22, మార్చి 2022, మంగళవారం

భ్రష్టమవుతాయి

 శ్లోకం

*********/

శ్లో: నిర్మర్యాదస్తుపురుషః పాపాచార సమన్వితః ॥ మానం నలభతేసత్సు భిన్న చారిత్ర దర్శనః ॥


తాత్పర్యము : ఎవరు ధర్మ - వేద పద్ధతులను వదలివేస్తారో వారు పాపకర్మల్లో పడి కొట్టుకుపోతారు. ఆచార విచారాలు భ్రష్టమవుతాయి. అతను చివరికి సజ్జనులలోనూ ఎన్నడూ గౌరవింపబడడు......


*శ్రీరామాయణ రత్నాకరము*

కళ్యాణ మండపంలో

 *అన్నవరం క్షేత్రం లో రత్నగిరిపై, స్వామి వారి సన్నిధిలో, పెళ్లి చేసుకోబోయే వధూవరులకు శుభవార్త.* పెళ్లిళ్ల సీజన్‌లో కళ్యాణ మండపాలు దొరకడమే కష్టం. దొరికినా సామాన్యుడికి అందుబాటులో లేని అడ్వాన్సులు. కానీ *లలిత రైస్ ఇండస్ట్రీస్ అధినేతల్లో ఒకరైన మట్టె శ్రీనివాస్ సుమారు రూ.4 కోట్ల వ్యయంతో సెంట్రల్ ఎయిర్ కండీషన్డ్ కళ్యాణ మండపాన్ని అన్నవరం దేవస్థానంలో ఏర్పాటు చేశారు.* ఈ కళ్యాణ మండపంలో *ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే తమ పిల్లల పెళ్లిళ్లు చేసుకోవచ్చు.*

ఇది పేద,మరియు మధ్య తరగతుల వారి కోసం పెద్ద మనసుతో ఏర్పాటు చేసిన కళ్యాణ వేదిక. *అన్నవరం దేవస్థానంలో అధికారులు బుకింగ్‌లు ప్రారంభించారు.* ఈ మండపంలో *ఒకేసారి 12 జంటలకు వివాహం జరిపించేందుకు వీలుగా ఉంటుందని దేవస్థానం అధికారులు వివరించారు. పెళ్లి వారికి కావలసిన పాత్రలు, పాదుకలు, కుర్చీలు ఇలా అన్నీ దాత శ్రీనివాస్ సమకూరుస్తారు.*


పెళ్లి పేదలకు తలకుమించిన భారమే. అయితే వారు కూడా *సాదాసీదాగా కాకుండా ఉన్నతంగా జరుపుకోవాలనే సదుద్దేశంతో ఈ ఏర్పాట్లు చేసినట్లు దాత శ్రీనివాస్ చెబుతున్నారు.* ఈ కళ్యాణ వేదికను ఈ నెల 16న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించగా.. వివాహాలు చేసుకునే వారి కోసం దేవస్థానం అధికారులు ఆదివారం నుంచి బుకింగ్స్ ప్రారంభించారు. సంబంధిత పత్రాలు తీసుకువస్తే ఆయా తేదీలలో మండపాలను బుక్ చేస్తారు.

*ఏసీ కళ్యాన మండపంలో వివాహం చేసుకోదల్చిన వారు లగ్న పత్రిక, వధూవరుల ఆధార్ జిరాక్స్, వారి తల్లిదండ్రుల ఆధార్ జిరాక్స్‌లను రత్నగిరిపై ఉన్న సీఆర్‌వో కార్యాలయంలోఅందజేయాలి. వారికి ఉచిత కళ్యా వేదిక నెంబరును కేటాయిస్తారు. ఆ నంబర్‌ను ఉచిత కళ్యాణ వేదిక వద్ద చూపించి వివాహ సామాగ్రిని పొందాల్సి ఉంటుంది.ఈ మొత్తం ప్రక్రియలో ఎవరికీ ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన పని లేదని ఆలయ అధికారులు వెల్లడించారు.*

                       ఇట్లు మీ

 *అవధానుల శ్రీనివాస శాస్త్రి*

                🙏🙏🙏🙏

సత్యాలు - ధర్మఆచారములు

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*స్నానం చేయకుండా అన్నం వండరాదు. ఆ అన్నం తినరాదు*


100 నిత్య సత్యాలు - ధర్మఆచారములు


1. తల్లిదండ్రులను పూజించాలి. ఏ స్థితిలోనూ దూషించరాదు. 


