27, జులై 2021, మంగళవారం

ఆనాటి పెళ్ళి భోజనాలు

 మనందరినీ నాలుగైదు దశాబ్ధాల వెనుకకు తీసుకుపోయే మెసేజ్ -  ఆనాటి పెళ్ళి భోజనాలు ఒకసారి రుచి చూడాలంటే, చదివేయండి మరి 😃

చివరన, ఆగకుండా చదివిన తృప్తి ఎంత అంటే, చెప్పలేనంత👌😊

ఆరోజులు మళ్లీ రావు. వస్తే ఎంత బాగుండును? 


*పెళ్ళి భోజనం* 


ఆకుపచ్చని అరిటాకు ముందు కూచుంటాము శుభ్రంగా.  శుభ్రంగా...తడిగా మెరుస్తుంటుంది లేత అరిటాకు నవ నవలాడుతూ. 


వంటల వాసన గాలిలో తేలివస్తూ మనల్ని ఒక ఊపు ఊపేస్తుంటుంది తొందర చేస్తూ.  తినబోయే వాటి రుచులు నాలుకను చవులూరిస్తాయి. 


ఈలోగా ‘ చవి’ వడ్డిస్తానంటూ వస్తాడు ఒక బూరిబుగ్గల పిల్లవాడు. బొజ్జనిండా తిని పందిట్లో పడి అల్లరి చేస్తుంటే పిలచి వాడికి ఉప్పు విస్తట్లో పైన వారగా వేసే పని అప్పచెప్పారులా ఉంది. 

శ్రద్ధగా వేస్తున్నవాణ్ణి చూసి నవ్వుతుంటాం. 


పట్టుపరుకిణీ గర గర లాడించుకుంటూ నీళ్ళ జగ్గు పట్టుకొస్తుంది ఓ బాలామణి , దానితో పాటే ఇంకా కొందరు ఆడపిల్లలు వీరికి మంచినీళ్ళు పోసే పని . కిలకిలా గల గలా నవ్వుతూ చిందకుండా తలలు వంచి గ్లాసులలో నీళ్ళు పోస్తుంటే, ఆడపిల్లల వద్దిక చూసి ముచ్చట పడిపోతాం ఆకుల ముందు కూచున్న మనం . 


ఈలోగా వస్తాడు పూర్ణంబూరెల బుట్ట పుచ్చుకుని చినమామయ్య. 

ఈ మామయ్యకు లౌక్యం బాగా తెలుసు. 

బావా ! బామ్మర్దీ! ఏమే మరదలా ! మేనకోడలా ! అని పలకరిస్తున్నట్టే పలకరిస్తూ లాఘవంగా రెండు బూరెలు వడ్డించిపోతుంటాడు వేగంగా. ఇంకోటి వేయవయ్యా ! అంటున్నా మాటలు చెవిని వేసుకోనే వేసుకోడు. 


పెద్ద పళ్ళంలో కనపడేట్టు పట్టుకుని పొడుగ్గా ఉన్న అరటికాయ బజ్జీ అందంగా వడ్డించి పోతాడు నూనూగు మీసాల మేనల్లుడు మరో మాటుండదు. 


వచ్చి ఆకులో ఇటుపక్క  చెంమ్చాతో చూసి చూసి వడ్డిస్తుంది దోసావకాయను , పెళ్ళై ఇద్దరు పిల్లలున్న నంగనాచి మేనకోడలు. 

ఆ దోసావకాయ ఘాటుకు నోట్లో నీళ్ళూరి , ‘అదేమిటే ఆ  విదపడం ..ఇంకొంచం వేయచ్చు కదే ‘అంటే , 

‘ముందు అది తినవమ్మా తర్వాత మళ్ళా వేస్తా ‘అంటూ తన పిల్లలకు చెప్పినట్టు చెపుతూ చక్కా పోతుంది. 


తర్వాత కొత్తావకాయని అత్తయ్య పట్టుకొస్తుంది . 

ఈ రంగు చూసావా వదినా! 

నే దగ్గరుండి గుంటూరు మిరపకాయలు ఆడించి కలిపించాను, ముక్క కసుక్కుమంటోంది కొరికితే ‘ అంటూ పెచ్చుతో సహా ఎర్రెర్రని ఆవకాయ వడ్డించి అందరి మనసు రంజింప చేస్తుంది. 


పచ్చళ్ళ గుత్తి పుచ్చుకొని తెల్లటి లాల్చీ పైజమా వేసుకున్న బాబయ్య వస్తాడు వడ్డించడానికి. ఈ బాబయ్య ఎప్పుడూ తెల్లటి బట్టలే వేసుకొని చల్లగా నవ్వుతుంటాడు. 

పైగా వడ్డింపుకు పట్టుకొచ్చినదో.. 

రుచులూరించే గోంగూర పచ్చడి దానికి తగ్గట్టుగా గొప్పకబుర్లు చెపుతూ’ మీ పిన్ని చేత చేయించాను, ఆకంతా నేనొక్కడినే వలిచాను తెలుసా ‘ అంటూ. ఆచేత్తోనే గుత్తి రెండో భాగంలో ఉన్న తాజాగా ఘుమ ఘుమలాడే కొబ్బరికాయ మామిడికాయ కలిపిన పచ్చడి వడ్డించేసి పోతాడు. 


తర్వాత అమాయకపు పిన్ని వంతు. పట్టెడు పట్టెడు పులిహోర వెనకాడకుండా వడ్డిస్తుంటుంది, వరసలో కుర్రవెధవ నాకు వేరుశనగపలుకులు ఎక్కువ రాలేదంటే, మళ్ళీ వెనక్కి వెళ్ళి చిరునవ్వుతో వడ్డిస్తుంది. ‘సుబ్బరంగా తినండి , లేకపోతే అక్క నన్ను కోప్పడుతుంది ‘ అంటుంది తెచ్చుకున్న పెద్దరికంతో. 


ప్రత్యేకంగా పనసపొట్టు కూర గంపలో వేసుకు పట్టుకువస్తాడు వంటపంతులు మామ. ఎంతో కష్టపడి చేసిన ఆ కూర తన చేత్తో తానే వడ్డించాలని, పదిమందికీ తన వంట నైపుణ్యం చెప్పాలని , పనసపొట్టు కొట్టిన దగ్గరనుంచి పోపు పుష్కలంగా వేసానని , జీడిపప్పుకు మొహమాటపడలేదని,  కొంచం ఆవ కూడా తగిలించానని వర్ణిస్తూ వడ్డిస్తుంటే మనం ఉవ్విళ్ళూరిపోతాం ఎప్పుడెప్పుడు నోటపెట్టుకుందామా అని. 


ఈలోగా ’గుత్తివంకాయ కూర ‘అంటూ అరుస్తూ వడ్డిస్తాడు అసిస్టెంటు కుర్రాడు , పరుగులే నుంచోడం లేదు. గరిట నుంచి జారి విస్తట్లో పడుతుంటుంది నూనె ఓడుతున్న నోరూరూంచేసే గుత్తి వంకాయ . ఎవరో అది చూడంగానే బంతిలో వారు కూనిరాగం తీస్తారు , *‘గుత్తివంకాయ కూరోయి బావా ”* అంటూ. 


పప్పు గోకర్ణంతో వస్తాడు పెళ్ళి కూతురు అన్నగారు. చెల్లెలి పెళ్ళిపనుల పర్యవేక్షించి అలసిపోయినట్టున్నా , వడ్డింపు పనికి కూడా పరుగెట్టుకొచ్చాడు. మరి ఇదే కదా అన్నిటికన్నా ముఖ్యమైన పని, వచ్చిన అతిధులను భోజనంతో ఆదరించడం . పేరుకు పప్పు గోకర్ణం పట్టుకు వడ్డిస్తున్నా , పది కళ్ళు పెట్టుకు చూస్తున్నాడు అందరకీ అన్నీ అందుతున్నాయా, వడ్డింపులు సరిగా సాగుతున్నాయా అని. అంత హడావిడిలోనూ ఆకులో మామిడికాయ పప్పు వడ్డిస్తూ మొహంలో నవ్వు చెదరనివ్వనేలేదు.  


సిల్కు వల్లెవాటు జారిపోతుంటే సద్దుకుంటూ, మొహం మీది ముంగురులు వెనక్కి తోసుకుంటూ, అక్క పెళ్ళికి సందడి అంతా తానై తిరుగుతున్న కాటుక కళ్ళ చిన్నది, పెళ్ళి కూతురు చెల్లి అప్పడాలు,గుమ్మడి వడియాలు,ఊర మిరపకాయ వడ్డిస్తోంది హుషారుగా. కాని ఒకళ్ళకి వడియం వడ్డించడం, వదిలేస్తే ఇంకోరికి ఊరమిరపకాయ సొడ్డు పెడుతోంది , నలుగురినీ ఒక్కదగ్గరగా చూసిన గాభారాలో. పైగా పొలోమంటూ ఈ పిల్లను చూడగానే ప్రతీవాళ్ళూ పరాచికాలాడటమే. 

*‘ఏమిటా కంగారు అంటూ ‘తర్వాత నీదే కదా ఛాన్స్’,* *నువ్వెప్పుడు పెట్టిస్తావే పప్పన్నం’* 

ఇవ్వన్నీ వింటూ ఆ పిల్ల సిగ్గుపడిపోయి మరింత కంగారుపడి , కనిపించిన వదిన గారికి ఆ అప్పడాలు అప్పచెప్పి తుర్రుమంది. 


వెంట అన్నం పట్టించుకుని చేతిలో నేతి కొమ్ముజారీ పట్టుకుని పట్టుచీరతో అక్షింతలు పూలరేకులు కాసిని మీదపడి అంటుకున్నవాటితో ఆమట్ని ఆపసోపాలు పడుతూ వస్తుంది పెద్దమ్మ , పెళ్ళికూతురు తల్లి యజమానురాలు. మొహమంతా పెళ్ళి నిర్విఘ్న్నంగా జరిగిందన్న తృప్తీ సంతోషమూనూ. 

ప్రతి వక్కరనీ పేరుపేరునా వరసలతో పలకరిస్తూ పెద్దవాళ్ళని ‘ ‘అన్నయ్యా! వచ్చి నీ చేతుల మీదుగా 

మా పిల్ల పెళ్ళి జరిపించావు, వదినా భోజమనమయ్యేక బొట్టెట్టించుకుని తాంబూలం తీసుకు వెళ్ళండమ్మా’ అంటూనూ’ 

తమ్ముడూ ! నువ్వొచ్చావు ఎంతో సంతోషం , అమ్మాయీ లక్షీమీదేవి లాగ ఉన్నావమ్మా’ అంటూ చిన్నవాళ్ళనీ పలకరించుతూ, వడ్డించిన అన్నం మరికాస్త కలపండి మొహమాటం లేకుండ భోంచేయమని చెపుతూ , చాలు చాలంటున్నా నేయి ధార కట్టిస్తుంది విస్తట్లో. 


ఈలోగా అల్లక్కడ లోపలనుంచి  *‘తప్పుకోండి , తప్పుకోండి వేడి వేడి గుమ్మడికాయ దప్పళం వస్తోంది’* అని కేకలు వినిపిస్తుంటాయి . 

మనం అయితే దప్పళానికి ఖాళీ ఉంచుకోవాలనుకుంటూ, అన్నీ తినేసి కొంత అన్నం మధ్యలో గుంట చేసి పెట్టుకొని అందులో వేడి వేడి ముక్కల పులుసు పోయించుకొని మైమరచి తింటాము. 


అప్పుడొస్తాడు పెళ్ళి పెద్ద గృహయజమాని కన్యాదాత , కమ్మని గట్టి పెరుగు దగ్గరుండి వెంటబెట్టించుకుని. జోడీగా చక్కెరకేళీ,అరటిపండు .విస్తట్లో పెరుగుకు అన్నం ఏదని కేకలు పెట్టి మళ్ళీ అన్నం వడ్డిపిస్తాడు. అన్నీ అందాయా లోటేమీ జరగలేదు కదా అని కనుక్కుంటాడు. 

అతని మొహంలో భారం దిగిన తేలిక తృప్తి సంతోషం పరవళ్ళు తొక్కుతున్నా పొంగిపోకుండా అందరకీ తన ఆహ్వానం అందుకొని పెళ్ళికి వచ్చినందుకు పేరు పేరునా కృతజ్ఞతలు చెప్పుకుంటాడు. ఇంకా చేయవలసిన బాధ్యతలు తలచుకుంటూ అందరనీ గబ గబా చిరునవ్వుతో తలపంకించి చూస్తూ అభినందనలు అందుకుంటూ ముందుకెడుతుంటాడు. 


ఈయనకు ఎదురు వస్తాడు అత్తాకోడలంచు పంచా, కండువా సవరించుకుంటూ, పెళ్ళికూతురి తండ్రికి ప్రాణస్నేహితుడుట. ‘ ప్రత్యేకించి పురమాయించి చేయించాను, మాపిల్ల పెళ్ళి కోసం’ అంటూ  బూందీ మిఠాయి , పాకం కాజా వేసి, ‘ వదలకుండా తినాలి’ అని బెదిరించి మరీ వెడతాడు. 


చివరలో ఎవరు పెట్టి పోయారో గమనించముగాని , భోజనం పూర్తి చేసి తలఎత్తి చూసేటప్పటికి సుగంధభరితమైన తియ్యని కిళ్ళీ ఉంటుంది, మంచినీళ్ళ గ్లాసు పక్కన. 


కిళ్ళీ నోట్లో బిగించి , ఎదురుగా చూస్తే పందిట్లో ఓ పక్క వెండి కంచాలలో వధూవరులకు భోజనం వడ్డించి, స్నేహితులు వరసైన వారు పరాచికాలాడుతూ వారిని ఒకరికొకరు తినిపించుకోవాలని గొడవ చేస్తుంటారు. సిగ్గులతో ఓరచూపులతో కొంటె నవ్వులతో,ఒకళ్ళకొకళ్ళు తినిపించుకుంటూ ఒకరు కొరికిన మిఠాయి మరోకరు కొరుకుతూ , జీవితంలోని మధురిమలను రుచులను కలిసి అందుకోవడానికి సిద్ధమైన వారిని దూరం నుంచే మనసులో  కలకాలం సుఖంగా బతకమని ఆశీర్వదించి, భుక్తాయాసంతో ఇంటిదారి పడతాం మనం. 


