8, డిసెంబర్ 2024, ఆదివారం

సూర్యాష్టకం

 *సూర్యాష్టకం*


ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మభాస్కర

దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే


సప్తాశ్వ రధ మారూఢం ప్రచండం కశ్యపాత్మజం

శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం


లోహితం రధమారూఢం సర్వ లోక పితామహం

మహాపాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం 


త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం

మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం


బృంహితం తేజసాం పుంజం వాయు మాకాశ మేవచ

ప్రభుంచ సర్వ లోకానాం తం సూర్యం ప్రణమామ్యహం


బంధూక పుష్ప సంకాశం హార కుండల భూషితం

ఏక చక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం


విశ్వేశం విశ్వ కర్తారం మహా తేజః ప్రదీపనం

మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం


తం సూర్యం జగతాం నాధం జ్నాన విజ్నాన మోక్షదం

మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం


సూర్యాష్టకం పఠేన్నిత్యం గ్రహపీడా ప్రణాశనం

అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్


ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్ధినే

సప్త జన్మ భవేద్రోగీ జన్మ కర్మ దరిద్రతా


స్త్రీ తైల మధు మాంసాని హస్త్యజేత్తు రవేర్ధినే

న వ్యాధి శోక దారిద్ర్యం సూర్య లోకం స గచ్ఛతి


*ఇతి శ్రీ శివప్రోక్తం శ్రీ సూర్యాష్టకం సంపూర్ణం*

సర్వరోగనివారణ సూర్యస్తోత్రం*

 *సర్వరోగనివారణ సూర్యస్తోత్రం*


సూర్యుడు ఆరోగ్య ప్రదాత. ఐశ్వర్య ప్రదాత కర్మ సాక్షి ప్రత్యక్ష నారాయణుడు. సమస్త సూర్యమండలానికి వెలుగును ప్రసాదించే దైవము. అటువంటి సూర్యారాధన సమస్త రోగములను హరించి ఆరోగ్యమును అందిస్తుంది.సర్వ రోగాలు మాయమవ్వాలంటే సూర్యభగవానుడిని స్తుతించండి.శక్తివంతమైన సూర్య స్తోత్రమును ప్రతిరోజూ పఠిస్తే--రోగాలు దరిచేరవు.


1::ఉద్యన్నద్య వివస్వాన్ ఆరోహన్నుత్తరాం దివందేవః

హృద్రోగం మమ సూర్యో హరిమాణం చాశునాశయతు


2::నిమిషార్టే నైకేన త్వేచశ తేద్వేసహస్రేద్వే

క్రమమాణ యోజనానాం నమోస్తుతే నళిననాధాయ


3::కర్మజ్ఞానఖదశకం మనశ్చజీవ ఇతి విశ్వసర్గాయ

ద్వాదశధాయోవిచరతి సద్వాదశమూర్తి రస్తు మోదాయ


4::త్వం యజుఋక్ సామత్వం త్వమాగమస్త్వం వషట్కారః

త్వం విశ్వం త్వం హంసః త్వం భానో ! పరమహంసశ్చ


5::శివరూపాత్ జ్ఞానమహంత్వత్తో ముక్తిం జనార్దనాకారాత్

శిఖిరూపాదైశ్వర్యం భవతశ్చారోగ్యమిచ్చామి


6::త్వచిరోషా దృశిదోషా హృదిదోషా యే~ఖిలేంద్రి యజదోషాః

తాన్ పూషా హతదోషః కించిద్రోషాగ్నినాదహదు


7::తిమిరమివ నేత్రతిమిరం పటలమివాశేషరోగపటలం నహః

కాచమివాధినికోశం కాలపితారోగశూన్యతాం కురుతాత్


8::యశ్యచ సహస్రాంశోరభిషులేశో హిమాంశు బింబగతః

భాసయతి నక్తమఖిలం కీలయతు విపద్గణానరుణః


9::యేనవినాంధం తమసం జగదేతత్, యత్రసతి చరాచరం విశ్వం

దృతబోధం, తం నళినీ భర్తారం హర్తారమా పదామీళే


10::వాతాశ్మరీ గదార్శః త్వగ్దోష మహోదర (ప్రమేహాంశ్చ)

గ్రహణీ భగంధరాఖ్యా మహారుజోపిత్వమేవహంసి


11::ధర్మార్ధ కామ మోక్ష ప్రతిరోధిన ఉగ్రతాపవేగకరాన్

బందీకృతేంద్రియ గణాన్ గదాన్ విఖండ యతుచండాంశుః


12::త్వం మాతాత్వం శరణత్వం దాతాత్వం ధనః త్వమాచార్యః

త్వం త్రాతా త్వం హర్తావిపదాం ; అర్క ! ప్రసీద మమ


*ఫలశ్రుతి*


ఇత్యార్యా ద్వాదశకం సాంబస్య పురోనభా స్థలాత్పతితం

పఠతాం భాగ్యసమృద్ధిః సమస్త రోగక్షయ స్స్యాత్


ఈ స్తోత్రాన్ని శ్రద్ధతో పఠించేవారికి భాగ్యాభివృద్ధి కలుగుతుంది.అన్ని జబ్బులూ హరింపబడతాయి


ఓం సూర్యాయ నమః

⚜ శ్రీ మణక్కట్టుదేవి ఆలయం

 🕉 మన గుడి : నెం 953


⚜ కేరళ : పల్లిప్పాడ్  : అలెప్పి


⚜ శ్రీ మణక్కట్టుదేవి ఆలయం



💠 మనక్కట్టు దేవి ఆలయం భారతదేశంలోని కేరళ రాష్ట్రంలోని అలప్పుజా జిల్లా, కార్తీకపల్లి తాలూకాలోని పల్లిప్పడ్‌లో ఉంది. 

ఈ ఆలయం భువనేశ్వరి దేవికి అంకితం చేయబడింది. అలాగే, ఆలయానికి నాలుగు ప్రాంతాలు ఉన్నాయి. 


💠 ఆలయ ప్రధాన దేవత భువనేశ్వరి. ఆలయంలోని ఉప దేవతలలో దేవత యక్షి అమ్మ, నాగరాజ, వల్ల్యచన్ మరియు రాక్షసులు ఉన్నారు.


💠 ఆలయం అనేక పండుగలను జరుపుకుంటుంది. 

నిరపుత్తరి, నవరాత్రి, చిరప్పు, ఆరట్టు, భగవతిప్పర, ప్రతిష్ట వార్షికం మరియు కొడియెట్టు ఉత్సవం వంటి ముఖ్యమైన పండుగలు ఈ ఆలయంలో ఉన్నాయి. అమ్మవారిని ఊరేగింపుగా తీసుకువెళ్లే అతి ముఖ్యమైన పండుగ, పరాయెడుపు, మలయాళ మాసం మకరంలో వస్తుంది.



🔆 ఆలయ చరిత్ర


💠 చాలా కాలం క్రితం ద్వాపర యుగంలో ఈ ప్రాంతాలు ఖాండవ వనంలో చేర్చబడ్డాయి. భగవాన్ శ్రీకృష్ణుని సలహా మేరకు అర్జునుడు తన బాణాన్ని ఏవూరు (ఎయ్త్తూరు) నుండి ప్రసిద్ది చెందిన శ్రీకృష్ణ స్వామి దేవాలయం ఉన్న ఏవూరు నుండి పంపాడు. 

ఖాండవదహనం తర్వాత ఈ ప్రాంతంలోని ఆలయాలు అగ్నికి ఆహుతయ్యాయి. 

దశాబ్దాల తర్వాత పంజా కాండానికి వెళ్లే దారిలో ఒక రైతు తన విల్లు ఆకారపు కత్తిని రాయిలో పదును పెట్టడానికి ప్రయత్నిస్తుంటే అకస్మాత్తుగా రాయి నుండి రక్తం వచ్చింది.


💠 భయపడిన అతను ప్రముఖ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఆచార్యుల వద్దకు వెళ్లి జరిగిన విషయాన్ని తెలియజేసారు.

పూజారి దిగి వచ్చి అక్కడ శ్రీభువనేశ్వరి విగ్రహాన్ని కనుగొన్నాడు. 

పరశు రామునిచే ప్రతిష్టింపబడిన పాత శాస్తా దేవాలయానికి సమీపంలో అర్చక ప్రతిష్ఠాపన చేయబడ్డాడు . 

శ్రీ పొన్ను మణక్కట్టమ్మ విగ్రహం లభించిన ప్రాంతాన్ని వలియ మనక్కట్టు కావు అంటారు.


💠 మనక్కట్టమ్మ శ్రీ భువనేశ్వరి రూపంలో ఉంటుంది. అన్ని దేవతల తల్లి బ్రహ్మ విష్ణు మరియు శివను కలిగి ఉంటుంది. 

