30, మార్చి 2025, ఆదివారం

శ్రీవిశ్వావసు నామ సంవత్సరం విశేషాలు*

 *శ్రీవిశ్వావసు నామ సంవత్సరం విశేషాలు*


నూతన తెలుగు సంవత్సరం శ్రీవిశ్వావసు నామ సంవత్సరం నేడు మార్చి 30 ఆదివారం ప్రారంభ మైంది.

 

ఇది కలియుగం 5,127 సంవత్సరం, 28 మహాయుగం, ఏడవ మన్వతరం , బ్రహ్మ 51 సంవత్సరం లోని మొదటి రోజు. ఇప్పటికి ఈ సృష్టి జరిగి 216 కోట్ల సంవత్సరాల పైనే అయ్యింది.


 హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి సంవత్సరానికి ఒక పేరు ఉంటుంది. ఈ సంవత్సరాల పేర్లు 60 సంవత్సరాల కాల చక్రాన్ని అనుసరించి మళ్ళీ మళ్ళీ వస్తాయి.

బ్రహ్మకల్పం ప్రారంభ మైన మొదటి ఉగాది ప్రభవ.


*హిందువుల సంవత్సరాలు ఎలా పుట్టాయి?*

 

*పేర్ల వెనుక వున్న పురాణ కథనం*


తెలుగు సంవ‌త్సరాలను గురించి పురాణాల్లో ఒక కథ ఉంది. బ్రహ్మ మానసపుత్రుడు నారదమహాముని ఓ సారి విష్ణుమాయ వల్ల స్త్రీగా మారి ఒక రాజును పెళ్లాడాడు. ఈ దంపతులకు 60 మంది సంతానం జన్మించారు. ఆ రాజు తన సంతానంతో కలిసి ఓ యుద్ధంలో పాల్గొంటే.హ, అప్పుడు ఆ 60 మందీ యుద్ధంలో మరణిస్తారు. తన పిల్లల మరణాన్ని తట్టుకోలేని స్త్రీ రూపంలో ఉన్న నారదుడు విష్ణువును ప్రార్థించగా, విష్ణువు కరుణించి, నీ పిల్లలు 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతుంటారు అని వరశమిచ్చాడట. అవే మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి.

 

*ఆధ్యాత్మిక సంబంధ కథనం*


మనం సౌరమానంలో జీవిస్తున్నాం. ఏదైనా బిందువు దగ్గర నుంచి చుట్టు తిరిగితే 360 డిగ్రీలు పూర్తి అవుతుంది. కేంద్రం నుంచి గమనిస్తే ముందు 180 డిగ్రీలు, వెనక 180 డిగ్రీలూ అన్నమాట. వెనుక వున్న గతం 180 డిగ్రీలూ గతం. నిలబడిన రేఖ వర్తమానం. ముందున్నవి భవిష్య సూచకాలు. కృత, త్రేతా, ద్వాపర యుగాల కంటే కలియుగంలో మానవుల ఆయుర్దాయం పడిపోయి కేవలం 120 సంవత్సరాలకు వచ్చిందట. అందుకే 60 ఏళ్ళు పూర్తవగానే సగం జీవితం పూర్తయ్యిం దని గుర్తు చేస్తూ లోక సంబంధ విషయాలు పూర్తి చేసుకొమ్మని, షష్టిపూర్తి ఉత్సవం చేస్తారు. అంటే మిగిలిన 60 ఏళ్లు తరువాతి తరాలకు మార్గదర్శనం చేస్తూ ఆధ్యాత్మికచింతనలో బ్రతకాలని చెప్పకనే చెప్తున్నా రన్నమాట.


2025 విశ్వావసు నామ సంవత్సరం. హిందూ సంవత్సరాలలో ఇది 39 ది. 


*విశ్వావసు ఎవరు?*

 విశ్వావసు 6000 గంధర్వులలో ఒక డు. గంధర్వులు మంచి గాయకులు, నృత్యకారులు, సంగీతకారులు, సుందరులు. అప్సరసలతో సహజీవనం చేస్తూ ఉంటారు. విశ్వావసు తన తపస్సుతో బ్రహ్మ దేవుని నుంచి అమరత్వం సిద్ధింప చేసుకున్నాడు. ఆ తరువాత అహంకారంతో ఇంద్రుని మీద దాడి చేసి, ఇంద్రుని క్రోధానికి గురి యైనాడు. ఇంద్రుడు తన వజ్రాయుధంతో విశ్వాసుని చేతులను, తొడలను శరీరంలో కోసివేశాడు. దానితో విశ్వాసుడు చేతులు, తొడలు లేని వికృత రూపం పొందాడు. తన తప్పు తెలుసుకున్న విశ్వాసుడు ఇంద్రుణ్ని వేడుకున్నాడు. ఇంద్రుడు కరుణించి, అతనికి రెండు పొడవైన చేతులతో పాటు, పొట్టలోనే భుజించేందుకు వీలుగా ఒక నోటిని ఇచ్చాడు. అలా విశ్వాసుడు కబంధుడై అరణ్యంలో జీవించాడు. అతను భయంకరమైన ఈ రూపం ధరించి వనాలలో ఉండే మునులను భయపెడుతూ వచ్చాడు. ఇలా చేస్తూండగా ఒకసారి స్థూలశిరు డనే మహాముని తటస్థపడి, ” నీకీ రూపమే శాశ్వతంగా ఉండిపోవు గాక !” అని శపించాడు. అప్పుడు కబంధుడు మునికి క్షమాపణ చెప్పుకుని, శాప విముక్తి ఎలాగని అడిగాడు. “ఎప్పుడు రాముడు అడవికి వచ్చి, నీ చేతులు నరికి నీకు దహనక్రియలు చేస్తాడో అప్పుడు నీకు యథారూపం వస్తుంది” అని ముని చెప్పి వెళ్లిపోయాడు.


*విశ్వావసుడి శాప విమోచనం*


శ్రీరాముడు, లక్ష్మణుడు సీతను వెదకుతూ అరణ్యంలో సంచరిస్తూ ఉండగా, విచిత్రరూపంలో ఉన్న ఓ రాక్షసుడు రామలక్ష్మణులకు ఎదు రయ్యాడు. అతనికి తల, మెడ, కాళ్లు లేవు. ఉదరం అంటే కడుపు భాగంలో మాత్రం ఓ పెద్ద నోరుంది. ఊరువుల ప్రదేశంలో రెండు ఉగ్రనేత్రా లున్నాయి. అతని బాహువులు మాత్రం ఎనిమిది యోజనాల వరకు విస్తరించి ఉన్నాయి. అటువంటి రాక్షసుడు ఒక్కసారిగా రామలక్ష్మణులను తన హస్తాలతో బంధించి గుప్పిట్లో బిగించాడు. దీనికే “కబంధహస్తం” అనే నానుడి ఉన్నది. భయకర మైన నోటిని తెరిచి వారిని ఆరగించబోతుండగా రాముడు కుడి చేతిని, లక్ష్మణుడు ఎడం చేతిని నరికివేయడంతో ఆ రాక్షసుడు నేలకు ఒరిగాడు. తనను గాయపరిచింది రాముడు అని తెలుసుకుని కబంధుడు ఎంతో సంతోషించాడు. కబంధుడు తన వృత్తాంతం తెలిపి తనకు అంత్యక్రియలు నిర్వహించమని శ్రీరాముడిని కోరగా, రాముడి అతని కోరిక మేరకు అలానే చేస్తాడు. కబంధుడు తన పూర్వగంధర్వ రూపాన్ని సంతరించు కుంటాడు. ఆ విశ్వావసు నామమే హిందూ సంవత్సరాలలో ఒకటి.

శాస్త్రాల ప్రకారం, ‘‘ఉగ’’ అంటే నక్షత్ర గమనం లేదా జన్మ, ఆయుష్ అనే అర్థాలు కూడా ఉన్నాయి. వీటికి ఆది ఉగాది అని అర్థం. అంటే విశ్వం లోని జీవకోటి రాశుల ఆయుష్షుకు తొలి రోజు ఉగాది. ఇంకో కథనం ప్రకారం, ‘యుగం’ అంటే రెండు లేదా జంట అని అర్థం. ఉత్తరాయణ, దక్షిణాయనాల మధ్య సంయుతం యుగం (ఏడాది) కాగా, ఈ యుగానికి ఆది ఉగాది అవుతుం దని పండితులు చెబుతున్నారు. అంతేకాదు, ఉగాది నుంచే వసంత బుుతువు ప్రారంభ మవుతుంది.   


పురాణాల ప్రకారం, చైత్ర మాసం శుక్ల పక్షం శుద్ధ పాడ్యమి తిథి నాడు అంటే ఉగాది రోజున సృష్టి ప్రారంభ మైనట్లు పండితులు చెబుతారు. వేదాలను తస్కరించిన సోమకుడిని హతమార్చి మత్స్యావతారంలో ఉండే విష్ణువు వేదాలను బ్రహ్మ దేవుడికి అప్పగించిన శుభతరుణ పురస్కారంగా విష్ణువు ప్రీత్యర్థం ‘‘ఉగాది’’ఆచరణ లోకి వచ్చిం దని చాలా మంది నమ్ముతారు. ఛైత్ర శుక్ల పాడ్యమి తిథి నాడే ఈ విశాల ప్రపంచాన్ని బ్రహ్మదేవుడు సృష్టించి నట్లు పండితులు చెబుతారు. అందుకే సృష్టి ఆరంభానికి సంకేతంగా ఉగాది పండుగను జరుపుకుంటారు.


ఉగాది పండుగ వేళ శిశిర బుుతువుకు వీడ్కోలు పలికి, వసంత బుుతువుకు స్వాగతం పలుకుతాం. ఈ సమయంలోనే చెట్లు చిగురించడం ప్రారంభ మవుతుంది. కోయిల రాగాలు వినిపిస్తాయి. తెలుగు వారి నూతన సంవత్సరం కూడా ఉగాది నుంచే ప్రారంభ మవుతుంది. అందుకే దీన్ని తెలుగు వారి తొలి పండుగ అంటారు. 


ఈ పవిత్ర మైన రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఉదయాన్నే తలస్నానం చేసి, ఇంటిని మామిడాకులతో అలంకరించి, కొత్త బట్టలు ధరించి, ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు.