*మరి ఈరోజుల్లో ఆ సరదాలు ఎక్కడ కానరావాయే....* 


*ఆ రోజులు మళ్లీ రావు, కదా, వస్తె ఎంత బాగుండు?*

  

.... *శ్రీమతి జానకి చామర్తి గారి రచన*

🙏🙏🙏🌹🌹🌹👌😊

వైదిక విజ్ఞానం అనే Link

 👇Link opened👇                         👉https://vignanam.org/mobile/

 

 ఈ వైదిక విజ్ఞానం అనే  Link     

అన్ని భాషలలో  ఇంతవరకు మీరు చూసి ఉండరు 


ఏ Book తో పని లేకుండా సమస్త దేవతల, దేవుళ్ళ  స్తోత్రాలు, అస్త్రోత్రాలు , శతనామాలు, సుప్రభాతాలు, చాలీసాలు, హారతులు  భగవద్గీత పతంజలి యోగ సూత్రాలు 

ఒకటేమిటి మీరు ఉహించలేనివి


భారతమాత కు సంభందించిన       

అన్ని వందేమాతరం జనగణమన సరేజహాసే అచ్చా మాతెలుగు తల్లికి  దేశభక్తి ,జాతీయ గీతములు


 అన్ని హారతులు అన్నమయ్య, రామదాసు త్యాగరాజు  కీర్తనలు

 

ఇవి ఒక ఉదాహారణ మాత్రమే ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో.... 

ఇది మీకు జీవితాంతం మీతో ఉంచుకోతగిన Link .దీని కోసం ఎంతో శ్రమ పెట్టి ఇది తయారు చేసిన వారికి  హృదయ పూర్వక వందనము. 

ఇంత అత్యంత విలువైన దానిని ప్రతిఒక్కరు

ఉపయోగించుకుంటారని ప్రతిగ్రూప్   కి పంపుతారని  కోరుకొoటూ....🙏😊

ప్రశ్న పత్రం సంఖ్య: 15

  ప్రశ్న పత్రం సంఖ్య: 15                          కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

 క్రింది సాహిత్యానికి సంబందించిన ప్రశ్నలకు జవాబులు తెలుపండి 

1) మనుచరిత్ర వ్రాసినది ఎవరు.  

2) మహాప్రస్థానం కవి ఎవరు. 

3) గిరీశం పాత్ర ఏ నాటకం లోనిది 

4)  రామరాజభూషణుని ఇంకొక పేరు ఏమిటి. 

5) మేఘ సందేశం వ్రాసినది ఎవరు. 

6) తెలుగులో తోలి కవి అని ఎవరిని అంటారు. 

7) రామాయణం మొదటిసారి తెలుగులో వ్రాసిన కవియిత్రి ఎవరు. 

8) " పొగ తాగనివాడు దున్నపోతయి పుట్టున్" అన్న డైలాగు ఎవరిది. 

9) ఈ క్రింది పద్యం ఎవరు వ్రాసారని విశ్వసిస్తారు 

అల వైకుంఠ పురంబులో నగరిలో నా మూల సౌధంబు దా
పల మందార వనాంత రామృత సరః ప్రాంతేందు కాంతోపలో
త్పల పర్యంక రమావినోది యగు నాపన్నప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము “పాహి పాహి” యనఁ గుయ్యాలించి సంరంభి యై.

10) బారిస్టర్ పార్వతీశం నవల రచయిత ఎవరు 

11)సిరిగలవానికి చెల్లును

తరుణుల పదియారువేలదగ పెండ్లాడన్
మిగిలింది పూరించగలరు 

12) కన్య శుల్కం నాటకం ఏ సాంఘిక దురాచారానికి వ్యతిరేకంగా వ్రాసారు. 

13) కావ్యేషు రమ్యం ________

14)  "శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిహి" అంటే అర్ధం ఏమిటి. 

15)  "ఖరహర ప్రియ" రాగం వ్రాసింది ఎవరు 

16)  ఈ క్రింది పద్యం ఏ ప్రబంధంలోది, ఎన్నవ అశ్వాసము, కవి ఎవరు. 

ఇంతలు కన్నులుండ తెరువెవ్వరి వేడెదు భూసురేంద్ర ఏ

కాంతమునందునున్న జవరాండ్ర నెపంబిడి పల్కరించు లా
గింతియ కాక నీవెరుగవే మునువచ్చిన త్రోవచొప్పు నీ
కింత భయంబులే కడుగ నెల్లిదమైతిమె మాటలేటికిన్‌

17)  ఈ క్రింది పద్యం, కవి, గ్రంధము, ఘట్టం తెలుపగలరు. 

మందార మకరంద మాధుర్యమున దేలు
మధుపంబు వోవునే మదనములకు

18) ఈ క్రింది పద్యం మిగిలిన పాదాలు పూర్తించండి, కవి పేరు తెలపండి. 

సిరిదా వచ్చిన వచ్చును
సరసంబుగ నారికేళ సలిలము భంగిన్

19) శతకానికి ఎన్ని పద్యాలువుంటాయి  

20) శతకాలలో మకుటం అని దేనిని అంటారు. 

21)  ఒక యోగి వ్రాసిన శతకం తెలపగలరు 

22) కాదేది కవితకు అనర్హం అన్న కవి ఎవరు.  

23) ఈ పద్యం మొదటి రెండు పాదాలు తెలుపగలరు  

హాలికులైన నేమి? గహనాంతర సీమలఁ గందమూల కౌ

ద్దాలికులైన నేమి నిజదారసుతోదరపోషణార్ధమై.

24) ఉత్పల మాలిక అంటే ఏమిటి. 

25) తెలుగు, సంస్కృతంలో ఆశువుగా ఉత్పల మాలిక చెప్పి గండపెండేరం అలంకరించుకున్న కవి ఎవరు. 

 


ప్రశ్న పత్రం సంఖ్య: 14

 ప్రశ్న పత్రం సంఖ్య: 14                          కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

 క్రింది ప్రశ్నలకు జవాబులు తెలుపండి ప్రతి పదం "“రు " " తో అంతమౌతాయి  

1) జీవనాధారము  

2) నిజము కాదు  

3) పడవలని ఓడలని ఆపటానికి వడ్డులో వేసేది   

4)  గుంటూరు జిల్లలో ఒక గ్రామము 

5) మంచానికి నేసేది    

6) అన్నంలో కలిపి తేనే ఒక ద్రవ వంటకం   

7) వివాహాలలో విందులల్లో చాల్లే సువాసన ద్రవం 

8) ఉన్న విషయం చెప్పటానికి ఎందుకు నీకు అంత  ______

9) ఆంద్రప్రదేశ్ లోని ఒక జిల్లా ---

10) చివర ----

11) మలేషియాలోని ఒక పట్టణం ---

12) షడ్రుచులలో ఒక రుచి 

13) పారే జలము 

14)  చిన్న పిల్లలకు పెట్టె నల్లని బొట్టు

15)  చాలా తేలికగా చేసే విషయానికి  _____ మీద నడక అంటారు 

16) ముళ్ళు గల ఒక కయ 

జవాబులు 

1) జీవనాధారము ----  నీరు  

2) నిజము కాదు ---పుకారు 

3) పడవలని ఓడలని ఆపటానికి వడ్డులో వేసేది   లంగరు 

4)  గుంటూరు జిల్లలో ఒక గ్రామము పొన్నూరు 

5) మంచానికి నేసేది    నవారు 

6) అన్నంలో కలిపి తేనే ఒక ద్రవ వంటకం   సాంబారు 

7) వివాహాలలో విందులల్లో చాల్లే సువాసన ద్రవం పన్నీరు 

8) ఉన్న విషయం చెప్పటానికి ఎందుకు నీకు అంత  ______కంగారు 

9) ఆంద్రప్రదేశ్ లోని ఒక జిల్లా ---నెల్లూరు 

10) చివర ----ఆఖరు  

11) మలేషియాలోని ఒక పట్టణం ---కౌలాలంపూరు 

12) షడ్రుచులలో ఒక రుచి -----వగరు 

13) పారే జలము ---- ఏరు 

14)  చిన్న పిల్లలకు పెట్టె నల్లని బొట్టు--- అగరు 

15)  చాలా తేలికగా చేసే విషయానికి  _____ మీద నడక అంటారు ---నల్లేరు 

16) ముళ్ళు గల ఒక కయ ----- పల్లేరు 

తెలుగు భాష గొప్పతనం

 🤣😋🤣నవ్వుల శుభోదయం🤗🤔😍😘


ఖ-క.... లకు ఎంత తేడా వుందో చూడండి.... తెలుగు భాష గొప్పతనం గుర్తించండి. 

లాయర్ : మీ వివాహానికి కారణం?

ఆనంద్ : *ప్రేమలేఖ*

లాయర్ : మరి ప్రేమించి పెళ్ళి చేసుకొని.. ఇప్పుడు విడాకులెందుకు?

ఆనంద్ : *ప్రేమలేక*

😀😁😂🤣😃😄😅😆😉😊😋😎😍😘


😝😜🤣 నవ్వుల శుభోదయం 😍


*ప్రసాద్* : ఏ వస్తువు కొనాలన్నా మా ఆవిడ రెండు కారణాలు చూపిస్తుందిరా!

*మురళి*: ఏమిటవి?

*ప్రసాద్*: పక్కింటివాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి మనం కొనాలి. లేదా వాళ్ళ దగ్గర లేవు కనుక మనం కొంటే గొప్పగా ఉంటుందని కొనిపిస్తుంది.😞

😜😜😜😬😬😬😂😂😂😍😘😗😚


*భర్త : అదేంటీ.. పంతులు అన్ని నక్షత్రాలుండగా ఒక్క అరుంధతిని మాత్రమే చూపించాడు....!!* 🤔🤔


*భార్య : మిగతా నక్షత్రాలన్నీ రేపటి నుండి నేను చూపిస్తానుగా...!!*😳😳

😜😜😜😬😬😬😂😂😂🙄😐😶


🤣 నవ్వుల శుభోదయం 😍


 *నవ్వొస్తే నవ్వుకోండి...!*


*టీచర్:* _"సతీ సావిత్రి కధ లో  నువ్వు  తెలుసుకున్నది ఏమిటి?"_


*స్టూడెంట్:* _"భార్య నుండి భర్తను  ఆ యముడు కూడా కాపాడలేడని!"_

 🤣😃😄😅😜😅😄😃🤣😂😁😀


నవ్వుల శుభోదయం 🤣


ఒక సందేశాన్ని అత్యంత వేగంగా చేరవేయాలంటే *"ఈమెయిల్"*అయినా ఉండాలి లేదా *"ఫీమేల్"* అయినా ఉండాలి.

రెండవది మరింత వేగంగా చేరవేస్తుంది.!😜

😉😉😉😉😉😉😉😉😉😉😉😉


నవ్వుల శుభోదయం 🤣

*పెళ్ళి* అంటే ఏంటో  కుతూహలంతో ఒక *శాస్త్రవేత్త* పెళ్లిచేసుకున్నాడు ... కొంతకాలం తర్వాత అతనికి అర్ధమయ్యింది ...


*శాస్త్రవేత్త* అనేవాడు అందరికీ పనికొచ్చే ప్రయోగాలు చేయాలి కానీ , పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేయకూడదని..

😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊


నవ్వుల శుభోదయం 😜

ఈ భూమ్మీద ....

రెండే రెండు వింతలు చెప్పుకోదగ్గవి !!!!

1 . *మద్యపానం*...

ఎంతటి మితభాషి నైనా...

మాట్లాడేటట్టు చేస్తుంది!!!

2 . *భార్య* ...

ఎంతటి ఘనుడినైనా...

మూగవాని గా మార్చేస్తుంది !!!!! 😁

😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋


నవ్వుల శుభోదయం 😍

దొంగ .. పోలీసుతో ఇలా..


*దొంగ* : మా కష్టాలు ఏమి చెప్పమంటారు..ఈ పెళ్ళిల సీజన్లలో 20 చైన్లు లాగితే 18 గిల్టు చైనులు ఉంటున్నాయి ..😭

😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎


నేను బస్ లో వెళ్తున్నా..

నా ముందు నిల్చున్న అబ్బాయి

మొబైల్ లో జాతీయ గీతాన్ని పెట్టాడు ....

నేను లేచి నిల్చున్నా..

యెదవ నేను నిల్చోగానే సాంగ్ ఆఫ్ చేసి నా సీట్ లో కుార్చున్నాడు....

😥😥


వాట్సాప్ నుండి

దేవున్ని చూసారా

 Lఒక ప్రఖ్యాత శైవ క్షేత్రానికి  ఒక జర్నలిస్ట్  వెళ్ళింది,

 ఏదైనా సెన్సషనల్ న్యూస్ వేసి మంచిపేరు తీసుకో వాలని ఆమె కోరిక. 

అక్కడే ఉన్న ఒక  భక్తుడిని ఇలా అడిగింది. 

జర్నలిస్ట్ :మీ  వయసు ఎంతుంటుందండి? 

భక్తుడు :85 ఏళ్లు ఉంటాయండి 

జర్నలిస్ట్ :ఎన్నేళ్లుగా గుడికి వస్తుంటారు? 

భక్తుడు : నాకు  బుద్ది వచ్చినప్పటి నుండి 

జర్నలిస్ట్ : మరి దేవున్ని  చూసారా? 


భక్తుడు : లేదండి 

జర్నలిస్ట్ :మరి ఎందుకు అంత నమ్మకంగా ప్రతిసారి గుడికి వెళుతున్నారు? 

భక్తుడు :మీరెక్కడ నుండి వచ్చారు? 

జర్నలిస్ట్ :సిటీ నుండి 

భక్తుడు :అక్కడ ఎక్కువ కుక్కల్ని పెంచుకొంటారట కదా? 

జర్నలిస్ట్ :అవును, చాలా ఇళ్లల్లో పెంచుకొంటారు 

భక్తుడు :మాది  చిన్న పల్లెటూరండి, అక్కడ పంట చేల్లో దొంగలు పడకుండా కొంత మంది మామూలు కుక్కల్ని పెంచుకొంటారు, 

జర్నలిస్ట్ :నేనడిగిన దానికి మీరు చెప్పేదానికి ఏమిటి సంబంధం? 

భక్తుడు :రాతిళ్ళు పంట చేల దగ్గర  ఎవరైనా దొంగ కనిపిస్తే ఒక కుక్క మొరుగుతుంది, అది చూసి చుట్టూ దూరంగా  ఉన్న కుక్కలు కూడా మొరుగుతాయి, కానీ దొంగని చూసింది ఒక కుక్క మాత్రమే, కానీ మిగతా కుక్కలు దాని మీదున్న నమ్మకంతో నే  మొరిగాయి తప్ప అవేవి దొంగని చూడలేదు. 

