే* (18.06.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

_జూన్ 17, 2024_*

 *ఓం శ్రీ గురుభ్యోనమః* 

     *_జూన్ 17, 2024_* 

*శ్రీ క్రోధి నామ సంవత్సరం*

*ఉత్తరాయణం*

*గ్రీష్మ ఋతువు*

*జ్యేష్ఠ మాసం*

*శుక్ల పక్షం*

తిథి: *ఏకాదశి*

మర్నాడు తె4.23

వారం: *ఇందువాసరే*

(సోమవారం)

నక్షత్రం: *చిత్ర* మ12.35

యోగం: *పరిఘము* రా8.55

కరణం: *వణిజ* మ3.34

&

*భద్ర* తె4.23

వర్జ్యం: *సా6.40-8.24*

దుర్ముహూర్తము: *మ12.26-1.18*

&

*మ3.03-3.55*

అమృతకాలం: *తె5.32-7.18*

&

మర్నాడు *తె5.06నుండి*

రాహుకాలం: *ఉ7.30-9.00*

యమగండం: *ఉ10.30-12.00*

సూర్యరాశి: *మిథునం*

చంద్రరాశి: *తుల*

సూర్యోదయం: *5.29*

సూర్యాస్తమయం:   *6.32*


      🌼 *సర్వ ఏకాదశి* 🌼


           *లోకాః సమస్తాః*

           *సుఖినోభవంతు*

17, జూన్ 2024, సోమవారం

కాకర రసం -

 ఇన్సులిన్ కి బదులు కాకర రసం  - 


       రొజూ పరగడుపున కాకరకాయల రసం 10 గ్రాముల మోతాదుగా తాగి పొట్టు గొధుమ పిండితో తయారుచేసిన రొట్టె లో వెన్న కలుపుకుని తింటూ ఉంటే మూడు నాలుగు వారాలలో చక్కర వ్యాధి పూర్తిగా అదుపులోకి వస్తుంది. 


               ఇన్సులిన్ ఎక్కువ ఉపయోగించేవారు తమ శారీరక బలాన్ని బట్టి కాకరాకు రసం 20 గ్రా వరకు తీసుకుంటూ క్రమంగా ఇన్సులిన్ మానివేయవచ్చు . 


   

        ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

Panchaag


 

అర్ధాంగి

 రావుగారు రిటైర్ అయ్యారు.


పెద్ద మొత్తంలో రిటైర్మెంట్ అమౌంట్ వచ్చింది. . రూ.20 లక్షలు, తన మరియు భార్య జాయింట్ అకౌంట్లో ఉంచి, ఆమెకు ఎటిఎం కార్డు పిన్ కూడా చెప్పారు. .


ఒకసారి పనిమీద గంట సేపు బయటకు వెళ్లాక ఫోన్ మర్చిపోయానని గుర్తుకొచ్చింది. వెంటనే ఇంటికి వచ్చారు. . సోఫాలో పడివున్న ఫోన్ చూసి కుదుటపడ్డారు. . సోఫాలో కూర్చొని భార్యను "ఫోన్ వచ్చిందా?" అని అడిగారు. .


"అవునండి. బ్యాంకు నుంచి ఫోన్ వచ్చింది జాయింట్ అకౌంట్ సమాచారాన్ని అప్డేట్ చేయమని "


రావుగారికి చెమటలు పట్టి సోఫాలో కూలబడ్డాడు. భయాందోళనతో "ఒ.టి.పి.. ఇచ్చావా ?" అని అడిగాడు.


భార్య: అవును. బ్యాంకు మేనేజర్ స్వయంగా నాకు ఫోన్ చేయగా నేను అతనికి ఇచ్చాను.


రావుగారు ఇంకా కుప్పకూలిపోయాడు. తల తిరుగుతున్నట్టు అనిపించింది. తన మొబైల్ ఫోన్లో బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేశాడు. ఇందులో రూ.20 లక్షలు అలాగే ఉన్నాయి.


"ఏ ఓటీపీ ఇచ్చావు" అని అడిగారు.


భార్య అమాయకంగా చెప్పింది "ఓటీపీ 4042గా వచ్చింది. జాయింట్ అకౌంట్ కదా. నా వంతు ఓటీపీ 2021 ఇచ్చాను.


రావుగారికి పోయిన ప్రాణం వచ్చినట్లు అనిపించింది.


అందుకనే కదా అర్ధాంగి అంటారు. !.

🤣🤣🤣🤣

పరోపకారం

 *పరోపకారం*

భగవంతనికి ఇన్ని అవతార స్వీకారాలు ఎందుకు చేస్తాడన్నది ప్రశ్న. ఆయనకేమి అవసరం..?అంటే.. ధర్మ స్థాపన మరియు పరోపకారం కోసమే భగవంతుడు అవతారాలు స్వీకరిం చాడు. తాను స్వీకరించిన అన్ని అవతారాలలో దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించి, అధర్మాన్ని నిర్మూలించి ధర్మాన్ని రక్షించాడు. ఇదంతా దేనికి అంటే? లోకానుగ్రహం కోసమే. భగవంతునికి వేరే ఏమీ సాధించవలసిన అవసరంలేదు. భగవంతుడే పరోపకారానికి ఇంత ప్రాధాన్యతనిస్తే మనమెంత ప్రాధాన్యమివ్వాలి? మన పూర్వీకులు దీనిగురించి ఉదాహరణగా చిన్న శ్లోకంలో చెప్పారు.

*परोपकृतिकैवल्ये तोलयित्वा जनार्दनः* |

*गुर्वीं उपकृतिं मत्वा अवतरान् दश अग्रहीत्* ||

పరోపకారం చేయటం ఉత్తమమా? లేక ఊరికే ఉండటం ఉత్తమమా? అని తులనాత్మకంగా పరిశీలించి భగవంతుడు పరోపకారమే ఉత్తమమని భావించి అవతారాలు స్వీకరించాడు. అలా భగవంతుడే పరోపకారానికి ప్రాముఖ్యత నిచ్చాడు. పరోపకారం పరమోత్తమం, పరపీడనం నికృష్ణం. రాక్షసులు పరపీడనంలో గడిపేవారు. అందువలననే వారిని భగవంతుడు సంహరించాడు.

మానవులు రాక్షసుల గుణగణాలను అలవరచకోకూడదు. ఇతరులకు ఎప్పుడూ సహాయపడే లక్షణం కలిగియుండాలి. మనకు వీలైనంత సహాయం చేయాలే తప్ప పరులకు అపకారం తలపెట్టకూడదు. అట్టి పరోపకార స్వభావం ఏర్పడితే మన జీవితం ధర్మబద్దంగా ఉంటుంది. మనం ధర్మానుయాయులం అవుతాం.

జగద్గురు శ్రీ శంకర భగవత్పాదులు కూడ అధర్మాన్ని నాశనంచేసి ధర్మాన్ని రక్షించి లోకోపకారం చేయటానికే అవతరించారు. అందువలన మన పూర్వ జన్మ పుణ్యంగా లభించిన మానవజన్మ సార్ధకతకై ధర్మాచరణ చేద్దాం. ధర్మాచరణ అంటే విచక్షణతో కూడిన పరోపకారమే. ప్రతియొక్కరూ ఈవిషయాన్ని గ్రహించి తమ జీవితాలను పవిత్రవంతం చేసుకోవాలి.


|| हर नमः पार्वती पतये हरहर महादेव ||


--- *జగద్గురు శ్రీశ్రీ భారతీ తీర్థ మహస్వామివారు*