 

 ఉగాది అంటే అందరికీ టక్కున గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఆరు రుచుల కలయికతో ఉండే ఈ పచ్చడి తెలుగు వారందరికీ ఎంతో ప్రత్యేకం. తీపి, కారం, పులుపు, వగరు, చేదు, ఉప్పు అనే షడ్రుచుల కలయిక జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలు, మంచి చెడుల గురించి వివరిస్తుంది. ఈ పచ్చడిలో ఉప్పు, మిరియాల పొడి, మామిడికాయలు, వేపపువ్వు, చింతపండు, బెల్లం తప్పనిసరిగా వాడతారు. అదే విధంగా ఉగాది రోజునే పంచాంగ శ్రవణం, గోపూజ, ఏరువాక ఆచారాలను పాటిస్తారు.

          🙏🙏🙏🙏

*సంక్షిప్త దివ్య రామాయణ పారాయణం*

 *9 రోజులపాటు ప్రతిరోజూ*


*సంక్షిప్త దివ్య రామాయణ పారాయణం*


*1 వ  రోజు*


గురుర్ బ్రహ్మ గురుర్విష్ణు


గురుదేవో మహేశ్వరః


గురు సాక్షాత్ పర బ్రహ్మ


తస్మై శ్రీ గురవే నమః


***


శ్రీరాఘ‌వం ద‌శ‌ర‌థాత్మ‌జ మ‌ప్ర‌మేయం


సీతాప‌తిం ర‌ఘుకులాన్వ‌య ర‌త్న‌దీపం


ఆజానుభాహుం అర‌వింద ద‌ళాయ‌తాక్షం


రామం నిశాచ‌ర వినాశ‌క‌రం న‌మామి.


****


శ్రీ‌మ‌ద్ రామాయ‌ణం ఆదికావ్యం.  వాల్మీకి మ‌హ‌ర్షి, బ్ర‌హ్మ అనుగ్ర‌హంతో మాన‌వాళిని త‌రింప‌చేయ‌డానికి ఈ మ‌హాకావ్యాన్ని మ‌న‌కు అందించారు.


వాల్మీకి మ‌హ‌ర్షి ఒక‌రోజు త‌మ‌సా న‌దికి స్నానాకి వెళ్ళాడు. అక్క‌డ ఎదురుగా ఉన్న ఒక చెట్టు కొమ్మ‌మీద క్రీడిస్తూ ఆనంద‌సాగ‌రంలో ఉన్న ఒక ప‌క్షుల జంట‌లోని మ‌గ‌ప‌క్షిపై కిరాతుడు ఒక‌డు బాణం వేశాడు. అది విల‌విలకొట్టుకుంటూ నేల‌రాలింది. ఆ బాణం దెబ్బ‌తో ఆ మ‌గ‌ప‌క్షి ప్రాణాలు విడిచింది. ఆ మ‌గ‌ప‌క్షి చుట్టూ తిరుగుతూ  ఆడ‌ప‌క్షి విల‌పిస్తుండ‌డం చూసిన వాల్మీకి మ‌హ‌ర్షి మ‌న‌సు ద్ర‌వించింది.


ఆయ‌న హృద‌య లోని  శోకం,  శ్లోకంగా మారింది.


మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమః శాశ్వతీః సమాః|


యత్ క్రౌంచమిథునాదేకమ్ అవధీః కామమోహితమ్| |


ఓ కిరాతుడా! క్రౌంచ పక్షులజంటలో కామ పరవశమైయున్న ఒక (మగ) పక్షిని చంపావు. అందువలన నీవు ఎక్కువకాలము జీవించియుండవు. (శాశ్వతముగా అపకీర్తి పాలగుదువు) అని ఆ కిరాతుడిని, మహర్షి శ‌పించాడు .


అదే క్ష‌ణంలో బ్ర‌హ్మ ప్ర‌త్య‌క్ష‌మై నీ నోట స‌ర‌స్వ‌తి ప‌లికింది. క‌విత్వం జాలువారింది. నువ్వు రామాయ‌ణ మ‌హాకావ్యాన్ని ర‌చించి మాన‌వాళిని త‌రింప‌చేయి . అది భూలోకంలో శాశ్వ‌తంగా ఉంటుంది.,అని  సూచించి అక్క‌డినుంచి వెళ్లిపోయాడు.


*బాల‌కాండ*

కోసలదేశానికి రాజధాని అయోధ్య. శత్రువులు జయించడానికి వీలులేనిది కనుక దీనికి అయోధ్య అని పేరు. ఈ రాజ్యానికి అధిపతి దశరథుడు. ప్రజలను కన్నబిడ్డల వలె పాలిస్తున్నాడు, ధర్మాత్ముడు. దశరథుడికి ముగ్గురు భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయి. తనకు సంతానం లేకపోవడంతో దశరథుడు పుత్రకామేష్టి యాగాన్ని తలపెట్టాడు. యాగం పరిసమాప్తమైన వెంటనే యాగ జ్వాలలనుంచి ఒక మహాపురుషుడు పాయసంతో కూడిన బంగార కలశంతో ప్రత్యక్షమై దానిని దశరథుడికి యాగఫలంగా అందించాడు. ‘ఇందులోని పాయసాన్ని నీ రాణులకు ఇవ్వు , వారి యందు నీకు సంతానం కలుగుతుంది’ అని దీవించి ఆ మహాపురుషుడు అదృశ్యమయ్యాడు. దశరథుడు పరమానందంతో ఆ పాయసంలో సగభాగాన్ని కౌసల్యకు ఇచ్చాడు. మిగిలిన సగభాగంలో సగం సుమిత్రకు ఇచ్చాడు.మిగిలిన నాలుగవ వంతులో సగభాగం కైకేయికి ఇచ్చాడు. ఇంకా మిగిలిఉన్న ఎనిమిదవ భాగాన్ని మళ్లీ సుమిత్రకు ఇచ్చాడు. వారు దానిని దివ్య ప్రసాదంగా స్వీకరించారు.

*శ్రీరామ జననం*.....

ఆ తర్వాత సంవత్సరానికి చైత్రశుద్ధ నవమినాడు పునర్వుసు నక్షత్రంలో కౌసల్యాదేవి సర్వలక్షణ సంపన్నుడైన, తేజోవిరాజమూర్తి అయిన శ్రీరాముడిని ప్రసవించింది.

వెడ ద కన్నుల వాడు,                                                                           విపులాంసముల  వాడు,                                                                                   రాకేందు బింబ వక్త్రంబు వాడు,                                                                               కంబు కంఠంబు వాడు,                                                                                           ఘన లలాటము వాడు ,                                                                                  రమణీయ మృదు కపోలముల వాడు                                                                                  పీన వక్షమువాడు , పృథు నితంబము వాడు,                                                                             సముదగ్ర చారు మస్తకము వాడు,                                                                           దివ్యదేహమువాడు, దీర్ఘబాహులవాడు,                                                              కమనీయ శుభలక్షణముల వాడు,                                                                             నీలమేఘశ్యాముడు సర్వలక్షణ సుశోభితుడు                                                                  లోక రక్షకుడు శ్రీరామచంద్ర మూర్తి జన్మించారు.                                                          సత్య పరాక్రముడైన భరతుని, కైకేయీదేవి ప్రసవించింది.                                               సకల శాస్త్ర పారంగతులైన లక్ష్మణ, శత్రుఘ్నులను సుమిత్రాదేవి ప్రసవించింది.                           లోకం పులకించి పోయింది.

*విశ్వామిత్రుడి* *ఆగమనం*.....

అయోధ్యాన‌గ‌రంలో శ్రీ రామ ల‌క్ష్మ‌ణ భ‌ర‌త శ‌త్రుఘ్నులు ధ‌నుర్ విద్య‌లో ప్రావీణ్యం సంపాదిస్తున్నారు.మ‌హ‌ర్షుల యాగాల‌కు ఆటంకం క‌లిగిస్తున్న రాక్ష‌సుల‌ను అంతం చేయ‌డానికి ద‌శ‌ర‌థ‌మ‌హారాజు సాయం కోరి విశ్వామిత్రుడు అయోధ్యా న‌గ‌రానికి విచ్చేశాడు. రాజ‌మందిర ద్వారం వ‌ద్ద నిల‌బ‌డి త‌న రాక‌ను ద‌శ‌ర‌థ మ‌హారాజుకు తెలియ‌జేయ‌మ‌న్నాడు. విష‌యం తెలిసిన వెంట‌నే, ద‌శ‌ర‌థుడు స‌క‌ల మ‌ర్యాద‌ల‌తో విశ్వామిత్ర మ‌హ‌ర్షికి సాద‌ర స్వాగ‌తం ప‌లికాడు. ఏం కావాల‌న్నా ఇస్తాన‌న్నాడు. విశ్వామిత్రుడు తాను వ‌చ్చిన ప‌నిని వివ‌రించాడు. మారీచ సుబాహువుల‌నే రాక్ష‌సులు తమ య‌జ్ఞ‌యాగాల‌కు ఆటంకం క‌లిగిస్తున్నారని చెప్పాడు.  రాక్షసులను  శ‌పించ‌వ‌చ్చు కానీ, యజ్ఞ క్ర‌తువులో నిమ‌గ్న‌మైన‌పుడు కోపం ద‌రిచేర‌కూడ‌దు కనుక రాక్షసులను శ‌పించ‌డం లేదని చెప్పాడు.  ఇలాంటి ప‌రిస్థితుల‌లో యాగ‌ రక్ష‌ణ జ‌ర‌గాలంటే శ్రీ‌రాముడిని త‌న వెంట పంపాల‌ని విశ్వామిత్రుడు ద‌శ‌ర‌థ మ‌హారాజు ను కోరాడు. ఈ మాట వింటూనే ద‌శ‌ర‌థుడికి దిక్కుతోచ‌లేదు. లేక లేక క‌లిగిన సంతానాన్ని ఇలా రాక్ష‌స సంహారం కోసం పంప‌డ‌మా? అని బాధ‌ప‌డ్డాడు. రాముడి  బ‌దులు తాను వ‌స్తాన‌న్నాడు.