అలాగే వేల సంవత్సరాలనుండి ఎంతో మంది, ఋషులు, పుణ్యపురుషులు, రాజులు, తపస్సు తో దేవుడి నే చూసివచ్చిన వాళ్ళు ఇలా ఎంతో మంది హిందూ ధర్మం లో పురాణపురుషులు చెప్పారు దేవుడు ఉన్నాడని, అలాంటప్పుడు  

యోచనా శక్తి లేని కుక్కలే  ఇంకొక కుక్క మీద నమ్మకంతో మొరిగాయి, 

అలాంటిది ఆలోచించే శక్తి, ఉన్న మనుషులం మనం మన పూర్వీకుల నే నమ్మలేమా !

తప్పకుండా మంచిమనస్సుతో ఎప్పటికైనా దేవుణ్ణి దర్శించుకొంటాను. 

జర్నలిస్ట్ : క్షమించండి. మీ అనుభవం అంత,

 నా వయసు లేదు, తప్పుగా  మాట్లాడిన  జీవిత సత్యాన్ని తెలుసుకున్నాను.

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*పారాయణం తో పరివర్తన..*


"నువ్వు నీ చాదస్తం తో నన్ను కాల్చుకు తినొద్దు..నన్ను నీకు తోడుగా రమ్మన్నావు..నీతో పాటు వచ్చాను..నువ్వు పారాయణమే చేసుకుంటావో..పొర్లుదండాలు పెడతావో..నీ ఇష్టం..అవన్నీ చేయమని నన్ను బలవంతం చేయకు.." అని ఖరాఖండిగా తేల్చి చెప్పేసింది..అలా మాట్లాడుతున్న కూతురుని చూసి మౌనంగా తలూపింది ఆ పిల్ల తల్లి..ఆ అమ్మాయి వయసు పాతికేళ్ల లోపే..తల్లికి సుమారు నలభైఐదేళ్ల వయసు ఉన్నది..ఆమె పేరు రాజేశ్వరి గారు..ఆ అమ్మాయి పేరు కల్యాణి.


ఆ తల్లీకూతుళ్ళు ఆరోజు ఉదయమే శ్రీ స్వామివారి మందిరానికి బస్సులో వచ్చారు..బస్సు దిగగానే..రాజేశ్వరి గారు నేరుగా బావి వద్దకు వెళ్లి తన కాళ్ళూ చేతులూ కడుక్కొని..కొన్ని నీళ్లు నెత్తిన చల్లుకుని..కూతురి నెత్తిమీద కూడా చల్లింది.. అప్పుడే ఆ అమ్మాయి చిరాగ్గా ముఖం పెట్టుకున్నది..ఆ అమ్మాయికి దైవం  మీద పెద్దగా విశ్వాసం లేదు..పైగా భక్తి, విశ్వాసాలు కలిగిన వారిని చూస్తే చిరాకు కూడా..శ్రీ స్వామివారి మందిరానికి కూడా కేవలం తన తల్లి తోడుగా రమ్మని బలవంతం చేస్తే వచ్చింది..వచ్చే ముందు కూడా తల్లితో తనను నమస్కారం పెట్టమని బలవంతం చేయొద్దని చెప్పింది....సరే అని చెప్పి బైలుదేరింది ఆవిడ..


శ్రీ స్వామివారి మందిరం లోపలికి వచ్చి..శ్రీ స్వామివారి ప్రధాన మంటపం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేసి..అర్చన చేయించుకొని..ముందున్న మంటపం లో కూర్చున్నారు రాజేశ్వరి గారు.. ఆరోజు ఆదివారం..భక్తులు ఎక్కువగానే వచ్చారు..శ్రీ స్వామివారి మందిరం కోలాహలంగా ఉన్నది..కొందరు జుట్టు విరబోసుకొని..మందిరం చుట్టూ కేకలు పెడుతూ పరిగెడుతున్నారు..మరికొందరు మంటపం లో పడుకొని వున్నారు..ఇంకొందరు "దత్తాత్రేయా మమ్ములను చల్లంగా చూడు.." అని గట్టిగా ప్రార్ధిస్తున్నారు..మందిరానికి బైట వైపు..భజన జరుగుతున్నది..పరిసరాలు మరచిపోయి భజన చేస్తున్నారు కొందరు..ఇంత సేపూ ఆ అమ్మాయి  మంటపం లో కూర్చుని అందరినీ గమనిస్తోంది..


ఏ మహత్తూ లేకపోతే.. ఇంతమంది..ఇంత విశ్వాసం తో ఇక్కడికి ఎందుకొస్తారు?..అని మొదటిసారిగా ఆ అమ్మాయి మనసులో సందేహం మొదలైంది..మెల్లిగా వాళ్ళమ్మ దగ్గరకు వెళ్లి.."అమ్మా..ఇందాకటి నుంచి గమనిస్తున్నాను..ఇక్కడ సిద్ధిపొందిన ఈ స్వామివారి మీద అందరికీ ఇంతటి భక్తి విశ్వాసాలున్నాయి..ఏమిటీ మహాత్యం?.."అని అడిగింది..అలా అడిగిన కూతురి వైపు ఆశ్చర్యంగా చూసిన ఆ తల్లి..తాను పారాయణం చేస్తున్న శ్రీ స్వామివారి జీవిత చరిత్రను చదవమని ఆ అమ్మాయికి ఇచ్చింది..


"పారాయణమే చేస్తావో..పొర్లుదండాలే పెడతావో..నీ ఇష్టం.." అని చెప్పిన ఆ పిల్ల..కేవలం రెండుగంటల సేపు శ్రీ స్వామివారి మందిరం లో గడిపి..మనసులో ఏర్పడిన కుతూహలం కారణంగా శ్రీ స్వామివారి జీవిత చరిత్రను పారాయణం చేయడం మొదలుపెట్టింది..సాయంత్రం నాలుగు గంటలకు ఆ పుస్తకాన్ని పూర్తిగా చదవడం పూర్తిచేసింది..తన తల్లి దగ్గరకు వచ్చి.."అమ్మా..స్వామివారి సమాధిని దర్శించుకుంటాను.." అన్నది..అనడమే కాదు..తల్లిని వెంటబెట్టుకొని..శ్రీ స్వామివారి సమాధి దర్శనం చేసుకొని..అర్చన కూడా చేయించుకున్నది..మంటపం లో ఉన్న శ్రీ స్వామివారి చిత్రపటానికి తల ఆనించి కొద్దిసేపు నిలబడింది..ఆ సమయంలో ఆ అమ్మాయి కళ్ల నుంచి అశ్రువులు ధారగా కారుతున్నాయి..స్వామివారి మీద భక్తి వల్లనా.. లేక పశ్చాత్తాపం వల్లనా అనేది ఆ దైవానికే తెలియాలి..


అంతవరకూ ఆ అమ్మాయిలో ఉన్న మొండితనం..దైవం పట్ల ఉన్న నిరసన భావం ఎటుపోయాయో తెలీదు..ఆ నిమిషం వరకూ..కల్యాణి అని పిలువబడే ఆ అమ్మాయి..మొగలిచెర్ల గ్రామం వద్ద సిద్ధిపొందిన శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి భక్తురాలు కల్యాణి గా మారిపోయింది..మరెప్పుడూ దైవం పట్ల చులకన భావాన్ని ప్రదర్శించలేదు..ప్రస్తుతం వివాహం చేసుకొని సాఫ్టువేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న కల్యాణి ..ప్రతి సంవత్సరం రెండుసార్లు భర్త తో సహా  శ్రీ స్వామివారి మందిరాన్ని దర్శిస్తున్నది...ఒకప్పుడు "ఏమిటీ మహాత్యం?.." అని తన తల్లిని ప్రశ్నించిన కల్యాణి..తన లో వచ్చిన మార్పే ఆ మహాత్యం అని గ్రహించింది..శ్రీ స్వామివారిని దర్శించడానికి భర్తతో కలిసి మందిరానికి వచ్చిన ప్రతిసారీ..భక్తులకు అన్నదానం చేసి..తిరిగి వెళ్లడం కల్యాణి కి ఆనవాయితీగా మారిపోయింది..కల్యాణి ఈ విధంగా మారిపోవడానికి శ్రీ స్వామివారి చల్లని కరుణ కాక మరేమిటి?..


సర్వం..

దత్తకృప.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114.. సెల్..94402 66380 & 99089 73699).

26, జులై 2021, సోమవారం

తస్మాత్ జాగ్రత

తస్మాత్ జాగ్రత జాగ్రత !

1. శ్లో|| మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర |
               అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత  జాగ్రత||

తా:- తల్లి, తండ్రి, బంధువులు, అన్నదమ్ములు, ధనము, ఇల్లు ఇవి అన్నియు మిధ్యయే. ఇవి ఏవియు నిజముగా లేవు అందుచే ఓ మానవుడా సావధానుడవై ఉండుము.

2. శ్లో|| జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం పునః పునః|
      సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత  జాగ్రత||

తా:- ఈ జన్మము, వృద్ధాప్యము, భార్య, ఈ సంసారము ఇవన్నియు దుఃఖ భరితములు. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.

3. శ్లో|| కామశ్చ, క్రోధశ్చ, లోభశ్చ దేహే తిష్ఠతి తస్కరాః|
      జ్ఞాన రత్నాపహారాయ తస్మాత్ జాగ్రత  జాగ్రత||

తా :-  కామము, క్రోధము, లోభము మొదలైన అరిషడ్వర్గములు మనలోని జ్ఞానమనెడు  విలువైన రత్నములను దొంగిలించుటకై మన దేహమునందు దాగియున్నదొంగలు. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.

4. శ్లో|| ఆశయా బధ్యతే జంతుః కర్మణా బహు చింతయా|
      ఆయుక్షీణం న జానాతి తస్మాత్ జాగ్రత  జాగ్రత||

తా:- ఈ మనుష్యులు ఎల్లప్పుడూ ఎదియో చేయవలెనను ఆశతోనే జీవింతురు. కానీ తరిగిపోవుచున్న జీవిత కాలమును గుర్తింపరు. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.

5. శ్లో|| సంపదః స్వప్రసంకాశాః యౌవనం కుసుమోపమ్|
      విధుఛ్చచంచల ఆయుషం తస్మాత్ జాగ్రత  జాగ్రత||

తా:- మన సంపదలన్నియు ఒక కలవంటివి, యౌవనము ఒక పూవు వలె మనజీవితములో స్వల్ప కాలము మాత్రమే ఉండునది. ఈ జీవితమూ మెరుపు వలె క్షణభంగురము. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.

6. శ్లో|| క్షణం విత్తం, క్షణం చిత్తం, క్షణం జీవితమావయోః|
      యమస్య కరుణా నాస్తి తస్మాత్ జాగ్రత  జాగ్రత||

తా:- ధనము, బుద్ధి, జీవితము ఇవన్నియు క్షణభంగురములు. మన ప్రాణములను హరించుటకై వేచియున్న యముడు ఏ మాత్రము దయ జూపడు. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.

7. శ్లో|| యావత్ కాలం భవేత్ కర్మ తావత్ తిష్ఠతి జంతవః|
      తస్మిన్ క్షీణే వినశ్యంతి తత్ర కా పరివేదన||

తా:- మనుషులకు వారి కర్మానుసారము జీవితకాలము ఉండును. అది తీరిన తరువాత వారును నశింతురు. దానికై దుఃఖించుట ఎందులకు?

8. శ్లో|| ఋణానుబంధ రూపేణ పశుపత్నిసుతాదయః|
      ఋణక్షయే క్షయం యాంతి తత్ర కా పరివేదన||

తా:- గత జన్మ ఋణానుబంధముచే పశు, పత్ని పుత్ర లాభము గల్గును. ఆ ఋణము తీరగనే వారును పోవుదురు. దానికై దుఃఖించుట ఎందులకు?

9. శ్లో|| పక్కాని తరుపర్ణాని పతంతి క్రమశో యథా|
      తథైవ జంతవః కాలే తత్ర కా పరివేదన||

తా:- చెట్ల యొక్క పండిన ఆకులు ఏ విధముగా రాలిపోవునో అదే విధముగా ఆయువు తీరిన వారు మరణింతురు. దానికై దుఃఖించుట ఎందులకు?

10. శ్లో|| ఏక వృక్ష సమారూఢ నానాజాతి విహంగమాః|
      ప్రభతే క్రమశో యాంతి తత్ర కా పరివేదన||

తా:- రాత్రి చెట్లపై వివిధ జాతుల పక్షులు చేరును. మరల సూర్యోదయము కాగానే ఒక్కటోక్కటిగా ఎగిరిపోవును. ఇదే విధముగా మానవ జీవితములందును సంయోగ వియోగములు సంభవించును. దానికై దుఃఖించుట ఎందులకు?

11. శ్లో|| ఇదం కాష్టం ఇదం కాష్టం నద్యాం వహతి సంగతః|
      సంయోగాశ్చ వియోగాశ్చ కా తత్ర పరివేదన||

తా - ప్రవహించుచున్ననది లో కర్ర/కట్టె ముక్కలు తేలుచు, ఒకప్పుడు కలియుచు ఒకప్పుడు విడిపోవుచుండును. ఇదే విధముగా మానవ జీవితములందును సంయోగ వియోగములు సంభవించును. దానికై దుఃఖించుట ఎందులకు?ఎప్పుడూ మనల్ని వీడని సర్వేశ్వరుడుండగా!

🌞🌞🌞అంతాశివసంకల్పం🌞🌞🌞

దగ్గుబాటి లక్ష్మీపతి

*గురు దక్షిణ

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

        *గురు దక్షిణ*

      *రచన:ఎం.ఆర్.వి.*       

    *సత్యనారాయణ మూర్తి* 

🏛️👴🏛️👴🏛️👴🏛️👴🏛️


“తప్పదు నాన్నా.  అంతకన్నా నాకు వేరే దారి లేదు". కొడుకు మాటలకు ఖిన్నుడైపోయాడు రాఘవ రావు. జానకమ్మ ఎటూ చెప్పలేక కొయ్యబొమ్మలా నిలబడిపోయింది. తల్లీ, తండ్రి ఇద్దరికేసి మరోమారు చూసి బాగ్ తీసుకుని వెళ్ళిపోయాడు రాజేష్.

