14, జనవరి 2022, శుక్రవారం

కేనోపనిషత్తు వేదాంత అధ్యయనం మానకండి

 కేనోపనిషత్తు


వేదాంత అధ్యయనం మానకండి. మీకు అది తలపై నుంచి వెళ్లిపోయినట్టు ఉంటే, మీ జీవితాన్ని కర్మ ప్రధానంగా మలచుకోండి. ఉపాసన, జ్ఞానం కూడా వాటి వెన్నంటే పాటించండి. అలాగే, కొంచెం అర్థమయింది. ఇంకా సాధన చేయాలి అనిపిస్తే ఉపాసన ప్రధానంగా మీ జీవితాన్ని మలచుకుని, కర్మ, జ్ఞానమార్గాలను కూడా అనుసరించండి. మీరు పూర్వజన్మలోనో, ఈ జన్మలోనో సాధన చేసి ఉంటే మీ జీవితాన్ని జ్ఞానప్రధానంగా చేసుకోండి. అలా మీరు ఉత్తమ అధికారి అయి, జ్ఞానం పొందితే మీకు కలిగే ఫలమేమిటి? అది ఈ మంత్రంలో వస్తుంది. యోవా ఏతామేవం వేద- ఈ విధంగా బ్రహ్మను ఎవరైతే తెలుసుకుంటారో; ఏవం అంటే ఈ విధంగా అంటే ఏ విధంగా? ఇది చాలా ముఖ్యం.

నేను బ్రహ్మను. నేను ప్రతి అనుభవం వెనకా చైతన్యంగా ప్రకటితమవుతున్నాను. నేను తెలిసిన వస్తువు కాను; తెలియని వస్తువును కాను. నేను వస్తువును తెలుసుకునే కర్తను. ఈ విధంగా తెలుసుకోవాలి. అలాకాకుండా అంతా విని బ్రహ్మ ఎక్కడో ఉన్నాడు. నాకు బ్రహ్మ అనుభవం ఎప్పుడు అవుతుందో అనుకోకూడదు. అలా సరిగ్గా అర్థం చేసుకుంటే, ఫలం ఏమిటి? 

అపహత్య పాప్మానమ్ - అతని పాపాలన్నీ నాశనమయిపోతాయి. 

సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే గీత 4-33 

పాపాలంటే మనం మామూలుగా పాపాలు అనుకుంటాము. కాని ఉపనిషత్తులో 

పాపాల కింద మూడు అంశాలు వస్తాయి. 

1. పాపాలంటే పాపాలే పాప రూప పాపం.

2. పుణ్యాలు పుణ్యరూప పాపం

ఆత్మ అజ్ఞానం 3. అజ్ఞానం

వేదాంతంలో పుణ్యం కూడా పాపం కిందకే వస్తుంది. ఎందుకు? పాపాలు అనుభవించటానికి పునర్జన్మ ఎత్తినట్టే, పుణ్యకర్మఫలం అనుభవించటానికి కూడా పునర్జన్మ ఎత్తాల్సి ఉంటుంది.

అజ్ఞానం కూడా పాపం కిందకే వస్తుంది. ఎందుకంటే అజ్ఞానం వల్లనే


137

కర్తృత్వ భావన, కోరికలు, కర్మలు, పుణ్యపాపాలు

 కర్తృత్వ భావన, కోరికలు, కర్మలు, పుణ్యపాపాలు, సుఖదుఃఖాలు, పునరపి జననం, పునరపి మరణం కలుగుతాయి. సంసారికి మూల కారణం అజ్ఞానం. ఆత్మ అజ్ఞానం. ఆత్మ అజ్ఞానం తొలగితే, పునర్జన్మ ఉండదు. అందువల్ల పాప్మానమ్ అంటే పాపం, పుణ్యం, అజ్ఞానం మూడూ వస్తాయి. ఈ మూడు నాశనమవుతాయి జ్ఞానికి. అప్పుడేమవుతుంది?


అనస్తే స్వర్గోలోకే ప్రతితిష్ఠతి - స్వర్గలోకంలో నెలకొని ఉంటాడు. అదెలా సాధ్యం? పరస్పర భిన్నంగా లేదా? ఒకపక్క పుణ్యం కూడా నాశనమవుతుంది అంటున్నది. స్వర్గలోకం పుణ్యఫలం కదా! అలాంటప్పుడు స్వర్గలోకానికి ఎలా వెళతాడు? శంకరుల వారు స్వర్గలోకానికి అర్థాన్ని పరం బ్రహ్మగా తీసుకోవాలి అంటారు. స్వరోలోకే బ్రహ్మణి. ఎటువంటి 'బ్రహ్మ?


జ్యేయే- అంతిమం, శ్రేష్ఠతమం. దీన్ని బట్టి కూడా స్వర్గలోకే అంటే స్వర్గలోకం కాదని తెలుస్తున్నది. స్వర్గలోకం అంతిమ లోకం కాదు. శ్రేష్ఠతమమూ కాదు. దానిపైన ఇంకా లోకాలు ఉన్నాయి. అందువల్ల జ్ఞాని బ్రహ్మలో ప్రతితిష్ఠతి అనాలి. అంటే ఎప్పుడూ బ్రహ్మనిష్ఠలో ఉంటాడు అని అర్థం.


బ్రహ్మలో ప్రతితిష్ఠతి అంటే బ్రహ్మ ఇక్కడ ఉన్నాడు. జ్ఞాని బ్రహ్మమీద ఉన్నాడు అని కాదు అర్థం. జ్ఞాని బ్రహ్మనిష్ఠలో ఉంటాడు అని అర్థం. తను బ్రహ్మకు భిన్నంగా లేడు అని తెలుసుకుంటాడు.


ప్రతితిష్ఠతి ప్రతితిష్ఠతి - రెండుసార్లు ఈ పదం చెప్పటంలోని అర్థం. ఈ ఫలం ఖచ్చితం. అందులో సందేహం లేదని హామీ ఇస్తున్నది ఉపనిషత్తు.


పూర్వం ఉపనిషత్తులు వ్రాతపూర్వకంగా ఉండేవికావు. అందుకని అధ్యాయం ముగిసేటప్పుడు, ఉపనిషత్తు ముగిసేటప్పుడు ఆఖరి పదం మళ్ళీ చెప్పటం జరుగుతుంది. అందువల్ల ప్రతితిష్ఠతి రెండుసార్లు చెప్పటంలోని ఇంకో అర్థం ఇక్కడితో నాలుగవ అధ్యాయం ముగిసింది. ఇక్కడితో కేనోపనిషత్తు కూడా ముగిసింది.


శుభం భూయాత్.


కేనోపనిషత్తు


138

కేనోపనిషత్తు సారాంశము

 కేనోపనిషత్తు సారాంశము


ప్రశ్న:- కేనేషితం పతతి ప్రేషితం మనః


మనస్సు, ప్రాణం, వాక్కు, కన్ను,చెవుల వెనుక ఉన్న దేవత ఎవరు?


జవాబు:


1. శ్రోతస్య శ్రోత్రం (చెవితో చూద్దాం) ఆత్మ వేరు, చెవి వేరు. ఆత్మ చెవి అంతటా వ్యాపించి ఉంది.


ఆత్మ ఉండటం వల్లే చెవిని చెవి అనగలుగుతున్నాము. అంటే చెవితో వినగలుగుతున్నాము.


ఇదే సూత్రం మనస్సు, ప్రాణం, వాక్కు, కన్ను, చెవులకు వర్తిస్తుంది.


2. న తత్ర చక్షుర్గచ్ఛతి న వాగ్గచ్ఛతి నో మనః మనస్సు, ప్రాణం, వాక్కు, కన్ను, చెవుల ద్వారా ఆత్మను తెలుసుకోలేము. 3. యద్వాచానభ్యుదితం యేన వాగభ్యుద్యతే


మనస్సు, ప్రాణం, వాక్కు, కన్ను, చెవుల ద్వారా ఆత్మను తెలుసుకోలేము. కాని మనస్సు, ప్రాణం, వాక్కు కన్ను, చెవులు ఆత్మ వల్లనే పని చేస్తున్నాయి. 4. అన్యదేవ తద్విదితాదథో అవిదితాదధి


ఆత్మ తెలిసిన వస్తువు కాదు, తెలియని వస్తువు కాదు.


దీని అర్థం- ఎ) ఆత్మ తెలియబడే వస్తువు (ఆబ్జెక్టు) దు - ప్రమేయం కాదు. బి) ఆత్మ తెలుసుకునే నేను - ప్రమాతా అయిన నేను.


సి) ఆత్మ ప్రమాతృత్వం లేకపోయినా ఉంటుంది. అది శుద్ధ చైతన్యం. 5. తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే -


ఆత్మ ఆబ్జెక్టు కాదు కాబట్టి, సగుణ రూపంలో కొలిచే దేవుడు ఆత్మ కాదు. సాక్షి చైతన్యమైన నేనే ఆత్మను.


ఆత్మ అనుభవం


ఆత్మ అనుభవం పొందలేము.

కేనోపనిషత్తు ఆత్మ అనుభవం పొందనవసరం లేదు.

 కేనోపనిషత్తు


ఆత్మ అనుభవం పొందనవసరం లేదు.


ఎందుకంటే అది నువ్వే. ఎవ్వర్ ది ఎక్స్ పీరియన్సర్, నెవ్వర్ ది ఎక్స్ పీరియడ్. అనుభవించే నువ్వే ఎప్పటికీ, అనుభవించబడే వస్తువు కాదు ఎన్నటికీ. యచ్చక్షుషా న పశ్యతి యేన చక్షూంషి పశ్యతి ఆత్మను కన్నుతో చూడలేము కాని కళ్ళు ఆత్మ వల్లే పనిచేస్తున్నాయి ప్రతిబోధ విదితం మతం


ఆత్మ అనుభవం పొందలేము కాని ప్రతి అనుభవమూ ఆత్మ వల్లే పొందుతున్నాము.


ఆత్మజ్ఞానం


ఆత్మ అంటే అనుభవించబడే వస్తువు కాదు. ఆత్మ అంటే అనుభవించే నేనే. నేను అంటే సాక్షి చైతన్యాన్ని, ఆత్మజ్ఞానం పొందటం అంటే వృత్తిలో మార్పు.