మణక్కట్టు ఆలయ ఆచారాలు పూర్తిగా భిన్నమైనవి. ఇది మూకాంబికా దేవి వంటి దుర్గా, లక్ష్మి మరియు సరస్వతికి మూడు రోజువారీ సందర్భాలలో మూడు వేర్వేరు పూజలను కలిగి ఉంటుంది .

కడుంపాయసం, తేరాలి అమ్మవారికి ముఖ్యమైన ప్రసాదం.


💠 శ్రీమనక్కడు దేవి ఆలయంలో వలియాచన్ అతి ముఖ్యమైన ఉప దేవత. అతను ధర్మరాజ కార్తీక తిరునాళ్ రామవర్మ సైన్యాధ్యక్షుడు మరియు టిప్పు సుల్తాన్‌పై విజయం సాధించిన కీలక వ్యక్తి . అతను మణక్కట్టు అమ్మవారికి అత్యంత నమ్మకమైన భక్తుడు.

అతని సైన్య సేవ తరువాత, వానప్రస్థకు వెళ్ళే వరకు మణక్కట్టు అమ్మకు సేవకుడిగా వల్యచన్ తన జీవితానికి ఎంపిక చేసుకున్నాడు . 

వానప్రస్థ సమయంలో అతను మోక్షాన్ని పొందాడని నమ్ముతారు.


💠 మనకట్టు దేవి ఆలయంలో వల్యచన్ నిజంగా శాశ్వతమైన ఉనికి. వాల్యాచన్‌పై గతంలోనూ, ప్రస్తుతంనూ అనేక సంఘటనలు జరిగాయి. నాతాలిక్కల్ మఠం సమీపంలో వల్యచన్‌కు మరొక ఆలయం ఉంది, దీనిని నతాలిక్కల్ ఆలయం అని కూడా పిలుస్తారు.


🔆 శ్రీ ధర్మ శాస్తా దేవాలయం : 

శ్రీ ధర్మ శాస్తా దేవాలయం పూర్వం ఉండేది.

 శ్రీ ధర్మ శాస్తాను శ్రీ పరశు రాముడు ప్రతిష్టించాడని శతాబ్దాలుగా నమ్ముతారు .

 కానీ ఆలయ పునర్నిర్మాణం కోసం కూల్చివేయబడింది మరియు గత 10 సంవత్సరాలుగా ఏమీ చేయలేదు. 

శ్రీధర్మ శాస్తా ప్రతిష్టను బాలాలయానికి తరలించడం భక్తులకు చాలా బాధ కలిగిస్తోంది. ఆ దిశగా చర్యలు తీసుకోవడంలో ఆలయ అధికారులు విఫలమయ్యారు.


🔆 ఇతర ఉప దేవతలు : 

ఆలయానికి ప్రక్కనే అనేక ఉపదేవతలు ఉన్నాయి. 

ఆలయ ప్రాంగణంలోని ప్రధాన ఉపదేవతలు:

ప్రధాన దేవాలయం.

శాస్తా ఆలయం (పాతది)

యక్షి

మాడస్వామి

నాగరాజవ్

ముహూర్తి

రేక్షలు


🔆 పండుగలు : 


ఆరట్టు


వృశ్చిక మాసం చివరి వారంలో ఆరాట్టు జరుపుకుంటారు. ఇది వృశ్చికం 24న ప్రారంభమై ధను 1న ముగుస్తుంది. కొడియేరంలోని 7 రోజున మనకట్టమ్మ శ్రీ అరయకులంగర శ్రీకృష్ణ స్వామి ఆలయ కొలను వద్దకు వెళ్లి తిరుగు ప్రయాణంలో ధ్వజారోహణం చేస్తారు. గతంలో కొచూర్ మఠంలోని బ్రాహ్మణులు పూజలు నిర్వహించేవారు, కానీ ఇప్పుడు మనకట్టు దేవి ఆలయ తంత్రం నిర్వహించే తజమన్ మఠం తంత్రి నిర్వహిస్తారు.


రచన

©️ Santosh Kumar

తిరుమల సర్వస్వం -81*

 **తిరుమల సర్వస్వం -81* 

*శ్రీవారి బ్రహ్మోత్సవాలు - 20*

స్వామిపుష్కరిణిలో ఉన్న మహత్తు ఏమిటంటే మూడు దివ్యమైన మార్గాలద్వారా అందులోకి జలం చేరుతూ ఉంటుంది: *మొదటిది: భూస్పర్శ.* పుష్కరిణిలో ఉన్న అనేక ఊటబావుల నుండి ఎల్లవేళలా జలం ఊరుతూ, పుష్కరిణి నిండుగా ఉంటుంది. అంటే, భూదేవి, పుష్కరిణిని నింపడానికి తనవంతు ప్రయత్నం నిర్విరామంగా చేస్తుందన్నమాట. *రెండవది: ఇంద్రుని సమర్పణ.* వర్షపుధారల ద్వారా వచ్చిన నీటితో పుష్కరిణి నిండుతుంది. 

*మూడవది: విరజానది* స్వర్గలోకం నుండి భువికి దిగివచ్చి స్వామిపాదాల క్రిందుగా ప్రవహిస్తూ పుష్కరిణిలో చేరుకుంటున్న *"విరజానది".* 

*త్రిపథ జల సంగమమైనది కాబట్టే ఈ పుష్కరిణి పరమపవిత్రమైనదిగా విరాజిల్లుతోంది.* 

ఈ పుష్కరిణి చుట్టూ దేవతలు కొలువై ఉంటారని భక్తుల విశ్వాసం. ప్రాచీనకాలంలో ఎందరో మహర్షులు పుష్కరిణి ఒడ్డున తపస్సు చేసి సిద్ధి పొందారు. సంస్కృతంలో *"నీరము"* అంటే నీరు లేదా జలము అని అర్థం. ఉదకం సాక్షాత్తు ఆ శ్రీహరి స్వరూపం కనుక, ఆ స్వామి "నారాయణుడు" అయ్యాడు. 

ఈ సందర్భంలో తీర్థక్షేత్రాల గురించి కూడా కొద్దిగా చెప్పుకోవాలి: 

పుష్కరిణిలు, నదులు, ఏ ఇతర సహజ జలసదుపాయం లేకుండా ఉన్నటువంటి దేవాలయాన్ని *క్షేత్రం* అంటారు. ‌ దేవాలయం లేకుండా కేవలం సహజ జలసదుపాయం ఉంటే వాటిని *తీర్థం* అంటారు. 

‌ పుష్కరిణి లేదా నది మరియు ఆలయం - ఈ రెండూ కలిసి ఉంటే దాన్ని *తీర్థక్షేత్రం* అంటారు. *తిరుమల అన్ని తీర్థ క్షేత్రాలకు తలమానికం.* 


దేవాలయాల్లో కూడా వాటి ఆవిర్భావాన్ని బట్టి ఐదు రకాలున్నాయి: 

'భగవంతుడే "స్వయంగా" అవతరిస్తే అవి *స్వయంవ్యక్త క్షేత్రాలు.* 

దేవతలచే నిర్మింపబడినవి *దివ్యక్షేత్రాలు.* 

పురాణ ప్రసిద్ధి గాంచినవి *పురాణ క్షేత్రాలు.* 

మునిపుంగవుల ద్వారా ఏర్పాటు చేయబడినవి *సిద్ధ క్షేత్రాలు* లేదా *ఆర్షములు* 

భక్తులు, రాజులచే నిర్మించబడినవి *మానుషక్షేత్రాలు


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

99490 98406

విభూతియోగము

 10-35-గీతా మకరందము

          

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


బృహత్సామ తథా సామ్నాం 

గాయత్రీ ఛందసామహమ్ | 

మాసానాం మార్గశీర్షోఽహం ఋతూనాం కుసుమాకరః || 

 

తా:- సామవేదగానములలో బృహత్సామమును,  ఛందస్సులలో గాయత్రియు, మాసములలో మార్గశిరమాసమును, ఋతువులలో వసంతఋతువును నేనైయున్నాను. 

 

వ్యాఖ్య:- ‘మాసానాం మార్గశీర్షోఽస్మి’ - ఈ క్రింది కారణములచే మార్గశీర్షమాసముయొక్క శ్రేష్ఠత్వము సూచితమగుచున్నది - 

(1)పూర్వము మహాభారతకాలమున సంవత్సరము మార్గశీర్షమాసముతో ప్రారంభమగుచుండెడిది. (మహాభారతము - అను - 106,109 అధ్యా). కావున అది అన్నిమాసములకును మొదటిది అయియుండెను. 

(2)ధనుర్మాసకాలమగు ఆ సమయము మహాపవిత్రమైయున్నది. శాస్త్రములందును ఆ సమయమున వ్రతోపవాసాదులు సలుపువారికి గొప్ప ఫలితములు చేకూరునని వచింపబడినది. 