రాజేష్ వెళ్ళిన రెండు నిముషాల వరకూ భార్యా, భర్తా ఇద్దరూ అలానే గుమ్మం కేసి చూస్తూ ఉండిపోయారు.  ముందుగా జానకమ్మ తేరుకుని నిట్టూర్పు విడిచి వంటింట్లోకి వెళ్ళింది. రాఘవ రావు కండువా భుజమ్మీద వేసుకుని పార్కుకి బయల్దేరాడు. పదినిముషాలలో పార్కుకి చేరుకున్నాడు.  అప్పటికే అతని మిత్రులు పరమేశం, సుబ్బారావు బెంచి మీద కూర్చుని ఉన్నారు. సుబ్బారావు పక్కకు జరిగి ‘రా రాఘవా’ అని ఆహ్వానించాడు.

మ్లానవదనంతో కూర్చున్న రాఘవరావు ని చూసి , ఇంటి దగ్గర ఏదో అయ్యిందని గ్రహించారు మిత్రులు ఇద్దరూ.  కాసేపు లోకాభిరామాయణం మాట్లాడారు వాళ్ళు ఇద్దరూ. తర్వాత పరమేశం అన్నాడు “చూడు రాఘవా, నువ్వు ఏదో విషయం గురించి

బాధపడుతున్నట్టున్నావు.

నీ బాధ నీ సన్నిహితులుతో పంచుకుంటే కొంత వరకూ ఉపశమనం కలుగుతుంది.  మన ముగ్గురి మధ్యా రహస్యాలు లేవుగా.”  రాఘవ రావు దీర్ఘంగా నిట్టూర్చి “మా అబ్బాయి ఇల్లు అమ్మేయమంటున్నాడు.” అన్నాడు.  “కారణం?” అడిగాడు సుబ్బారావు. “ఎనభై లక్షల, త్రీ బెడ్ రూమ్ ప్లాట్ అరవైకే వస్తోందట. మళ్ళీ ఈ అవకాశం రాదుట.  నేను ఈ ఇల్లు అమ్మితే వచ్చే డబ్బు, వాడి దగ్గర ఉన్న డబ్బు

కలిపి ఆ ప్లాట్ కొంటాడట.  అదీ సంగతి.” అని కండువాతో మొహం తుడుచుకున్నాడు రాఘవ రావు.  మిత్రులు ఇద్దరూ ఆలోచనలో పడ్డారు.  కాసేపటికి సుబ్బారావు

అడిగాడు “మీ ఆవిడ ఏమంది?”

“తల్లి ప్రేమ కదా, కొడుకు వైపే మాట్లాడింది.  ఎలాగూ చివర దశలో వాడి దగ్గరకు చేరవలసిన వాళ్ళమే కదా అని అంది.”

“రాఘవా, నువ్వు చాలా కష్టపడి ఇల్లు కట్టుకున్నావు. ఆ మమకారం ఉంటుంది. కానీ పరిస్తితుల్ని బట్టి మనం నడచుకోవాలి.  నీకు ఒక్కగానొక్క కొడుకు.  అతణ్ణి

కాదని అంటే, రేపు నిన్ను చూడటానికి కూడా రాడేమో ఆలోచించు.  ఈ రోజుల్లో పిల్లలు ఎలా ఉంటున్నారో మనం చూస్తున్నాంగా” అన్నాడు పరమేశం.  సుబ్బారావు కూడా పరమేశం లాగే కొడుకు దగ్గరకు వెళ్ళడమే మంచిదని సలహా

ఇచ్చాడు.  ఒక అరగంట కూర్చుని ఇంటికి వచ్చాడు రాఘవ రావు. అన్యమనస్కంగానే భోంచేసి పడుకున్నాడు.  కానీ ఎంతకూ నిద్ర రావడం లేదు.  గతం పదే పదే గుర్తుకు వస్తోంది .

                🌷🌷🌷

పంచాయతీ ఆఫీస్ వెనక ఉన్న ఖాళీ స్థలాల్ని తక్కువ రేటుకి ఇస్తున్నారని, మాస్టార్లందరూ తీసుకుని ఇల్లు కట్టుకున్నారు. అందరూ రెండు వందల గజాలు

స్థలం తీసుకుంటే, రాఘవరావు భార్య కోరిక మీద నాలుగు వందల గజాల స్థలం తీసుకున్నాడు. జానకమ్మకు మొక్కలంటే ప్రాణం. అందుకే స్థలం మధ్యలో ఇల్లు

కట్టుకుని చుట్టూ ఉన్న జాగాలో చాలా మొక్కలు వేసుకున్నారు. రాఘవరావు స్కూల్ లో ఉంటే, జానకమ్మే ఇంటి నిర్మాణం పనులు చూసేది.  పనివాళ్ళతో సమంగా తానూ ఎండలో నిలబడి వారిచేత పనులు చేయించేది.  వాస్తవానికి, రాఘవరావు కన్నా జానకమ్మే ఇంటి కోసం కష్ట పడింది.  ఒక ఆదివారం నాడు భార్యా భర్తలు ఇద్దరూ కడియం వెళ్లి రక రకాల పూల మొక్కలు, మామిడి, పనస, సపోటా మొక్కలు చిన్న వాన్ మీద తెచ్చుకున్నారు.  మిగతా మాస్టర్లు

‘వాళ్ళిద్దరికీ చాదస్తం అని’  విమర్శించినా వాళ్ళ ఇల్లు *నందన వనంలా* పెరిగాక అభినందించ కుండా ఉండలేక పోయారు. అందరూ బోరింగ్ పైపులు వేయించుకున్నా, రాఘవరావు మాత్రం నుయ్యి తవ్వించుకున్నాడు .

నూతి పళ్ళెం దగ్గరనుండి తూములు ఏర్పాటు చేసి నీళ్ళు మొక్కలకు చేరేటట్లు చేసాడు. ఉదయమే నూతి దగ్గర స్నానం చేసి, సూర్యుడికి నమస్కరించి ఇంట్లోకి వచ్చేవాడు. మామిడి చెట్టు బాగా పెరిగి పెద్దది అయ్యాకా దానికి సిమెంట్చప్టా చేయించాడు.  రాఘవరావు స్కూల్ నుంచి వచ్చాక మామిడి చెట్టుకింద ఉన్న చప్టా మీద కూర్చుంటే, జానకమ్మ కాఫీ తీసుకు వచ్చి ఇచ్చేది.  ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగేవారు.  సెలవు రోజుల్లో మిత్రులు వస్తే వాళ్ళ మీటింగ్ కూడా మామిడి చెట్టుకిందే.  వేసవికాలం సాయంత్రాలలో భార్యా భర్తలు ఇద్దరూ ఆ చెట్ల మధ్యే కూర్చుని

మాట్లాడుకునే వారు.  టీచర్స్ కాలనీ లో ఏ శుభకార్యం జరిగినా రాఘవరావు ఇంటి నుండే మామిడి ఆకులు తెచ్చుకుని తోరణాలు కట్టుకునే వారు.  సపోటా పళ్ళు కూడా రాఘవరావు మిత్రులు అందరకు పంపించేవాడు.  రెండు పడక గదులు, ఒక హాలు, వంటగది అన్నీ విశాలంగా ఏర్పాటు చేసుకున్నాడు రాఘవరావు.

పాతిక ఏళ్ల అనుబంధం ఉంది ఆ ఇంటితో వాళ్ళిద్దరికీ.  ఎన్నో అందమైన అనుభూతులు, జ్ఞాపకాలు ఉన్నాయి.  వాటిని ఒక్కసారిగా వదులుకోవాలంటే రాఘవరావు తట్టుకోలేక పోతున్నాడు.  కానీ తప్పదు.

కొడుకు కోరిక తీర్చాలి. ఏం చేస్తాం? అని మధనపడుతూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు రాఘవరావు.


కొడుకు తరచూ ఫోన్లు చేయడం, భార్య కూడా పదే పదే చెప్పడంతో

రాఘవరావు ఇల్లు అమ్మకానికి పెట్టాడు. ఇల్లు కొందామని వచ్చిన వారు ఇల్లుచూసి పెదవి విరిచి వెళ్ళిపోతున్నారు. పాతిక ఏళ్ల క్రితం కట్టిన ఇల్లు ఈనాటి ఫాషన్ కి అనుగుణంగా లేదని కొందరు, ఇల్లు చిన్నది, చుట్టూ స్థలం ఎక్కువ

వదిలేసారని మరి కొందరు వెనక్కి వెళ్ళిపోయారు.  ఇల్లు బేరం పెట్టి రెండు నెలలు గడిచినా సరైన బేరం రాలేదు.  జానకమ్మ బెంగ పెట్టుకుంది, కొడుకుకి సాయం

చేయలేకపోతున్నామని.  ఒక రోజు షావుకారు వెంకటరావు వచ్చాడు ఇల్లు చూడటానికి.  ప్రతి గది పరిశీలన చేసాడు. దొడ్డి అంతా టేపు తో కొలిచాడు.  భార్యాభర్తలు ఇద్దరూ అతను ఏం చెబుతాడా? అని ఆతృతగా చూస్తున్నారు. చివరికి పెదవి విప్పాడు షావుకారు.

“మాస్టారు, ఇల్లు కట్టి పాతిక ఏళ్ళు అయ్యింది, అంటే పాతదాని కిందే లెక్క.  ఎవరైనా కొనుక్కున్నా ఒక కుటుంబమే ఉండాలి.  మీరు ఏభై లక్షలు చెబుతున్నారు. అంత

ఖర్చు పెట్టి పాత ఇంటిని ఎవరూ కొనరు. ఆ డబ్బుతో మరింత సౌకర్యంగా ఉండే కొత్త ఇల్లే కట్టుకుంటారు. ఏమంటారు?”


రాఘవరావు మౌనం వహించాడు. జానకమ్మే అంది. ‘ఇక్కడ గజం రేటు పదివేలకు పైమాటే.  అలా చూసినా, నాలుగు వందల గజాలకు నలభై లక్షలు, ఇంటికి పదిహేను, మొత్తం ఏభై ఐదు లక్షలు రాదంటారా?”  ఆమె మాటలకు చిన్నగా నవ్వాడు షావుకారు. “చూడండి అమ్మా, మీ లెక్కలు మీకు ఉంటాయి. కొనేవాడి లెక్కలు కోనేవాడికుంటాయి. నేను ఇక్కడ ఒక అపార్ట్ మెంట్ కట్టాలని అనుకుంటున్నాను. అప్పుడు ఇల్లు తీసెయాలి. అందుకని స్తలం రేట్ కి

కొందామని నా ఉద్దేశ్యం. అందుచేత నలభై లక్షలకు మాత్రమే నేను కొంటాను.  ఆలోచించండి “ అని చెప్పి వెళ్ళిపోయాడు షావుకారు.

అతను వెళ్ళాకా భార్యాభర్తలు ఇద్దరూ చాలాసేపు చర్చించుకున్నారు.

చివరకు జానకమ్మే నిర్ణయం ప్రకటించింది . “మనం ఆలస్యం చేసేకొద్దీ అబ్బాయికి వచ్చిన అవకాశం చేజారి పోతుంది. నలభై లక్షలకు షావుకారికే ఇల్లు ఇచ్చేద్దాం.  మిగతా డబ్బుకి అబ్బాయే తంటాలు పడతాడు”

ఆ రాత్రే కొడుక్కి ఫోన్ చేసింది, ఇల్లు నలభై లక్షలకు షావుకారికి

ఇద్దామనుకుంటున్నామని .

రాజేష్ అలాగే చెయ్యమని చెప్పాడు.  మర్నాడే రాఘవరావు షావుకారికి కబురుచేసి తమ అంగీకారం చెప్పాడు.  వారం రోజుల్లో రాఘవరావు ఇల్లు షావుకారు పరం అయ్యింది.  రిజిస్ట్రేషన్ సమయానికి రాజేష్ వచ్చి సంతకాలు చేసి డబ్బు

పట్టుకుని హైదరాబాదు వెళ్ళిపోవడం చాలా స్పీడుగా జరిగిపోయింది.  నెలరోజుల తర్వాత రాజేష్ వచ్చి తల్లితండ్రుల్ని హైదరాబాదుకి  తీసుకునివెళ్లాడు. భారమైన హృదయాలతోనే వెళ్ళారు రాఘవరావు, జానకమ్మ.

కొన్నాళ్ళకు మనవల ఆట పాటలతో ఇంటి గురించి మర్చిపోయారిద్దరూ.  మరో నెల రోజులకు కొడుకు కొన్న ప్లాట్ లోకి మారారు అందరూ.  రెండు పడక గదులే ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు రాఘవరావు. కొడుకుని అడిగితే  ‘మనం ఆలస్యం చేయడంవలన, మూడు పడక గదుల ప్లాట్ చేజారిపోయిందని ‘ చెప్పాడు రాజేష్.  కొడుకు, కోడలు మనవలు ఒక గదిలో, రాఘవరావు జానకమ్మ ఒక గదిలో పడుకునే

వారు. మూడు నెలలు ముచ్చటగా గడిచాయి.  ఒకరోజు మనవడు ‘నానమ్మా , నేను నీ దగ్గరే పడుకుంటానని’ పెద్దవాళ్ళ దగ్గరకు వచ్చేసాడు.  జానకమ్మ ఎంతో

సంతోషించి వాడిని దగ్గరకు తీసుకుని కథలు చెప్పి తన దగ్గరే పడుకోబెట్టుకుంది.  పది రోజులు తర్వాత మనవరాలు కూడా ‘నానమ్మా, నేనూ నీ దగ్గరే పడుకుంటానని’  జానకమ్మ దగ్గరకు వచ్చేసింది.  ఆ విధంగా రాఘవరావు పడక హాలులోని దివాను మీదకు మారిపోయింది.

ఆరునెలలు గడిచాయి.  పిల్లల ఫీజులు కట్టడానికి కొడుకు, కోడలు గొడవ పడటం చూసి, తన పెన్షన్ లో దాచుకున్న ఏభై వేలు పట్టుకొచ్చి కొడుకుకి ఇచ్చాడు

రాఘవరావు. మరో ఆరునెలలు గడిచేసరికి రాఘవరావు తన పెన్షన్ లోంచి ఐదువేలు తన దగ్గర ఉంచుకుని మిగతా ఇరవైవేలు కొడుకుకి ఇవ్వడం అలవాటు చేసుకున్నాడు.  ఇంటి ఖర్చులకి రాజేష్ సంపాదన సరిపోవడం లేదని సుమిత్ర కాన్వెంట్ లో

టీచర్గా చేరింది.  వంట చెయ్యడం, మనవలు ఇద్దరినీ కాన్వెంట్ కి తయారు చేయడం జానకమ్మ డ్యూటీ గా మారిపోవడం జరిగింది. జానకమ్మకు శ్రమ ఎక్కువ అయ్యింది ఇంటి పనితో.  శివపురంలో వాళ్ళు ఇద్దరే ఉండేవారు.  వంట తక్కువ, పని

కూడా తక్కువే .  విశ్రాంతిగా ఉండేది.  ఇక్కడ విశ్రాంతి అన్న మాటే లేదు. పని ..పని ..పని.