ఆత్మ అనుభవం కోసం ప్రయత్నించకూడదు. ఆత్మ వల్లే అన్నీ అనుభవిస్తున్నాము. ఆ ఆత్మను నేనే అని పదునైన బుద్ధితో అర్థం చేసుకోవటమే ఆత్మజ్ఞానం,


ఆత్మజ్ఞానం పొందిన విద్యార్థి స్పందన


1. నాకు బ్రహ్మ తెలుసు అనను 2. నాకు బ్రహ్మ తెలియదు అనను అంటే- బ్రహ్మను ఆబ్జెక్టుగా చూస్తే తెలియదని నాకు తెలుసు. బ్రహ్మను సబ్జెక్టుగా తెలుసుకోవాలని నాకు తెలుసు. బ్రహ్మ ఎవరికి తెలియదో, వారికి తెలుసు.


3. నాకు తెలుసు


దీన్నే ఉపనిషత్తు మళ్ళీ చెపుతుంది.


140


4. నాకు తెలియదు


బ్రహ్మ ఎవరికి తెలుసో, వారికి తెలియదు.

కేనోపనిషత్తు తెలిసిన వారికి

 కేనోపనిషత్తు


తెలిసిన వారికి తెలియదు.


తెలియని వారికి తెలుసు. అంటే బ్రహ్మను ఆబ్జెక్టుగా


చూసేవారికి తెలియదు. బ్రహ్మను సబ్జెక్టుగా తెలుసుకునేవారికి తెలుసు.


యక్షుని కథ వల్ల వచ్చిన 6 సందేశాలు 1. బ్రహ్మ అస్తి- యక్షుడు కనబడ్డాడు. ఉపాసనలు 1. విద్యుత్ ఉపాసన


2. బ్రహ్మణః దుర్విఘ్నేయం- వాయువు, అగ్ని తెలుసుకోలేకపోయారు. అంటే ఇంద్రియాల ద్వారా తెలుసుకోలేము.


3. జ్ఞానయోగ్యతా అపేక్షః- గర్వం ఉండకూడదు. శ్రద్ధ, భక్తి,శరణాగతి కావాలి. ఇంద్రుడు శరణు వేడాడు.


4. గురు అపేక్ష:- గురువు ద్వారానే నేర్చుకోవాలి. ఉమాదేవి గురువుగా వచ్చింది. 5. బ్రహ్మవిద్యాస్తుతిః - బ్రహ్మ విద్య పొందిన ఈ ముగ్గురు దేవతలూ ఖ్యాతిని పొందారు.


6. ఉపాసనవిధి అంగత్వం - ఈ కథకు అనుగుణంగా కొన్ని ఉపాసనలు చెప్పబడ్డాయి.


2. నిమేష ఉపాసన అధి దైవ ఉపాసనలు 3. వృత్తి ఉపాసన 4. బ్రహ్మ మహిమ ఉపాసన గుణ విశిష్ట ఉపాసన యక్షుని లక్షణాలు - క్షణికత్వం, మనోహరత్వం, ప్రకాశరూపత్వం. మెరుపుకూ, కనురెప్పలు ఆర్పటానికీ, వృత్తికీ ఈ మూడు లక్షణాలు ఉన్నాయి. మనస్సు బాహ్యవస్తువును ప్రకాశింపజేస్తుంది. చైతన్యం, వృత్తిని ప్రకాశింపజేస్తుంది. మనస్సు అంతర్గతంగా ఉన్న సాక్షిని ప్రకటింపచేస్తుంది. వృత్తి, చైతన్యాన్ని ప్రకాశింపజేస్తుంది. ఆధ్యాత్మ ఉపాసన


141

కేనోపనిషత్తు కర్మయోగం

 కేనోపనిషత్తు కర్మయోగం


ఉపనిషత్తు అనే ఆవుకు నాలుగుపాదాలు- తపస్సు, దమము, కర్మ, శమము


అంగాలు


అన్ని వేదాలు


సత్యం ఫలం


ఆయతనం


పాపరూప పాపాలు, పుణ్యరూప పాపాలు, అజ్ఞానరూప పాపాలు


నాశనమవుతాయి. సర్వాత్మ భావన కలుగుతుంది. జ్ఞాననిష్ఠలో నెలకొంటాడు. అంటే ఈ క్రింది భావనలోనే ఉంటాడు తదేవ బ్రహ్మత్వం విద్ధి వేదం యదిదముపాసతే


శాంతి పాఠం


ఓం ఆప్యాయను మమాజ్ఞాని వాక్పాణశ్చక్షుః శ్రోత్రమథోబలమిన్షియాణి చ సర్వాణి! సర్వం బ్రహ్మోపనిషదం మా_హం బ్రహ్మ నిరాకుర్యాం మా మా బ్రహ్మ నిరాకరోదనిరాకరణమస్త్వనిరాకరణం మే2 స్తు! తదాత్మని నిరతే య ఉ పనిషత్సు ధర్మాస్తే మయి సన్తు తే మయి సన్తు ||


ఓం శాస్త్రశ్శాస్తిశ్శాస్త్ర


కేనోపనిషత్తు అధ్యయనం మొదలుపెట్టే ముందు విఘ్నాలు లేకుండా చేయమని శాంతిపాఠం పఠిస్తాము. ఇప్పుడు అధ్యయనం నిరాటంకంగా సాగినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మళ్ళీ శాంతి పాఠాన్ని పఠిస్తాము.


సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు


142

అంతటా మట్టే.

 కుండ మట్టి - జీవన్ముక్తి


మనిషి ఏం చేసినా శాంతి, సుఖం, భద్రత కోసమే చేస్తూంటాడు. అవి వస్తువుల్లోనూ, పరిస్థితుల్లోనూ, మనుషుల్లోనూ, సంఘటనల్లోనూ ఉందనుకుంటాడు. తన స్వరూపమే శాంతి, సుఖం, భద్రత అని తెలుసుకోలేక, బాహ్యంగా పరుగులు తీస్తూంటాడు. కస్తూరి మృగం తనలో సువాసన పెట్టుకుని బయట ఎక్కడో ఉందని, వెతికి, వెతికి అలసి సొలసి చనిపోతుందిట. సరిగ్గా మనిషి కూడా అలానే చేస్తాడు. తనే ఆనంద స్వరూపం అని గ్రహించడు.


కుండకు ఎవరో చెప్పారు. నీ గురించి నువ్వు తెలుసుకో! స్వరూపంగా నువ్వెవరో తెలుసుకో! స్వరూపతః నువ్వు మట్టివి. మట్టిని తెలుసుకుంటే, వెంపర్లాట, ఆరాటం పోయి జీవన్ముక్తి పొందుతావు అని చెప్పారు. వెంటనే కుండ మూటాముల్లే సర్దుకుని స్వరూపంగా మట్టిని చూద్దామని చార్ ధామ్ యాత్రకు బయలు దేరింది. యాత్ర అంతా పూర్తి అయింది కాని స్వరూపంగా మట్టి మాత్రం కనపించలేదు. యజ్ఞ యాగాదులు చేసింది మట్టి జాడే తెలియలేదు. ధ్యానం చెయ్యాలన్నారెవరో! ధ్యానం లోనూ మట్టి కనపడలేదు. కుండ మట్టిని వెతకాలి. ఎలా? మట్టి ఎక్కడ ఉంది? కుండ లోపల ఉందా? కుండ బయట ఉందా? కుండ మధ్యలో ఉందా? అసలు కుండకు మట్టికి దూరం ఎంత? కుండ అంతటా మట్టే. మట్టి తప్ప కుండే లేదు. కుండకు మట్టికి దూరం ఏమిటి? అవి రెండు వస్తువులైతే కదా! మట్టినే కుండ అంటున్నాం. కుండగా పరిమితత్వం, అల్పత్వం, అశాశ్వతత్త్వం ఉన్నాయి. అదే మట్టిగా అపరిమితత్త్వం, అనల్పత్వం, శాశ్వతత్త్వం. అదే జీవన్ముక్తి. ఇప్పుడు కుండ ఏం చేయాలి? అంతటా వెతకాలా? పూజలు చేయాలా? ధ్యానం చేయాలా? నేనే మట్టిని అని తెలుసుకుంటే చాలు. కుండ తయారుకాక ముందూ మట్టే, కుండగానూ మట్టే, కుండ పగిలినా మట్టే. మట్టిగా దానిలో ఏ మార్పూ లేదు. దానికి పుట్టుకా లేదు, మరణం లేదు. అదే కుండయితే మరణం, పుట్టుక తప్పవు.

కంఠ చామీకర న్యాయం

 అదే మాదిరిగా జీవుడు తను స్వరూపతః బ్రహ్మను అని తెలుసుకుంటే, తనే ఆనంద స్వరూపమని తెలుసుకుంటాడు. అదే జీవన్ముక్తి. జీవుడు ఎప్పుడూ ముక్తుడే. ఆ విషయం తెలుసుకోవడమే తరువాయి. దీనినే శాస్త్రం ప్రాప్తస్య ప్రాప్తం అంటుంది. మోక్షం సిద్ధవస్తువు, సాధ్యవస్తువు కాదు.


కంఠ చామీకర న్యాయం - ఒక రాజ్యంలో రాణిగారు చాలా ఖరీదైన నెక్లెస్ విదేశాలనుంచి తెప్పించుకున్నారు. అకస్మాత్తుగా ఆ నెక్లెస్ కనిపించడం లేదు. రాణిగారికి చాలా ప్రీతికరమైన నెక్లెస్ మాయమయింది. దానిమీదమోజు తీరకుండానే పోయింది. దానితో రాణిగారు విపరీతమైన ఆవేదన చెందారు. సేవకులతో రాజప్రాసాదమంతా అడుగడుగునా గాలింపు చేయిస్తున్నారు.


ఎంత వెతికినా ప్రయోజనం కన్పించ లేదు. మంత్రి ఏమైనా మార్గం చూపుతాడేమోనని పిలిపించారు. మంత్రిగారు అసలు విషయం వాకబు చేస్తే రాణిగారి నెక్లెస్ పోయిందని తెలిసింది. రాణిగారిని చూడగానే మంత్రిగారికి నెక్లెస్ జాడ తెలిసిపోయింది. వెంటనే మంత్రి అమ్మా మీ సేవకులను వెతకడం ఆపమనండి అన్నారు.


మంత్రి తెలివితేటల మీద అచంచలమైన విశ్వాసం ఉన్న రాణిగారు చప్పట్లు కొట్టి నెక్లెస్ గురించి వెతకడం ఆపింది.