2. మంత్రోపదేశం చేసినవారు మాత్రమే గురువు. (తక్కిన విద్యలు నేర్పినవారు అధ్యాపకులు మాత్రమే) అట్టి గురువును ఏ పరిస్థితిలోనూ నిందించరాదు. ఆయన ఎదురుగా కాళ్ళుచూపి కూర్చోరాదు. 


3. భోజనం తూర్పు, ఉత్తర దిక్కులవైపు కూర్చొని చేయాలి. 


4. చిన్న పిల్లల్ని చూడ్డానికి వెళ్ళేటప్పుడు, అనారోగ్యవంతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, గుడికి వెళ్ళేటప్పుడు, గురుదర్శనానికి వెళ్ళేటప్పుడు, పురాణం వినటానికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరాదు. ఏదో ఒకటి సమర్పించుకోవాలి


5. భోజనానంతరం ఎంగిలి ఆకులు ఎత్తే వాడికి వచ్చే పుణ్యం అన్నదాతకు కూడా రాదు.


6. తల్లిదండ్రులకు నిత్యపాద నమస్కారం చేయడానికి మించిన ధర్మం, నిత్యాన్నదానం చేయడం కంటే మించిన పుణ్యం ఈ సృష్టిలో లేవు. 


7. ఒకేసారి నీరు, నిప్పు రెండు చేతులతో గాని, ఒకే చేత్తోగాని పట్టుకెళ్ళరాదు. 


8. తూర్పు, దక్షిణ దిక్కుల తల పెట్టి నిద్రపోవాలి, ఉత్తర, పశ్చిమాల వైపు తల పెట్టి నిద్రిస్తే వారు ప్రమాదాల పాలౌతారని మార్కండేయ పురాణం చెబుతుంది. 


9. ఇంటికి గురువు వస్తే టక్కున లేచి నిలబడి ఎదురుగావెళ్ళి లోపలికి గౌరవంగా తీసుకొని వచ్చి ఆసనం వేసి కూర్చోబెట్టకుండా మాట్లాడరాదు. సాగనంపేటపుడు బయటకు వచ్చి గురువుని కొంచెం దూరం అనుసరించాలి. 


10. పైన అనగా భుజాలమీదుగా వస్త్రం లేకుండా దైవపూజ చేయరాదు, భోజనం చేయకూడదు.


11. రెండు చేతులతో ఎప్పుడూ తల గోక్కోరాదు. 


13. ఇతరుల చెప్పులు, వస్త్రాలు ధరించకూడదు.

 

14. తెలిసినవారి మరణ వార్త విన్న వెంటనే గాని, పురిటి వార్త విన్న వెంటనే గాని కట్టుబట్టలతో స్నానం చేయాలి.

 

15. అన్నము తిన్నాక కంచంలో చేయి కడుక్కోరాదు. చేయి కడిగిన తరువాత ఆ చేతిని విదల్చరాదు. 


16. నవగ్రహ ప్రదక్షిణ, పూజానంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించవచ్చు . 


17. పిసినిగొట్టుతో, శత్రువుతో, అసత్యం పలికే వాడితో భర్తను తిట్టే స్త్రీతో కలిసి భోజనం చేయటం మహాపాపం. 


18. స్నానం చేయకుండా అన్నం వండరాదు. ఆ అన్నం తినరాదు. 


19. నోటితో అగ్నిని ఆర్పరాదు, ఊదరాదు. 


20. పురాణాలు చెప్పే వ్యక్తి సర్వోత్తముడు. అటువంటి వారిని నిందించరాదు.


21. పుణ్య కార్యాల్లో చోళ్ళు, జొన్నలు, వెల్లుల్లి, ఉల్లి, చద్ది పదార్థాలు తినరాదు, ఉపయోగించరాదు. 


22. కాళ్ళు కడుక్కొన్నాక తుడుచుకోకుండా, తడి కాళ్ళతో భోజనం చేయరాదు.

 

23. తడిసిన బట్టల నీళ్ళు ఇతరులపై పడేట్లు విదిలించరాదు. 