ఏం కోరినా ఇస్తాన‌ని చెప్పి, ఇప్పుడు మాట త‌ప్పుతావా? ఇది రాజ‌ధ‌ర్మ‌మా? అని విశ్వామిత్రుడు ద‌శ‌ర‌ధుడిని సూటిగా ప్ర‌శ్నించాడు . వ‌శిష్ఠుల వారు గమనించారు. లోక కల్యాణం కోసమే ఇదంతా జరుగుతున్నదని, విశ్వామిత్రుడి వెంట రాముడిని పంపడం వల్ల రాముడి కీర్తి ,యశస్సు పెరుగుతాయని దశరథుడికి సూచించాడు.వశిష్టులవారి  సూచ‌న మేర‌కు ఎట్టకేలకు విశ్వామిత్రుడి వెంట రామ‌ల‌క్ష్మ‌ణుల‌ను పంప‌డానికి దశరథుడు నిర్ణ‌యించాడు. అలా విశ్వామిత్రుడి వెంట రామ‌ల‌క్ష్మ‌ణులు అయోధ్య దాటి,   అరణ్య మార్గంలో ముందుకు సాగుతున్నారు.  అలా త‌న‌ను అనుస‌రిస్తున్న రామ‌ల‌క్ష్మ‌ణుల‌కు   స‌రయూ న‌దీతీరంలో - ఆక‌లి, ద‌ప్పిక‌లు లేకుండా బ‌ల , అతి బ‌ల అనే విద్య‌ల‌ను విశ్వామిత్రుడు వారికి అనుగ్ర‌హించాడు. దీనివ‌ల్ల వారికి ఎన్న‌టికీ ఆక‌లి , ద‌ప్పిక‌లు ఉండ‌వు.  ఆ రాత్రి వారు అక్క‌డే విశ్ర‌మించారు. మ‌రునాడు ఉద‌యం తెల తెల వారుతుండ‌గా ....


కౌసల్యా సుప్రజా రామ                                                                                       పూర్వాసంధ్యా ప్రవర్తతే ।

ఉత్తిష్ఠ నరశార్దూల                                                                                                 కర్తవ్యం దైవమాహ్నికం ॥

కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా! తూర్పు తెల్లవారుతోంది, దైవ సంబంధాలైన కార్య‌క్ర‌మాలు  చేయవలసి ఉంది. క‌నుక లెమ్ము, అంటూ ఆ శ్రీ‌రామ చంద్ర‌మూర్తిని, విశ్వామిత్ర మ‌హ‌ర్షి మేల్కొలిపాడు.

మ‌హ‌ర్షి మేల్కొలుపుతో లేచి, సంధ్యావంద‌నాది కార్య‌క్ర‌మాలు ముగించుకుని వారు అక్క‌డి నుంచి బ‌య‌లుదేరారు. అలా న‌డుచుకుంటూ వారు మ‌హార‌ణ్యంలో ఒక జ‌న‌ప‌దం చేరారు. అక్క‌డ తాట‌క అనే రాక్ష‌సి ఉంటున్న‌ది. దాని గురించి రాముడికి తెలిపాడు మ‌హ‌ర్షి. అగ‌స్త్యుని ఆశ్ర‌మ ప్రాంతాన్ని ధ్వంసం చేస్తూ , జ‌నాన్ని తింటూ ఇది బ‌తుకుతున్న‌ద‌ని రాముడికి వివ‌రించాడు. దీనికి వెయ్యి ఏనుగుల బ‌లం ఉంటుంద‌ని చెప్పాడు. తాట‌క స్త్రీ క‌దా దానిని చంప‌డం ఎలా అని సంకోచించ‌కుండా , దుష్ట శ‌క్తిని సంహ‌రించ‌మ‌ని  విశ్వామిత్రుడు, రాముడికి సూచించాడు.

*తాటక వధ:*

రాముడు ధ‌నుష్ఠంకారం చేశాడు. ఆశ‌బ్దానికి తాట‌కి ఉగ్రురూపిణి అయి శ‌బ్దం వ‌చ్చిన దిక్కుగా వ‌చ్చింది. రాముడు దాని చేతులు ఖండించాడు. సాయంత్రం అయితే దాని బ‌లం ఇంకా పెరుగుతుంది క‌నుక వెంట‌నే దానిని సంహ‌రించ‌మ‌న్నాడు విశ్వామిత్రుడు. రాముడు తాట‌కిని సంహ‌రించాడు. వెంట‌నే విశ్వామిత్రుడు రాముడికి దివ్యాస్త్రాలు అనుగ్ర‌హించాడు.  దండ‌చ‌క్ర‌, ధ‌ర్మ‌చ‌క్ర‌, కాల‌చ‌క్ర‌, విష్ణు చ‌క్ర‌,బ్ర‌హ్మాస్త్ర‌, కాల‌పాశ‌,ధ‌ర్మ‌పాశ‌, వ‌రుణ‌పాశ‌, ఆగ్నేయాస్త్రం, వాయ‌వ్యాస్త్రం ఇలా స‌మ‌స్త్ర అస్త్రాల‌నూ అనుగ్ర‌హించాడు.  తాట‌కి వ‌ధ‌తో లోకం లో పుష్ప వ‌ర్షం కురిసింది. అక్క‌డి నుంచి విశ్వామిత్ర మ‌హ‌ర్షి తాము యాగం చేస్తున్న సిద్ధాశ్ర‌మానికి  వారంతా చేరుకున్నారు.

*మారీచ,సుబాహువుల వధ*:

విశ్వామిత్ర మ‌హ‌ర్షి యాగం మొద‌లు పెట్టారు. అంతే రాక్ష‌సులైన మారీచ సుబాహువుల అనుచ‌ర‌గ‌ణం అక్క‌డ‌కు చేరుకుని యాగానికి ఆటంకం కలిగిస్తోంది. రాముడు బాణాల వ‌ర్షం కురిపించి వారిని హ‌త‌మార్చాడు. తాట‌క కొడుకు మారీచుడిపై బాణం సంధించాడు. వాడు వంద‌యోజ‌నాల దూరంలో స‌ముద్రంలో పోయి ప‌డ్డాడు.

ఇక రాక్షసులు ఎవ‌రూ అటువైపు క‌న్నెత్తి చూడ‌లేదు. యాగం నిర్విఘ్నంగా సాగిపోయింది.

ఆ త‌ర్వాత వారు అక్క‌డ నుంచి మిథిలా న‌గ‌రానికి బ‌య‌లుదేరారు. మార్గ‌మ‌ధ్యంలో వారు గౌత‌మ మ‌హ‌ర్షి ఆశ్ర‌మం చేరుకున్నారు. అక్క‌డ అహ‌ల్య శాప గాథ‌ను విశ్వామిత్రుడు రాముడికి తెలిపాడు. నీ పాద స్ప‌ర్శ‌తో ఆమెకు  పూర్వ రూపం వ‌స్తుంద‌న్నాడు.  రాముడి దృష్టి ప‌డ‌గానే అహ‌ల్య పూర్వ రూపంతో లేచి నిల‌బ‌డింది. రామ‌ల‌క్ష్మ‌ణులు ఆ సాధ్వీమ‌త‌ల్లికి న‌మ‌స్క‌రించి ముందుకు సాగారు.

*సీతా స్వయంవరం:*

మిథిలా న‌గ‌రంలో సీతా స్వ‌యంవ‌రం వార్త తెలుసుకుని విశ్వామిత్ర మ‌హ‌ర్షి, రామ‌ల‌క్ష్మ‌ణుల‌ను మిథిల‌కు తీసుకువెళ్లాడు. శివ‌ధ‌న‌స్సును విరిచి సీతమ్మ‌త‌ల్లిని స్వ‌యంవ‌రంలో రామ‌చంద్ర‌మూర్తి ద‌క్కించుకున్నాడు. అయోధ్యలో ఉన్న ద‌శ‌ర‌థుడికి క‌బురుపంపి సీతారామ క‌ల్యాణానికి ఏర్పాట్లు చేశారు.  ల‌క్ష్మ‌ణ భ‌ర‌త‌శ‌త్రుఘ్నుల‌కూ వివాహాలు జ‌రిపించారు.            ద‌శ‌ర‌థుడు కొడుకులు, కోడ‌ళ్ల‌తో అయోధ్య‌కు బ‌య‌లుదేరాడు. మార్గ మ‌ధ్యంలో ప‌ర‌శురాముడు ఎదురై, శివ‌ధ‌నుస్సు విరిచినందుకు రాముడిపై ఆగ్ర‌హించాడు.  నూత‌న వ‌ధూవ‌రుల‌పై ఆగ్ర‌హం త‌గ‌ద‌ని ద‌శ‌ర‌ధుడు ప‌ర‌శురాముడిని వేడుకున్నాడు. అయినా కుద‌ర‌ద‌న్నాడు పరశురాముడు . త‌న ద‌గ్గ‌ర  ధ‌నుస్సు తీసుకుని బాణం ఎక్కుపెట్ట‌మ‌ని రాముడికి సవాలు విసిరాడు. రాముడు బాణం సంధించి వ‌దిలాడు.  అది దూసుకువస్తుండడంతో పరశురాముడు హడలిపోయాడు. వ‌దిలిన బాణం ల‌క్ష్యాన్ని ఛేధించ‌క త‌ప్ప‌దు. నీ న‌డ‌క‌ను నిరోధించ‌నా  లేక నీవు త‌ప‌స్సుతో ఆర్జించిన పుణ్య‌లోకాల‌ను  వ‌దిలించ‌నా అని పరశురాముడిని, శ్రీరాముడు అడిగాడు. పరశురాముడు తన ఎదురుగా ఉన్నది శ్రీమహావిష్ణువని గ్రహించాడు. పుణ్య‌లోకాల‌ను వ‌దిలిస్తే మ‌ళ్లీ త‌ప‌స్సు చేసి సాధించుకుంటాన‌ని  చెప్పి పరశురాముడు పుణ్య‌లోకాల‌ను వ‌దులుకున్నాడు . రాముడి శ‌క్తి సామ‌ర్ధ్యాల‌ను కీర్తించి ప‌ర‌శురాముడు అక్క‌డి నుంచి వెళ్లిపోయాడు.


ఇక అక్క‌డ నుంచి ర‌థాలు అయోధ్య దిశ‌గా క‌దిలాయి........