“అమ్మా రాణిగారూ! మీ మెడను ఒకసారి తడుముకోండి,” అన్నారు మంత్రి. అప్పుడు రాణిగారికి మెడ తడుముకోకుండానే నెక్లెస్ బరువు తెలిసింది. ఆమె తన మెడలోనే నెక్లెస్ ను పెట్టుకుని, ఊరంతా వెతుకుతోంది. తనదగ్గరే వున్న నెక్లెస్ బయట ఎలా దొరుకుతుంది? విశ్వమంతా ఎంత వెతికినా దొరకదు. ఈ సమస్యకు పరిష్కారం నెక్లెస్ పొయింది అనే అజ్ఞానం తొలిగి తన దగ్గరే, మెడలోనే ఉందని తెలిస్తే చాలు. దీనినే కంఠచామీకర న్యాయం అంటారు. ఇది తెలిస్తే ఇక ఎటువంటి ఆందోళన ఉండదు. కంఠచామీకరం అంటే నెక్లెస్ అని అర్థం. -


సరిగ్గా ఇలాగే జీవుడు తనే స్వరూపతః బ్రహ్మనని తెలుసుకోలేక జన్మ జన్మలనుంచి బ్రహ్మను వెతుకుతూనే ఉన్నాడు. మన దగ్గరే కోహినూర్ డైమండ్ ఉంది. దానిని అజ్ఞానంతో పేపరు వెయిట్ లా వాడుతున్నాము.


ప్రయోజనం: నేనే శాంతి, సుఖం, ఆనందాలకు నెలవు అని తన పూర్ణత్వం దర్శించిన జ్ఞానికి ఎటువంటి వెలితి లేదు. అతను ఇక్కడే ఇప్పుడే జీవన్ముక్తి, అత్యంతిక ఆనందం అనుభవిస్తాడు.


అలవోకగా అద్వైతం పుస్తకరూపంలో రాబోతున్నది ...


***


146

పలకరింపు

 _*🙏💫 పలకరింపు 💫🙏💐*_

*🌹🌸🌹🌸🌹🌸🌹 🌸 🌹*

_*మనుషులకు మాత్రమే వున్న వరమిది. మానవీయ సంబంధాల వారధి. మనసు వ్యాకులతలను పారద్రోలే మంత్రమిది.*_


_*పలకరింపులు లేని సమాజం సమూహం ఒట్టి నిర్జీవంగా గోచరిస్తాయి. ఒక్క పలకరింపుతో నూతనోత్తేజమేదో తొంగి చూస్తూంటుంది. పలకరింపు అనేది మనిషితనానికి, కలిసి బతికే మనిషితనానికి నిదర్శనంగా నిలుస్తుంది.*_


_*నేటి అత్యంతాధునిక అనేక సౌకర్యాల, విలాసాలననుభవిస్తున్న కాలంలో మనం పోగొట్టుకుంటున్న గొప్ప మానవాంశం పలకరింపు. ఇది చాలా చిన్న విషయంగానే అనిపించవచ్చు. ఒక్క చిన్న మాటే పలకరింపై వెలగవచ్చు. కానీ ఎన్ని డబ్బులు పోసినా దొరకని అమూల్య సంపద పలకరింపు.*_


_*ఒక ప్రాణాన్ని నిలబెట్టవచ్చు. ఒక బాధని తొలగించవచ్చు. ఒక ఆలోచనను రేకెత్తించవచ్చు. ఒక ఆశను చిగురింపచేయొచ్చు. మనసు గాయాలను, గాట్లను మాన్పించవచ్చు !*_


_*పలకరింపుకు అంత శక్తి వుంది. పలకరించడమనే సమస్య నేడు ఇండ్లల్లో వృద్ధులు విపరీతంగా ఎదుర్కొంటున్నారు. తమ జీవితమంతా కుటుంబం కోసం, పిల్లల కోసం వెచ్చించి, వృద్ధాప్యంలో ఏమీ చేయలేని స్థితిలో ఇంట్లో వున్న పెద్దల్ని పనికిరాని వస్తువుల్ని చూసినట్లు చూస్తున్నారు. "వారి శ్రమఫలమే వర్తమానపు మన కళ " - అని మరిచి పోతున్నారు. అట్లాంటి పెద్దలను ఆప్యాయంగా పలకరించాలి.*_


_*ఒక మాట మాట్లాడాలి. ఒక్కసారి పలకరింపుతో వాళ్ళను కదిపి చూడండి. బండెడు అనుభవాలను మీ ముందుంచుతారు. ఆ అనుభవాలు ఇప్పటికీ మనకు దివిటీలా పని చేస్తాయి.*_


_*పలకరింపులు పెద్దలకు ఆరోగ్యాన్నిచ్చే మందులా పని చేస్తుంది. పెద్దలనే కాదు ఎవరినైనా పలకరిస్తూ వుండాలి. దాంతో స్నేహం, బంధం, ప్రేమ, అనుబంధం పెరుగుతూ వుంటుంది. ఇవి కేవలం మనుషులు సాధించేవి.*_


_*ప్రముఖ కథా రచయిత్రి ఇల్లిందల సరస్వతీ దేవిగారు _"తీయని పలకరింపు" - అని ఒక కథను రాశారు. అందులో ఒక రిటైర్డు పెద్దాయన, పలకరింపులు లేక పడుతున్న బాధను చక్కగా చిత్రించారు. ''నేను డబ్బులు బాగా సంపాదిస్తూ ఉద్యోగం చేస్తున్నపుడు నన్ను చాలా మందే పలకరించేవాళ్ళు. ఉద్యోగ విరమణ చేసి, ఆదాయం తగ్గిపోయిన క్షణం నుంచి పనికిరాని వాడిలా పలకరింపుకు నోచుకోలేక వృద్ధాశ్రమం చేరాను'' అని పాత్రలో వివరిస్తుంది.*_


_*డబ్బులు మాత్రమే ముఖ్యంగా మారిన నేటి తరాలకు మనుషుల మధ్య సంబంధాలు అప్రధానమై పోయి ఈ పరిస్థితులు దాపురించాయి. ఇది లాభాల ఆర్జన కోసం సరుకుల మీద వ్యామోహాన్ని పెంచిన సాంస్కృతిక దాడి ఫలితం. దీన్ని మార్చకపోతే మనమూ ఒకప్పటికి బాధితులుగా మిగులుతాం.*_


_*లాక్‌డౌన్‌ మూలాన ఇంట్లోనే అందరూ ఉన్నప్పటికీ, వారి మధ్య దూరాలేవీ తగ్గలేదు. మరింత పెరుగుతూనే వున్నాయి. ఎవరి చేతుల్లో వాళ్ళు సెల్‌ఫోన్‌లతో ఇయర్‌ ఫోన్లతో తమలో తామే, తమకు తామే గడిపేస్తున్నారు. కుటుంబ సంబంధాల్లో విపరీత దూరాలు పెరుగుతున్నాయి.*_


_*మనసుల్లో దాగిన భావాలు, అభిప్రాయాలు పలకరించి అడిగితేనే తెలుస్తాయి. తెలిసినపుడే వాటిని సరిచేయడమో, చర్చించి మనం సరికావడమో చేయవచ్చు. కొన్ని అపోహలూ తొలిగిపోవచ్చు. కుటుంబంలోనే కాదు ఇంటి పక్కన వాళ్ళను, దూరానవున్న మిత్రులను ఖాళీ సమయం దొరకగానే ఒకసారి పలకరించండి.*_


*కరోనా బాధితులను, దాని వల్ల భయపడుతున్న వాళ్ళను పలకరించాలి. పది మందితో గల సంబంధమే జీవితం.*


*నాకు తెలిసిన ఒక పెద్దాయన అన్ని హంగులు ఉండి కూడా, తాను, తన భార్యాబిడ్డలు, సన్నిహితులతో ఏసి లాంటి సకల సౌకర్యాలు అనుభవిస్తూ, వృద్ధురాలు తన తల్లిని మాత్రం ఔట్ హౌస్ కొట్టుగదిలో ఉంచాడు. తనని పలకరించితేనే భార్య అనుగ్రహానికి దూరమైపోతానేమో అని భావించి, దూరంగానే ఉంచిన ప్రబుద్ధుడు.*


_*''నాకేమీ పెట్టాల్సిన అవసరం లేదు. నేనేమీ అడగటమూ లేదు. రోజు ఏం చేస్తున్నావమ్మా, ఏం తిన్నావు, బాగున్నావా'' అని నన్ను అడిగితే చాలని ఎనభై యేండ్ల తల్లి నాతో చెబుతూ దు:ఖించింది. అంటే పలకరింపుల విలువేమిటో అర్థం చేసుకోవచ్చు. చివరికి ఆమె పోయిన తరువాత అతను కార్చిన మొసలి కన్నీరుకి ఏ అవార్డు ఇవ్వొచ్చో అర్థం కాలేదు !*_ 


_*🌹✅ అందుకే.. పలకరించండి. పలుకులేమీ బంగారం కాదు. మనిషి మంచి తనానికి ఆనవాళ్ళు ! 🚩🙏శుభోదయం🙏

పుణ్యఫలాలన్నీ

 పుణ్యఫలాలన్నీ ఒక్క చెడ్డపనితో పోతావి....

కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. కృష్ణుడు పాండవులను తీసుకుని హస్తినాపురానికి వస్తాడు. తన వందమంది పుత్రులను పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు శోకంలో మునిగిపోయి ఉంటాడు. కృష్ణుడి రాకను గమనించిన ధృతరాష్ట్రుడు ఎదురువెళ్లి బోరున విలపిస్తాడు. చిన్నపిల్లాడిలా ఏడుస్తున్న అతని కృష్ణుడు ఓదార్చేందుకు ప్రయత్నిస్తాడు.

ధృతరాష్ట్రుడి దు:ఖం కోపంగా మారి కృష్ణుడిని నిలదీస్తాడు. ‘అన్నీ తెలిసి కూడా, మొదటి నుంచీ జరిగేదంతా చూస్తూ కూడా సాక్షాత్తూ భగవంతుడవైన నువ్వు ఎందుకు మిన్నకుండిపోయావు? ఇంత ఘోరాన్ని ఎందుకు ఆపలేదు? కావాలని ఇదంతా ఎందుకు జరగనిచ్చావు? ఈరోజు తనకు వందమంది పుత్రులను పోగొట్టుకునే స్థితిని ఎందుకు కలగజేశావు’ అని నిలదీస్తాడు. అందుకు అన్నీ తెలిసిన కృష్ణుడు ఇలా సమాధానమిస్తాడు.