(3)జనులకు క్రొత్తపంట చేతికివచ్చును. అందఱియొద్ద ధాన్యము పుష్కలముగ నుండును. 

(4) వాల్మీకి రామాయణమునందు మార్గశీర్షమాసము సంవత్సరమునకు భూషణముగ వర్ణింపబడినది. 

(5) భగవద్గీత ఈ మార్గశిరమాసమందే ఆవిర్భవించినది. (మార్గశిర శుద్ధ ఏకాదశి). 

(6) అవతారపురుషులగు దత్తాత్రేయులు ఈ నెలయందే జన్మించిరి. (మార్గశిర శుద్ధ పౌర్ణమి). 

(7) వాతావరణము చల్లగనుండుటచే జనుల హృదయమున్ను ఉల్లాసముగ నుండును. ధ్యానాదులకది అనుకూలసమయము. 

    “ఋతూనాం కుసుమాకరః” - వసంతఋతువునందు చెట్లన్నియు చిగిర్చి శోభాయమానముగనుండును. అత్తఱి వాతావరణమున్ను సమశీతోష్ణముగ నుండును. కావున ఋతువులలో అది శ్రేష్ఠముగ వర్ణింపబడెను. శ్రీరామచంద్రుడున్ను ఆ పవిత్రఋతువునందే జన్మించిరి.

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*ఉద్యోగ పర్వము ద్వితీయాశ్వాసము*


*219 వ రోజు*

చెట్టు ఒకటే ఉంటే దానిని ఏనుగులు, గుఱ్ఱాలు తొక్కివేస్తాయి. గాలి కూల్చేస్తుంది గుంపుగా ఉన్న చెట్లను ఎవరూ ఏమీ చేయలేరు. అన్నదమ్ములు కలిసి ఉంటే వారిని ఎవరూ కన్నెత్తి చూడలేరు. వేరుగా ఉంటే శత్రువుకు లోకువైపోతారు. కాబట్టి కౌరవులు, పాండవులు ఒకరికొకరు అండగా ఉంటే శత్రువుకు జయించరానివారు అవుతారు. పాండు పుత్రులను పిలిచి వారికి హితం కలిగించి నీ పుత్రులను బ్రతికించుకో. ఇచ్చకాలు మాట్లాడేవారు ప్రతిచోటా ఉంటారు. అప్రియమైనా హితం పలికేవారు వేరుగా ఉంటారు. జూదం ఆడిన నాడే నేను వద్దని చెప్పాను. రోగం వచ్చినవాడికి పథ్యం సహించనట్టుగానే నా మాటలు నీవు విన లేదు. కాకుల వంటి నీ కుమారులను నమ్మి నెమళ్ళ వంటి పాండవులను వదులుకుని ఇప్పుడు తల్లడిల్లి పోతున్నావు.పిల్లులను ఆదరించి సింహాలను చేరదీసినట్టు దుర్యోధనాదులకోసం పాండవులను వదిలేసావు. కులం నిలుపుకోవడానికి ఒక్కడినయినా వదులుకోవాలని పెద్దలంటారు. అవినీతిపరుడై, మంచి మాటలు చెప్తే వినని దుర్యోధనుడిని వదులుకుంటే వచ్చే నష్టం ఏమిటి. సహాయం సంపదను బట్టి, సంపద సహాయాన్ని బట్టి ఉంటాయి. ఇలా ఒకదానితో ఒకటి కూడి ఉంటే గాని సిద్ధించవు. కాబట్టి నీ సంపద పాండవులకు, వారి సహాయం నీకు ప్రీతి కలిగిస్తుంది. పరస్పరం కలిసి ఉండడం మేలు. కురువంశోద్ధారకులైన భీష్ముడు,ధర్మరాజు,మంచి పరాక్రమవంతులైన అర్జునుడు, కర్ణుడు , భీముడు, దుర్యోధనుడు, శస్త్ర అస్త్ర విద్యలలో నిపుణులైన అభిమన్యుడు, లక్ష్మణ కుమారుడు, ద్రోణుడు, ద్రుపదుడు వంటి ఆత్మీయులు వారి బంధువులు అంతా చేరి నిన్ను సేవిస్తుంటే నీ వైభవం ఎలా ఉంటుందో ఆలోచించు. " అన్నాడు. పాండవులు ఇప్పుడు పగ విషయం మరిచిపోయినా కొన్నాళ్ళకయినా ఇబ్బందులు పడి చెడుతుందే కాని దుర్యోధనుడితో రాజ్యం పాలించబడదు. అని చెప్పాడు విదురుడు. ధృతరాష్ట్రుడు " విదురా! నీవు చెప్పిన మాటలు రాజనీతి సమ్మతములే . అయినా నా కొడుకును వదలలేను. కనుక ధర్మం జయిస్తుంది అని చూస్తూ ఉంటాను " అన్నాడు. అప్పుడు విదురుడు " రాజా! దాయాదులు గుణం లేనివాళ్ళయినా విడిచిపెట్టకూడదు అంటారు. సకల గుణసంపద కలిగినవారై, నీ అనుగ్రహం కోరే పాండవులను నీవు వదిలి పెట్టవచ్చా. నేను నీ మేలుకోరేవాడిని. పాండవులు బ్రతకడానికి చిన్న పల్లెలు అయినా కొన్నిటిని కేటాయించి, దుర్యోధనుడిని ఒప్పించి సంధి చేస్తే మంచిది. యుద్ధం నివారించడానికి కొడుకులను వదల మన్నాను కాని సంధి చేసుకుంటే అందరికీ క్షేమమే కదా!

ఎన్ని భోగాలు అనుభవించినా మహారాజులకైనా చావు తప్పదు. కాబట్టి చెవికి చేదుగా ఉన్నా  

ఈ విషయాన్ని అర్థం చేసుకున్నావంటే నీకు ఇహ పరాల్లో కీర్తి సంపదలు కలుగుతాయి. ధర్మరాజును వదిలిపెట్టకు. మనసు గట్టిచేసుకొని నీ కొడుకులకు, మంత్రులకు సంధి చేసుకోమని చెప్పు." అన్నాడు. ధృతరాష్ట్రుడు " విదురా! నీ మాటలు నా మనసును తేటపరిచాయి. ఆలోచిస్తే ఇదే తగిన పని అనిపిస్తోంది. అలాగే చేస్తాను " అన్నాడు. విదురుడు " ఆ మాట మీద ఉండు. ఇంతకాలానికి నీకు చేయదగినదానిపై మనసు స్థిరపడింది. దుర్యోధనుని చూసి మనసు మార్చుకోకుండా, అతను మొగ్గినవైపు నీవు మొగ్గకుండా ధర్మరాజుతో సంధి చేసుకో. మా వంటి వారికి ఆనందం కలుగుతుంది " అని చెప్పి తన మందిరానికి వెళ్ళాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

శ్రీ ఘాటీ సుబ్రమణ్య ఆలయం

 *శ్రీ ఘాటీ సుబ్రమణ్య ఆలయం... ( కర్నాటక  దొడ్డబల్లాపూర్  )*

శ్రీ సుబ్రహ్మణ్య భగవానుడు దేశవ్యాప్తంగా ప్రత్యేకించి దక్షిణ భారతదేశంలో పూజించబడతాడు.  

శివుని కుమారునిగా పరిగణించబడే సుబ్రహ్మణ్యుడు తారకాసురుడు అనే రాక్షసుడిని సంహరించిన దేవతల సైన్యానికి అధిపతి.  అతన్ని షణ్ముఖ, కార్తికేయ, శరవణభవ మరియు స్కంద మొదలైన పేర్లతో కూడా పిలుస్తారు.


🌸 గుహ అనేది సుబ్రహ్మణ్య స్వామి మరొక పేరు, అతను గుహలలో నివసించేవాడు మరియు సుబ్రహ్మణ్య స్వామి నివాసంగా పర్వతాలు మరియు గుహలు మనకు ఎల్లప్పుడూ కనిపిస్తాయి.


🌿 సుబ్రహ్మణ్య స్వామికి అనేక దేవాలయాలు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి మరియు వాటిలో కొన్ని సుబ్రహ్మణ్య క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందిన యాత్రా కేంద్రాలు.  అటువంటి అరుదైన ప్రాముఖ్యత కలిగిన దేవాలయం బెంగుళూరు నుండి 60 కిలోమీటర్ల దూరంలో కర్ణాటక రాష్ట్రంలోని ఘాటి వద్ద ఉంది.


🌸 ఘటి అనే పదం సంస్కృతం నుండి ఉద్భవించింది.  కుండ అని అర్థం. ఇక్కడ పాము యొక్క పడగ ఒక కుండను పోలి ఉంటుంది.