*****

యావత్ స్థాయన్తి గిరయ: సరితశ్చ మహీతలే

తావ ద్రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి

ఈ ప్రపంచంలో గిరులు  ,నదులు   ఉన్నంత కాలం రామాయణ కథ లోకంలో నిలిచి ఉంటుందని కవియైన వాల్మీకితో , బ్రహ్మదేవుడు అంటాడు.


శ్రీమద్రామాయణం లోని ప్రతి అక్షరం మోక్ష ప్రదమే ,పాపనాశమే.

ఇదం పవిత్రం పాపఘ్నం , పుణ్యం వేదైశ్చ సమ్మితమ్

య:పఠే ద్రామచరితం సర్వపాపై:ప్రముచ్యతే

రామకథ పవిత్రమైనది. పాపములను హరిస్తుంది. పుణ్యమైనది. వేదములతో సమానమైనది.

రామకథను పఠించువారు సర్వపాపాలనుంచి విముక్తులౌతారు అని వాల్మీకి మహర్షి శ్రీమద్రామాయణ బాలకాండలో తెలుపుతారు.

****

ఆపదామపహర్తారం దాతారం                                                                                 సర్వసంపదామ్

లోకాభిరామం శ్రీరామం                                                                                             భూయో భూయో నమామ్యహమ్.

****

*శ్రీరామ రామ రామేతి*

*రమే రామే మనోరమే                                                              సహస్రనామ తత్తుల్యం.  రామనామ వరానే*

( బాల‌కాండ స‌మాప్తం)

కృతిపతి కాశీస్సులు!

 శు భో ద యం 🙏


శు భో ద యం🙏


కృతిపతి కాశీస్సులు!


            శా:  శ్రీవక్షోజ  కురంగనాభ  మెదపైఁ  జెన్నొంద ,విశ్వభరా


                   దేవిన్  దత్కమలా   సమీపమున  బ్రీతిన్  నిల్పినాడో యనం


                   గా ,వందారు  సనందనాది  నిజభక్తశ్రేణికిన్   దోచు   , రా


                  జీవాక్షుండుఁ   గృతార్ధుసేయు  శుభ దృష్టిన్  కృష్ణరాయాధిపున్. 


                   మనుచరిత్ర ప్రారంభ పద్యము-  అల్లసాని  పెద్దన  గారు!


                 అర్ధము:   శ్రీ-  లక్ష్మీదేవియొక్క; వక్షోజ  -స్తనముల యందలి;  కురంగ నాభము- కస్తూరి ; ఎదపై-  వక్షస్థలమందు;  చెన్నొందన్- ప్రకాశింపఁగా;  విశ్వంభరాదేవిన్ - భూదేవిని;  తత్- ఆ;  కమలాసమీపమున- లక్ష్మి సన్నిధానమునందు;  ప్రీతిన్- ప్రేమతో;

నిల్పినాడో  యనంగా- నిల్పెపెనాయని ;  వందారు- నమస్కరించు ;  సనందనాది- సనందనుడు మున్నగు; నిజభక్తశ్రేణికిన్- తన భక్త

సముదాయమునకు  తోచు- కనబడు;  రాజీవాక్షుండు- విష్ణువు;  శుభదృష్టన్- శుభములనొసగు చూపులతో; కృష్ణరాయాధిపున్-

శ్రీకృష్ణరాయ  సార్వభౌముని;  కృతార్ధు  సేయున్- కోరికలు దీర్చి గాపాడుగాక!


                   భావము: లక్ష్మీదేవి  వక్షోజములకు గల కస్తురి  విష్ణువక్షస్థలమునకు అంటగా  ,నమస్కరింప వచ్చిన  సనక సనందనాదిభక్తిలకు " శ్రీహరి  లక్ష్మిదేవితోబాటు  భూదేవిని గూడ తనహృదయమున  ధరించెనా? " యను భ్రమను కల్గించుచుండెను.

అట్టి శ్రీహరి కృష్ణరాయల కోరిక లీడేర్చి రక్షించుగాక.! యనిభావము.


              విశేషాంశములు: విష్ణువక్షాలయా"- అని కమలాదేవికి బిరుదు. శ్రీహరి వక్షస్థలమామెకు స్వంతము. అక్కడ మరెవ్వరికి తావులేదు. కానీ చూచు సనకాది భక్తులకు  భ్రమకలుగుచున్నది. యేమని?  లక్ష్మి ప్రక్కన  శ్రీదేవినిగూడ (శ్రీహరి) చేర్చెనేమోయని. సవతుల నొక్కచోటఁజేర్చుటా!అమ్మో!యెంతయాశ్చర్యము!దానికి కారణముగూడ కనిపించుచున్నది. లక్ష్మీదేవి తన స్తనమండలమున  కస్తూరీ ద్రవ్యము నలదుకొని  వచ్చినది. శ్రీహరి ప్రణయ పారవశ్యమున

కమలను కౌగిలింప  ఆకస్తురి యంతయు నతని  వక్షస్థలమున  కంటినది. కస్తురి  నల్లనిది. భూమియు నల్లనిదే  ఆకారణమున సనకాదుదులకు  అనుమానము  గలిగినది.ఆవిధముగా  యిరువురి  భార్యలను రంజింపజేయు సామర్ధ్యముగల హరి కృష్ణరాయల కాపాడుగాక !యనిపెద్దన యాశీర్వాదము..


                         దీని వెనుక  రాయల కథయు వ్యంగ్య రీతిని జోడించినాడు. రాయలకు  తిరుమలదేవి, చిన్నాదేవి యను నిరువురు

భార్యలు. నావిష్ణుః పృధివీపతిః - అన్నారుగనుక రాయలుగూడ విష్ణుతుల్యుడే! భార్యలును  శ్రీదేవి భూదేవులే.హరి భార్యలను ఏలినట్టు  గా నీవును దేవేరులను రంజింప జేయవలెననుట  యొకసందేశము. 


                   రాజ్యాధికారమునకు  మూలమైనవి భూమి ,ధనము , ఈరెంటిని  తనయధీనమున నుంచుకొన్నహరి ,ఆరెంటిని నీకొసంగి

రక్షించునుగాక! అనియాశీర్వాద ఫలితమును వెల్లడించుట. 


                              మహా కవుల  కవితల లోని మతలబు  లిట్లుండును. 


                                              స్వస్తి!🙏


🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

యు(ఉ)గాది...

 యు(ఉ)గాది...


లోకమును బ్రహ్మచే సృష్టించ బడిన రోజును యుగ ఆది పిలవడం జరిగింది. తెలుగు నేల యందు ఉగాది గాను, కన్నడ ప్రాంతమందు యుగాది గాను, మహారాష్ట్ర గోవా ప్రాంతాల యందు గుడి పద్వా అని పిలవడం జరుగుతోంది. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి కాల నామ సంవత్సరము చైత్ర మాసమందు మొదటి రోజును ఉగాది పర్వదినం నిర్వహించడ మైనది. పండుగ రోజు పంచాంగ శ్రవణం చేయడంతో పాటు ఉగాది పచ్చడిని సేవించడం చేయుదురు. 


ప్రతి మనిషి జీవితంలో ఉండే ఆరు రకాల భావోద్వేగాలకు ఆరు రకాల షడ్రుచులను అన్వయిస్తారు. 


సంతోషానికి మధురం అనగా తీపి, కోపమునకు కటువు అనగా కారము, ఆమ్లంనకు పులుపు, తిక్తం అనగా చేదు, వగరు, లవణం అనగా ఉప్పు,  కషాయం అనగా వగరు వంటి గుణాలు కలిగిన చెరకు తేనే/బెల్లం, మిరప/మిరియం, చింత/నిమ్మ, వేప పువ్వు, ఉప్పు, మామిడి పిందె వంటి ప్రకృతి ప్రసాదించిన పండ్లు, పువ్వు, మిశ్రమాలను కలిపి ఉగాది పచ్చడిని తయారు చేస్తారు.


శరీర గుణాలైన వాత, పిత్త, కఫములను సమతూకము చేయడమే కాకుండా శరీరంలో అనేక దుష్ప్రభావాలు రాకుండా 

షడ్రుచులు తగు పాళ్లలో సేవించడం ద్వారా శరీరం యొక్క రసాయన క్రియలలో క్రమబద్ధీకరణ జరుగుతుంది. ఈ విషయం ఆయుర్వేదం చెబుతోంది. అందుకే ఉగాది పచ్చడికి అంత ప్రాశస్త్యం కలదు. వసంత కాలం నుండి  గ్రీష్మ కాలం వరకు వేడి పెరిగి శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. 


అందుకే ఈ ఋతువులలో శరీరానికి షడ్రుచులు అందించడం మేలుకరం.


ఉగాది పండుగ సంవత్సరానికి తొలి రోజున జరపడం తెలుగు, కన్నడ ప్రాంతీయులు నిర్వహించడం చేస్తుంటారు. 


ముఖ్యంగా తెలుగు నేల యందు పంచాంగ శ్రవణం ముఖ్య కార్యక్రమంగా నిర్వహిస్తారు. 


కొత్త సంవత్సరంలో రాశులు, నక్షత్రాల గమనం ప్రకారం జాతకాలను వినడం చేస్తుంటారు. నూతన కాల పయనంలో పంటలు, వర్షాలు, ప్రమోదాలు, విపత్కరములు వంటి గురించి సంఘ, వ్యక్తిగతంగా పూజ్యం, అవమానంలతో పాటు ఆదాయం, ఖర్చు వంటి భవిష్యత్తు ఆశాజనక విషయాలను తెలుసుకోవడం జరుగుతుంది.


*అందరికి ఉగాది పండుగ శుభాకాంక్షలు.*


మన అందరికి ఈ ఉగాది పండుగ  కొత్త జవసత్వాలు కూడిన 

నూతన శక్తిని కలిగించాలని మనసారా కోరుకుంటున్నాను.


మీ,


అశోక్ చక్రవర్తి నీలకంఠం.