‘ఓ రాజా! ఇదంతా నేను చేసిందీ కాదూ, నేను జరగనిచ్చిందీ కాదు. ఇది ఇలా జరగడానికి, నీకు పుత్రశోకం కలగడానికీ అన్నిటికీ కారణం నువ్వూ, నీ కర్మ. యాభై జన్మల క్రితం నువ్వొక కిరాతుడివి(వేటగాడు). ఒకరోజు వేటకు వెళ్లి రోజంతా వేటాడినా నీకు యేమీ దొరకని సందర్భంలో ఒక అశోకవృక్షం మీద రెండు గువ్వల జంట వాటి గూటిలో గుడ్లతో నివసిస్తున్నాయి. వాటిని నీవు చంపబోగా ఆ రెండు పక్షులూ నీ బాణాన్ని తప్పించుకుని బతుకగా అప్పటికే సహనం నశించినవాడివై కోపంతో ఆ గూటిలో ఉన్న వందగుడ్లను ఆ రెండు పక్షులు చూస్తుండగా విచ్ఛిన్నం చేశావు. తమ కంటి ముందే తమ నూరుగురు పిల్లలు విచ్ఛిన్నం అవుతున్నా కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండిపోయాయి. ఆ పక్షుల గర్భశోకం దుష్కర్మగా నిన్ను వదలక వెంటాడి ఈ జన్మలో నిన్ను ఆ పాపం నుంచి విముక్తుడిని చేసి కర్మబంధం నుంచి విడిపించింది, నువ్వు ఎన్ని జన్మలెత్తినా ఎక్కడ ఉన్నా ఎవరు నిన్ను ఉపేక్షించినా, ఎవరు నిన్ను శిక్షించలేకపోయినా నీ కర్మ నిన్ను తప్పకుండా వెంటాడుతుంది. వదలక వెంటాడి ఆ కర్మఫలాన్ని అనుభవింపజేస్తుంది. కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు’ అని అంటాడు.

ధృతరాష్ట్రుడు సమాధానపడ్డట్టు అనిపించినా మళ్లీ కృష్ణుడిని తిరిగి ప్రశ్నిస్తాడు. కర్మ అంత వదలని మొండిదే అయితే యాభై జన్మలు ఎందుకు వేచి ఉన్నట్టు? ముందే ఎందుకు శిక్షించలేదు.. అని ప్రశ్నిస్తాడు. అందుకు కృష్ణుడు చిరునవ్వు నవ్వి ‘ఓ రాజా! వందమంది పుత్రులను ఒకే జన్మలో పొందాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి.. ఎన్నో సత్కర్మలు ఆచరించాలి. ఈ యాభై జన్మలు నువ్వు ఈ వందమంది పుత్రులను పొందడానికి కావాల్సిన పుణ్యాన్ని సంపాదించుకున్నావ్​. వందలాది మంది పుత్రులను పొందేంత పుణ్యం నీకు లభించాక నీ కర్మ తన పనిచేయడం మొదలుపెట్టింది అని సెలవిస్తాడు. అది విన్న ధృతరాష్ట్రుడు ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు.

మనం జన్మజన్మలుగా సంపాదించుకున్న పుణ్యఫలాలన్నీ ఒక్క చెడ్డపనితో తుడిచిపెట్టుకుపోతాయని శ్రీ కృష్ణుడు అంతరార్థం. ...... -

13, జనవరి 2022, గురువారం

వైకుంఠ ద్వారా దర్శనంకు ఎందుకు అంత ప్రాధాన్యత?

 #శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారా దర్శనంకు ఎందుకు అంత ప్రాధాన్యత?


పదిరోజులు పాటు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం ఎందుకు కల్పిస్తారు?


ఏ రోజు దర్శనం చేసుకుంటే మంచి ఫలితాలు సిద్దిస్తాయి?


మానవులుకు 365 రోజులు…దేవతలకు ఒక్కరోజుతో సమానం.


మానవులుకు 6 నెలల కాల సమయం….దేవతలకు 12 గంటల సమయం.


దేవతలకు 12 గంటల రాత్రి సమయాని దక్షిణాయం అని….పగలు 12 గంటల సమయాని ఉత్తరాయణం అని అంటారు.


దక్షిణాయంలో మహవిష్ణువు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు సేద తీరే సమయం…దినినే కర్కాటక మాసం అంటారు.


రాత్రి 8గంటలకు మహవిష్ణువు నిద్రకు ఉపక్రమించే సమయం…8 నుంచి 10 గంటల సమయాని సింహ మాసం అంటారు.


రాత్రి 10 నుంచి 12 గంటల మధ్య మహవిష్ణువు ప్రక్క తిరిగి పడుకునే సమయం….ఈ కాలం మానవులుకు కన్యా మాసం. 


అర్దరాత్రి 12గంటల నుంచి వేకువజాము 2 గంటల వరకు మహవిష్ణువు గాడ నిద్రలో వుండే సమయం….

మానవులుకు తులామాసం.


మహవిష్ణువు నిద్రలేచే సమయం వేకువజాము 2 గంటల 40 నిముషాలకు….ఉదయం 2 నుంచి 4 గంటల సమయాని మానవులుకు వృశ్చికమాసం.


మహవిష్ణువు నాలుగు గంటల నుంచి నాలుగు గంటల నలభై నిముషాల వరకు ముక్కోటి దేవతలకు దర్శనభాగ్యం కల్పిస్తారు…ఉదయం 4 నుంచి 6 గంటల కాలాని దనుర్మాసంగా పిలుస్తారు.


దేవతలకు ఒక్క గంట సమయం ….మానవులుకు 15.2 రోజులుతో సమానం.


దేవతలకు 40 నిముషాల సమయం….మానవులుకు 10 రోజులుతో సమానం.


ఈ 10 రోజులు కాలమే….శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరిచే పదిరోజులు….


దినితో వైకుంఠ ఏకాదశి నుంచి పది రోజులు వ్యవధిలో ….ఏ రోజు దర్శనం చేసుకున్నా….ఉత్తమ ఫలితాలే భక్తులుకు సిద్దిస్తాయి...


#సమాచారం అందించిన వారు:


#ప్రోఫసర్ రాణి సదాశివామూర్తి,

సంస్కృత విధ్యాపిఠం

తిరుపతి...

12, జనవరి 2022, బుధవారం

అమ్మ గది🌷

🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹

           🌷అమ్మ గది🌷

                🌷🌷🌷

బంధుమిత్రులు, అతిథుల రాకపోకలతో వామనరావు ఇల్లంతా ఒకటే హడావిడి. మూడ్రోజుల కిందటే వాళ్ళీ కొత్తింట్లోకి వచ్చారు. గృహప్రవేశానికి వచ్చి ఇంకా ఉన్న బంధువులు, అప్పుడు రాలేక, ఇప్పుడొచ్చి శుభాకాంక్షలు చెప్తున్న వాళ్ళతో ఆ కొత్తిల్లు కళకళలాడుతోంది. వామనరావు, ఆయన భార్య పరిమళ మొహాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. వచ్చిన వాళ్లందరికీ తమ ఇల్లు చూపిస్తూ వారిరువురూ సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు. 


"ఈ ప్లోరింగ్ మార్బుల్స్ రాజస్థాన్ నుంచి తెప్పించాం. ఇది కన్సీల్డు కిచెన్. ఇది మాస్టర్ బెడ్ రూమ్, పక్కది చిల్డ్రన్ బెడ్ రూమ్, ఆ తరువాత గెస్ట్ రూమ్, అది పూజ గది, మూలగా ఉన్నది స్టోర్ రూమ్, పైన లెఫ్ట్ కార్నెర్లో జిమ్, రైట్ సైడ్ పెట్ కార్నివాల్, టాప్ లో పెంట్ హౌస్, ఇది సిటౌట్, లోపల కారిడార్, సైడ్ లో డ్రాయింగ్ రూమ్, ఇది చేపల ఎక్వైరియం ప్లేస్" ఇలా అన్నీ చూపిస్తూ మురిసిపోతున్నారా భార్యా భర్తలు. 


వామనరావు చూపుల్లో విజయ దరహాసం, పరిమళ మాటల్లో దర్పం స్పష్టంగా కనబడుతున్నాయి. లిప్ట్, పనిమనిషికి ఔట్ రూమ్, స్విమ్మింగ్ ఫూల్, విశాలమైన గార్డెనింగ్... వీటితో ఆ మూడంతస్తుల పాలరాతి కట్టడం నిజంగానే ఓ అద్బుత కళా ఖండంగా మెరిసిపోతోంది. 


వామనరావు ఆధాయ పన్నుల శాఖలో ఉన్నతోద్యోగి. పరిమళది ధనిక కుటుంబ నేపథ్యం. గత పదిహేనేళ్ల నుంచీ అద్దిళ్ళల్లో ఉంటున్న వాళ్ళకీ యిల్లు కలల సౌధం.

వారం రోజులు గడిచాయి. హడావిడి సద్దుమణిగింది. 


"ఇక వెళ్ళొస్తాన్రా!" అంటూ తన చేతి సంచీ తీసుకుని బయలుదేరాడు వామనరావు మేనమామ, గంగయ్య. "ఇంకో రెండ్రోజులుండి వెళ్దువు గాని మామయ్యా!" అన్నాడు వామనరావు. "నేనిక్కడ ఉండి చేసే పనేముంది? ఇప్పటికే వారం రోజులయింది. నేనెళ్ళకపోతే అక్కడ చేనెండిపోతుంది" అన్నాడు మామయ్య. "మధ్యాహ్నం భోజనం చేస్తే గాని వెళ్లడం కుదరదు, ససేమిరా!" అని మొహమాట పెట్టేసింది పరిమళ. ఆమె మాటను కాదనలేకపోయాడు గంగయ్య. 


గంగయ్య వామనరావు తల్లి వేణమ్మకి స్వయానా అన్నయ్య. పేదవాడైనా అతనిది ఉన్నతమైన సంస్కారం, మంచి మనస్సు. వాళ్ళది ఒక చిన్న పల్లెటూరు. ఆయన్ని ఊళ్ళో అందరూ బాగా గౌరవిస్తారు. వాళ్ళ ఊళ్ళో ఉండే ఓ మోతుబరి రైతుకు నమ్మిన బంటుగా ఉండి పొలం చూసుకుంటున్నాడు గంగయ్య. 