🌿 స్థల పురాణం ప్రకారం, తారకాసురుడు అనే రాక్షసుడిని చంపడానికి ముందు సుబ్రహ్మణ్య భగవానుడు ఈ ప్రాంతంలోని పర్వత శ్రేణులలోని గుహలలో సర్ప వేషంలో తపస్సు చేసిన ప్రదేశం.


🌸 ఈ ప్రదేశంలో సుబ్రహ్మణ్య భగవానుడు పాము రూపంలో ఇప్పటికీ తపస్సు చేస్తున్నాడని నమ్ముతారు.  

నాగుల కుటుంబాన్ని విష్ణువు వాహనం అయిన గరుడుని నుండి రక్షణ అందించమని సుబ్రహ్మణ్యస్వామి  నరసింహుడిని ప్రార్థించాడు. 


🌿 ఘాటి వద్ద ఉన్న దేవాలయం అరుదైన కలయికలో సుబ్రహ్మణ్య భగవానుడు మరియు లక్ష్మీ నరసింహ స్వామికి ప్రత్యేకంగా అంకితం చేయబడింది.


🌸 ఈ ఆలయం యొక్క అరుదైన విషయం ఏమిటంటే, రెండు దేవతలు ఒకే  స్వయంభూ. విగ్రహంపై ఏడు తలల నాగుపాము ఉన్న కార్తికేయ విగ్రహం ఒకే రాయితో తయారు చేయబడింది.  


🌿ఇది తూర్పు ముఖంగా ఉండగా నరసింహుని విగ్రహం పడమర దిశగా ఉంటుంది.  గర్భగుడి లోపల వ్యూహాత్మకంగా ఉంచిన అద్దం ద్వారా లక్ష్మీ నరసింహ స్వామిని వీక్షించవచ్చు.


🌸 ఘట అనేది సంస్కృత పదానికి అర్థం కుండ.  ఒక పాము యొక్క పడగ ఒక కుండను పోలి ఉంటుంది మరియు ఘటి అనేది సుబ్రహ్మణ్య భగవానుడు ఘట సర్ప రూపంలో నివసించిన ప్రదేశం. 


🌿 హిందీలో ఘాట్ అంటే పర్వత శ్రేణి మరియు ఈ సుబ్రహ్మణ్య దేవాలయం పర్వత శ్రేణులలో ఉంది.  

సుబ్రహ్మణ్య భగవానుడు ఘటికాసురుడు అనే రాక్షసుడిని సంహరించిన ప్రదేశంగా ఘటి భావిస్తారు.


🌸 ఆలయ రికార్డుల ప్రకారం ఘటి సుబ్రహ్మణ్య క్షేత్రంలోని ఆలయానికి 600 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది మరియు దీనిని సండూర్ రాజవంశానికి చెందిన పూర్వపు పాలకులు ఘోర్పడే నిర్మించారు. 


🌿 సుబ్రహ్మణ్య భగవానుడు స్వయంగా ఇచ్చిన ఆదేశాల ప్రకారం (కల) స్థానిక పౌరుల సహాయంతో ఈ అరుదైన మరియు స్వయంగా వ్యక్తీకరించబడిన విగ్రహాన్ని రాజు వెలికితీశారు.


🌸 ఘాటి కర్ణాటక రాష్ట్రంలోని ప్రధాన యాత్రా కేంద్రాలలో ఒకటిగా మారింది మరియు సుబ్రహ్మణ్య భగవానుని సర్పరూపం కారణంగా ఈ ప్రదేశం నాగ క్షేత్రంగా కూడా గౌరవించబడుతుంది.

సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం కోసం వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సంప్రదిస్తారు.


 🌿కుజ (అంగారక) ముఖ్యంగా కుజ (అంగారక) దోషం, వైవాహిక సంబంధిత సమస్యలు మరియు శ్రేయస్సు, రాహు, సర్ప/నాగ దోషాల నుండి వచ్చే దుష్ప్రభావాలకు నివారణగా, సంతానం పొందడం కోసం; 


🌸ఆరోగ్య సమస్యలకు ముఖ్యంగా కుష్టువ్యాధి, ల్యూకోడెర్మా వంటి దీర్ఘకాలిక చర్మ వ్యాధులకు నివారణగా, శత్రువుల నుండి ఉపశమనం (అంతర్గత మరియు బాహ్య రెండూ), కాకుండా అప్పుల నుండి ఉపశమనం లాంటి సమస్యలు కోసం ఇక్కడ పూజలు చేస్తారు.


 🌿ఆలయ రథోత్సవం ప్రతి సంవత్సరం 6వ చాంద్రమానం (శుక్ల షష్ఠి) నాడు పుష్య మాసంలో మాత్రమే కాకుండా, ఇతర ముఖ్యమైన సందర్భాలలో సుబ్రహ్మణ్య స్వామి మరియు లక్ష్మీ నరసింహ స్వామిని ఆరాధించడం కోసం ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు.. 


స్వస్తి...🙏🌹


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

తిరుమల దర్శనంపై ఆర్టీసీ

 తిరుమల దర్శనంపై ఆర్టీసీ ప్రకటన:

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో తిరుమలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం APSRTC బస్సుల్లో రోజుకు 1000 దైవ దర్శనం టిక్కెట్లు జారీ చేయబడ్డాయి.

  ఏబీఎస్‌ఆర్‌టీసీ బస్సుల్లో తిరుమలకు వెళ్లే ప్రయాణికులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఈ సువర్ణావకాశం కల్పించారు.

  ఏబీఎస్‌ఆర్‌టీసీ బస్సుల్లో తిరుపతికి వెళ్లే ప్రయాణికులు రూ.300 అదనంగా చెల్లించి బస్సులోనే ఎక్స్‌ప్రెస్ దర్శనం టికెట్ పొందవచ్చు.


  ఈ శీఘ్ర దర్శనం ప్రతిరోజూ ఉదయం 11.00 మరియు సాయంత్రం 4.00 గంటలకు నిర్వహించబడుతుంది.

  తిరుమల బస్టాండ్‌కు చేరుకున్నప్పుడు ఆర్టీసీ సూపర్‌వైజర్లు ప్రయాణికులకు శీఘ్ర దర్శనానికి సహకరిస్తారు.

  కావున తిరుపతికి వెళ్లే ప్రయాణికులు ముందుగా ఆర్టీసీ బస్సుల్లో ఎక్స్‌ప్రెస్ దర్శనం టిక్కెట్లు పొందే అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.   APSRTC తిరుపతికి రోజూ 650 బస్సులను నడుపుతోంది.   ప్రతి డిపో నుండి తిరుపతికి బస్సు సౌకర్యం ఉంది.   బెంగళూరు, చెన్నై, కంచి, వెల్లూరు, పాండిచ్చేరి, హైదరాబాద్ మొదలైన నగరాల నుండి దైవ దర్శనం కోసం వచ్చే ప్రయాణికులకు ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.


 *చివరి అభ్యర్థన:*

  ఈ పోస్ట్‌ను షేర్ చేయడం మర్చిపోవద్దు.   మీకు ఇది అవసరం లేకపోవచ్చు, కానీ మరెవరికైనా ఇది అవసరం, కాబట్టి దయచేసి షేర్ చేయండి.🙏🏻🙏🏻💐☺️☺️

7, డిసెంబర్ 2024, శనివారం

మహాభారతం

 🙏మహాభారతం - శాంతి పర్వం 🙏

                   నాల్గవ భాగం 

ధర్మం గురించి ఎంత చర్చ జరిగిందో చూడండి దయచేసి అర్ధం చేసుకోండి. శాంతి పర్వం అంతా ధర్మం గురించి  చర్చ అందుకే భారతాన్ని పంచమ వేదం అన్నారు. విషయంలోకి వెడదాము 