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం - వసంత ఋతువు - చైత్ర మాసం - శుక్ల పక్షం - ప్రతిపత్ - రేవతి -‌‌ భాను వాసరే* (30.03.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

29, మార్చి 2025, శనివారం

శనివారం🍁* *🌹29, మార్చి, 2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

      *🍁శనివారం🍁*

*🌹29, మార్చి, 2025🌹*

    *దృగ్గణిత పంచాంగం*                


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - శిశిరఋతౌః*

*ఫాల్గుణ మాసం -  కృష్ణపక్షం*


*తిథి       : అమావాస్య* సా 04.27 వరకు ఉపరి *చైత్ర మాసారంభః*

*వారం    : శనివారం* ( స్ధిరవాసరే )

*నక్షత్రం   : ఉత్తరాభాద్ర* రా 07.26 వరకు ఉపరి *రేవతి*


*యోగం  : బ్రహ్మ* రా 10.04 వరకు ఉపరి *ఐంద్ర*

*కరణం   : చతుష్పాద* ఉ 06.13 *నాగ* సా 04.27 ఉపరి *కింస్తుఘ్న*


 *సాధారణ శుభ సమయాలు:* 

          *- ఈరోజు లేవు -*

అమృత కాలం  : *మ 03.11 - 04.36*

అభిజిత్ కాలం  : *ప 11.48 - 12.37*


*వర్జ్యం              : ఉ 06.40 - 08.05*

*దుర్ముహూర్తం  : ఉ 06.05 - 07.43*

*రాహు కాలం   : ఉ 09.08 - 10.40*

గుళికకాళం      : *ఉ 06.05 - 07.37*

యమగండం    : *మ 01.44 - 03.16*

సూర్యరాశి : *మీనం* 

చంద్రరాశి : *మీనం*

సూర్యోదయం :*ఉ 06.05* 

సూర్యాస్తమయం :*సా 06.20*

*ప్రయాణశూల  : తూర్పు దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం          :  *ఉ 06.05 - 08.32*

సంగవ కాలం         :      *08.32 - 10.59*

మధ్యాహ్న కాలం    :      *10.59 - 01.26*

అపరాహ్న కాలం    : *మ 01.26 - 03.53*


*ఆబ్ధికం తిధి         : ఫాల్గుణ అమావాస్య*

సాయంకాలం        :  *సా 03.53 - 06.20*

ప్రదోష కాలం         :  *సా 06.20 - 08.41*

రాత్రి కాలం             :  *రా 08.41 - 11.48*

నిశీధి కాలం          :*రా 11.48 - 12.35*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.30 - 05.17*

________________________________

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🙏శ్రీ వేంకటేశ్వరస్వామి🙏*

 *🔯ద్వాదశనామ స్తోత్రం🔯*


*ఇతి బ్రహ్మాండపురాణే బ్రహ్మనారదసంవాదే* 

*శ్రీ వేంకటేశ ద్వాదశనామ స్తోత్రం సంపూర్ణం ||*


*🙏ఓం నమో వేంకటేశాయ🙏*

******************************


*🚩IIజై పవన పుత్ర హనుమాన్II🚩*


*సింధూర తైల రచి తాతి విభూషణాత్మన్!*

*లాంగూల తాడ నకృతాసుర సంఘ నాశ!*

*క్రోధా ద్దశానన పురీ దహన ప్రకారిన్*

*శ్రీరామదూత సతతం హనుమన్ నమస్తే||*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో

 *తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో ఏప్రిల్ నెల‌లో జ‌రుగ‌నున్న విశేష ప‌ర్వ‌దినాల వివ‌రాలు ఇలా ఉన్నాయి.*

-ఏప్రిల్ 6న శ్రీరామ నవమి ఆస్థానం.

-ఏప్రిల్ 7న శ్రీరామ పట్టాభిషేక ఆస్థానం.

-ఏప్రిల్ 8న సర్వ ఏకాదశి.

-ఏప్రిల్ 10 నుండి 12వ తేది వరకు వసంతోత్సవాలు.

-ఏప్రిల్ 12న చైత్ర పౌర్ణమి గరుడ సేవ, తుంబురు తీర్థ ముక్కోటి.

-ఏప్రిల్ 23న భాష్యకార్ల ఉత్సవారంభం.

-ఏప్రిల్ 24న మతత్రయ ఏకాదశి.

-ఏప్రిల్ 30న పరశురామ జయంతి, భృగు మహర్షి వర్ష తిరు నక్షత్రం, శ్రీనివాస దీక్షితులు వర్ష తిరు నక్షత్రం, అక్షయ తృతీయ.

పద్యం

 🚩🚩మా గురువు గారు మాకు చెప్పిన పద్యం.!

#ఎన్ని కష్టాలు ఆయినా నవ్వు తో ఓర్చు కోవాలి .. పాండవు ల వలే

.

♦️"రాకన్మానవు హానివృద్ధులు మహారణ్యంబులో డాగినన్

పోకన్మానదు దేహమేవిధమునన్ బోషించి రక్షించినన్

గాకన్మానవు పూర్వజన్మకృతముల్ గాగల్గు నర్థంబులున్

లేకన్మానవదెంత జాలిబడినన్ లేముల్ సిరుల్ రాఘవా !--🖤

(రాఘవ శతకము..)

🚩🚩శాప భయమున సముద్రమందు గట్టబడిన మేడలో

 జాగ్రత్తగా నుండిననూ పరీక్షిత్తుపాము కాటుచే మరణించినట్లు కారణభూతములైన కర్మములు పూనుకొనిననే గాని ఎన్ని ప్రయత్నములు చేసిననూ కావాలినవి కాకమానవు. 

మనము ఎక్కడ చావవలెనని వ్రాసి వుండిన కర్మ మనలను 

అక్కడికి కొనిపోవును.

♎️♎️♎️♎️♎️♎️

⚜ శ్రీ వరక్కల్ దేవి ఆలయం

 🕉 మన గుడి : నెం 1064


⚜ కేరళ  :  కోజికోడ్


⚜ శ్రీ వరక్కల్ దేవి ఆలయం



💠 కోజికోడ్‌లోని వరక్కల్ దేవి ఆలయం కేరళ పురాణ స్థాపకుడు శ్రీ పరశురామ నిర్మించిన 108వ మరియు చివరి దేవి ఆలయంగా పరిగణించబడుతుంది.  

దేవత కనిపించడానికి పరశురాముడు ఈ ప్రాంతాన్ని దున్నాడని నమ్ముతారు. 



💠 పురాణాల ప్రకారం, త్రేతాయుగంలో  పరశురాముడు తపస్సు చేసిన తరువాత, దుర్గాదేవి ప్రత్యక్షమై, భక్తులను ఆశీర్వదించడానికి నేను చోతి నక్షత్రం రోజున మరియు వావు (పౌర్ణమి రోజు) తీర్థరూపంలో ఉంటానని చెప్పింది.  

దీనిని అనుసరించి పరశురామన్ ఆలయాన్ని ప్రతిష్టించాడు  మరియు ఈ ఆలయాన్ని సృష్టించడం అతనికి గొప్ప సంతృప్తిని ఇచ్చింది. 


💠 ఆలయ మూలాలు త్రేతాయుగం నాటివి, ఇది ఈ ప్రాంతంలోని అత్యంత పురాతన దేవాలయాలలో ఒకటిగా నిలిచింది. 

సెప్టెంబర్‌లో జరిగే నవరాత్రి పండుగ మరియు వావు బలి ఆచారం ఇక్కడ ముఖ్యమైన సంఘటనలు. 

తులం మరియు కర్కిడకం అమావాస్య రోజుల్లో జరిగే వావు బలి సముద్రతీరంలో పితృకర్మలు చేసే వేలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది. విశేషమేమిటంటే, ఈ ఆచారాల సమయంలో సముద్రం ప్రశాంతంగా ఉంటుంది, వేడుకలను సులభతరం చేస్తుంది.


💠 వరక్కల్ దేవి ఆలయం దక్షిణ తీర్థయాత్రలో యాత్రికులకు మరియు శబరిమల యాత్రలో అయ్యప్ప భక్తులకు కూడా ఒక ముఖ్యమైన విడిది .


💠 ఆలయ ప్రారంభ కాలంలో సరైన రోజువారీ ఆచారాలు ఉండేవి.  అనంతరం నిధుల కొరత లేదా ఇతర కారణాలతో కర్మకాండలకు సెలవు ఇచ్చారు.  

ఆలయ నిర్లక్ష్యానికి ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  

ఇది విన్న అప్పటి పాలకులు పెరుమాళ్లోర్లు రంగప్రవేశం చేసి నిత్యకృత్యాలు తీర్చుకున్నారు.  వెంటనే ఆ మందిరం మహాక్షేత్రం (పెద్ద దేవాలయం) స్థానంలోకి దూసుకెళ్లింది.  తరువాత, జామోరిన్లు ఆలయ బాధ్యతలు స్వీకరించారు, పునరుద్ధరించారు మరియు ప్రస్తుత స్థితికి నిర్మాణాన్ని సవరించారు.  

నేటికీ ఆలయాన్ని జామోరిన్ కుటుంబం నిర్వహిస్తోంది.


💠 ఈ ఆలయంలో గణపతి, దక్షిణామూర్తి మరియు శ్రీ అయ్యప్పన్ ఉప దేవతలు కూడా ఉన్నారు.


💠 ఈ ఆలయం ఒకప్పుడు మలబార్ యొక్క కళ మరియు సాంస్కృతిక కార్యక్రమాల ప్రచార కేంద్రంగా ఉంది.


💠 ఆలయ ప్రధాన పండుగ వావు బలి, వర్క్కల్ బీచ్‌లో బలి తర్పణం చేయడానికి భక్తులు తులం వావు కోసం పెద్ద సంఖ్యలో గుమిగూడుతారు.

 

🔅 నవరాత్రి: 

ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు కూడా ఘనంగా జరుగుతాయి.  మహానివేదం ఆలయంలో అత్యంత ముఖ్యమైన ఆచారం, పుష్పాంజలి, పడివిలకు, నైవిలక్కు, త్రికాలపూజ, స్వయంవర పుష్పాంజలి, సంతాన గోపాల పూజ, గణపతి హోమం, తిలహోమం మరియు ఇతర నైవేద్యాలు.


💠 నవరాత్రి పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు.  

తులం (అక్టోబర్/నవంబర్) నెలలో పౌర్ణమి రోజున వావు బలి (వెళ్లిపోయిన ఆత్మలకు సంబంధించిన ఆచారం) నిర్వహిస్తారు.  