వారం రోజుల ముందే గంగయ్య ఇక్కడకొచ్చి చిన్నా, పెద్దా పనులు చక్కపెడుతూ వచ్చాడు. ఇల్లు కడిగించడం, మామిడి తోరణాలు కట్టడం, ఆవు, దూడని తెచ్చి గృహప్రవేశానికి ఇల్లంతా తిప్పడం, వచ్చిన అతిథులకి ఏ లోటూ రాకుండా చూసుకోవడం వంటి ఎన్నో పనులు మామయ్యే దగ్గరుండి చూసుకున్నాడు. మామయ్య చిన్నప్పటి నుంచీ వామనరావు కుటుంబానికి పెద్ద ఆసరా. 


అమ్మమ్మ ఇంటికెళ్లినప్పుడు భుజాల మీద ఎక్కించుకుని పొలం తీసుకెళ్లి తియ్యటి తాటి ముంజలు, తేగలు వంటి ఎన్నో రుచులు పంచేవాడు. వచ్చినప్పుడల్లా బోలెడు తినుబండారాలు తెచ్చేవాడు. అందుకే ఇప్పటికీ

తనకీ, చెల్లికీ మామయ్యంటే ఓ మధురమైన బంధం, ఆత్మీయ భావం.


మధ్యాహ్నమైంది. భోజనం ముగిసింది. ఊరికి వెళ్లేందుకు ఉపక్రమించాడు మామయ్య. వెళ్తూ, వెళ్తూ హాల్లో ఆగాడు, "బాబూ ఓ చిన్న మాట" వామనరావుని పిలిచాడు. "చెప్పు మామయ్యా!" అన్నాడు వామనరావు. "ఇల్లు చాలా బాగా కట్టేవు... అందరూ నీ యింటి గురించి చెప్పుకుంటుంటే... ఇది మా మేనల్లుడిల్లని చాలా పొంగిపోయాను... కాకపోతే..!?" అని ఆగి సందేహిస్తుండగా, "చెప్పు! మామయ్యా! ఫర్వాలేదు!" అన్నాడు వామనరావు. 


"అసలున్నాడో ? లేడో ? తెలియని దేవుడికి ఈ ఇంట్లో ఓ గదుంది. చిన్న పిల్లలకు, రాబోయే అతిథులకీ గదులున్నాయి. పనిమనుషులకి, ఆఖరికి పెంపుడు కుక్కకీ, చేపల తొట్టికీ కూడా గదులున్నాయి... కానీ, నిన్ను కన్న నీ తల్లి కోసం ఎక్కడా ఓ చిన్న గది కూడా కనిపించడం లేదయ్యా?" అన్నాడు. ఆ విషయం గురించి అంతగా ఆలోచించని వామనరావు మామయ్య మాటలకి షాకయ్యాడు. 


"లంకంత ఇంటిలో ఆమె పడి మీదే తుంగ చాపేసుకుని పడుకుంటోంది. మీ కోసం ఎవరైనా వస్తే కనిపించకుండా తలుపెనకాలో, దొడ్డివైపు సందులోకో వెళ్ళిపోయి మరుగు చేసుకుంటోంది. తనకంటూ స్థిరమైన గదిలేక అది 'గడీలాటలో మప్పీలా గడియకో చోటుకి మారుతోంది'. దాని అవస్థ చూస్తుంటే పూర్వమున్న తాటాకింట్లోనే  స్వేచ్ఛగా ఉందనుకుంటున్నాను. అసలు ఈ లోకంలో ఏమీ ఆశించకుండా అన్నీ త్యాగం చేసి ఇచ్చేది ఒక్క తల్లేరా ! నీ యంత చదువు, జ్ఞానం నాకు లేకపోయినా, వయసిచ్చిన అనుభవంతో చెబ్తున్నాను. నేను తప్పు మాట్లాడుంటే మరోలా అనుకోవద్దు", వామనరావు మస్తిష్కంలో ఆలోచనలు నింపి వెళ్ళిపోయాడు మామయ్య.


మామయ్య మాటలు మనస్సు లోతుల్లో ఎక్కడో గుచ్చుకుని, సోఫాలో చతికిల పడ్డాడు వామనరావు. తనను తాను సరిపెట్టుకోలేని నిస్సహాయతేదో అతన్ని ఆవరించింది. కాసేపటికి తేరుకుని, కిటికీలొంచి అమ్మకోసం చూశాడు. సందులోంచి ప్రహారీ అవతలున్న ఇరుగూ పొరుగుతో కొడుకు, కోడలు కట్టుకున్న ఇంటి గురించి గొప్పలు తెగ చెప్పేస్తోంది. వామనరావుకి కన్నీళ్లాగలేదు. "ఈ లోకంలో ఏమీ ఆశించకుండా అన్నీ ఇచ్చేది తల్లి ఒకత్తేరా !", మామయ్య మాటలు చెవుల్లో గింగురుమంటున్నాయి, "మామయ్య చెప్పింది నిజమే కదా !". 


వామనరావుకు తన చిన్నతనం, అమ్మ తన కోసం జీవితమంతా పడిన కష్టం గుర్తుకొచ్చి కళ్ళవెంబడి నీళ్ళు బొటబొటా కారాయి. చిన్నప్పుడు వర్షానికి తాటాకింట్లో పై కప్పు నుంచి నీళ్లు కారుతుంటే తమకు మైకా సంచి కప్పి, రాత్రంతా తాను తడుస్తూ కూర్చుంది. కాలేజీ వాళ్ళు పొరుగు రాష్ట్రాలకు టూర్ పెడితే తనను కూడా పంపించింది. తరువాత తెలిసిన నిజం... అందు కోసం తన పెళ్లినాటి జరీ పట్టు చీర అమ్మేసిందని. తన రక్తాన్ని మరిగించినా, కండలు కరిగించినా తమ కోసమే కదా... అనుకుంటూంటే కళ్ళల్లో నీళ్లు ధారాపాతమౌతున్నాయి. కళ్ళు ఒత్తుకున్నాడు వామనరావు.


వామనరావుకి ఆరేళ్ళు, చెల్లికి మూడేళ్ల వయసులో పొద్దున్నే చద్దన్నం తిని పనికెళ్ళిన నాన్న మోటారు విద్యుత్ తీగ మృత్యువై కబళించగా శవమై ఇంటికి వచ్చాడు. వేణమ్మ దుఃఖసాగరంలో మునిగిపోగా, ప్రపంచం తెలియని వయస్సులో ఆ అమాయక పిల్లలు బిత్తర చూపులు చూస్తూండిపోయారు. 


ఆ హాఠాత్పరిణామం ఇంటిల్లిపాదినీ కృంగదీసింది. వేణమ్మ రోజులు గడుస్తున్నా బాధ నుంచి కొలుకోలేకపోతోంది. మొదట్నుంచీ భర్తా, పిల్లలకి వండి పెట్టడం తప్ప ఆమెకు మరో వ్యాపకం తెలియదు, సంపాదించడం రాదు. క్రమంగా ఇంట్లో అన్నీ నిండుకుని, రోజు గడవడమే కష్టమైంది. ఇరుగూ పొరుగూ సాయం ఎంతకాలం ? కూర్చుని తింటుంటే కొండలాగుతాయా ? కరెంటు, పాలు కట్, బియ్యం డబ్బా ఖాళీ. అప్పు తీర్చక, కిరాణా కొట్టులో సామాను ఇవ్వక, రేపు అన్నదే ప్రశ్నార్థకంగా మారింది. అటువంటి సమయంలో ఆత్మహత్యకు కూడా ప్రయత్నించి, పిల్లల్ని చూసి విరమించిందని పక్కింటి వాళ్ళు అనుకుంటుండగా విన్నాడు వామనరావు.


ఒకరోజు టిఫిన్ తెచ్చుకోవడానికి వీధి చివరున్న హోటల్ కి వెళ్ళిన పిల్లలిద్దరూ అవి అయిపోయాయని బిక్కమొహల్తో తిరిగి వచ్చినప్పుడు ఓ మెరుపులాంటి ఆలోచన వచ్చి, కార్యరంగంలోకి దిగి, వాళ్ళింటి దగ్గరే టిఫిన్ సెంటర్ మొదలుపెట్టింది వేణమ్మ. కాలం కలిసి వచ్చి వేణమ్మకి డబ్బులు చేయి తిరగడంతో భర్త చేసిన పాత బాకీలన్నిటినీ తీర్చేయాలనుకొంది.


"నాన్న ఎప్పుడో చేసిన బాకీలు ఇప్పుడెవ్వరూ అడగట్లేదుగా? ఇక తీర్చడమెందుకు ?" అమ్మతో అన్నాడు వామనరావు. "రుణ శేషం, శత్రు శేషమన్నారు పెద్దలు. మనం బాకీలుండిపోతే వచ్చే జన్మల్లో తీర్చగలమో, లేమో" అంది అమ్మ. నాన్న చేసిన అప్పులన్నీ వడ్డేతో సహా తీర్చేసింది అమ్మ. తల్లి శ్రమకు ప్రతిఫలంగా అన్నట్టు తామిద్దరూ కష్టపడి చదువుకుని ప్రయోజకులయ్యారు. 


వేణమ్మ మంచి పెంపకంలో పెరిగిన వామనరావు గుణగణాలు, ఉద్యోగం చూసి ఏరికోరి మరీ వాళ్ళమ్మాయి పరిమళనిచ్చి వివాహం చేశాడు మామగారు. వామనరావు భార్యా పిల్లల్నేసుకుని చాలా ఊళ్లు తిరిగినా, వేణమ్మ మాత్రం తన ఊరు, తన ఇల్లు, తన పని వదిలిపెట్టలేదు, తమ దగ్గరికి రమ్మని కొడుకు అభ్యర్ధించినా... 


వామనరావు పదోన్నతుల్లో పెద్ద స్థాయి ఉద్యోగంతో నగరానికి చేరుకుని, అక్కడే స్థిరపడాలని అనుకుంటే, ఇల్లు కట్టు కోవడానికి పరిమళ వాళ్ల నాన్నగారు కూడా ఆర్ధికంగా సాయపడ్డాడు. వామనరావు అమ్మను కూడా ఒప్పించి ఈ ఇంటికి తీసుకొచ్చేశాడు. అనుకున్నట్టుగా అన్నీ సక్రమంగా జరిగే సమయంలో మామయ్య తన బాధ్యతని గుర్తు చేయడంతో తన ఆలోచన్ని పరిమళ ముందుంచాడు. 