అర్జునుడు తిరిగి ఇలా చెప్పసాగాడు. ప్రజలను పాలించవలసిన రాజు దండనీతిని వదిలిన, సన్యాసులు కూడా సన్మార్గం వదిలి అక్రమాలకు పాల్పడతారు. ప్రజలు క్రమము తప్పి ఒకరి ఆస్తిని, ధనమును, భార్యను మరొకరు అపహరిస్తారు. అరాచకం చెలరేగుతుంది. అందు వలన వచ్చే పాపం రాజుకు చుట్టుకుంటుంది. కనుక దండనీతిని పాపంగా తలచవద్దు. దుర్మార్గులను దండించిన రుద్రుడు, గోవిందుడు, ఇంద్రుడు, గుహుడు మొదలగు వారు పాపం పొందారా పైగా వారికి గౌరవాదరాలు లభించాయి. కనుక అన్నయ్యా ! దండనీతి వలన ధర్మం స్థాపించ పడుతుంది. అధర్మం నశిస్తుంది. అన్నయ్యా ! సామాన్య మానవులూ తమ దైనందిక జీవితంలో హింసకు పాల్పడక తప్పదు. మనం తినే పండ్లలో, నీటిలో, కాయలలో ఎన్నో కంటికి గోచరం కాని జీవులు ఉన్నాయి. అహారం కొరకు మనం వాటిని చంపుతున్నాము. మనం కందమూలాల కొరకు భూమిని తవ్వే సమయంలో అనేక జీవులు నశిస్తాయి అవి అన్నీ పాపమును కలిగిస్తాయా ! ప్రాణం నిలుపుకోవడానికి ఆహారం కావాలి, అహారం కావాలంటే హింస తప్పనిసరి. భగవంతుడు కూడా ఒక ప్రాణికి మరొక ప్రాణిని ఆహారంగా సమకూర్చ లేదా ! ధర్మమార్గాచరణలో చేసిన హింస పాపం కాదు. రాజుకు దుర్మార్గులైన శత్రువులను చంపడం హింస కాదు. అన్నయ్యా ! మనతండ్రి పాండురాజు సంపాదించిన రాజ్యాన్ని మనం తిరిగి పొందుట అన్యాయం ఎలా ఔతుంది ? మనం చేసింది ధర్మయుద్ధమో అధర్మయుద్ధమో ఆ భగవంతుడికి తెలుసు. కనుక దక్షుడవై ఈ రాజ్యాన్ని పాలించు " అన్నాడు.ఎంత మంది ఏన్ని చెప్పినా ధర్మరాజులో చలనం లేదు. అప్పుడు భీముడు " అన్నయ్యా ! అన్నీ ధర్మములు తెలిసిన నీకు మేము చెప్పగలిగిన వాళ్ళమా ! కాని నా ఓర్పు నశించింది అందుకని తిరిగి తిరిగి చెప్పవలసి వచ్చింది. న్యాయ మార్గములో సంపాదించిన రాజ్యసంపదను విడుచుట పిరికితనం అనిపించుకుంటుంది. జనం మనలను చూసి పిరికివాళ్ళని చీదరించుకుంటారు. కపటజూదం కారణంగా ఎన్నో కష్టాలు పడ్డాము. అవమానాల పాలయ్యాము. కాని నీవు సత్యాన్ని నమ్ముకున్నావు. మేము నిన్ను అనుసరించాము. యుద్ధములో అనేక మంది శత్రువులను చంపాము. నీకు ఎనలేని కీర్తి లభించింది. రాజ్యలక్ష్మి లభించింది. అసలు మనకు యుద్ధం చేయ వలసిన అవసరం ఎందుకు వచ్చింది. కౌరవసభలో పడిన కష్టాలు, అడవులలో అనుభవించిన ఇడుములు, అజ్ఞాతవాసంల్లో అనుభవించిన వ్యధ వలన శ్రీకృష్ణుని నిర్ణయం మేరకు అతడి సహకారంతో యుద్ధం చేసాము. యుద్ధంల్లో కౌరవులో మనమో చావడం తప్పదని యుద్ధానికి ముందే నీకు తెలియదా ! ఇప్పుడు శత్రువులు చచ్చారని బాధపడటం ఎందుకు ? కనుక అన్నయ్యా ! వచ్చి రాజ్యభారం వహించు " అని భీముడు పలికాడు.


భీముడి మాటలు సావధానంగా విన్న ధర్మరాజు " మీరు కోరికలు, మదం, భయంతో సతమతమౌతూ ఈ రాజ్యాన్ని పాలించమని కోరుతున్నారు. కాని రాజ్యపాలన దుఃఖభూయిష్టం అని పెద్దలు అంటారు. రాజుకు నరకం తప్పదని ఆర్యోక్తి. రాజ్య పాలనలో సుఖం శాంతి ఎలా లభిస్తుంది. కామపరమైన భోగములు అనుభవించడంలో ఆనందం ఎక్కడ ఉంది. వాటిని విడిచిన పరమానందం పొందవచ్చు. అరణ్యములలో కందమూలములు తిని జీవిస్తున్న మునులు వెర్రివాళ్ళా ! దుర్మతులు విషయసంబంధ విషయములలో చిక్కుకుని నిరంతర దుఃఖములు పొందుతున్నారు. విజ్ఞులు కోరికలను జయించి ప్రశాంత చిత్తులై జీవిస్తున్నారు. ఈ విషయంలో జనక మహారాజు మాటలు మనకు తెలుసు కదా ! " కోరికలు లేని వాడికి సంపదలతో పని లేదు. మిధిలా నగరం కాలి పోతున్నా నేను ఏ వస్తువూ కాలనట్లే భావిస్తాను " అన్నాడు కదా ! ఆ జనకమహారాజును అందరూ గౌరవించ లేదా ! బాగా ఆలోచించే శక్తి ఉన్న మీరు అజ్ఞానులై శాంతి కాముకుడు నిందార్హుడని అనడం ధర్మమా ! సంసార సుఖాలకు దూరంగా ఉన్న సర్వసంఘ పరిత్యాగికి సంసారంలో పడి కొట్టుకుంటున్న వాళ్ళు పైనున్న వాడికి కొండ క్రింద ఉన్న వాడిలా కనిపిస్తాడు " అని అన్నాడు ధర్మరాజు.


ధర్మరాజు మాటలకు అర్జునుడు ఇలా బదులిచ్చాడు. " నీవు చెప్పిన జనక మహారాజుకు ఆయన భార్యకు జరిగిన సంవాదం విను. నీ వలెనే జనకుడు రాజ్యమును వదిలి బిక్షుక వృత్తి స్వీకరించ నిశ్చయించినపుడు ఆయన భార్య " నాధా ! నీవు రాజ్యపాలన వదిలి భిక్షుక వృత్తి స్వీకరించిన ఇక్కడ అతిథి సత్కారాలు, దేవతర్పణములు, పితృ తర్పణములు ఎవరు చేస్తారు ? శిరోముండనం చేయించుకున్న తరువాత భిక్షకొరకు ఇల్లిల్లు తిరగాలి కదా ! మరి ఆ గృహస్థు మీకు అన్నదానం చేసి పుణ్యం పొందుతాడు కదా ! అన్నదానం వలన అధిక పుణ్యం వస్తుంది కదా ! దానం తీసుకునే వాడి కంటే దానం చేసే వాడు గొప్పని నీకు తెలుసు కదా ! వేదవిదులు రాజుల మీద ఆధారపడతారు. రాజైన మీరే మీ కర్తవ్యం వదిలితే మిగిలిన వారికి దిక్కెవ్వరు ? వారి బ్రతుకులు చెడుపుట మీకు ధర్మమా ! కన్నతల్లినీ కట్టుకున్న దానిని వదిలి, మీ కర్తవ్యం అడవులలో మీరు ఏమిసాధిస్తారు ? ఎండకు చలివేంద్రంగా, చెట్టుకు మధుర ఫలములుగా ఉండి ప్రజల కష్టములు తీర్చవలసిన మీరు ఇలా దీన వృత్తిని స్వీకరించ తగునా ! మీరు చేయదలచిన పని ధర్మవిరుద్ధం. దాని వలన మీకు మోక్షం కలుగుతుందని నేను అనుకోను " అని జనకుని భార్య జనకునితో చెప్పింది.


అర్జునుడి మాటలు విన్న ధర్మరాజు " అర్జునా ! వేదాలు మానవులకు కర్మమార్గాన్ని నిర్ధేశించాయి. అదే వేదములు కర్మసన్యాస మార్గమును కూడా చెప్పి దాని వలన ఉత్తమగతులు కలుగుతాయని చెప్ప లేదా ! మానవుడు తన విజ్ఞతతో తనకు తగిన మార్గాన్ని ఎన్నుకోవాలి. ఉత్తమకార్యములు చేస్తే పరలోకప్రాప్తి కలుగుతుంది. నీవు చెప్పినది లోకథర్మం అది తప్పు కాదు. కాని విజ్ఞులు, వేదవిదులు లోకపూజ్యులు చేసేది తప్పని అనగలమా ! నీవు ఇంద్రుడి పుత్రుడవు, భీముడు వాయుపుత్రుడు మీరిరువురు దైవాంశ సంభూతులు అరివీర భయంకరులు. శ్రీకృష్ణుడు మనతో ఉండటం వలన ఆయన తేజస్సు కూడా మీకు సంక్రమించింది. కాని మీరిరువురు యుద్ధవిద్యా విశారదులు కాని ధర్మవేత్తలు తత్వవేత్తలు కారు కదా ! ఈ సంసారం సారహీనమైనదని తత్వవేత్తలు అంటారు. ఆశాపాశములు వదిలి కర్మలు చేయుట మాని నిర్మలమైన మనసు కలవాడు సుఖి. ఎప్పుడూ ధనం సంపదల కొరకు పాకులాడు వాడు ఎన్నడూ సుఖించలేడు. వేదవేదాంగములు చదివి తత్వజ్ఞానమును రుచి చూసి కూడా జ్ఞానం లేని వారు కర్మమార్గమే మంచిదని ప్రభోదిస్తూ కర్మలలో పడి కొట్టు మిట్టాడు తుంటారు కాని శాశ్వత సుఖమును పొందలేరు. జ్ఞానసముపార్జన చేసిన వారు శమము, దమము, త్యాగము శాశ్వతానందం కొరకు మూలములని చెప్తారు. వాటిని నా వంటి విచక్షణ కలవారు అంగీకరించి ఆచరిస్తారు " అని పలికాడు ధర్మరాజు.