మరో ఆరు నెలలు గడిచాయి. మనవలు ఇద్దరూ పెందరాలే పడుకోకుండా స్కూల్

విషయాలు చెప్పుకోవడం, జోకులు వేసుకోవడం చేస్తూ జానకమ్మకు నిద్ర పట్టకుండా చేయడంతో ఆమె పడక కూడా హాలు లోకి మారింది. రాఘవరావు దివాను మీద, జానకమ్మ నేలమీద చాప వేసుకుని పడుకుంటున్నారు. ఒకరోజు రాజేష్ ఏమీ తెలియనట్టు “ఇదేమిటమ్మా ఇక్కడ పడుకుంటున్నావు?” అని అడిగాడు.  మనవల గురించి ఫిర్యాదు చేయడం ఇష్టం లేని జానకమ్మ ‘మీ నాన్నకు తోడుగా ఉందామని ఇక్కడ పడుకుంటున్నాను’ అంది.

శీతాకాలం వచ్చింది.  టైల్స్ మీద చాప వున్నా జానకమ్మ చలికి తట్టుకోలేక పోతోంది.  అది చూసి రాజేష్ బజారు నుండి చిన్న పరుపు తీసుకు వచ్చి తల్లికి ఇచ్చాడు. దానికే చాలా మురిసిపోయింది జానకమ్మ.  ఒకసారి సుమిత్ర తల్లి తండ్రులు హైదరాబాద్ వచ్చారు. రాజేష్ వాళ్లకు ఎంతో మర్యాదలు చేసాడు.  పిల్లల పడకలు తల్లి తండ్రుల గదిలోకి మారాయి. రాజేష్, మావయ్య అత్తయ్య పిల్లల గదిలో పడుకున్నారు.  రాఘవరావు, జానకమ్మ

యధావిధిగా హాలు లోనే పడుకున్నారు. మొత్తం వంట పనంతా జానకమ్మ మీదే

పడింది.  సుమిత్ర , తల్లి తండ్రులు వారం రోజులు ఉన్నారు.  జానకమ్మ వళ్ళు హూనం ఐపోయింది. వాళ్ళు వెళ్ళేటప్పుడు సుమిత్ర తండ్రి అన్న మాట రాఘవరావు దంపతుల్ని మరీ బాధించింది. ‘బావ గారు, అక్కయ్య గారు అదృష్టవంతులు. చక్కగా కొడుకు దగ్గర వుండి సుఖ పడుతున్నారు’ అని.  అమ్మమ్మ, తాతయ్య వెళ్లి పోగానే మనవలు మల్లీ వాళ్ళ గదిలోనే పడుకో

సాగారు.  దాంతోరాఘవరావు, జానకమ్మ లకు ఒక విషయం పూర్తిగా అర్ధమయ్యింది.  కొడుకు, కోడలు కావాలనే తమని హాలు లోకి పంపించారని.  ఆ రాత్రి దంపతులు ఇద్దరూ చాలా సేపు బాధపడ్డారు.  శివపురం వదిలి కొడుకు దగ్గరకు వచ్చి చాలా పొరపాటు చేసామని.  రెండేళ్ళు గడిచాయి. వంటరి తనంతో రాఘవరావు, పని ఎక్కువై , విశ్రాంతి లేక జానకమ్మ ఆరోగ్యం దెబ్బతింది. తమ బాధ ఎవరికీ చెప్పుకోలేక కుమిలి

పోతున్నారు వాళ్ళిద్దరూ.  ఈ మధ్యనే పరమేశం కూతురు దగ్గరకు వచ్చి రాఘవరావుని చూడటానికి రాజేష్ ఇంటికి వచ్చాడు.  ఆ సమయానికి రాజేష్ ,సుమిత్ర ఉద్యోగాలకు వెళ్ళారు.  పిల్లలు కాన్వెంట్ నుంచి ఇంకా రాలేదు.  రాఘవరావు,

జానకమ్మలను చూసిఆశ్చర్య పోయాడు, ఆపై బాధ పడ్డాడు.

“ఏమిటి రాఘవా ఇది?  ఇద్దరూ ఇలా అయి పోయారేమిటి? ఏమిటి అనారోగ్యం? డాక్టర్కి చూపించు కున్నారా?“ “ఆ ఏమీలెదు, కొద్దిపాటి నీరసం. అంతే.” అన్నాడు రాఘవరావు చిన్నగా నవ్వుతూ. ఆ నవ్వు సహజంగా లేకపోవడం గ్రహించాడు పరమేశం. ఈ లోగా పిల్లలు ఇద్దరూ వచ్చారు.  వాళ్లకు టిఫిన్ పెట్టి, పాలు ఇవ్వడం పనిలో మునిగిపోయింది జానకమ్మ.  ఒక పావుగంట ఉండి వెనుదిరిగాడు పరమేశం.  శివపురం వచ్చాకా సుబ్బారావు దగ్గర బాధపడ్డాడు పరమేశం. “మన రాఘవ పరిస్తితి ఏమీ బాగోలేదు.  ఇద్దరూ చిక్కి పోయారు.  కొడుకు వాళ్ళని

పట్టించుకోవడం లేదనిపిస్తోంది. ఇంటి బాధ్యత అంతా జానకమ్మ మీద పడింది.  చాలా శ్రమ పడుతున్నారు ఇద్దరూ. కాళ్ళూ, చేతులూ ఆడుతున్డగానే ఇలా ఉంటే, రేపు ఓపిక తగ్గిపోతే వాళ్ళ పరిస్తితి ఎంత దుర్భరమో అనిపిస్తోంది.”

కొద్దిసేపు మౌనం వహించాడు సుబ్బారావు.  తర్వాత పరమేశంతో చిన్నగా మాట్లాడాడు. ఆ మాటలకు పరమేశం చాలా సంతోషించాడు.

రెండు నెలలు గడిచాయి.  ఒకరోజు రాజేష్ ఇంటికి మిదున్, సాత్విక్ వచ్చారు.  “మేము శివపురంలో రాఘవరావు మాస్టారు దగ్గిర చదువుకున్నాము.  వచ్చే

ఆదివారం మా స్కూల్ పూర్వ విద్యార్ధుల సమావేశం ఉంది.  ఆ రోజున మా గురువులు అందరినీ సన్మానించాలని నిర్ణయించాము. మాస్టారికి ఆహ్వానం పత్రిక

ఇద్దామని వచ్చాం.” చెప్పాడు మిదున్.  నాన్నగారు పూజ చేసుకుంటున్నారు, కూర్చోమని చెప్పి లోపలకు వెళ్ళాడు రాజేష్. పదినిముషాలకు రాఘవరావు హాలులోకి వచ్చాడు.  మిదున్, సాత్విక్ లేచి రాఘవరావు కి నమస్కరించి, తాము వచ్చిన

పని చెప్పారు.  “నేను ఇక్కడ ఉన్నానని ఎవరు చెప్పారు?” అడిగాడు రాఘవరావు.

“పరమేశం గారు చెప్పారు సర్ . వచ్చే శనివారం ఉదయమే వచ్చి కారులో మిమ్మల్ని, మేడం గారిని తీసుకుని వెళ్లి, తిరిగి హైదరాబాద్లో దిగబెడతాం” వినయంగా చెప్పాడు మిదున్.  తప్పకుండా వస్తానని వాగ్దానం చేసాడు రాఘవరావు.

ఆరు రోజులు గడిచాకా శనివారం ఉదయమే మిదున్, సాత్విక్ ఇద్దరూ ఏ.సి. కారు తీసుకుని వచ్చి రాజేష్ అపార్ట్ మెంట్ కి వచ్చారు. ఫంక్షన్ అయ్యాకా వెంటనే వచ్చేయమని రాజేష్ , సుమిత్ర మరీ మరీ చెప్పారు.  అలాగే అని చెప్పి కారు ఎక్కారు రాఘవరావు, జానకమ్మ.  వాళ్ళు ఇద్దరికీ చాలా ఆనందంగా ఉంది.  శివపురంలో అందరిని కలవ వచ్చని, రెండోది ఆ జైలు నుంచి బయటకు వస్తున్నామని.  పరమేశం కూడా ఫోన్ చేసి చెప్పాడు’ రెండురోజులూ మా ఇంట్లోనే ఉండాలని’.  చిన్న పిల్లలు పండగకు తాత గారి ఇంటికి వెళ్ళేటప్పుడు ఎంత హుషారుగా ఉంటారో, రాఘవరావు, జానకమ్మ కూడా అంత హుషారుగాను ఉన్నారు.  విజయవాడలో భోజనాలుచేసి, సాయంత్రానికి శివపురం చేరుకున్నారు నలుగురూ.  పరమేశం ,గిరిజ ఏంతో ఆదరంగా వాళ్ళని ఇంటిలోకి తీసుకువెళ్ళారు. మిదున్, సాత్విక్ వాళ్ళ ఇంటికి వెళ్లిపోయారు.  ఒక అరగంటకు సుబ్బారావు, పద్మలత వచ్చారు.  మిత్రులు అందరికీ

భోజనాలు ఏర్పాటు చేసాడు పరమేశం.  మూడు జంటలూ కబుర్లు చెప్పుకుంటూ తృప్తిగా

భోజనం చేసారు. మిత్రులు ముగ్గురి కళ్ళల్లో ఆనంద భాష్పాలు కదలాడాయి.  “నేను హైదరాబాద్ వెళ్ళాకా ఏం కోల్పోయానో ఇప్పుడు నాకు బోధపడింది” అన్నాడు రాఘవరావు.  మిత్రులు ఇద్దరూ ఆప్యాయంగా అతని భుజాల మీద చేతులు వేసారు.  ఆ రాత్రి రాఘవ రావు, జానకమ్మ చాలాసేపు చాలా విషయాలు మాట్లాడుకున్నారు. ఒక స్తిరమైన నిర్ణయానికి వచ్చారు ఇద్దరూ.  మర్నాడు ఉదయం శివపురం హైస్కూల్ లో జరిగిన పూర్వ విద్యార్ధుల సభ చాలా బాగా జరిగింది.  ముందుగా తమకు విద్య నేర్పిన గురువులు అందరికీ 

పాదాభివందనం చేసి, ఆ తర్వాత వేదిక మీదకు వెళ్ళారు. రాఘవరావు, మిగతా ఉపాధ్యాయులు కూడా వారి వినయానికి, సంస్కారానికి అబ్బురపడ్డారు.  అమెరికాలో,

ఆస్ట్రేలియా, సింగపూర్ లలో ఉన్నవాళ్ళు కూడా సభకు వచ్చి తమ పాత మిత్రులు అందరినీ పేరు పేరునా పలకరించి మాట్లాడుకోవడం అందరినీ ఆకట్టుకుంది.  పూర్వ విద్యార్ధుల తరపున వరుణ్ మాట్లాడుతూ “ఈ సమావేశానికి మూలకారకులు మిదున్, సాత్విక్.   వాళ్ళిద్దరూ అమెరికాలో ఉన్నా అందరినీ కాంటాక్ట్  చేసి ఇక్కడికి రప్పించారు. వారికి సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.  మమ్మల్ని వృద్ధిలోకి తీసుకువచ్చిన మా గురువులు అందరికీ నా నమస్సులు.” అని అన్నాడు. తర్వాత గురువులు అందరికీ ఘనంగా సన్మానంచేసి, వెండి పళ్ళాలు కానుకగా ఇచ్చారు పూర్వ విద్యార్ధులు.  రాఘవరావు మాట్లాడుతూ, ”మిమ్మల్ని అందరినీ మా బిడ్డలుగా భావించే మేము మీకు చదువు చెప్పాం. అది గురువుగా మా బాధ్యత.  మీరు మన ఊరికి, మన స్కూలుకి  పేరు తెచ్చినట్టుగానే మన దేశానికి కూడా పేరు తీసుకురావాలి.  మీరు అందరూ పిల్లా, పాపలతో సుఖంగా ఉండాలి.  మీరు మాకు చేసిన సత్కారం, సరస్వతీదేవికి చేసిన

సత్కారంగా నేను భావిస్తున్నాను” అని అన్నాడు. వెంటనే సభా ప్రాంగణం చప్పట్లతో మారుమోగింది.  చివరగా మిదున్ మాట్లాడుతూ” మన బాచ్ ఫ్రెండ్ స్నిగ్ధ డాక్టర్ గా తణుకులో ప్రాక్టీసు చేస్తోంది.  ప్రతి ఆదివారం శివపురం వచ్చి వృద్ధులైన మన గురువులకి వైద్య సహాయం అందిస్తానని వాగ్దానం చేసింది.  ఆమెకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీ అందరికీ ఒక విశేషం చూపిస్తాను రండి” అని అన్నాడు.