మునుపటి రోజు ఉపవాసం ఉన్న వేలాది మంది ప్రజలు వరక్కల్ బీచ్‌లో సమావేశమవుతారు మరియు ఆలయ పూజారులు తన ప్రియమైన మరియు సమీపంలోని ఆత్మల కోసం వావు బలి చేసే ప్రతి వ్యక్తికి వేడుకలను నిర్వహిస్తారు.  

వావు బలి నిష్క్రమించిన ఆత్మలను సంతృప్తిపరుస్తుందని మరియు వారు జీవించి ఉన్న ప్రియమైనవారికి మరియు సమీపంలోని వారికి రక్షణగా నిలుస్తారని భావన.


💠 ఆలయం, ప్రతిరోజూ ఉదయం 05:00 నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు మరియు సాయంత్రం 05:30 నుండి రాత్రి 08:00 వరకు తెరిచి ఉంటుంది, ఇది కేరళ యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తూ చారిత్రక ప్రాముఖ్యత, నిర్మాణ సౌందర్యం మరియు ఆధ్యాత్మిక వాతావరణాన్ని మిళితం చేస్తూ గౌరవప్రదమైన ప్రదేశంగా కొనసాగుతుంది. .



💠 కోజికోడ్ రైల్వే స్టేషన్, సుమారు 6 కి.మీ దూరంలో ఉంది.



 రచన

©️ Santosh Kumar

తిరుమల సర్వస్వం -192*

 తిరుమల సర్వస్వం -192*

**శ్రీవారి ఆభరణాలు -4*

5. *స్వర్ణ పీతాంబరాలు:* 


 ఇరవై కిలోల బరువైన స్వర్ణాంబరాన్ని 2009వ సంవత్సరంలో అప్పటి తి.తి.దే. బోర్డు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు మూడు కోట్లు వెచ్చించి చేయించారు. మూలవిరాట్టుకు నాభి క్రింద భాగం నుంచి ఈ పీతాంబరం ధరింప చేస్తారు. తి.తి.దే. వారు ఇరవై కిలోగ్రాముల మరో స్వర్ణ పీతాంబరం అంతకుముందే తయారు చేయించారు. ఇది రెండవది.


 *మరికొన్ని ముఖ్యాభరణాలు* 


 ఇవే కాకుండా శ్రీవారి మూలమూర్తిని పాదాల నుండి శిరస్సు వరకు అలంకరించే మరికొన్ని ముఖ్య ఆభరణాల జాబితా, అదే క్రమంలో, ఇలా ఉంది:


1. శ్రీవారి పాదాల క్రిందనున్న బంగారు పద్మపీఠాన్ని కప్పుతూ ఉన్న నగిషీలు చెక్కిన బంగారు రేకు.


2. కుడి ఎడమ పాదాలకు రెండు బంగారు కవచాలు.


3. ఏడు కిలోల బరువైన బంగారు సూర్యకఠారి (ఖడ్గం).


4. వైకుంఠహస్తానికి బంగారుకవచం.


5. వైకుంఠ హస్తానికి, కటిహస్తానికి చెరొక నాగాభరణం. 

(వీటిని శ్రీమద్రామానుజుల వారు తయారు చేయించారు.)


6. వైకుంఠ హస్తానికి నాగాభరణం క్రింద ఉండే కడియం.


7. వైకుంఠహస్తాన్ని అలంకరించే రత్నాల దస్తుబందు.


8. పెన్నా సిమెంట్స్ వారు ఐదుకోట్ల వ్యయంతో చేయించిన 'వల కటి, వరద హస్తాలు'.


9. 'కమ్మరపట్టి' అనబడే బంగారు వడ్డాణం.


10. దశావతార వడ్డాణం. 

       బంగారు గంటల మొలత్రాడు.


11. వక్షస్థల అమ్మవార్లకు రత్నాలతో కూడిన బంగారు కంటె.


12. దశావతార హారం.


13. అష్టోత్తర శతనామ హారం.


14. నాలుగు పేటలతో కూడిన బంగారు మొహరీల గొలుసు.


15. ఆరు ప్రోగుల బంగారు యజ్ఞోపవీతం.


16. బంగారు పులిగోరు.


17. రెండు భుజకీర్తులు.


18. నాలుగు కిలోల బరువైన, రత్నాలు పొదిగిన శంఖం.


19. నాలుగు కిలోల బరువైన, రత్నాలు పొదిగిన సుదర్శనచక్రం.


20. మూడు కిలోల బరువున్న రవ్వల కర్ణాభరణాలు.


21. రత్నాలు పొదిగిన కుడి, ఎడమ బంగారు బావళీలు.

చంద్రవంక కంటి.


22. వజ్ర ఖచితమైన అశ్వత్థపత్ర హారం (అశ్వత్థపత్ర మనగా రావి ఆకు).


23. భుజదండ భూషణాలు 


24. రెండు పేటల బంగారు గొలుసు.


25. ఐదు కిలోల బరువైన బంగారు గొడుగు.


26. ఇరవై ముత్యాల హారాలు.


27. యాభై కాసుల దండలు


     *ఎన్నో కిరీటాలు...* 


 సకలలోక సార్వభౌముడు, దేవాది దేవుడు అయిన శ్రీనివాసుని మకుటాల గురించి చెప్పుకోవాలంటే ఉద్గ్రంథమే అవుతుంది. 


 *శ్రీవారికి ఏడు ముఖ్యమైన కిరీటాలు ఉన్నాయి -* 


1. మామగారైన ఆకాశరాజుచే బహూకరింప బడ్డ తొమ్మిదిన్నర కిలోల బంగారు కిరీటం. దాదాపు ఐదువేల సంవత్సరాల నాటిదిగా భావించబడే ఈ కిరీటాన్ని *'ఆకాశరాజు కిరీటం'* గా పిలుస్తారు.


2. ఇరవయ్యవ శతాబ్దపు ప్రథమార్థంలో అప్పటి దేవాలయ పురాతత్వ శాస్త్రవేత్త సాధు సుబ్రహ్మణ్యశాస్త్రి గారి ఆధ్వర్యంలో *గద్వాల మహారాణి చేయించిన వజ్రకిరీటం.*


3. 2009వ సంవత్సరంలో గాలి జనార్దన్ రెడ్డి గారు సమర్పించిన, 42 కోట్ల రూపాయల విలువగల వజ్రాల కిరీటం.


4. వేంకటేశ్వర హెచరీస్ సంస్థ సమర్పించిన 13 కిలోల కిరీటం.


5. గోయెంకా కుటుంబం కానుకగా ఇచ్చిన 10 కిలోల బంగారు కిరీటం.


6. 1945 సంవత్సరం లో తి.తి.దే. వారు చేయించిన వజ్రకిరీటం.


7. 1986వ సంవత్సరంలో, అప్పుడే 5 కోట్ల రూపాయలు వెచ్చించి తి.తి.దే. వారు చేయించిన మరో వజ్రకిరీటం.


7. ఇవే కాకుండా అరుదుగా వాడే లేదా అసలు ఉపయోగించని కిరీటాలెన్నో కూడా శ్రీవారి చెంత ఉన్నాయి.

*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

15-13-గీతా మకరందము

 15-13-గీతా మకరందము

         పురుషోత్తమప్రాప్తియోగము

       

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - భూమియందు ప్రవేశించి సస్యాదుల నభివృద్ధిపఱచునది తానే యని భగవానుడు పలుకుచున్నారు -


గామావిశ్య చ భూతాని ధారయామ్యహ మోజసా | 

పుష్ణామి చౌషధీస్సర్వాః

సోమో భూత్వా రసాత్మకః || 


తాత్పర్యము:- మఱియు నేను భూమిని ప్రవేశించి శక్తిచేత సమస్త ప్రాణికోట్లను ధరించుచున్నాను (నిలుపుచున్నాను). రసస్వరూపుడగు చంద్రుడనై సస్యము లన్నింటిని పోషించుచున్నాను. 


వ్యాఖ్య:- 'ధారయామి ఓజసా’ - అని చెప్పుటవలన జగత్తునందలి సమస్త పదార్థములకును, ప్రాణికోట్లకును శక్తిని, సామర్థ్యమును, బలమును ఒసంగునది ఆ పరాత్పరుడే యని తెలియుచున్నది. పైవాక్యమువలన శ్రీకృష్ణమూర్తి వసుదేవునకు జన్మించిన ఒకానొక చిన్నఉపాధి మాత్రమే కాదనియు, విశ్వవ్యాపి, జగద్భర్తకూడ యనియు స్పష్టమగుచున్నది. మఱియు సస్యములను అభివృద్ధిపఱచునది తానేయని చెప్పుటచే జీవులు భుజించు ఆహారము సాక్షాత్ పరమాత్మవలననే సంభవించుచున్నదని తెలియుచున్నది. కావున, ఆహారమును భుజించునపుడు ఈ అన్నమెవరివలన మనకు వచ్చినది? అని ఆలోచించి అన్నస్రష్ట, అన్నదాత యగు ఆ సర్వేశ్వరునకు సర్వులును కృతజ్ఞత చూపవలసియున్నారు. మనుజుడు తాను ఆహారమును భుజించుటకుముందు అద్దానిని ఆ దేవదేవునకు సమర్పించి తదుపరి దైవభావనతో దానిని భుజించవలెను. సస్యములను భగవానుడు పోషించనిచో జనులకు అన్నము దొఱకదు; సూర్యచంద్రాగ్నులకు ప్రకాశమివ్వనిచో లోకము అంధకారావృతమై యుండును. కాబట్టి ఎన్నియో అనుకూలములుచేసి ప్రాణులను భరించుచున్న ఆ జగద్ధాత్రికి మనుజులు సదా కృతజ్ఞులై వర్తించవలెను. సర్వకాలములందును. వారిని స్మరించుచు, కీర్తించుచు నుండవలెను.


ప్రశ్న:- భగవాను డే యేప్రకారములుగ ప్రజలకు మేలొనర్చుచున్నారు?

ఉత్తరము:- (1) భూమియందు ప్రవేశించి బలముచే సమస్తప్రాణులను భరించుచున్నారు. (2) చంద్రుడయి సస్యములన్నిటిని పోషించుచున్నారు.

ప్రశ్న:- కావున జీవు లేమి చేయవలెను?

ఉత్తరము: - అతనికి కృతజ్ఞులై వర్తించుచు, సంకీర్తన, జప, పూజాదులచే నిరంతర మాతనిని స్మరించుచుండవలెను.