అక్కడే ఉన్న దేవస్థుడు అనే ముని " ఓ ధర్మరాజా ! ఈ లోకములో సుఖంగా జీవించాలంటే అర్జునుడు చెప్పినట్లు సంపదలు, ధనమూ కావాలనడం సత్యం. యోగమార్గముకు చక్కని సోపానములు కలవు నీవు ఆ మార్గమున పయనించిన కాని మోక్షమును పొందలేవు. భోగములు అనుభవించడానికి మాత్రమే ధనార్జన చేయడం తప్పే కాని యజ్ఞ, యాగములు చేయుటకు దాన ధర్మములు చేయుటకు ధనార్జన చేయడం తప్పుకాదు. పైగా దాని వలన మోక్షం కలుగుతుంది. యజ్ఞయాగాదులకు వినియోగించడానికి సంపాదించిన ధనం మనస్తాపాన్ని పోగొడుతుంది. దాని వలన శమము, దమము కలుగుతాయి. కనుక ధనం సముపార్జించి యజ్ఞయాగములు, దానధర్మములు చేయుము. ధర్మరాజా ! శివుడు సర్వమేధము అనే యజ్ఞం చేసాడు. దిక్పాలకులు, బ్రహ్మ ఎన్నో యజ్ఞాలు చేసారు. మరుత్తులు ఎన్నో యజ్ఞములు చేసి ఖ్యాతి పొందారు. ఒక సారి ఇంద్రుని కోరిక పై బృహస్పతి " ఇంద్రా ! కామము క్రోధము మనసున చేర నీయక ఇంద్రియ నిగ్రహం పాటిస్తూ శోకమును దరి చేరనీయక తాను సుఖుడై ప్రజలను సుఖపెడుతూ రాజ్యపాలన చేసే వాడికి సర్వం వాటంతట అవి వచ్చిచేరతాయి. ధర్మజా ! కర్మలు చెయ్యడం కర్మలు వదలడం రెండూ మేలుకాదు. కర్మలు చేస్తూ దాని ఫలమును ఈశ్వరార్పణం చేయడం ఉత్తమమని పెద్దలు చెప్తారు. మంచి చెడ్డ పనులను సమానంగా చూస్తూ ఎవరికీ ద్రోహం తలపెట్టక క్షత్రియ ధర్మాన్ని పాటిస్తూ రాజ్య పాలన చెయ్యడం ఉత్తమం. నీకు పూర్వులైన రాజులందరూ ఇదే చేసారు. నీకు పూర్వులైన రాజులందరూ ఇదే ఉత్తమమార్గమని ఎంచి దానిని అనుసరించారు. తరువాత వారి కుమారులకు రాజ్యమును అప్ప చెప్పి వానప్రస్థాశ్రం స్వీకరించారు. నీవు కూడా అలాగే చెయ్యి " అని దేవస్థానుడు పలికాడు.


తరువాత అర్జునుడు ధర్మరాజుతో " అన్నయ్యా ! క్షత్రియ ధర్మం అనుసరించి యుద్ధం చేసావు. యుద్ధంలో చని పోయిన శత్రురాజులు ఉత్తమ గతిని పొందారు. రాజధర్మం రౌద్రమని బాలురకు తెలుసు. రాజ్యపాలనలో పాపాలకు తావు లేదు. రాజనేవాడు రాజ్య పాలన చేస్తూ పదిమందిని పోషించాలి గాని ఒకరు పెడితే తినడం ధర్మమా ! కురువంశ అగ్రగణ్యుడవు ఇది నీకు తగునా ! రాజుల మనసు వజ్రంలా కఠినంగా ఉండాలి కాని ఇలా బేలగా ఉండకూడదు. కనుక శోకం విడిచి రాజ్యభారం వహించు.

                     సశేషం 

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

ఎక్కువ ప్రమాదం

 🙏🕉️శ్రీ మాత్రేనమః. శుభోదయం🕉️🙏             ❤️బుసలు కొట్టే పాము కంటే ఇతరుల గురించి గుసగుసలాడే మనుషులతోనే ఎక్కువ ప్రమాదం...కాలం కలసి రాకపోతే అవసరం లేని విషయాలు కూడా మనం మాట పడాల్సి వస్తుంది.. ఈ రోజుల్లో మాట కన్నా మౌనమే మేలు❤️మనుషులు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికీ తెలియదు.. ఎప్పుడు దండలు వేస్తారో తెలియదు.. ఎప్పుడు నిందలు వేస్తారో తెలియదు.. అందుకే పొగడ్తలకు పొంగిపోకూడదు.. నిండాలకు కుంగిపోకూడదు..ఉప్పు లాగ కాటువుగా మాట్లాడేవాడే నీ మేలు కోరే మిత్రుడు.. అంతే తప్ప చెక్కర లాగ తీపి కబుర్లు చెప్పేవాడు కాదు.. ఎందుకంటే చెక్కరకు చీమలు పట్టని రోజు లేదు..అదే ఉప్పుకు పురుగు పట్టిన దాఖలాలు  లేవు❤️మీరు జీవితంలో ఏ స్థాయికి వెళ్ళాలానుకుంటున్నా అక్కడికి మిమ్మల్ని చేర్చగలిగేది మీరే తప్ప ఇంకెవ్వరూ కాదని గుర్తుంచుకొండి.. మీ జీవితానికి మీరే బాధ్యత తీసుకొండి.. భవిష్యత్తుపై అనవసర భయాందోళన విడి జీవితాన్ని మెరుగుపరుర్చు కోవడానికి నీ కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వార్తించండి... *విజయ రహస్యమంతా ముందు చూపు,ఓర్పు, సహనం లోనే దాగి ఉంది.. ఇవి రెండు లేనివారి కృషి ఫలప్రదం కాదు.. ఓరు, ముందు చూపు, సహనం ఉన్నవారికి అన్నింట్లోను విజయమే*  ❤️❤️ మీ *అల్లoరాజు భాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ & జనరల్ ఏజెన్సీస్ D.N.29-2-3 గోకవరం బస్ స్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజ ముండ్రి 9440893593 9182075510* 🙏🙏🙏

శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం*

 *శ్రీ ఆదిశంకరాచార్య విరచిత శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం*



హే స్వామినాథ కరుణాకర దీనబంధో,

శ్రీపార్వతీశముఖపంకజ పద్మబంధో |

శ్రీశాదిదేవగణపూజితపాదపద్మ,

వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 1 ||


దేవాదిదేవనుత దేవగణాధినాథ,

దేవేంద్రవంద్య మృదుపంకజమంజుపాద |

దేవర్షినారదమునీంద్రసుగీతకీర్తే,

వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 2 ||


నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్,

తస్మాత్ప్రదాన పరిపూరితభక్తకామ |

శృత్యాగమప్రణవవాచ్యనిజస్వరూప,

వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 3 ||


క్రౌంచాసురేంద్ర పరిఖండన శక్తిశూల,

పాశాదిశస్త్రపరిమండితదివ్యపాణే |

శ్రీకుండలీశ ధృతతుండ శిఖీంద్రవాహ,

వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 4 ||


దేవాదిదేవ రథమండల మధ్య వేద్య,

దేవేంద్ర పీఠనగరం దృఢచాపహస్తమ్ |

శూరం నిహత్య సురకోటిభిరీడ్యమాన,

వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 5 ||


హారాదిరత్నమణియుక్తకిరీటహార,

కేయూరకుండలలసత్కవచాభిరామ |

హే వీర తారక జయాౙ్మరబృందవంద్య,

వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 6 ||


పంచాక్షరాదిమనుమంత్రిత గాంగతోయైః,

పంచామృతైః ప్రముదితేంద్రముఖైర్మునీంద్రైః |

పట్టాభిషిక్త హరియుక్త పరాసనాథ,

వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 7 ||


శ్రీకార్తికేయ కరుణామృతపూర్ణదృష్ట్యా,

కామాదిరోగకలుషీకృతదుష్టచిత్తమ్ |

భక్త్వా తు మామవకళాధర కాంతికాంత్యా,

వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 8 ||


సుబ్రహ్మణ్య కరావలంబం పుణ్యం యే పఠంతి ద్విజోత్తమాః |

తే సర్వే ముక్తి మాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదతః |

సుబ్రహ్మణ్య కరావలంబమిదం ప్రాతరుత్థాయ యః పఠేత్ |

కోటిజన్మకృతం పాపం తత్‍క్షణాదేవ నశ్యతి ||

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

అనగనగా

 🔔 *అనగనగా...* 🔔


వెనక కోసల దేశంలో ముగ్గురు మిత్రులు ఉండేవారు. వారిలో ఇద్దరు నందుడు, సునందుడు అనేవారు ధనికులు. మూడో వాడు ఆనందుడు గర్భదరిద్రుడు. అతను తాళ్ళు పేనుకొని జీవించేవాడు. అతణ్ణి ఏ విధంగానైనా ధనికుణ్ణి చెయ్యాలని నందుడూ, సునందుడూ ఆలోచన చేశారు.