అందరూ నడుచుకుంటూ టీచర్స్ కాలనీకి వచ్చారు.  రాఘవరావు ఇంటిముందు ఆగాడు మిదున్.  రాఘవరావు ఆశ్చర్యానికి అంతులేదు.  తను అమ్మేసిన ఇంటికి రంగులు వేసి ఉన్నాయి.  గురువు గారికి స్వాగతం అని బోర్డు ఉంది. మిదున్, రాఘవరావు చేయి

పట్టుకుని లోపలకు తీసుకువచ్చాడు.  “మాస్టారు, మీ ఇల్లు మీకు అప్పచెబుతున్నాం. మీరు, అమ్మగారు హాయిగా ఇందులో ఉండండి.  షావుకారు దగ్గరనుండి మేము దీన్ని కొన్నాం. చాలా కాలంక్రితమే పరమేశం గారు నాకు, మీరు ఎంత బెంగగా, దిగులుగా ఉన్నారో చెప్పారు. మేము ఈ రోజు ఇలా విదేశాలలో ఉంటూ లక్షలూ, కోట్లు సంపాదిస్తున్నామంటే దానికి

మూలం మీరు పెట్టిన జ్ఞాన భిక్షే. మీకు గురుదక్షిణ చెల్లించుకోవాలనే నేనూ, నా మిత్రులు కలిసి ఈ ఇంటిని కొన్నాం.  మీ స్నేహితులు అందరూ ఇక్కడే ఉన్నారు.  మీ

ఆరోగ్య పరిరక్షణకు డాక్టర్ స్నిగ్ధ ఉంది.  మన వూరి నుండి తణుకు పది నిముషాల ప్రయాణం.  మీరు ఆనందంగా ఉండడమే మా అందరి కోరిక.  కాదనకండి.” అని రాఘవరావు రెండు చేతులూ పట్టుకున్నాడు.  కళ్ళమ్మట ఆనందభాష్పాలు కారుతుండగా రాఘవరావు, మిదున్ ని దగ్గరకు

తీసుకుని నుదిటి మీద ముద్దు పెట్టుకున్నాడు.  వెంటనే ఇంట్లోకి వెళ్లి, ప్రతిగుమ్మాన్ని తడిమి తడిమి చూసుకుని మురిసిపోయాడు. దొడ్లోకి వచ్చి, మామిడిచెట్టు కింద ఉన్న చప్టా మీద కూర్చున్నాడు. లేచి ప్రతి చెట్టుని ముట్టుకుని పరవశించి పోయాడు.  తల్లి దగ్గర నుండి తప్పిపోయిన ఆవుదూడ , చాలాసేపటికి తన తల్లి కనపడగానే ఆనందంతో ఎలా గంతులు వేస్తుందో అలా ఉంది రాఘవరావు మనసు.  ఐదు నిముషాలు గడిచాక పూర్వ విద్యార్ధులు అందరూ రాఘవరావు దగ్గర శెలవు

తీసుకుని వెళ్ళిపోయారు. రాఘవరావు, మిత్రబృందం మిగిలారు.  పరమేశం, సుబ్బారావు

ల చేతులు పట్టుకుని  ‘మీ ఋణం ఎలా తీర్చుకోను’ అన్నాడు రాఘవరావు బరువెక్కిన

హృదయంతో.

“రోజూ మనం కలుసుకుని ఆనందంగా మాట్లాడుకోవడమే” అన్నాడు సుబ్బారావు నవ్వుతూ.

ఇన్ని రోజులకు భర్త మొహంలో వెలుగు చూసి ఆనందించింది జానకమ్మ.  ఆమె మనసు ప్రశాంత గోదావరిలా ఉంది.

*******

రచయిత వివరాలు

ఎం. ఆర్. వి. సత్య నారాయణ మూర్తి, జె.వి.ఎల్.రావు నగర్, పెనుగొండ - 534320.Andhra Pradesh

ఫోన్ .9848663735. email.mrvsmurthy@gmail.com

🧑‍🏫🧑‍🏫🧑‍🏫🧑‍🏫🧑‍🏫🧑‍🏫🧑‍🏫🧑‍🏫🧑‍🏫


గోరింటాకు

 గోరింటాకు అసలు పేరు గౌరింటాకు. గౌరి ఇంటి ఆకు, గౌరీ దేవి బాల్యములో చెలులతో వనములో ఆడుకుంటూ ఉన్న సమయములో రజస్వల అయింది. ఆ రక్తపు చుక్క నేలకు తాకగానే ఓ మొక్క పుట్టింది.

ఈ వింతను చెలులు పర్వత రాజుకు చెప్పగా సతీ సమేతముగా చూసేందుకు వచ్చాడు. అంతలోనే ఆ చెట్టు పెద్దది అయి నేను సాక్షాత్తు పార్వతి రుధిర అంశతో జన్మించాను. నా వలన లోకానికి ఏ ఉపయోగం కలుగుతుంది అని అడిగింది. అప్పుడు పార్వతి చిన్నతనపు చాపలాటతో ఆ చెట్టు ఆకు కోసింది. అప్పుడు ఆమె వేళ్ళు ఎర్రబారిపోయాయి. అయ్యో బిడ్డ చేయి కందిపోయింది అనుకునేలోపు పార్వతి నాకు ఏవిధమైన బాధ కలుగలేదు. పైగా చాలా అలంకారంగా కనిపిస్తోంది అంది.

అప్పుడు పర్వత రాజు ఇక పై స్త్రీ సౌభాగ్య చిహ్నముగా ఈ గోరింటాకు మానవలోకములో ప్రసిద్ధము అవుతుంది. రజస్వల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు, స్త్రీల గర్భాశయ దోషములను తొలగిస్తుంది. అతి వేడి తొలగించి స్త్రీల ఆరోగ్యమును కాపాడుతుంది. తన రంగు వలన చేతులకు, కాళ్లకు అందానినిచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుంది అని ఆశీర్వదించి అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని పలుకగా గౌరితో సహా అందరు ఆ చెట్టు ఆకుల పసరుతో చేతులు కాళ్ళు అందముగా తీర్చి దిద్దుకున్నారు.

అదే సమయములో కుంకుమకు ఒక సందేహము వచ్చింది. నుదుటన కూడా ఈ ఆకుతో బొట్టు దిద్దుకుంటారేమో, నా ప్రాధాన్యత తగ్గిపోతుంది అని గౌరీ దేవి తో బాధగా చెప్పగా అప్పుడు గౌరీ దేవి ఈ ఆకు నుదుటన పండదు అని చెప్పింది. కావాలంటే పెట్టుకుని చూడండి, గోరింటాకు నుదుటన పండదు. ఇక శాస్త్రపరంగా చూస్తే ఈ ఆకు గర్భాశయ దోషాలను తీసివేస్తుంది. అరచేతి మధ్యలో శ్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి. వాటిలోని అతి ఉష్ట్నాన్ని లాగేసి ప్రశాంత పరుస్తుంది ఈ గోరింటాకు. ప్రసవం కాగానే గోరింటాకు ముద్దగా నూరి ఆ బాలింత చేత మింగిస్తే ప్రసవం వలన ఏర్పడే గర్భాశయ బాధలు నయం అవుతాయి.

ఇక భర్తకు, గోరింటాకుకు కల అనుబంధం గురించి చెప్పాలంటే, స్త్రీలోని హార్మోన్ల పని తీరు చక్కగా ఉన్నందువలన దేహం కూడా చక్కగా, సున్నితంగా, అందముగా ఉంటుంది. అలా లేతగా ఉన్న చేతులకు పెట్టుకున్న గోరింటాకు మరింత అందంగా పండి కనిపిస్తుంది. ఆ పండడం అనేది ఆ మగువ ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఆరోగ్యమే మహా భాగ్యము కదా. అందముగా ఉన్న అమ్మాయికి చక్కని భర్త వస్తాడు. ఆరోగ్యకరమైన దాంపత్యానికి కారణం అయిన భార్యను ప్రేమిస్తాడు కదా. ఇవన్నీ కూడా అందుకే మన పెద్దలు ఎంతో దూరదృష్టితో అలోచించి చెప్పారు. గోరింటాకును మనం అందరం శాస్త్రీయంగా అలోచించి ఆదరిస్తే అన్నివిధాలా ఆరోగ్యం, ఆనందం లభిస్తాయి. 

నిజానికి ఈ గోరింటాకు సంవత్సరం పొడవునా మనకు దొరుకుతుంది. కానీ వేరే అప్పుడు పెట్టుకునేదానికి, ఈ ఆషాఢ మాసములో పెట్టుకునేదానికి ఎంతో తేడా ఉంటుంది. కొత్త పెళ్లి కూతురు ఈ ఆషాఢ మాసములో అత్తవారింట్లో ఉండకుండా పుట్టింటికి వెళుతుంది. ఆమె పుట్టింట్లో ఉన్నప్పుడు చేతులకు గోరింటాకు పెట్టుకుని ఎర్రగా పండిన చేతులు చూసుకుని భర్తను గుర్తు చేసుకుని మురిసి పోతుంది. చేతుల్లో గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి భర్త లభిస్తాడు, అంత ఎక్కువ ప్రేమిస్తాడు అన్న నానుడి ఉంది కదా. 

ఇక శాస్త్రీయంగా మరొక విషయం ఏమిటి అంటే ఆషాఢ మాసము వర్షాకాలం. ఈ కాలములో తడుస్తూ ఉండడం వలన కాళ్ళ పగుళ్లు, చర్మ వ్యాధులు వస్తాయి. వీటి బారి నుంచి తప్పించుకోవడానికి కూడా గోరింటాకు పెట్టుకుంటారు. గోరింటాకు వల్ల ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. శరీరంలో అతి ఉష్ణం రాకుండా కాపాడుతుంది. అంతే కాదు, ఇంతటి అద్భుతమైన, ఆరోగ్యకరమైన, మన గోరింటాకును ఈ రోజుల్లో హెన్నాగా కోన్ లతో పెడుతున్నారు. కానీ అలాగే కాకుండా, మన పెద్దలు చేసినట్లు చెట్టుకు దొరుకుతున్న ఆకులనే తీసుకుని, వాళ్ళు చెప్పినట్లు నూరుకుని పెట్టుకుంటే ఆ ఔషధ గుణాలు మనకు నూటికి నూరు పాళ్ళు లభిస్తాయి. ఇది మన గోరింటాకు కథ. 

    🙏 శ్రీ మాత్రే నమః 🙏

వాట్సప్ సమూహ వింత లక్షణములు*.

 *వాట్సప్ సమూహ వినియోగదారుల వింత లక్షణములు*. 


1. *కుప్పరులు*

*వీరు రోజస్తమానం కుప్పలు తెప్పలుగా సమాచారమును సమూహములో గ్రుమ్మరించుచుందురు*. 


2. *ఆకస్మికులు*

*వీరు అప్పుడప్పుడు తమ ఉనికిని తెల్పుటకు అసందర్భపు సమాచారమును సమూహములో ప్రచురించెదరు*. 


3. *విధ్యుక్తులు*

*వీరు ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము లేదా రాత్రి వేళలో శుభోదయం, శుభరాత్రి లాంటి సమాచారములు మరియు లేదా పుట్టిన రోజు శుభాకాంక్షలు, వివాహ శుభాకాంక్షలు లాంటివి మాత్రమే సమూహములో ప్రచురించెదరు*.


4.*గవాక్షులు*

*వీరు సమూహములో ఏమి జరుగుతున్నదో చూచెదరుకాని ఎటువంటి సమాచారమునూ ప్రచురించరు. బహుశా వీరికి సాంకేతిక పరిజ్ఞానం కాని భాషా పరిజ్ఞానం కాని లోపించి ఉండవచ్చు*. 


5. *అవ్యవస్థితులు* 

*వీరు అనేక సమూహములలో సభ్యత్వం కలిగి ఉండుటచే ఏ సమాచారమును ఎక్కడ ముద్రించవలయునో అనే అయోమయావస్థితిలో ఉండి తను ప్రస్తుతం ఉన్న సమూహములోని సమాచారమును అదే సమూహములో ప్రచురించెదరు*. 


6. *అనుక్రియాయులు* 


*వీరు సమూహములో ప్రచురించబడిన ప్రతి సమాచారమునకు, కార్యాలయంలో అధికారి ఎవరి ఉత్తరము వారికి తన వాఖ్యనము వ్రాసి ఏవిథంగా పంచునో ఆ విధంగా తన వాఖ్యనము తో విధిగా ప్రతిస్పందిస్తారు*. 


7. *తంత్రజ్ఞులు*. 

*వీరు తమ సమాచారములతో అందరూ ఏకభవించాలని ఆశిస్తారు*. 


*8.పృథక్ లు*. 

*సమూహములో వీరి ఉనికి మిగతా సభ్యులెవరికి తెలియదు. తామరాకు మీది నీటి బొట్టులాగా*. 


*9.అసంబద్ధులు*.

*వీరు ప్రచురించే సమాచారమునకు సమయము సందర్భము ఉండదు. సాయంకాలమునకు శుభోదయ మన్నన ఉదయమున శుభ రాత్రి మన్నన లాంటివి ప్రచురించెదరు*. 


10. *మేషియలు*

*వీరు తమ మేథస్సుననుసరించరు. తమకంటే ముందున్న సమాచారమును సరించి, తథనుగుణంగా సమాచారమును తప్పు ఒప్పు విచారణ విస్మరించి ప్రచురించెదరు*. 


11. *తస్కరులు*. 

*వీరు ఇంతకు ముందే ప్రచురితమైన* *సమాచారమును కాపీ చేసి పేస్ట్ చేయుదురు*. 


*12. *రవాణాగ్రేసరులు*. 

*వీరు వివిధ మార్గములలో తమకు* *సంక్రమించిన సమాచారమును* *కేవలం రవాణా చేయుదురు. అది ఎటువంటి సమాచారము*, *ఇతరులకు అది ఉపయోగకరమా అనేది కూడ పట్టించుకోరు*. 


*"ఇందులో మనందరి మనస్తత్వాలు ఉన్నాయి."*

 ఇది ఎవరిని దృష్టి లో ఉంచుకొని వ్రాసినది కాదు.

*ఒకవేళ మీకలా అనిపిస్తే అది కేవలం కాకతాళీయం మాత్రమే. హాయిగా నవ్వుకోండి. ఆనందో బ్రహ్మ.*

అనేక శివాలయాలు

 #ద్రాక్షారామం చుట్టుపక్కల అనేక శివాలయాలు, దేవీ మందిరాలు ఉన్నాయని అందరికి తెలిసిన విషయమే. 


ఆ ఆలయాలన్నిటిని ఆకాశ మార్గాన చూస్తే అన్ని కలిపి ఒక పద్మాకారం లో వుంటాయి. ఈ ఆలయాల గురించి బహుళ ప్రాచుర్యం లేనందున చాల మందికి ఈ ఆలయాల గురించిన అవగాహన లేదు.


విశేషమేమిటంటే., ప్రతి వ్యక్తి 27 నక్షత్రాలలో ఉన్న 108 పాదాలలో ఏదో ఒక దానిలో జన్మిస్తారు. ప్రతి నక్షత్రానికి, దానికి సంబంధించిన ప్రతి పాదానికి సంబంధించి ప్రత్యేకమైన ఆలయం ఉంది..


 గ్రహదోష నివారణ కోసం అభిషేకాలు చేయదలుచుకున్న వారికి ఆ ప్రత్యేకమైన ఆలయంలో మొదట నామ నక్షత్రము లేదా జన్మ నక్షత్రానికి తరువాత రాశికి సంబంధించిన లింగ ఆరాధన చేసి చివరకు #ద్రాక్షారామం దర్శించుకుంటే ఫలితం ఉంటుందట.


మేష రాశి నుండి మీన రాశి వరకు.. అదే క్రమంలో ఆరాధించవలసిన ఆలయాల సమాచారం..