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*ద్రోణ పర్వము చతుర్థాశ్వాసము*


*331 వ రోజు*


*అర్జునాదులు కౌరవసేనలతో పోరుట*


భీమ సాత్యకులు అర్జునుడి వద్దకు చేరగానే అలంబసుడు అనే రాజు వారిని చేరుకున్నాడు. సాత్యకి, అలంబసుడు ఘోరంగా చేస్తున్నాడు. ఒకరి విల్లు ఒకరు విరిచారు. కవచాలను చీల్చుకున్నారు. సాత్యకి కోపించి అలంబసుని రధసారధిని, హయములను చంపి ఒక అర్ధచంద్ర బాణంతో అలంబసుని తల తెగనరికాడు. ఇంతలో నీ కుమారులు అందరూ దుశ్శాసనుడిని ముందుంచుకుని సాత్యకిని ఎదుర్కొన్నారు. సాత్యకి దుశ్శాసనుని హయములను చంపి రధము మీదకు దూకబోయాడు. అది చూసి త్రిగర్త సైనికులు అతడిని ఎదుర్కొన్నారు. సాత్యకి వారిని ఎదుర్కొని వెంటనే ఏభై మందిని చంపాడు. అది చూసి మిగిలిన సైనికిలు పారిపోయారు. సాత్యకి శూరసేనదేశాధీశుని వెంబడించాడు. కళింగ సైనికులను నాశనం చేసాడు. అతడి బలపరాక్రమము చూసిన కృష్ణుడు " అర్జునా ! అటు చూడు నీ శిష్యుడు సాత్యకి నీ పేరు నిలబెడుతున్నాడు. ద్రోణుడు అంతటి వాడిని జయించి లోపలకు వచ్చాడు. ధర్మరాజు మీద భక్తి, నీతోటి మైత్రి అతడిని ఇంత వరకు తీసుకు వచ్చింది " అని ప్రశంసించాడు. అర్జునుడు " కృష్ణా ! నేను సాత్యకిని ధర్మరాజుకు రక్షణగా ఉండమన్నాను. నా మాట వినక ఇక్కడకు వచ్చాడు. అక్కడ ధర్మజుని పరిస్థితి ఎలా ఉందో కదా! అతడు ద్రోణుని బారిన పడ్డాడు. ఇక్కడ నేను సైంధవుడిని ఇంకా చంప లేదు. పొద్దు వాలి పోతుంది. సాత్యకి కృపాచార్యుడు, కృతవర్మ మొదలైన యోధులను ఎదిరించి అలసిపోయాడు. భూరిశ్రవసుడు అతడితో తలపడుతున్నాడు. సాత్యకి ఎలా యుద్ధం చేస్తాడో ఏమో ! ద్రోణాచార్యుడు పక్షి కొరకు ఎదురు చూస్తున్న డేగవలె మా అన్నయ్య ధర్మజుని కొరకు ఎదురు చూస్తున్నాడు అని ధర్మజునికి ఎందుకు అర్ధం కాలేదు " అని మనసులో పరితపిస్తున్నాడు. ఇంతలో సోమదత్తుని కుమారుడు భూరిశ్రవసుడు సాత్యకిపై విరుచుకు పడ్డాడు. ఇరువురి నడుమ పోరు ఘోరమైంది. ఒకరి మీద ఒకరు బాణవర్షం కురిపించారు. ఒకరి రధాశ్వములను ఒకరు చంపారు. ఒకరి రధసారధిని ఒకరు చంపుకున్నారు. రధము దిగి నేల మీద కత్తి సాము చేస్తున్నారు. అవి కూడా వదిలి మల్ల యుద్ధము చేయసాగారు. చివరకు భూరిశ్రవసుడిదే పైచేయిగా ఉండటము చూసి కృష్ణుడు చూసి " అర్జునా! ఏమిటి అలాచూస్తున్నావు నీకు సాయంగా వచ్చిన సాత్యకి భూశ్రవసునితో యుద్ధమ చేసి అలసి ఉన్నాడు. సత్వరమే రక్షించు " అన్నాడు. అప్పుడు భూరిశ్రవసుడు సాత్యకిని కింద పడ వేసాడు. అది చూసిన కృష్ణుడు " అర్జునా! ఇది న్యాయం కాదు నీకు సాయం చేయడానికి వచ్చిన నీశిష్యుడు ఆపదలో ఉన్నాడు సతరం రక్షించడం నీ కఎర్తవ్యం " అన్నాడు. అర్జునుడు " కృష్ణా ! మల్లయుద్ధం చేసుకుంటున్న ఇరువురి నడుమ నేను బాణ ప్రయోగం చేయడం ధర్మం కాదు అయినా నా మిత్రుడిని నేను రక్షిస్తాను " అన్నాడు. అర్జునుడు అలా అంటుండగా భూశ్రవసుడు సాత్యకిని నేలపై వేసి గొండెలపై కాలు వేసి సాత్యకి తల నరకడానికి కత్తి తీసుకుని చేయి పైకెత్తాడు. అది చూసిన కృష్ణుడు " అర్జునా! ఇక ఆలస్యం చేయకు బాణ ప్రయోగం చెయ్యి " అన్నాడు. అర్జునుడు గాండీవం ఎక్కు పెట్టి ఒకే ఒక బాణంతో ఎత్తిన భూశ్రవసుడి చేయి నరికాడు. భూరిశ్రవుసుడి చేయి తెగి పడింది వెంటనే భూరిశ్రవడు " అర్జునా ! ఇంతటి అన్యాయానికి పాలు పడతావని అనుకోలేదు. సాత్యకితో యుద్ధం చేస్తున్న నా చేయి నరకడం న్యాయమా, ధర్మమా ! ఇంటటి నీచ రాజ నీతిని నీకు నీరువు ద్రోణుడు నేర్పాడా ! నిన్ను పుట్టించిన ఇంద్రుడు నేర్పాడా ! పాశుపతం అందించిన శివుడు నేర్పాడా! నీ పక్కన కూర్చుని శ్రీకృష్ణుడు ఇది చూసి ఎలా సహించాడు " అన్నాడు. అర్జునుడు ఆ మాటలకు నవ్వి భూరిశ్రవసా! నీవు నాకు నీతులు నేర్పే వాడివా యుద్ధరంగమున యుద్ధం చేస్తున్న వీరులను వారి బంధువులు కాపాడరా ! అలసి పోయి నిరాయుధుడైన సాత్యకిని చంపబూనడం ధర్మమా ! అతడిని నేను రక్షించండం అధర్మమా! మీరంతా కలసి బాలుడైన అభిమన్యుని వధించడం మాత్రం అధర్మమం కాదా! " అన్నాడు. చేయి తెగిన భూరిశ్రవసుడు బాణములను భూమి మీద పరచి వాటిపై కూర్చుని ప్రాయోపవేశం చేసాడు. ఇది చూసి సాత్యకి భీమసేనుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, కర్ణుడు, శ్రీకృష్ణుడు, అర్జునుడు వారిస్తున్నా వినక భూరిశ్రవుసుడి తల నరికి వారించిన వారిని అభిమన్యుని చంపిన వారిని ఇలా చంపడం అధర్మము కాదని సమర్ధించుకున్నాడు " అని సంజయుడు చెప్పగా


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

ఆహర విరుద్ధాలు -

 ఆహర విరుద్ధాలు -


 మనం భుజించే ఆహరం వరసగా 


 1.రసం .


 2.రక్తం .

 

 3.మాంసం .


 4.మేధస్సు (కొవ్వు ) .


 5. ఎముక .


 6. మజ్జా .


 7. వీర్యము. (ఆర్థవము ).


అనే 7 ధాతువులు గా రూపాంతరం చెందుతుంది. ఆహారం మనిషి నిత్య నూతనం గా శక్తివంతం గా ఉండేవిధంగా తోడ్పడుతుంది. ఇదే రెండు విరుద్ధ భావాలు గల ఆహారం తీసుకున్నప్పుడు అవి విషతుల్యం అయ్యి తీవ్రమయిన అనారోగ్యాన్ని కలిగించవచ్చు .ఒక్కోసారి విషమై మనిషి మరణానికి కారణం కావొచ్చు.


 * చేపలు తిన్న వెంటనే పాలు , పెరుగు తాగరాదు.ఎందుకంటే చలువ చేసే స్వభావం గల పాలు , వేడి చేసే స్వభావం గల చేపలు కలిపి తినడం వలన పరస్పర విరుద్ద స్వభావాలు గల ఆహారాల వలన రక్తం లొ దొషం ఏర్పడి చర్మ వ్యాధులు కలగజేస్తుంది.


 * మాంసం తేనే గానీ , నువ్వులుగాని బెల్లం గానీ , పాలు గానీ , మినుములు గానీ , ముల్లంగి గానీ , మొలకెత్తిన ధాన్యాలు గానీ కలిపి వాడ కూడదు . ఒకవేళ పొరపాటున గానీ , గ్రహపాటున గానీ తింటే ఆ వ్యక్తికీ చెముడు, దృష్టి మాంద్యము, వణుకు, మొదలయిన వ్యాధులు కాలక్రమేణ రావడం జరుగుతుంది.


 * ఆవ నూనే లొ వేయించిన పావురం మాంసం గానీ , తేనే , నెయ్యి సమంగా కలిపి ఎట్టి పరిస్థితులో భుజింప గూడదు . ఈ విరుద్ద ఆహరం వలన రక్తము చెడి ధమనుల యందు గ్రంధులు ఏర్పడతాయి. అపస్మారము , కణతలు యందు పోటు సంభవిస్తుంది.


 * వెల్లుల్లి, మునగ, తులసి మొదలయిన పదార్దాలు తినిన వెంటనే పాలు తాగకూడదు. అలా తాగితే కుష్టు వ్యాధి సంభవిస్తుంది.


 * నిమ్మ పండును తేనే , నెయ్యి కలిపి గానీ మినపపప్పు బెల్లం నెయ్యి లొ కలిపి గానీ ఉపయోగించ కూడదు . అలా ఉపయోగించడం వలన నపుసకత్వం ఏర్పడుతుంది .