24. ఎట్టి పరిస్థితులలోను ఆత్మహత్య చేసుకోరాదు. అలా చేసుకున్నవారు కొన్ని వేల జన్మలు పిశాచ జన్మలెత్తి వికలాంగులై పుడతారు. 


25. నోట్లో వ్రేళ్ళు పెట్టుకొనుట, గోళ్ళుకొరుకుట చేయరాదు


26. పుష్కర స్నానాదులలో చొక్కాతో స్నానం చేయరాదు. కండువా మాత్రమే ఉండవలెను. 


27. ఆదివారం, శుక్రవారం, మంగళవారం తులసి ఆకులు కోయరాదు. 


28. కూర్చొని తొడలు, కాళ్ళు ఊపరాదు. అలా ఊపినవాడు వచ్చే జన్మలో కుంటివాడై పుడతాడు. 


29. చీకటి పడ్డాక పువ్వులు, ఆకులు చెట్లనుండి త్రుంచరాదు. 


30. నిద్రనుండి లేవగానే ముందుగా అరచేతులను దర్శించి వామన నామస్మరణ చేయాలి.


31. నిజం తెలుసుకోకుండా ఎవరినీ నిందించరాదు, అభాండాలు వేయరాదు. అలా చేస్తే అవతలి వారి పాపాలన్నీ అభాండాలు వేసిన వారి తలకు చుట్టుకుంటాయి. 


32. శవాన్ని స్మశానం దాకా మోసినా, శవాన్ని ఇంటి దగ్గర ఉండటానికి అనుమతినిచ్చినా మనం స్వర్గానికి పోతాము. 


33. నిద్రపోతున్న వారిని అనవసరంగా లేపుట, పురాణ కథలు జరుగుతున్నపుడు విఘ్నం కలుగ చేయుట, భార్యాభర్తలను విడదీయుట, తల్లిని బిడ్డను విడదీయుట బ్రహ్మహత్యాపాతకాలతో సమానం. (వేళాపాళ లేకుండా నిద్రించేవారి విషయంలో వర్తించదు. 


34. పుట్టిన రోజునాడు దీపాలు కానీ, కొవ్వొత్తులు కానీ ఆర్పరాదు. నోటితో అగ్నిని ఊదుట ఘోరపాపం. అటువంటివారు గ్రహణపు మొర్రితో మళ్ళీ జన్మమెత్తి దుఃఖాలు పొందుతారు. 


35. ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు. ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు.


36. పురాణాలు దానం చేస్తే గొప్ప విద్యావేత్తలు అవుతారు.


37. క్రూరుడు, దుష్టుడు కాని మగనితో తాళికట్టించుకొన్న భార్య, కాపురం చేయక ఏడిపించటం, చెప్పిన మాట వినకపోవటం, తాళి తీసి భర్త చేతిలో పెట్టడం చేయరాదు. ఇలా చేసిన స్త్రీలకి వంద జన్మలలో వైధవ్యం కానీ, అసలు పెళ్లి కాకపోవడం జరుగుతుంది.


38. దీపాలు పెట్టేవేళ తలదువ్వుకోరాదు. ఇలా చేసిన స్త్రీలకి వందల జన్మలలో వైధవ్యం కాని, అసలు పెళ్లి జరగకపోవడం వంటివి జరుగుతాయి. 


39. తలమీద రెండు చేతులు ఒకేసారి పెట్టుకొనరాదు. 


40. వికలాంగులను వేళాకోళం చేయరాదు.


41. ఒకరి బట్టలు మరొకరు కట్టరాదు. ఒకరు తీసివేసిన జందెం మరొకరు ధరించరాదు. 


42. సంకల్పం చెప్పకుండా నదీస్నానం పనికిరాదు. ఒకవేళ చేస్తే ఇంటిలో స్నానం చేసినట్లే. నదీస్నాన ఫలితంరాదు. 


43. ఉమ్మితో వెళ్ళు తడిపి పుస్తకంలో పుటలు తిప్పరాదు.

 

44. వ్యసనపరులతో, మూర్ఖులతో వాదోపవాదనలు చేయరాదు. 


45. ఏడవటం వలన దారిద్ర్యం, సంతోషం వలన ఐశ్వర్యం లభిస్తాయి. 


46. భోజన సమయంలో మాట్లాడుట, నవ్వుట పనికిరాదు. 