" పెట్టుబడికి కొంత ధనం ఉన్నట్టయితే ఎవరైనా ధనికుడు కావచ్చు. కనుక 

ఆనందుడికి కొంత మూల ధనం ఇద్దాం” అన్నాడు నందుడు.


"ఎంతమంది ధనికులు దరిద్రులై పోవటం లేదు ? కలిసివచ్చినట్టయితే పెద్ద పెట్టుబడి లేకుండానే ధనికుడైపోవచ్చు” అన్నాడు సునందుడు.


తన మాట నిజమని రుజువు చేయటాని కని నందుడు మర్నాడు ఆనందుడికి రెండు వందల మాడలిచ్చాడు. వాటితో ఏదైనా వ్యాపారం చేసుకొని ధనం సంపాదించమని చెప్పాడు. ఆనందుడు సంతోషించి, ఆ రెండువందల మాడలలో పది ఖర్చుకు గాను తీసి, మిగిలినవి తన తలపాగాలోనే భద్రంగా మూటకట్టి, ఇంటికి కావలిసిన వెచ్చాలు కొనటానికి బజారుకు బయలుదేరాడు. దురదృష్టవ శాత్తూ దారిలో ఒక పక్షి ఎటు నుంచో వచ్చి, ఆనందుడి తలపాగాలో మూట చూసి అందులో ఏదో ఉన్నదనుకొని మూటనూ తన్నుకుపోయింది. నూట  తొంభై మాడలూ రెక్కలు వచ్చి ఎగిరి పోయినందుకు ఆనందుడు చాలా విచారించాడు.


తరువాత కొద్ది రోజులకు నంద సునంద లు ఆనందుడి ఇంటికి వచ్చి, తమ స్నేహి తుడి పరిస్థితిలో మార్పు లేనందుకు కారణం అడిగారు.


" నా అదృష్టం బాగులేదు. డబ్బంతా తలపాగాలో చుట్టుకొన్నాను. కాని ఏదో

పక్షి వచ్చి తలపాగా తన్నుకుపోయింది” అన్నాడు ఆనందుడు విచారంగా.


ఈ వృత్తాంతం నందుడు నమ్మాడుగాని సునందుడు నమ్మలేదు. ఆనందుడు ఆ డబ్బును దుర్వినియోగపరిచి ఉంటాడని అనుకున్నాడు. నందుడు మాత్రం ఆనందుడికి మరొకసారి రెండువందల మాడలిచ్చి, "ఈసారి అయినా డబ్బు భద్రంగా ఉంచుకొని, దాని సహాయంతో ధనం సంపాదించు,” అని సలహా ఇచ్చాడు.


ఈసారి ఆనందుడు తనకు కావలసిన మాడలు తీసుకోని, మిగిలినవి తవుడు తట్ట అడుగున భద్రంగా దాచి, ఇంటికి కావలసిన సంచారాలు పట్టుకువద్దామని బజారుకు వెళ్ళాడు. అతను తిరిగి వచ్చే సరికి తవుడుతట్ట కనబడలేదు. భార్యనడిగాడు.


"ఉప్పు అమ్మకానికి వచ్చింది. దగ్గిర డబ్బులు లేవు. అందుకని తపుడు తట్ట అమ్మి రెండు శేర్లు ఉప్పు తీసుకున్నాను" అన్నది ఆనందుడి భార్య.


ఆనందుడికి పట్టరాని దుఃఖం కలిగింది. తనకు డబ్బు దక్కించుకొనే యోగం లేదని అతను తేల్చుకొన్నాడు.


మరి కొద్ది రోజులకు నందనునందులు మళ్ళీ వచ్చి జరిగిన సంగతి విన్నారు. ఆనందుడు ఎప్పటికన్న దరిద్రుడుగా 

కనిపించాడు. అతడు బట్టల చిరుగులు కూడా కుట్టుకొలేదు. కారణమేమంటే ఇంట్లో సూది కూడా లేదని చెప్పాడు.


అప్పుడే బజారులో సూదుల పొట్లం కొన్న సునందుడు ఆనందుడికి ఒక సూది ఇచ్చి " ఇది పెట్టి నీ భార్య చేత చిరుగులు కుట్టించుకో!” అన్నాడు. తరువాత నంద సునందులు వెళ్ళిపోయారు.


ఆ రోజు రాత్రే పక్క ఇంటి బెస్తవాడి భార్య అనందుడి భార్య వద్దకు వచ్చి, " అక్కా, మీ ఇంట్లో సూది ఉంటే కాస్త ఇస్తావా? రేపు ఉదయమే మావాళ్ళు వలలు పట్టుకొని చేపలు పట్టబోతున్నారు. వల బాగుచేసుకోవాలి. వలలో మొదట పడిన చేపలు మీకిస్తాంలే!” అన్నది.


ఆనందుడి భార్య ఆమెకు ఇంట్లో ఉన్న సూది అరువు ఇచ్చింది.


మర్నాడు సాయంకాలం చేపలతో తిరిగి వచ్చిన బెస్తవాడు తన కూతురి చేతికిచ్చి ఆనందుడి ఇంటికి పెద్ద చేపను పంపాడు. కూర వండుదామని ఆనందుడి భార్య ఆ చేపను కోసేసరికి అందులో పెద్ద గాజు ముద్దలాటిది దొరికింది. ఆ గాజు ముద్దతో ఆనందుడి పిల్లలు వీథిలో ఆడుతూండగా చూసిన నగల వర్తకుడు అనందుడి దగ్గిరికి వచ్చి, "ఆ గాజు ముక్క నాకు అమ్ముతావా, ఆనందయ్యా? నూరు మాడలిస్తాను !'' అని అడిగాడు.


అది చాలా విలువైన గాజు పెంకు అయి ఉండాలని అనుమానం కగిలి ఆనందుడు దానిని అమ్మడానికి నిరాకరించాడు. ఆ రోజే దానిని నగరానికి పట్టుకుపోయి రత్నాల వర్తకులకు చూపించాడు.

నిజానికి అదొక అమూల్యమైన వజ్రం.

దానిని పెద్ద వర్తకుడు ఇరవై వేల మాడ లిచ్చి కొనుక్కొన్నాడు. ఆ ధనంతో 

ఆనందుడు ఇళ్ళూ, దొడ్లూ కొన్నాడు. తాళ్ళు పేనటానికి కర్రలతో యంత్రాలు చేయించాడు, తాళ్ళ పరిశ్రమ ఏర్పాటు చేశాడు, ధనికుడైనాడు.


అనందుడు అకస్మాత్తుగా ధనికుడైన వార్త తెలియగానే అతని మిత్రులు నంద సునందులు అతనిని చూడవచ్చారు.


"నేనిచ్చిన డబ్బు పెట్టుబడి చేసే ధనికుడ వయావు. అవునా?” అన్నాడు నందుడు.


ఆనందుడు జరిగినదంతా పూసగుచ్చిన ట్టు మిత్రులకు చెప్పాడు.


"కలిసివచ్చేసరికి నేనిచ్చిన సూది తోనే ఆనందుడు ధనం సంపాదించాడు, చూశావా?” అన్నాడు సునందుడు.


ఈసారి నందుడికి నమ్మకం కలగలేదు. ఆనందుడు తన ధనంతోనే ధనికుడై, ఆ సంగతి కప్పిపుచ్చటానికి అబద్ధమాడు తున్నాడనుకొన్నాడు.


మిత్రులు ముగ్గురూ కలిసి ఆనందుడు కొత్తగా కట్టించిన ఇల్లూ, వెనక ఉన్న దొడ్డి చూడటానికి బయలుదేరారు. వారు దొడ్లోకి వెళ్లేసరికి ఆనందుడి పిల్లలు ఒక చెట్టు ఎక్కి దాని మీద ఉన్న పక్షిగూడును కింద పడేశారు. అందులో ఆనందుడి తలపాగా కనిపించింది. దాని చెంగున మూటకట్టి ఉన్న నూటతొంభై మాడలూ దొరికాయి.