 * మామిడి , దానిమ్మ,, నిమ్మ , అరటి, పుల్ల దబ్బకాయ , రేగిపండ్లు, నేరేడు, వెలగ, చింతపండు , అక్రోటు, పనస, కొబ్బరి కాయ , ఉసిరి ఇటువంటి యే పుల్లటి పదార్ధం అయినా పచ్చిగా ఉన్నప్పుడు గానీ , ఎండిన పిమ్మట గానీ పాలతో కలిపి ఉపయొగించ కూడదు .


 * పెసలు మినుములు , అనుములు, ఉలవలు, కొర్రలు, వరిగలు.ఈ పదార్ధాలను కుడా పాలతో కలిపి భుజించకుడదు .అలా భుజిస్తే శరీరం లొ వాతము విపరీతం గా ప్రకోపించి వాత వ్యాదులుని కలిగిస్తుంది.


 * బచ్చలి కూరలో నువ్వుల పిండి కలిపి తింటె వెంటనే అతిసార వ్యాది కలుగుతుంది.


 * కొంగ మాంసం , పంది మాంసం కలిపితింటే తిన్న వెంటనే ప్రాణాంతక విషం అవుతుంది.


 * ఉష్ణ శరీర స్వభావం కలవారు తమ శరీరం లొ ఉష్ణం అదికం గా ఉన్నప్పుడు తేనెను వేడి చేసి గాని వేడి వస్తువులతో కానీ తింటే ప్రాణాలకే ప్రమాదం వాటిల్లతుంది.


 * తేనే , నెయ్యి సమాన భాగాలుగా కలిపి ఎప్పుడు భుజించకుడదు . తెనే లొ సగబాగం నెయ్యి కానీ , నెయ్యి లొ సగబాగం తేనే కానీ కలిపి మాత్రమే తీసుకొవాలి . లేకపొతే రెండు అమృతాలు కలిసి " "అమృతం అమృతేన విషం " అన్నట్లుగా విరుద్దమై ప్రాణాలు తీస్తాయి.


 * తేనే ను కొంచం గోరువెచ్చని నీటితో తప్ప భాగా వేడిగా ఉన్న నీటితో కలిపి సేవిస్తే అది విష తుల్యం అవుతుంది.


       ఈ విధంగా మనం తినే ఆహర పదార్దాలలోనే , ఒక దానితో ఒకటి పడని పదార్దాలు చాలా ఉన్నాయి వాటిని మన మహర్షులు పరిశోధించి విరుద్ద గుణాలు గల ఆహార పదార్దాలు వాడవద్దు అని తమ తమ గ్రంథాలలో విపులం గా పేర్కొన్నారు. 


ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


             కాళహస్తి వేంకటేశ్వరరావు  


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                     9885030034

ఆశయం

 ఆశయం 


జననమరణ చక్రంలో 

జనియించే పట్టుదల

మనిషి మనసులో రగిలే 

సాధించాలనే ఆశయం!


నిదుర వదిలి నిట్టూర్చి

అనుకున్నది సాధిస్తే

అమరసిద్ధి కలుగును

ఆశయ సాధన జరుగును!


చేసుకున్న కర్మలని చేధించి

మంచిఆశయం మొలకెత్తించి

పట్టుదలనే పణంగాపెట్టి

పరిశ్రమిస్తే కలుగు విజయం!


పదిమందికి పాటుపడుతు

ప్రగతివైపు పయనిస్తే

తరతరాల భవిష్యత్తుకు

తరగని నిధిఐ వెలుగుతుంది!


కలలుకంటు కాలంగడపక

నిర్ధిష్టకాంక్షతో పోరాడు

ప్రతిఫలం నీకే సొంతం

విజయమే నీలోదీపం!


స్వార్ధచింతన కొంతమాని

కోరికలు చంపుకొని

కొత్తమార్గం ఎంచుకొని

సాధించు నీ లక్ష్యం!


ప్రసాదు యంవివి(సాదు)

కల్లూరు, ఖమ్మం జిల్లా

వేదాంత వ్యాసం

 వేదాంత వ్యాసం 

                         మొదటి భాగం 

బ్రహ్మ : 

గొప్పదానికంటే గొప్పది, దానికంటె గొప్పది మరొకటి లేదో అది బ్రహ్మము. సర్వ కారణము, సర్వాధారము, సృష్టిలో వ్యాపించి యున్నది. పొందదగినది, సత్‌చిత్‌ ఆనంద లక్షణమై యున్నది. జీవులలో 'నేను' అను దానికి అనుభవముగా ఉండగలది. సృష్టిలో సగుణము. సృష్టికి పూర్వము నిర్గుణము. ఏ బ్రహ్మ సంకల్పముననుసరించి సృష్టి స్థితి లయములు జరుగుచున్నవో, తిరిగి ఆ బ్రహ్మలోనే సర్వము లయమగుచున్నవో ఆ బ్రహ్మమే సాలోక్య, సామీప్య, సారూప్య ముక్తులకు ఆధారమై యున్నది.


పరబ్రహ్మ : 

బ్రహ్మయందు సంకల్పము నిర్వికల్పమైనప్పుడు ఆ నిర్వికల్ప బ్రహ్మమే పరబ్రహ్మ. సృష్టికి పూర్వమున్న బ్రహ్మ, అవ్యక్తము, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సృష్టి స్థితి లయములకు సంబంధము లేనిది. ఈ నిర్వికల్ప బ్రహ్మము నుండి సంకల్పము జనించనిది. శాశ్వతమైనది. ఆద్యంతములు లేనిది. మాయావరణ లేనిది. బ్రహ్మ లక్షణములకు అతీతమై విలక్షణమై యున్నది. బ్రహ్మకు పరమైనది పరబ్రహ్మ. సాయుజ్య ముక్తికి ధామమైనది.

         ఏ నిర్గుణ బ్రహ్మ సగుణమగుటకు ఆస్కారమో, అట్టి పరబ్రహ్మ మాత్రము సృష్టికి బీజ ప్రదాత, సాయుజ్య ముక్తికి ధామము కాదు.


అచల పరిపూర్ణ పరబ్రహ్మ : 

శాశ్వత నిర్వికల్పము. త్రిగుణ రహితము. సగుణ నిర్గుణా తీతము. సృష్టి స్థితి లయ పద్ధతికి ఎట్టి సంబంధము లేనిది. సృష్టికి బీజ ప్రదాత కానిది. శాశ్వతముగా కదలనిది. అచలము. ఉన్నదున్నట్లున్నది. దేశ కాలాదులకు మూలము కానిది. దానినుండి ఏదీ పుట్టదు. అది దేనినీ తనలోనికి లయము చేసుకొనదు. అన్నిటికీ నిరాధారమైనది. దానినుండి సంకల్పము పుట్టదు. వ్యక్తావ్యక్తములు కానిది. సర్వకాలాలలో, సర్వ దేశాలలో అచలమై అద్వయమై, ముల్లు గ్రుచ్చ సందు లేక నిబిడీకృతమై యున్నది. ఎరుక లేనిది, చైతన్యము లేనిది, అహంకారము లేనిది. దీనిని బయలని, బట్టబయలని, పరమపదమని అచల పరిపూర్ణమని, అచల పరిపూర్ణ పరబ్రహ్మమని అందురు.


పరిపూర్ణము : 

పరిపూర్ణము నిర్వికారము. దానినుండి, దానికి సంబంధము లేకనే, ఆనందము అనే స్పందన దానికదే కలిగెను. ఈ ఆనంద స్పందనమే మూలావిద్య. ఈ ప్రథమ స్పందనకు మూలావిద్య కారణము గాని, పరిపూర్ణము కారణము కాదు. జీవ ఈశ్వర జగత్తులు మూడూ మూలా విద్యకారణముగా తోచెను గనుక జీవేశ్వర జగత్తులు మాయా కల్పితములు. లోకములు, లోకేశులు, లోకస్థులు కూడా మాయా కల్పితములే. అవన్నీ భ్రాంతియే. పరిపూర్ణము భ్రాంతి రహితము, త్రిగుణ రహితము, నిర్వికారము, శాశ్వతము, అచలము. ఉన్నదున్నట్లున్నది. పరిపూర్ణమనగా అచల పరిపూర్ణము, అచల బ్రహ్మము. అచల పరిపూర్ణ పరబ్రహ్మము.


ఇహరూపము : 

ఎదురుగా ఇంద్రియ గోచరముగా నున్న దృశ్య జగత్తునకు అంతర్గతమైనది ఇహ రూపము. ఇది మధ్యలోనే వచ్చి, మార్పు చెందుచూ మధ్యలోనే పోయే స్వభావము కలది. ఆది అంతములు, ఉత్పత్తి నాశములు, చావు పుట్టుకలు కలది. ప్రాకృతము, పాంచభౌతికమైనది. మానసిక రూపమును సంతరించుకొన్నది. ఇహ అనగా ఇక్కడి సంగతి, ఇక్కడి సందర్భము, ఇక్కడి సంబంధము కలిగినది. ఇంతగా వర్ణించిన ఇహ రూపము నిజానికి లేదు. లేకనే ఉన్నట్లు కల్పించబడినది. పైగా బాధించేది. ఇంద్రజాలము వంటిది. మిథ్య. మాయా కల్పితము, త్రిగుణాత్మకము, స్వప్నతుల్యము, మేల్కొంటే లేనిది. స్వస్వరూపమందు లేనిది. ఊహామాత్రము. భావనామాత్రము. యత్భావంతద్భవతి. అభావమందు లేనిది. మృతరూపము. తనకు తానే తోచినది. పరజ్ఞానమందు తోచినది ఇహరూపము.


పరరూపము : 

ఈ దృశ్య జగత్తుకు ఆవలనున్నది. ఇహరూపమునకు పరము, అతీతము గనుక పరరూపము అని పేరు. పరరూపుడు ఇహమునకు సాక్షిరూపుడు. ఇక్కడి వ్యవహారము అంతా భావనారూపమని తెలిసి, శరీర లక్షణమునకు, సర్వమునకు ఆధారము, అవస్థా సాక్షిరూపము, మార్పు చేర్పులకు అతీతమైనది. ప్రేరణ రూపమైనది. ధారణా రూపమైనది. కాని అమృత రూపము, జీవేశ్వర జగత్తుల యొక్క అఖండ సారమైనది. స్వతఃసిద్ధమై యున్నది. శాశ్వతము, నిర్వికారము, నిర్వికల్పము అయినది పరరూపము

                             సశేషం 

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