వెంటనే, ఓ గది ఖాళీ చేసి, అమ్మా, నాన్న తాలూకు ఫోటోలన్నిటినీ ఆ గదిలో అలంకరించి, అమ్మ నులక మంచం, నాన్న వాడిన మడత కుర్చీ, ట్రంకు పెట్టి, బేట్రీ లైటుతో సహా ఆ గదిలో సర్దేశారు.

 

పడి మీద కూర్చున్న వేణమ్మను పరిమళ, వామనరావు చేరొక చేయి పట్టుకుని ఆమె గది దగ్గరకు తీసుకొచ్చారు. గుమ్మం పైన *అమ్మ గది* అని పెద్ద అక్షరాలతో రాసి వుంది. అమ్మ కళ్ళల్లో ఆనంద భాష్పాలు. భర్త స్మృతుల్ని తలపిస్తూ గదిలో ఉన్న ఆమె తాలూకూ వస్తువులను చూస్తూ పరవసించిపోయింది. కొంతసేపు ఆమె కన్నీళ్లే మాట్లాడాయి. "ముసిలి దాన్ని... ఏ పడి మీద తల దాచుకున్నా రోజెళ్లిపోతుంది. ఇదంతా నాకెందుకురా బాబూ" అంది.


వామన రావుకి మామయ్య మాటలు మళ్ళా గుర్తోచ్చాయి, *లోకంలో ఏమీ ఆశించకుండా అన్నీ ఇచ్చేది అమ్మ ఒకత్తే !*. 


నాటినుంచీ వామనరావు అందరికీ చెప్తూనే వున్నాడు ఇంట్లో పూజగది కంటే ముందుగా ఉండాల్సింది *అమ్మ గది* అని...

కులం' అనే పదంతో రాసిన పదకేళి*

 ✍️

  *'కులం' అనే పదంతో రాసిన పదకేళి* 


బాల్యంలో *బాలకులం* 

యవ్వనంలో *యువకులం* 

వృద్ధాప్యంలో *పండుటాకులం* 

రాలిపోయే *ఎండుటాకులం* 


         ఎవరూ లేకుంటే *ఏకాకులం* 

         ప్రేమలో ఉంటే *ప్రేమికులం* 

         పెళ్ళైతే సంసారికులం

         కాకుంటే *బ్రహ్మచారికులం* 


రక్షిస్తే *రక్షకులం* 

భక్షిస్తే *భక్షకులం* 

దేశ *సైనికులం* 

సమాజ *సేవకులం* 


      ప్రయాణిస్తే *ప్రయాణికులం* 

      నిత్య వాహన *చోదకులం* 

      యాత్రలు చేస్తే *యాత్రికులం* 

      మాయలు చేస్తే *మాంత్రికులం* 


ఉపన్యసిస్తే *ఉపన్యాసకులం* 

హాస్యం పండిస్తే *విధూషకులం* 

పాడితే *గాయకులం* 

సభలో ఉంటే *సభికులం* 

సినిమా హాల్లొ *ప్రేక్షకులం* 

టీవీ ల ముందు *వీక్షకులం* 


      చదివింది *గురుకులం* 

      అభ్యసిస్తే అభ్యాసకులం 

      బోధిస్తే *బోధకులం* 

      వృత్తిరీత్యా *అధ్యాపకులం* 

      పత్రికల *పాఠకులం* 

      నేర్పించే *శిక్షకులం* 


కొందరితో ఉంటే *సామాజీకులం* 

అందరితో ఉంటే *అనేకులం* 

ఫలానోల్ల కుటుంభీకులం

ఆ వంశ సంబంధీకులం


మేం

        ధనముంటే *ధనికులం* 

        లేకుంటే *బీదకులం* 

        దేవుణ్ణి నమ్మితే *ఆస్తికులం* 

        నమ్మకుంటే *నాస్తికులం* 

 

మేమే 

        నాగరికత నేర్పిన నాగరికులం

        జాతకాలు నమ్మే అమాయకులం

        మూఢత్వంపోని మూర్ఖులం


మేమే మేమే

         సమానత్వ సాధకులం

         మతాలను గౌరవించే *లౌకికులం* 

         ఎల్లలు లేని దేశ ప్రేమికులం


మేమే

          కష్టపడే *కర్షకులం* 

          నిరంతర *శ్రామికులం* 

          పరిశ్రమించే *పారిశ్రామికులం* 

          కర్మాగారాల్లోని *కార్మికులం* 

          నిజాలు చెప్తే *వాస్తవికులం* 

          చెప్పకుంటే అపద్దీకులం


మేమవుతాం

           కొందరికి *పూర్వీకులం* 

           మరికొందరికి *సమకాలికులం* 

           ప్రస్తుత వర్తమానికులం

           కొందరికి *స్ఫూర్తిదాయకులం* 

           మరికొందరికి *మార్గదర్శకులం* 


    మేం

          మార్పు కోరే *పరివర్తకులం* 

          వినూత్న *ఔత్సాహికులం* 

          కొత్త కొత్త *ప్రయోగకులం* 

          సరికొత్త *ఆవిష్కర్తకులం* 

          వ్యాపారాలు చేసే *వర్తకులం* 

          సంస్థల,సంఘాల వ్యవస్థాపకులం


మేం

         పరిపాలిస్తే *పాలకులం* 

         పాలించబడితే ఎలీకులం

         వంచిస్తే వంఛకులం

         పంచుకుంటే భాగస్వామికులం


మొత్తానికి

           బాల్యంలో *చిగురుటాకులం* 

           కుర్రతనంలో *బాకులం* 

           యవ్వనంలో *చాకులం* 

           మధ్య వయస్సులో *మేకులం* 

           చరమాంకంలో *రేకులం* 

           రాలిపోయే *ఆకులం* 


విదేశాల్లో మేము *ఒకే దేశకులం* 

పక్క రాష్ట్రాల్లో మేము ఒకే *ప్రాంతీకులం* 

పరబాషల వారికాడ ఒకే *భాషకులం* 

ఒకే భాష వారికాడ ఫలానా యాసకులం

మొత్తానికి అవుతాం ఈ *దేశంలో ఏదో ఒకకులం* 

 

నిత్యం కులం పేరుతో తిట్టుకుంటాం,

కొట్టుకుంటాం , కానీ బేధాలెన్ని ఉన్నా,

నిలబెట్టుకుంటాం మా దేశాన్ని ,

అయినా అంటిపెట్టుకునే ఉంటాం కులాన్ని ,

అది ఇచ్చే బలాన్ని , ఎందుకంటే ........ !

      

             *మేమే భరత జాతి వంశీకులం* 

             *భావి భారత రథసారథికులం* ...

7, జనవరి 2022, శుక్రవారం

పాశురము

 *🚩రేపటి తిరుప్పావై ఇరవై రెండో రోజు పాశురం🚩*_ 


🚩 *తిరుప్పావై 22 వ ప్రవచనం*🚩


🕉🌴🌿🌹🌷🌿🌴🕉️


*☘పాశురం☘*


*అఙ్గణ్ మాఞాలత్తరశర్, అబిమాన*

*బఙ్గమాయ్ వన్దు నిన్ పళ్లిక్కటిల్ కీళే*

*శఙ్గమిరుప్పార్ పోల్ వన్దు తలైప్పెయ్ దోమ్*

*కిఙ్గిణివాయ్ చ్చెయ్ ద తామరై ప్పూప్పోలే*

*శెఙ్గణ్ శిఱిచ్చిణిదే యెమ్మేల్ విళియావో;*

*తిఙ్గళు మాదిత్తియను మెళున్దాఱ్పోల్* 

*అఙ్గణిరణ్డు ఙ్గొణ్డు ఎఙ్గళ్ మేల్ నోక్కుదియేల్* 

*ఎఙ్గళ్ మేల్ శాబ మిళిన్దులో రెమ్బావాయ్.*


*🌿భావం :-🌿*


ఈ సుందర సువిశాలమైన భూమిని ఏకఛత్రాధిపత్యముగ నేలిన రాజులందరును తమ కెదురెవ్వరు లేరను అహంకారమును వీడి, అభిమానులై నీ శరణు జొచ్చిరి. అనన్య శరణాగతిని చేయుచు నీ సింహాసనము క్రింద గుంపులు గుంపులుగా చేరినట్లు మేమును అనన్య ప్రయోజనులమై వారివలె నీ శరణుజొచ్చినాము. మాకు నీవు దక్క వేరు దిక్కులేదు స్వామీ! చిరుమువ్వలు నోళ్ళు తెరచినట్లుగను, సగము విరిసిన తామరపూవువలెను మెల్లమెల్లగా విప్పారిన నీ సుందర నేత్రాలనుంచి జాలువారు వాత్సల్య కరుణారస దృక్కులను మాపై ప్రసరింపనిమ్ము. సూర్యచంద్రులుదయించెయనునట్లు కనిపించు నీ కన్నుదోయి నుంచి జాలువారే కరుణ వాత్సల్యం రసదృక్కులు మాపై ప్రసరించినచో మా కర్మ బంధములన్నీ తొలగిపోవును కనుక మా కర్మబంధములు తొలగగనే మేము నిన్ను చేరుకొందము కద! మా వ్రతమునకు పొందవలసిన ఫలము గూడ యిదియేగదా! యని ఆండాళ్ తల్లి కర్మ బంధం. తొలగితే ముక్తి లభిస్తుందని' తెలియజేస్తోంది. 