వారక్కడి నుండి బయలుదేరి గొడ్లసావిడి కి వచ్చారు. అదే సమయంలో బజారు నుంచి నౌకరు ఒకడు తవుడుతట్ట కొని తెచ్చాడు. వాడు దానిలో నుంచి తవుడు తీసి కుడితిలో పోస్తూండగా బంగారు మాడలు కొన్ని వాడి చేతిలోకి వచ్చాయి. తట్ట బోర్లించి చూసేసరికి ఆనందుడు రెండవసారి పొగొట్టుకొన్న నూటతొంభై మాడలూ కూడా దొరికాయి!


ఇది చూడగానే నందుడికి ఆనందుడి మాటల్లో నమ్మకం కుదిరింది. సునందుడు చెప్పినట్టు కలిసివస్తే ఐశ్వర్యం రావటానికి  కుట్టుసూది అయినా చాలునని నందుడు గ్రహించాడు.


🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

సుబ్రహ్మణ్య #షష్టి

 🌿🌼🙏#డిసెంబర్ 7వ తేదీ #శనివారం మార్గశిర శుద్ధ షష్ఠి శ్రీ #సుబ్రహ్మణ్య #షష్టి🙏🌼🌿


🌿🌼🙏ప్రతి సంవత్సరం మార్గశిర మాసం శుక్లపక్ష షష్టినాడు శ్రీ సుబ్రహ్మణ్య షష్టి పర్వదినాన్ని జరుపుకోవడం ఆచారం. కృత్తిక నక్షత్రాన జన్మించినందువల్ల, కార్తికేయుడని, రెల్లుపొదలలో పుట్టినందువల్ల శరవణభవుడని, ఆరుముఖాలుండటం వల్ల షణ్ముఖుడని... ఇంకా స్కందుడని, సేనాని అని, సుబ్రహ్మణ్యేశ్వరుడనే నామాలతో కూడా ప్రసిద్ధుడు. శ్రీవల్లి, దేవసేన ఆయన భార్యలు. సుబ్రహ్మణ్యేశ్వరుని వాహనం నెమలి.ఆరుముఖాలతో, ఎనిమిది భుజాలతో, అపారమైన ఆయుధాలతో దర్శనమిచ్చే కార్తికేయుడు మార్గశిర శుద్ధషష్ఠినాడు మాత్రం సర్పరూపంలో దర్శనమిస్తాడు. ఆ రోజు ఆయనను సర్పరూపునిగా కొలవడం, షోడశోపచారాలతో పూజించి పుట్టలో పాలు పోయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతీతి.🙏🌼🌿


🌿🌼🙏జాతకంలో కాలసర్పదోషం ఉన్నవారు, కుజ,రాహు, కేతు దశలు నడుస్తున్నవారు,కుజ దోషం ఉన్నవారు,సంతానంలేని వారు,వివాహం కానివారు,దాంపత్య జీవితంలో ఇబ్బందులు ఉన్నవారు ఉపవాస వ్రతాన్ని పాటిస్తూ షోడశోపచారములతో అర్చించడంవల్ల సత్ఫలితాలు పొందుతారని సంతాన భాగ్యానికి నోచుకోని స్త్రీ, పురుషులు ఈ రోజున సర్పపూజలు చేసి,సంతానం కోసం, శత్రు విజయాల కోసం ఈ స్వామిని మార్గశిర శుద్ధ షష్ఠినాడు ప్రత్యేకంగా పూజిస్తుంటారు. సర్ప పూజలు ,తాంత్రిక పూజలు చేసే వారు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు పూజలు చేస్తే అపారమైన శక్తి సామార్ద్యాలు కలిగి ఉంటారు.🙏🌼🌿


🌿🌼🙏సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఉదయాన్నే స్నానం చేసి, ఏ ఆహారమూ తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మ ణ్యస్వామి ఆలయానికి వెళ్ళి పువ్వులు, పండ్లు, పడగల రూపాలలాంటివి అక్కడ సమర్పిస్తారు. బ్రహ్మచారియైన బ్రాహ్మణుడిని ఇంటికి పిలిచి సుబ్రహ్మణ్యస్వామి స్వరూపంగా భావించి భోజనం పెట్టి పంచెల జతను తాంబూలంతో ఉంచి ఇవ్వడం ఉత్తమం.తనను భక్తితో కొలిచిన వారికి నాయకత్వ సిద్ధి, విజయప్రాప్తి, వ్యాధినివారణ, సంతానలాభం, భూప్రాప్తి శీఘ్రంగా సిద్ధింపజేస్తాడు. "శరవణభవ" అనే ఆరు అక్షరాల నామమంత్రాన్ని పఠించడం, జపించడం కూడా మంచి ఫలితాలను ప్రసాదిస్తుంది.🙏🌼🌿


శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహనం షడాననం...

దారుణం రిపు రోగఘ్నం భావయే కుక్కుటధ్వజం

స్కంధం షణ్ముఖం దేవం శివతేజం ద్విషడ్భుజం...

కుమారం స్వామినాథం తం కార్తికేయం నమామ్యహం


🌿🌼🙏ఈ శ్లోకాన్ని ఎన్నిసార్లయినా మనస్ఫూర్తిగా పఠించితే శత్రు విజయం చేకూరుతుంది.🙏🌼🌿


ఓం శం శరవణభవ

శనివారం*🍁 🌹 *07, డిసెంబర్, 2024*🌹 *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

         🍁 *శనివారం*🍁

🌹 *07, డిసెంబర్, 2024*🌹

       *దృగ్గణిత పంచాంగం*                 


            *ఈనాటి పర్వం*

    🕉️ *సుబ్రహ్మణ్య షష్టి*🔱


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*దక్షిణాయణం - హేమంత ఋతౌః*

*మార్గశిర మాసం - శుక్లపక్షం*


*తిథి  : షష్ఠి* ఉ 11.05 వరకు ఉపరి *సప్తమి*

*వారం    : శనివారం* (స్ధిరవాసరే )

*నక్షత్రం  : ధనిష్ట* సా 04.50 వరకు ఉపరి *శతభిషం*


*యోగం  : వ్యాఘాత* ఉ 08.42 వరకు ఉపరి *హర్షణ*

*కరణం  : తైతుల* ఉ 11.05 *గరజి* రా 10.27 ఉపరి *వణజి*


*సాధారణ శుభ సమయాలు*

*ఉ 11.00 - 01.00  సా 05.00 - 06.00*

అమృత కాలం  : *ఉ 06.38 - 08.12*

అభిజిత్ కాలం  :  *ప 11.37 - 12.21*


*వర్జ్యం            : రా 11.48 - 01.21*

*దుర్ముహూర్తం :ఉ 06.24- 07.53*

*రాహు కాలం   : ఉ 09.11 - 10.35*

గుళికకాళం      : *ఉ 06.24 - 07.47*

యమగండం    : *మ 01.23 - 02.47*

సూర్యరాశి : *వృశ్చికం* 

చంద్రరాశి : *కుంభం*

సూర్యోదయం :*ఉ 06.24* 

సూర్యాస్తమయం :*సా 05.35*

*ప్రయాణశూల  : తూర్పు దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం   :  *ఉ 06.24 - 08.38*

సంగవ కాలం    :*08.38 - 10.52*

మధ్యాహ్న కాలం:*10.52 - 01.06*

అపరాహ్న కాలం : *మ 01.06 - 03.20*


*ఆబ్ధికం తిధి : మార్గశిర శుద్ధ సప్తమి*

సాయంకాలం  :  *సా 03.20 - 05.35*

ప్రదోష కాలం   :  *సా 05.35 - 08.08*

రాత్రి కాలం    :  *రా 08.08 - 11.34*

నిశీధి కాలం      :*రా 11.34 - 12.25*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.42 - 05.33*

________________________________

        🌷 *ప్రతినిత్యం*🌷

       *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


 *శ్రీ వేంకటేశ్వర కరావలంబ స్తోత్రం.....!!*


కామాది-వైరి-నివహోఽచ్యుత మే ప్రయాతః

దారిద్ర్యమప్యపగతం సకలం దయాళో 

దీనం చ మాం సమవలోక్య దయార్ద్ర దృష్ట్యా

శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబమ్


      🙏 *ఓం నమో వేంకటేశాయ*🙏

*************************

      🍁 *జై హనుమాన్*🍁

            

*తాల్చిన హారము నందున*

*రాల్చిన ప్రతి యణువునందు రాముని పేరే!*

 *పోల్చగ సాటియె లేనిది*

*చీల్చగ గుండెను* *హనుమకుఁ, శ్రీ కర ముఖమే!*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

వేద ఆశీర్వచనం.

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం  - హెమంత ఋతువు - మార్గశిర మాసం - శుక్ల పక్షం  - షష్ఠి   - ధనిష్ట -‌‌ స్థిర వాసరే* (07.12.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*