1. #మేష_రాశి


మేషరాశికి సంబంధించిన ఆలయం ద్రాక్షారామ భీమేశ్వర స్వామి వారి ఆలయానికి తూర్పున విలాస గంగావరంలో వుంది.  


అశ్విని_నక్షత్రం


పాదం ----------స్థలం -------- దేవీ దేవతల నామాలు...


1 వ పాదం... బ్రహ్మపురి.... శ్రీశ్రీశ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరస్వామి..

2 వ... ఉట్రుమిల్లి... శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ భీమశంకర స్వామి 

3 వ... కుయ్యూరు... శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి

4 వ... దుగ్గుదూరు... శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి


భరణి_నక్షత్రం


1 వ... కోలంక... శ్రీ ఉమా సమేత శ్రీ సోమేశ్వర స్వామి

2 వ... ఎంజారం... శ్రీ ఉమా సమేత కృపేశ్వర స్వామి

3 వ... పల్లిపాలెం... శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి

4 వ... ఉప్పంగళ... శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి


కృత్తికా_నక్షత్రం


1 వ... నేలపల్లి... శ్రీ మీనాక్షి దేవి సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి.


2. #వృషభ_రాశి


ద్రాక్షారామం లోని భీమేశ్వర స్వామి ఆలయానికి తూర్పున వృషభ రాశికి సంబంధించిన ఆలయం విలాస గంగావరంలో ఉన్నది. 


కృత్తికా_నక్షత్రం


 2 వ... అదంపల్లి... శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి

3 వ... వట్రపూడి... శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి

4 వ... ఉండూరు... శ్రీ ఉమా సమేత శ్రీ మార్కండేయ స్వామి


రోహిణీ_నక్షత్రం


1 వ... తనుమల్ల... శ్రీ పార్వతీ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి

2 వ... కాజులూరు... శ్రీ అన్నపూర్ణేశ్వరీ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి

3 వ... ఐతపూడి... శ్రీ అన్నపూర్ణా సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి

4 వ... చీల... శ్రీ ఉమా సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి


మృగశిర_నక్షత్రం


1 వ... తాళ్ళరేవు... శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి.

2 వ... గురజానపల్లి... శ్రీ ఓం శ్రీ సర్వమంగళ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి


3. #మిధున_రాశి


ద్రాక్షారామం లోని భీమేశ్వర స్వామి ఆలయానికి ఈశాన్యమున మిధున రాశికి సంబంధించిన ఆలయం హసనాబాద్ లో ఉన్నది.


మృగశిర_నక్షత్రం


3 వ... అంద్రగ్గి... శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి

4 వ... జగన్నాధగిరి... శ్రీ అన్నపూర్ణా సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి


ఆరుద్ర_నక్షత్రం


1 వ... పనుమళ్ళ... శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి

2 వ... గొల్లపాలెం... శ్రీ పార్వతీ సమేత గోకర్ణేశ్వర స్వామి

3 వ... వేములవాడ... శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి

4 వ... కూరాడ... శ్రీ భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి


పునర్వసు_నక్షత్రం


1 వ... గొర్రిపూడి (భీమలింగపాడు)....

శ్రీ పార్వతీ సమేత శ్రీ భీమేశ్వర స్వామి

2 వ... కరప... శ్రీ పర్వతవర్ధి సమేత శ్రీ రామ లింగేశ్వర స్వామి

3 వ... ఆరట్లకట్ల... శ్రీ భ్రమరాంబా సమేత శ్రీ మల్లీశ్వర స్వామి

   

4. #కర్కాటక_రాశి


ద్రాక్షారామం లోని భీమేశ్వర స్వామి ఆలయానికి ఉత్తరమున కర్కాటక రాశికి సంబంధించిన ఆలయం ఉన్నది. ఇక్కడి ఆలయం శ్రీ ఉత్తర సోమేశ్వర స్వామి వారికి అంకితం. 


పునర్వసు_నక్షత్రం


4 వ... యెనమాడల... శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి


పుష్యమి_నక్షత్రం


1 వ...కాపవరం... శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి

2 వ... సిరిపురం... శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి

3 వ... వేలంగి... శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ భవానీ శంకర స్వామి

4 వ... ఓడూరు... శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ భవానీ శంకర స్వామి


ఆశ్లేష_నక్షత్రం


1 వ... దోమాడ... శ్రీ ఉమా సమేత శ్రీ మార్కండేశ్వర స్వామి

2 వ... పెదపూడి... శ్రీ శ్యామలాంబా సమేత శ్రీ సోమేశ్వర స్వామి

3 వ... గండ్రాడు... శ్రీ ఉమా సమేత శ్రీ సోమేశ్వర స్వామి

4 వ... మామిడాడ... శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి


5. #సింహ_రాశి 


 ద్రాక్షారామం లోని భీమేశ్వర స్వామి ఆలయానికి ఉత్తరమున సింహ రాశికి సంబంధించిన ఆలయం ఉన్నది. ఇక్కడి ఆలయం వెల్ల లో శ్రీ ఉత్తర సోమేశ్వర స్వామి వారికి అంకితం. 


మఖ_నక్షత్రం


1 వ... నరసరావుపేట... శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి

2 వ... మెల్లూరు... శ్రీ విశాలాక్షీ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి

3 వ... అరికిరేవుల... శ్రీ అన్నపూర్ణా సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి

4 వ... కొత్తూరు... శ్రీ పార్వతీ సమేత శ్రీ నాగ లింగేశ్వర స్వామి


పుబ్బ_నక్షత్రం


1 వ... చింతపల్లి... శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి

2 వ... వెదురుపాక... శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి

3 వ... తొస్సిపూడి... శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ గోరేశ్వర స్వామి

4 వ... పొలమూరు... ఉమా సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి


ఉత్తర_నక్షత్రం


1 వ... పందలపాక... శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి


6. #కన్యా_రాశి


ద్రాక్షారామం లోని భీమేశ్వర స్వామి ఆలయానికి వాయవ్యమున కన్యా రాశికి సంబంధించిన ఆలయం ఉన్నది. ఈ ఆలయం యూరుపల్లి లోని శ్రీ రాజరాజేశ్వరీ సమేత నీలకంఠేశ్వర స్వామి వారికి అంకితం చేయబడ్డది. 


ఉత్తర_నక్షత్రం


2 వ... చోడవరం... శ్రీ పార్వతీ సమేత శ్రీ అగస్త్తేశ్వర స్వామి

3 వ... నదురుబాడు... శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి

4 వ... పసలపూడి... శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ రాజరాజేశ్వరుడు


హస్త_నక్షత్రం


1 వ... సోమేశ్వరం... శ్రీ బాలాత్రిపుర సుందరీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి

2 వ... పడపర్తి.... శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వరుడు

3 వ... పులగుర్త... శ్రీ పార్వతీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి

4 వ... మాచవరం... శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి


చిత్త_నక్షత్రం


1 వ... కొప్పవరం.... శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి

2 వ... అర్థమూరు.... శ్రీ పార్వతీ సమేతశ్రీ అగస్తేశ్వర స్వామి


7. #తుల_రాశి


ద్రాక్షారామానికి పడమరగా వున్న ఆదివారపు పేట లో తులారాశికి సంబంధించిన ఆలయం ఉన్నది. 


చిత్త_నక్షత్రం


3 వ... చల్లూరు.... శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి

4 వ... కాలేరు.... శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి


స్వాతి_నక్షత్రం


1 వ... మారేడుబాక.... శ్రీ పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి

2 వ... మండపేట.... శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ అగస్తేశ్వర కైలాసేశ్వర స్వామి

3 వ... గుమ్మిలూరు.... శ్రీ ఉమాసమేత శ్రీ రామలింగేశ్వర స్వామి

4 వ... వెంటూరు..... శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి


విశాఖ_నక్షత్రం


1 వ... దూళ్ళ.... శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి

2 వ... నర్సిపూడి.... శ్రీ పార్వతీ సమేత సోమేశ్వరస్వామి

3 వ... నవాబుపేట... శ్రీ పార్వతీ సమేత సోమేశ్వరస్వామి


8. #వృశ్చిక_రాశి


ద్రాక్షారామానికి పడమరగా వున్న ఆదివారపు పేట లో వృశ్చిక రాశికి సంబంధించిన ఆలయం ఉన్నది. ఈ ఆలయం శ్రీ పార్వతీ సమేత పరమేశ్వరునికి అంకితం. 


విశాఖ_నక్షత్రం


4 వ... కూర్మపురం.... శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి


అనూరాధ_నక్షత్రం 


1 వ... పనికేరు.... శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ ఇష్టకాంతేశ్వర స్వామి

2 వ... చింతలూరు.... శ్రీ పార్వతీ సమేత శ్రీ పృధ్వీశ్వర స్వామి

3 వ... పినపల్ల.... శ్రీ పార్వతీ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి

4 వ... పెదపల్ల.... శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి


జ్యేష్ట_నక్షత్రం


1 వ... వడ్లమూరు..... శ్రీ పార్వతీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి

2 వ... నల్లూరు.... శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి

3 వ... వెదురుమూడి.... శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి

4 వ... తేకి.... శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి


9. #ధనుస్సు_రాశి


ధనుస్సు రాశికి సంబంధించిన ఆలయం ద్రాక్షారామానికి నైఋతిలో ఉన్నది. నేలపర్తిపాడు లోని శ్రీ అన్నపూర్ణా సమేత కాశి విశ్వేశ్వర స్వామికి అంకితం...


మూల_నక్షత్రం


1 వ.... యెండగండి.... శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి

2 వ.... పామర్రు.... శ్రీ ఉమాపార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి

3 వ... అముజూరు.... శ్రీ ఉమాపార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి

4 వ... పానంగిపల్లి..... శ్రీ లలితాంబికా సమేత శ్రీ ఉత్తరేశ్వర స్వామి


పూర్వాషాఢ_నక్షత్రం


1 వ... అంగర... శ్రీ పార్వతీ సమేత శ్రీ కనకలింగేశ్వర స్వామి

2 వ.... కోరుమిళ్ళ..... శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి

3 వ... కుళ్ళ.... శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి

4 వ.... వాకతిప్ప..... శ్రీ ఉమాసమేత రామలింగేశ్వర స్వామి


ఉత్తరాషాఢ_నక్షత్రం


1 వ.... తాతపూడి.... శ్రీ పార్వతీసమేత శ్రీ మల్లేశ్వర స్వామి


10. #మకర_రాశి


మకర రాశికి సంబంధించిన ఆలయం ద్రాక్షారామానికి దక్షిణం ఉన్నది. కుందలమ్మ చెరువు లోని శ్రీ పార్వతీ సమేత మార్కండేయ స్వామికి అంకితం చేయబడ్డది ఈ ఆలయం. 


ఉత్తరాషాడ_నక్షత్రం


2 వ___ మచర___ శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి

3 వ___ సత్యవాడ____ శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి

4 వ___ సుందరపల్లి____ శ్రీ ఉమాసమేత శ్రీ సోమేశ్వర స్వామి


శ్రవణ_నక్షత్రం  


1 వ___ వానపల్లి...... శ్రీ ఉమాసమేత శ్రీ వైద్యనాధీశ్వర స్వామి

2 వ....మాదిపల్లి (మాడుపల్లి)__ శ్రీ పార్వతీ సమేత శ్రీ ముక్తేశ్వర స్వామి

3 వ.... వాడపాలెం..... శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ వీరేశ్వర స్వామి

4 వ.... వీరపల్లిపాలెం.... శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి


ధనిష్ట_నక్షత్రం


1 వ.... వెల్వలపల్లి... శ్రీ మహిషాసురమర్ధనీ సమేత శ్రీ రాజరాజనరేంద్ర స్వామి

2 వ... అయినవెల్లి..... శ్రీ అన్నపూర్ణా సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి


11. #కుంభ_రాశి


కుంభ రాశికి సంబంధించిన ఆలయం ద్రాక్షారామానికి దక్షిణంలో ఉన్నది. కుందలమ్మ చెరువులోని శ్రీ పార్వతీ సమేత మార్కండేయ స్వామికి అంకితం చేయబడ్డది ఈ ఆలయం.


ధనిష్ట_నక్షత్రం


3 వ..... మసకపల్లి.... శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లికార్జున స్వామి

4 వ... కుందూరు.... శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి


శతభష_నక్షత్రం


1 వ.... కోటిపల్లి___ శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి

2 వ... కోటిపల్లి____ శ్రీ పార్వతీ సమేత శ్రీ కోటేశ్వర స్వామి

3 వ.... తొట్టరమూడి..... శ్రీ భ్రమరాంబా సమేత శ్రీ మూల్లేశ్వర స్వామి

4 వ___ పాతకోట.... శ్రీ లోపాముద్రా సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి


పూర్వాభాద్ర_నక్షత్రం

1 వ.... ముక్తేశ్వరం.... శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ ముక్తేశ్వర స్వామి

2 వ.... శాసనపల్లి లంక..... శ్రీ భ్రమరాంబా సమేత శ్రీశ్రీ చౌడేశ్వర స్వామి

3 వ... తానెలంక..... శ్రీ పార్వతీ సమేత శ్రీ వీరేశ్వరస్వామి


12. #మీన_రాశి


మీనరాశికి సంబంధించిన ఆలయం ద్రాక్షారామానికి దక్షిణం ఉన్నది. కుందలమ్మ చెరువులోని శ్రీ పార్వతీ సమేత మార్కండేయ స్వామికి అంకితం చేయబడ్డది ఈఆలయం.


పూర్వాభాద్ర_నక్షత్రం


4 వ.... ఎర్రపోతవరం.... శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లికార్జున స్వామి


ఉత్తరాభాద్ర_నక్షత్రం


1 వ.... డంగేరు..... శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి

2 వ.... కుడుపూరు..... శ్రీ బాలా త్రిపుర సుందరీ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి

3 వ..... గుడిగళ్ళ____ శ్రీ ఉమాదేవీ సమేత శ్రీ మార్కండేయ స్వామి

4 వ.... శివల___ శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ త్రిపురాంతక స్వామి


రేవతి_నక్షత్రం


1 వ... భట్లపాలిక..... శ్రీ లోపాముద్ర సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి

2 వ.... కాపులపాలెం..... శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి

3 వ... పేకేరు...... శ్రీ లోపాముద్ర సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి

4 వ..... బాలాంత్రం..... శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి..