*🌴అవతారిక :-🌴*


పరమాత్మను పొందాలని కోరుకొనేవారు స్వామికి సంపూర్ణ శరణాగతులవ్వాలి. సంపూర్ణ ప్రపత్తిని చేయాలి. స్వామి పాదాలచెంత వ్రాలి 'నీవు దక్క మాకు దిక్కులేదు. మేము పూర్తిగా నీవారమే' అనే శరణాగతి చేసి పాదాల నాశ్రయించాలని ఆండాళ్ తల్లి బోధిస్తోంది. ఈ మాలికలో - మేము నిన్ను స్తుతిస్తుండగా నీ అతిలోక సుందరమైన రూపాన్ని - అనగా మెల్లమెల్లగా నీ సూర్యచంద్రులవంటి కన్నులను వికసింపచేస్తుండగా అందుండి నీ కరుణా కటాక్ష వీక్షణాల వాత్సల్యరసపూర్ణధారలను తనివితీరా పొంది ఆనందించాలని వచ్చామని గోపికలు తెలిపారు. కర్మల కారణంగా పరమాత్మకు బహుదూరమైన జీవులు తిరిగి కలుసుకొనేటట్లు చేసేదే యీ ధనుర్మాస వ్రతమంటుంది మన ఆండాళు తల్లి.


*🌳(కల్యాణిరాగము - రూపక తాళము)🌳*



ప.. చిరు మువ్వలు నవ్వి నటుల వికసించిన కలువల వలె - ఆ 

ఎరుపులీను కన్నుదోయి కరుణణు ప్రసరింపనీవె!


అ..ప.. సూర్యచంద్రులుదయించెనో? యట్టుదోచు కనుదోయిని 

పరమాత్మా! మా పాపములన్ని బోవ చూడరావె!


1. చ.. అహంకార మమకారములణచి వచ్చి రాజులు - నీ 

సింహాసనమునకు క్రిందగుంపు గూడియున్నట్టుల 

అహము వీడి నీ సన్నిధి నంజలి ఘటియించినాము 

మహాప్రభో! యింకనైన కటాక్షింపరావె! స్వామి 

ఎరుపులీను కన్నుదోయి కరుణను ప్రసరింపనీవె!


🙏🙏🙏🙏🙏🙏🙏🙏


_*🚩తిరుప్పావై ప్రవచనం‎ - 22 వ రోజు🚩*_ 


🌴🍃🌿🌹🌷🌿🍃🌴


*అనన్య గతిత్వం*

*ఆండాళ్ తిరువడిగలే శరణం* 


☘☘☘☘☘☘☘☘


*పాశురము*


*అంగణ్ మా ఞాలత్తరశర్, అబిమాన*

*పంగమాయ్ వందు నిన్ పళ్ళికట్టిల్ కీరే*

*శంగమ్ ఇరుప్పార్ పోల్ వందు తలై ప్పెయ్-దోమ్*

*కింగిణివాయ్ చ్చేయ్ద* *తామరై ప్పూప్పోలే*

*శెంగణ్ శిఱుచ్చిఱిదే* *యెమ్మేల్ విరయావో*

*తింగళుమ్* *ఆదిత్తియనుమ్ ఎరుందాఱ్పోల్*

*అంగణ్ ఇరండుం కొండు ఎంగళ్మేల్ నోక్కుదియేల్*

*ఎంగళ్మేల్ శాపం ఇరింద్-ఏలోర్ ఎమ్బావాయ్* 


మనిషి వస్తువులపై ఏర్పర్చుకున్న అభిమానము, ఎప్పటికీ వాటిని పట్టుకొని వ్రేలాడుటూనే ఉంటాడు ఎంత దుఃఖాల పాలైనా. అసలు ఇవన్నీ వాడివే అని ఒక మాట అనుకుంటే, ఏడవ వల్సిన అవసరము ఉండదు. ఒక మహానుభావుడు ఉండేవాడట, ఎంత సంపదలు అనుభవించేవాడంటే ఏనుగు ఎక్కి ఎప్పటికి పైకే చూసేవాడట, క్రిందకి చూడటము కూడా మరచి పోయాడట. వీడి దయకోసం రారాజులే వీడి పాదాల వద్ద వాళ్ళ కిరీటాలు ఉంచేవారట. ఇలాంటి వాడికి ఒకనాడు ఏమైందంటే వాడి రాజ్యాన్ని శత్రువులు ఆక్రమించారు. వాడు తన వాళ్ళని వదిలి వచ్చేసాడు. ఊరు దాటి బయటికి వెళ్ళలేడు, ఒక పూరి గుడిసెలో దాక్కున్నాడు. మరి ఎవరికైనా తెలిస్తే అభిమానం అడ్డొస్తుంది. తినటానికి అడుక్కోవాలంటే పగలు బయటికి రాలేడు. ఒక పెంకు ముక్కను తీసుకొని రాత్రి బయలుడేరాడు ఎవ్వరు చూడరని, అది కూడా వెలుతురు ఉండదని ఇండ్ల చూరు కింద నడుస్తూ వెళ్ళాడు. అక్కడ ఒక పిల్లలు కల కుక్క పడుకొని ఉండట, వీడేదో చేయటానికి వచ్చాడని, వీడి కాలు పట్టి కరిచిండి. అమ్మో అంటూ అరవడం మొదలు పెట్టాడు. అంతలోనే వచ్చి రాజు అని గుర్తు పట్టే సరికి వాడు అభిమానంతో తల దించుకున్నాడట. *"ఒరు నాయగమాయ్ ఓడ ఉల ఉడ ఆండవర్ కరునాయ్ కవరంద కాలర్ సిదగీన పానయర్ పెరునాడు కాన ఇమ్మయిలే పిచ్చితాన్ కరువర్"* ఏక ఛత్రాదిపతిగా పరిపాలించిన మహనీయుడే, ఒక నాడు కిరీటాలు తగిలించుకున్న కాలు, ఈనాడు కుక్క కరిచిన కాలు. ఒకనాడు బంగారు పాత్రలలో తినేవాడు, ఇప్పుడు చితికిన పెంకు ముక్క చేత పట్టుకున్నవాడు. అభిమానం పెంచుకున్న వాళ్ళ బ్రతుకులు ఇలా ఉంటాయి అని అళ్వారులు చూపిస్తారు.


మనిషి వస్తువులను సంపాదించటం, వాటిని అనుభవించటం తప్పు కాడు, అవి నావల్ల అని అనుకోవడం తప్పు. వాడిచ్చింది అనుకుంటే అన్ని మనకు సుఖంగా ఉండేట్టు చేస్తాడు, నేనార్జిస్తున్న అనుకుంటావా చుట్టు ఉండే వాటితో నిన్ను వదిలేస్తా, నీవే కాపాడుకో అని నిన్ను వదిలేస్తాడు. ఎంతవరకు అని మనం రక్షించుకోగలం కనుక. ఈ భూమి మీద అభిమానాలు అంతలా పెంచుకొని, భగవంతుడిదీ అని మరచి, బ్రతుకుతే వాడికి గతి ఉండనే ఉండదు. 


*“అంగణ్ మా ఞాలత్తరశర్”* ఈ అందమైన భుమి మీద *“అబిమాన పంగమాయ్ వందు”* అభిమానాలను వదులుకొని వచ్చి *“నిన్ పళ్ళికట్టిల్ కీరే”* నీ పడక మంచం క్రింద దాగి ఉండే రారాజుల వలె మేము వచ్చామయ్యా. మనిషి తన శరీరం పై కూడా అలాగే అభిమానం కల్గి ఉంటున్నాడే, చూస్తూ చూస్తూ ఉంటే నలుగురు అసహ్యించుకొనేలా మన శరీరం మారిపోతుందే. ఈ అభిమానాలను మనిషి వీడాలి. అన్నీ భగవంతుడు ఇచ్చినవి అని భావించాలి. ఈ దేహాల పై అభిమానాలు పెంచుకుని ఈ ప్రకృతి మండలాల్లో సంచరిస్తున్నమో ఆ అభిమానాలను అన్నీ వదులుకొని నీ పద సన్నిధి చేరామయ్యా. ఎవరైనా వదులుకొని రావాల్సిందే. మన లాంటి సామాన్యులకే అది సులభం, చతుర్ముఖ బ్రహ్మాదులకు అన్నీ లోకాలను వదులుకొని రావాలనంటె అది కష్టం, కాని తరించాలి అంటె ఆయన కూడా వదులుకు రావడం తప్పదు.


*“శంగమ్ ఇరుప్పార్ పోల్”* అయిటే వాళ్ళు ఒంటరిగా ఉంటే ఎవరైనా శంకిస్తారేమోనని గుంపులు గుంపులుగా ఎట్లా ఐతే చేరి ఉన్నారో, మేము కూడా అలాగే నీ వద్దకు చేరాము. *“వందు తలై ప్పెయ్-దోమ్”* ఈ చేరటం కూడా మాకు ఎంత ఆశ్చర్యంగా ఉంది అంటే, ఇది మా ప్రయత్నం కాదు సుమా, దురభిమానంతో మేం తప్పించుకు తిరుగుతుంటే మాపై లేని సుకృతాలు మామీద ఆరోపణ చేసి మాకు ఎంతలా ఉపకారం చేసావు, మాకు ఎక్కడో గుర్తులేని స్థితిలో మేముంటే ఒక శరీరాన్ని ఇచ్చి, ఇంద్రియాలను ఇచ్చి, జ్ఞానాన్ని ఇచ్చి, మహానుభావులను ఇచ్చి వారి ఉపదేశాలు వినేట్టు మాలో ఉండి మమ్మల్ని సంస్కరించి, మాలో నీ పై ద్వేశాన్ని తగ్గించి ని పై ప్రేమ కల్గి నీ సన్నిధికి పరుగు పరుగున వచ్చాం, ఇదంతా నీవే చేసిన ప్రయత్నం కదయ్యా. నీ కృషి ఫలించేట్టు చేయడానికి వచ్చాం. 


ఇక నీ సన్నిధి చేరాం, ఇక మాకు ఫలితం దక్కాలికదా, *“కింగిణివాయ్ చ్చేయ్ద”* చిన్నటి సిరిమువ్వ గజ్జలు ఒక గీతగా కనిపిస్తాయే, అట్లా కనిపించే ఆనేత్రాలని *“తామరై ప్పూప్పోలే”* పద్మాల్లా *“శెంగణ్ శిఱుచ్చిఱిదే”* అందముగా, మెల్లి మెల్లిగా *“యెమ్మేల్”* మాపై *“విరయావో”* ప్రసరించేట్టు చెయ్యి. *“తింగళుమ్”* చంద్రుడి చల్లటిచూపులాగా *“ఆదిత్తియనుమ్”* సూర్యుడి కాంతి వలె *“ఎరుందాఱ్పోల్”* ఇద్దరు కలిసి నట్లుగా ఉంది, ప్రేమించేవారికి ప్రేమను కురిపించేట్లు, ద్వేశించేవారికి ప్రతాపం కల్గి ఉంటాయి ఆ చూపులు. మరి ఈ రెండు ఒక్కసారి సంభవిస్తాయా అంటే సంభవిస్తాయి *“ప్రసన్నం ఆదిత్య వర్చసమ్ రామం”* అంటారు, సూర్యుడు తన మాధ్యాత్మిక కాంతిని చంద్రుడి చల్లటి చూపులలా ఇస్తె ఎలా ఉంటుందో మాకు నీ చూపులను అందించు.


తప్పు తప్పు *“అంగణ్ ఇరండుం”* ఆకళ్ళు అవే. నీ కళ్ళను పోల్చటానికి ఏ ఉపమానం లేదు, *“కొండు ఎంగళ్మేల్”* వాటిని మాపై పడేట్లు చెయ్యి. *“నోక్కుదియేల్ ఎంగళ్మేల్”* ఆచూపులు మాపై పడితే *“శాపం ఇరింద్”* మాకున్న శాపాలన్నీ తొలగుతాయి. ఆహల్యకున్న శాపం నీ పాద స్పర్షతో పోయింది-మాకూ నీ పాద స్పర్ష కావాలి, చంద్రపుష్కరిణి లో స్నానం ఆడితే దక్షుడికి శాపం పొయ్యింది- మాకూ నీ కళ్యాణగుణపుష్కరిణి లో స్నానం కావాలి, శివుడికి బ్రహ్మ తల తీసిన శాపం నీ వక్షస్పర్శచే తొలగింది-మాకూ అది కావాలి. నిన్ను ఎడబాసి ఉండడమే మాకు ఒక శాపం, నీవు అనుగ్రహించాలి. *“చకృషా తమ సౌమ్యేన పూతాస్మీ రఘునందన”* నీ చూపు నాపై పడిండయ్యా ఇక నా పాపాలన్నీ తొలగుతాయి అని శభరి అన్నట్లుగా మనవాళ్ళు ఆయన చూపులు మనపై ప్రసరింపచేయ్యమని స్వామిని కోరుతూ తమ అనన్య గతిత్వాన్ని తెలుపుతూ ఇవన్నీ ఆయన చేసుకున్నవి అని భావిస్తున్నారు. ఇక స్వామిని చేరే వరకే శాస్త్రాలు, ఇకపై ఆయనకు వీళ్ళ మాటలు వినక తప్పదు.


          🌷 *సేకరణ*🌷

      🌴 *న్యాయపతి*🌴 

    🌹 *నరసింహారావు*🌹


🙏🙏🙏🙏🙏🙏🙏🙏

ఉపవాసం

 ఉపవాసం లోని రకాలు - ఉపయోగాలు .


    ఉపవాసం అనగా ఏమి తినకుండా కేవలం మంచినీరు తాగి ఉండటమే ఉపవాసం . దీర్ఘ ఉపవాసం చేయువారు రసాహారము తీసికొనవలెను. కొందరు దేవునికి ఒకపొద్దు ఉంటున్నాం అని ఆ తరువాత అరడజను అరటిపళ్ళు, 10 ఇడ్లిలు, అరకిలో ఉప్మా లాగించేస్తారు . అన్నం మాత్రం తినరు.బహుశా వారి దృష్టిలో ఇదో రకం ఉపవాసం కావొచ్చు.కాని అలా చేయడం ఉపవాసం అనిపించుకోదు.


         ఉపవాసం చేయడం వలన ముఖ్య ఉపయోగం శరీరంలోని మాలిన్యాలను బహిష్కరింపచేసి వ్యాధి నిర్మూలనం అవుతుంది. పొట్ట , కన్ను, వ్రణములు , జ్వరములు, జలుబు మొదలగు వ్యాదులను కనీసం 5 రోజులపాటు ఉపవాసం చేసి వ్యాధి తగ్గించుకోవచ్చు. ఏ వ్యాధిలోనైనా ఉపవాసం చేయుట వలన వ్యాధి తొందరగా తగ్గించుకోవచ్చు . లేనిచో ఒకపూట ఉపవాసం ఉండి తరువాత ఆ వ్యాధికి సంబంధించిన పథ్యకరమైన ఆహారం తీసుకోవచ్చు.


          ఉపవాసంలో 4 రకాలు ఉన్నాయి అవి 


           1 - నిర్జలోపవాసం .


           2 - జలోపవాసం .


           3 - రసోపవాసం .


           4 - ఫలోపవాసం .


 * నిర్జలోపవాసం -


          మంచినీరు కూడా ముట్టకుండా చేయు ఉపవాసమును నిర్జలోపవాసం అంటారు. ఈ ఉపవాసం ముఖ్యంగా శరీరంలో నీరు ఎక్కువ చేరినప్పుడు అనగా శరీరం వాచినప్పుడు రెండు లేదా మూడు దినములు ఈ ఉపవాసం చేయవలెను . మూడురోజులకు మించి ఈ ఉపవాసం చేయరాదు .


 * జలోపవాసం -


          కేవలం మంచినీరు మాత్రమే తాగి చేయు ఉపవాసమును జలోపవాసం అందురు. దీనిని మూడురోజుల నుంచి ఏడు రోజుల వరకు మాత్రమే చేయవలెను . అంతకు మించి చేయరాదు . శరీరంలో మాలిన్యాలు అధికంగా చేరి ఏ రసాహారమును కూడా జీర్ణం చేసుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు కేవలం మంచినీరు తాగించి ఉపవాసం చేయించవలెను. అనగా సుమారు రెండులీటర్లు మంచినీరు త్రాగించవలెను.


 * రసోపవాసం -


           ఈ రసోపవాసమును సాధారణంగా ప్రకృతిచికిత్సాలయాల్లో రసోపవాసం చేయిస్తారు. కేవలం పండ్లరసాలతో చేయు ఉపవాసమును రసోపవాసం అంటారు. ఈ ఉపవాసం వారం రోజులు మొదలుకుని నెలరోజులు వరకు కూడా చేయవచ్చు . రసోపవాసంలో ముఖ్యంగా నిమ్మరసం , పలుచని నారింజరసం , బత్తాయిరసం , కమలారసం , తేనెనీరు, కొబ్బరినీరు , బార్లినీరు మొదలగునవి రోజుకు మూడుసార్లు నుండి అయిదుసార్లు లోపలికి తీసుకోవచ్చు .


 * ఫలోపవాసం -


        ఉపవాసం చేయలేనివారు ఫలోపవాసం చేయవచ్చు . కేవలం రసము నిండిన ఫలములు మాత్రమే ఆహారంగా తీసికొనవలెను . అరటిపండు తీసుకోకూడదు . ఎక్కువ బత్తాయి, నారింజ, కమలా , ద్రాక్షా, అనాస , దానిమ్మ, మామిడి, పుచ్ఛ మొదలగు పండ్లు తినవచ్చు . 


        ఈ ఉపవాసం రోగిని అనుసరించి పది నుంచి నలుబది రోజుల వరకు అనుసరించవచ్చు.


 * ఉపవాసం చేయుట వలన వివిధ అవయవాలలో కలుగు మార్పులు -


 జీర్ణక్రియకు మంచి విశ్రాంతి లభించి అజీర్ణం తొలగిపోయి ఆకలివృద్ధి అగును.


  మలాశయంలో మురికి బహిష్కరింపబడి అజీర్ణం తొలగించబడి క్రిములను, బాక్టీరీయా నాశనం చేయబడును.


  మూత్రపిండాలలోని విషపదార్ధాలు, రాళ్లు బహిష్కరింపబడును.


  ఊపిరితిత్తులలోని నంజు, నీరు బహిష్కరించబడి ఆయాసం నివారించబడును. శ్వాసక్రియ చక్కగా జరుగును.


  గుండెచుట్టు , లోపల చేరిన కొవ్వు, నీరు తగ్గి గుండె చక్కగా కొట్టుకొనును. గుండెజబ్బులలో రసోపవాసం మంచిది.


  లివర్ మరియు స్ప్లీన్ ఆహారం జీర్ణం అగుటకు ఇవి చక్కగా పనిచేయాలి. ఈ ఉపవాసం చేయుట వలన వీటికి విశ్రాంతి దొరుకును . వాటిలోని మాలిన్యం తొలగించబడి జీర్ణక్రియ వృద్ది అగును.


  శరీరంలో రక్తప్రసారం చురుకుగా ఉండును. ఉపవాసం చేయుట వలన రక్తదోషములు నివారించబడును. తిమ్మిర్లు, మంటలు , నొప్పులు కూడా తగ్గును.


  కీళ్లలో పేరుకుపోయిన కొవ్వు, నీరు, మాంసము వంటి మాలిన్యాలు తొలగించబడి వ్యాధి నివారణ అగును.


  నాడీమండలం శుభ్రపరచబడును.


  జ్ఞానేంద్రియాలలో మాలిన్యాలు అన్ని పోవును .


  చర్మం కాంతివంతం అగును. చర్మవ్యాధులు హరించును . శరీరానికి చక్కటిరంగు వచ్చును.


    మనస్సు ప్రశాంతంగా ఉండి కోపం వంటివి మన అదుపులో ఉండగలవు.


 * ఉపవాసం చేయకూడని వారు -


       చాలా బలహీనంగా ఉన్నవారు, గుండెజబ్బులు కలవారు , బాలురకు, వృద్దులకు గర్భిణీస్త్రీలకు , బాలింతలకు , క్షయ మరియు రక్తహీనత కలిగిన రోగులు , మధుమేహంతో ఉన్నవారికి ఎక్కువ రోజులు ఉపవాసం చేయకూడదు .


 * ఉపవాసం చేయదగిన వారు -


       స్థూలకాయులు , ఉబ్బసం, సంధివాతం, రక్తపుపోటు,చర్మవ్యాధులు మొదలగు దీర్ఘకాలిక రోగులకు ఉపవాసం చేయుట మంచిది.


    ఉపవాసం ముగించిన వెంటనే ఘనాహారం తీసుకోకూడదు . ఉపవాసం తరువాత ఎక్కువ ఆహారం తీసుకొకూడదు. క్రమేపి ఆహారాన్ని పెంచుకుంటూ రావలెను. కారం , మసాలా పదార్దాలు , పిండివంటలు పచ్చళ్ళు తినకూడదు. అలా తీసుకున్నచో విరేచనాలు , వాంతులు , కడుపులో మంట, నొప్పి వస్తాయి