ఓం నమఃశివాయ... హరహర మహాదేవ...


🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼


#పాత_మహేష్

చిట్టికథ

 ✍️ *...నేటి చిట్టికథ* 


--- ఛాందోగ్య ఉపనిషత్తు నుండి..


ఒకానొకప్పడు జాబాలి అనే కుర్రవాడు ఉండేవాడు. తన తోటివారంతా వేదవిద్యను అభ్యసిస్తుంటే జాబాలికి కూడా జ్ఞానాన్ని అర్జించాలన్న కోరిక కలిగింది. తనను శిష్యునిగా చేర్చుకోమని గౌతముడు అనే ఋషి దగ్గరకు వెళ్లి అర్థించాడు జాబాలి. ‘సరే నీ తల్లిదండ్రులు ఎవరో, నీ గోత్రం ఏమిటో చెప్పు’ అన్నాడు గౌతముడు. ఆ ప్రశ్నకి జాబాలి దగ్గర జవాబు లేకపోయింది. తల్లిని ప్రశ్నలకు జవాబుని కోరాడు. ‘నాయనా! నిజానికి నీ పుట్టుకకు కారణం ఎవరో నాకు కూడా తెలియదు.  కానీ ఒకటి. నా పేరు జాబాల కాబట్టి నా కుమారుడమైన నిన్ను జాబాలి అని పిలుచుకుంటూ వస్తున్నాను. ఈ నిజాన్ని నిర్భయంగా చెప్పగల ధైర్యం నీకు ఉందని నమ్ముతున్నాను. అంతేకాదు! ఇకమీదట ఎప్పుడూ సత్యాన్నే వాంఛించు. దానికి గుర్తుగా నీకు ‘సత్యకాముడు’ అన్న పేరుని అందిస్తున్నాను’ అని చెప్పి పంపింది.


తన తల్లి చెప్పిన మాటలను యథాతథంగా సత్యకామజాబాలి, గౌతమునితో చెప్పాడు. జాబాలి సత్యవాక్కుకు సంతోషించిన గౌతముడు అతణ్ని తన శిష్యగణంలో చేర్చుకున్నాడు. జ్ఞానానికే అంతిమం అనదగ్గ బ్రహ్మజ్ఞానాన్ని గౌతముని వద్ద పొందాలన్నది జాబాలి కోరిక. కానీ జ్ఞానం పట్ల జాబాలికి ఉన్న తపనను పరీక్షించి కానీ అతనికి విద్యను అందించేందుకు సిద్ధంగా లేడు గౌతముడు. 


అందుకోసం జాబాలికి ఆవులు, ఆంబోతులు ఉన్న పశుమందను అప్పగించి. ‘వీటి సంఖ్య వేయిగా మారేంతవరకూ నువ్వు వాటిని అడవులలో సంరక్షిస్తూ ఉండు’ అని ఆదేశించాడు.


గురువుగారి ఆదేశం మేరకు సత్యకాముడు పశువుల మందను మేపుతూ అడవులలో తిరగసాగాడు. కానీ అతని మేధోశక్తికి ప్రకృతిలోని ప్రతి అణువూ ఏదో ఒక రహస్యాన్ని చెబుతున్నట్లే తోచేది. లేత చిగుళ్లు జీవనంలోని సౌకుమార్యాన్ని సూచిస్తే, ఎండిన ఆకులు లయతత్వాన్ని బోధించాయి. కొండలు స్థిరత్వం గురించి చెబితే, సెలయేళ్లు సంతోషానికి శబ్దాన్ని ఇచ్చాయి. అలా అడవిలో తిరుగుతూ, కాలం గడుపుతూ…. తనకు తెలియకుండానే ఈ ప్రకృతిలోని పరమజ్ఞానాన్ని పొందసాగాడు సత్యకాముడు.


 ఇలా ఉండగా ఒకరోజున అతని మందలోని ఒక ఆంబోతు అతని దగ్గరకు వచ్చి ‘సత్యకామా! మా సంఖ్య వేయిని చేరుకుంది. ఇక నువ్వు నీ గురువుగారి దగ్గరకు బయల్దేరవచ్చు. అయితే అందుకు ముందుగా నీకు బ్రహ్మజ్ఞానంలోని తొలి పాదాన్ని వివరిస్తాను విను. ఈ విశ్వంలోని నాలుగు దిక్కులూ ఆ బ్రహ్మతత్వంలోని భాగమే!’ అని చెప్పింది.


సత్యకాముడు ఆ సాయంత్రం వెలిగించిన అగ్ని నుంచి వెలువడిన అగ్నిదేవుడు ‘ఈ జగత్తులో భాగమైన భూమి, ఆకాశం, సముద్రాలు అన్నీ కూడా బ్రహ్మంలోని భాగమే. ఇదే బ్రహ్మజ్ఞానంలోని రెండో పాదం’ అని విశదీకరించాడు.


 ఇక మర్నాడు ఒక హంస అతని చెంతకు చేరి వెలుతుర్ని ప్రసాదించే రూపాలు (అగ్ని, సూర్యుడు, చంద్రుడు, విద్యుల్లతలు) కూడా బ్రహ్మకు ప్రతిరూపాలే అని చెప్పి ఎగిరిపోయింది. 


ఇక బ్రహ్మజ్ఞానంలోని చివరి పాదాన్ని ఒక నీటి పక్షి అతనికి అందించింది. ‘మనిషి ఉనికికి ఆధారభూతమైన ప్రాణం, దృష్టి, వినికిడి, మనస్సు కూడా బ్రహ్మలోని అంతర్భాగాలే’ అని ఆ నీటి పక్షి అతనికి చెప్పింది.


 అలా సత్యకాముడు బ్రహ్మజ్ఞానాన్ని పొందినవాడై సంతృప్తిగా తన గురువుగారి ఆశ్రమానికి చేరుకున్నాడు.


సత్యకామునిలో వెలుగొందుతున్న బ్రహ్మవర్చస్సుని అల్లంత దూరాన చూసిన గురువుగారు జరిగింది గ్రహించారు. ‘సత్యకామా! నీకు ఇక నా అవసరం లేదు. నీ అంతట నువ్వే కావల్సిన జ్ఞానాన్ని సాధించగలిగావు’ అన్నారు. కానీ సత్యకామునిలో తాను జ్ఞానాన్ని పొందానన్న గర్వం లేశమంతైనా లేకపోయింది. ‘గురువుగారూ! జ్ఞానానికి అంతు ఎక్కడ? నాకు ఆ ఆంబోతు, అగ్ని, హంస, నీటిపక్షి బ్రహ్మజ్ఞానాన్ని నేర్పిన మాట నిజమే. కానీ మీ నుంచి కూడా ఎంతో కొంత విద్యను ఆర్జించాలనుకుంటున్నాను. దయచేసి ఈ దీనుడి కోరికను మన్నించండి’ అని వినమ్రతతో వేడుకున్నాడు. 


సత్యకాముని వినమ్రతకు ముగ్థుడైన గౌతముడు తనలో ఉన్న జ్ఞానసారాన్ని కూడా సత్యకామునికి అందించాడు.


సత్యకాముని నిబద్ధత, వినయము, గురువుపట్ల అతనికి ఉన్న భక్తి, విద్యపట్ల అతని శ్రద్ధ శ్లాఘనీయమైనది.


🌷🌷🌷🌷🌷🌷🌷🌷

జీవితం

 🙏ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉంటే అదే ఐశ్వర్యం..🙏

*ఐస్క్రీమ్ తిన్నా కరిగిపోద్ది, తినకపోయినా కరిగిపోద్ది*.

జీవితం కూడా అంతే...

*ఏంజాయ్ చేసినా కరిగిపోద్ది, చేయకపోయినా కరిగిపోద్ది*.

• *తర్వాత నరకం, స్వర్గం అంటారా*?!?! ఉన్నాయో, లేవో కూడా ఎవడికి తెలియదు, నువ్వు మళ్ళీ పుడతావో లేదో కూడా తెలియదు.

• తాగినోడు *ఎదవ కాదు, తాగలేనోడు మహానుభావుడు* కాదు.

• పోని తాగలేనోడు నూరేళ్ళు బ్రతుకుతాడా అంటే, ఆ గ్యారంటీ లేదు.

• ఎవడిపాయింట్ ఆఫ్ వ్యూ వాడిది, ఎవడి జీవితం వాడిది. 

ఫైనల్ గా చెప్పదేంటంటే...

*టైం టు టైం తినండి, పడుకొండి, ఎక్కువ ఆలోచించకండి, ఆరోగ్యాలు జాగ్రత్త*. 

• ఎక్కడ పోతుందో అని లాకర్లలో భయంతో దాచుకునే సంపద *ఐశ్వర్యమా*?

• లేక ఎప్పుడు మనతోనే ఉంటుంది అనే ధైర్యం *ఐశ్వర్యమా*!.

• *ఐశ్వర్యం* అంటే నోట్ల కట్టలు, లాకర్స్ లోని తులాల బంగారాలు కాదు?!?!?!

• ఇంటి గడపలలో ఆడపిల్ల గజ్జల చప్పుడు *ఐశ్వర్యం*.

• ఇంటికిరాగానే చిరునవ్వుతో ఎదురొచ్చే భార్య *ఐశ్వర్యం*. 

• ఎంత ఎదిగినా, నాన్న తిట్టే తిట్లు *ఐశ్వర్యం*. 

• అమ్మ చేతి భోజనం *ఐశ్వర్యం*. 

• భార్య చూసే ఓర చూపు *ఐశ్వర్యం*. 

• పచ్చటి చెట్టు, పంటపొలాలు *ఐశ్వర్యం*. 

• వెచ్చటి సూర్యుడు *ఐశ్వర్యం*. 

• పౌర్ణమి నాడు జాబిల్లి *ఐశ్వర్యం*. 

• మనచుట్టూ ఉన్న పంచభూతాలు *ఐశ్వర్యం*. 

• పాల బుగ్గల చిన్నారి చిరునవ్వు *ఐశ్వర్యం*. 

• ప్రకృతి అందం *ఐశ్వర్యం*.  

• పెదాలు పండించే నవ్వు *ఐశ్వర్యం*. 

• అవసరంలో ఆదరించే ప్రాణస్నేహితుడు *ఐశ్వర్యం*. 

• బుద్ధికలిగిన బిడ్డలు *ఐశ్వర్యం*. 

• బిడ్డలకొచ్చే చదువు  *ఐశ్వర్యం*. 

• భగవంతుడిచ్చిన ఆరోగ్యం  *ఐశ్వర్యం*. 

• చాలామందికన్నా ఉన్నతంగా ఉన్నామనుకునే తృప్తి *ఐశ్వర్యం*. 

• పరులకు సాయంచేసే మనసు మన *ఐశ్వర్యం*.

• *ఐశ్వర్యం* అంటే చేతులు లేక్కేట్టే కాసులు కాదు. 

• కళ్ళు చూపెట్టే ప్రపంచం *ఐశ్వర్యం*. 

• మనసు పొందే సంతోషం *ఐశ్వర్యం

కలియుగం

* #కలియుగం ఎలా ఉంటుంది.


కలియుగం ఎలా ఉంటుంది అన్న పాండవుల ప్రశ్నకు.... కృష్ణ భగవానుని సమాధానం. 


ఒకసారి ధర్మరాజు లేని సమయంలో  మిగిలిన నలుగురు పాండవులు శ్రీకృష్ణుని కలియుగం ఎలా ఉంటుంది అని అడిగారు.


శ్రీకృష్ణుడు నవ్వి చూపిస్తాను చూడండి అన్నాడు. నాలుగు బాణాలు నాలుగు దిక్కులకు వేసి తలో దిక్కు వెళ్లి ఆ బాణాలను తెమ్మన్నాడు. నలుగురు పాండవులు తలో దిక్కుగా ఆ బాణాలను వెదుక్కుంటూ వెళ్లారు.


అర్జునుడికి బాణం దొరికింది. ఇంతలోనే ఒక మధుర గానం వినిపించి అటు తిరిగాడు. ఒక కోయిల మధురంగా పాడుతూ బ్రతికున్న ఒక కుందేలును పొడచుకు తింటోంది. అర్జునుడు నివ్వెర పోయాడు. తిరిగికృష్ణుడి దగ్గరకు బయలు దేరాడు.


భీముడికి బాణం దొరికిన చోట నిండుగా నీళ్లున్న నాలుగు బావుల మధ్య ఒక ఎండి పోయిన బావి కనిపించింది. ఆశ్చర్య పోయాడు. కృష్ణుడి దగ్గరకు బయలుదేరాడు.


నకులుడికి బాణం దొరికిన చోట ఒక ఆవు అప్పుడే పుట్టిన తన లేగ దూడను గాయాలయ్యేంత విపరీతంగా నాకుతోంది. చుట్టూ వున్న జనం అతి కష్టమ్మీద ఆవు దూడలను విడదీశారు. నకులుడికి ఆశ్చర్యమేసింది. వెనుదిరిగాడు.


ఇక సహదేవుడికి బాణం దొరికిన చోట ఒక పర్వతం పైనుండి ఒక పెద్ద గుండు దొర్లుతూ దారిలో ఉన్న చెట్లను పడవేస్తూ వచ్చి ఒక చిన్న మొక్క దగ్గర ఆగిపోయింది. సహదేవుడికి అర్థం కాలేదు.


నలుగురూ కలిసి శ్రీకృష్ణుని తమ సందేహాలు అడిగారు.  


ఆయన చెప్పనారంభించాడు.


కలియుగంలో గొప్ప జ్ఞానులైన వారు కూడా కుందేలును కోయిల పొడుచుకు తిన్న రీతిగా భక్తులను దోచుకుంటారు.


కలియుగంలో అత్యంత ధనికులు కూడా పేదలకు పైసా సాయం చేయరు.


కలియుగంలో ఎలాగైతే ఆవు దూడకు గాయాలయ్యేంతగా నాకిందో తలిదండ్రులు తమ పిల్లలను గారం చేసి వాళ్ల జీవితాల్ని నాశనం చేస్తారు.


కలియుగంలో జనులు మంచి నడవడి కోల్పోయి కొండ మీద నుంచి గుండు దొర్లినట్లుగా పతనం అవుతారు. భగవన్నామమనే చిన్న మొక్క తప్ప ఎవరూ కాపాడ లేరు.


ఉద్ధవ గీత శ్రీమద్భాగవతం...

(సేకరణ)