47. పెద్దన్న గారు, పిల్లనిచ్చిన మామ గారు, గురువు ఈ ముగ్గురు కన్నతండ్రితో సమానం కనుక వీరు ముగ్గురినీ తండ్రిలాగే పూజించాలి. 


48. ఒకసారి వెలిగించాక ఏ కారణం చేతనైనా కొండెక్కిన దీపంలోని వత్తిని తీసివేసి క్రొత్త వత్తిని వేసి మాత్రమే దీపారాధన చేయాలి. పాత వత్తిని మళ్ళీ వెలిగించరాదు.

 

49. ఒక చెట్టును నరికేముందు మూడుచెట్లు నాటితే కాని ఆ దోషం పోదు. 


50. అన్నమును తింటున్నపుడు ఆ అన్నమును దూషించుట కాని, కోపముతో అన్నం పెట్టేవారిని తిట్టుటకాని చేయరాదు.


51. చీటికి మాటికి ప్రతిజ్ఞలు చేయుట, ఒట్టు పెట్టుట దోషం

52. నిలబడికాని, అటూఇటూ తిరుగుతూ కాని అన్నం తినటం వల్ల క్రమంగా దరిద్రుడౌతాడు. రాబోయే జన్మలో బిచ్చగాడు అవుతాడు.

 

53. నోట్లో వ్రేళ్ళు పెట్టుకొనుట, గోళ్ళుకొరుకుట చేయరాదు. 


54. నదిలో చీమిడి చీదుట, ఉమ్ముట, చిల్లర డబ్బులు వేయుట దోషం. 


55. ఒడిలో కంచం పళ్ళాలు పెట్టుకొని ఏ పదార్థాలు తినరాదు. అలా చేస్తే ఘోర నరకాలు కలగటమే కాక, వచ్చే జన్మలో దరిద్రులై పుడతారు

56. చీటికి మాటికి తనను తాను నిందించుకొనుట, అవమానించుకొనుట, తక్కువ వేసికొనుట చేయరాదు. 


57. గురువుద్వారా మంత్రోపదేశం పొందనివాడు ఎప్పటికీ తరించలేడు. కనుక ఉపదేశం పొందితీరాలి. 


58. చెట్లు, దేవతా విగ్రహాలు ఈశాన్యంలో ఉంటే వాటిని బరువులుగా భావించి తీసివేసేవారు, తీసివేయమని సలహా ఇచ్చేవారు ఏడు జన్మలు ఉబ్బసపు రోగులుగా పుడతారు. ఈ పనులు చేయుట దైవద్రోహం కనుక చేయరాదు. 


59. గురువులకు, అర్చకులకు, పౌరాణికులకు సరిగా పారితోషంఇవ్వక, వారికి ఋణపడేవారు నూరుజన్మలు కుక్కలుగా, చండాలురుగా పుట్టి కష్టనష్టాల పాలవుతారు.

 

60. శివలింగార్చన ఆడువారు కూడా చేయవచ్చు.


61. ఇంట్లో విగ్రహాలుంటే ఏమీ ప్రమాదం లేదు. పరులకు అపకారం కోరి పూజ చేసేవారికి మాత్రమే నియమాలు. తక్కిన వారికి పూజా విషయాలలో పెద్ద పెద్ద నియమాలు లేవు

.

62. ఎంతకోపం వచ్చినా తల్లిదండ్రులను, గురువును కొట్టరాదు. వారిపైకి చేయి ఎత్తరాదు. ఇంటి నుండి గెంటివేయరాదు. వారికి పెట్టకుండా పదార్థాలేవీ తాను తినరాదు. 


63. పాచి ముఖంతో అద్దం చూసుకొనరాదు. 


64. మేడి చెట్టుకు ప్రదక్షిణ, రావి చెట్టుకు పూజ, వేప చెట్టును నాటుట, మామిడి పళ్ళు దానం అశ్వమేథ యాగ ఫలితాన్ని ఇస్తాయి.


65. తీర్థం తీసుకున్నాక, ఆ చేతిని కడుక్కోవాలి తప్ప, అరచేతిని తలపై రాసుకొనరాదు. 


66. పాడయిపోయిన లేక శిథిలమైపోయిన దేవతల పటాలు లేక విగ్రహాలు కాలువలో కాని, చెరువులో కాని, సముద్రంలో కాని కలుపవలెను. ఏమీ లేకపోతే గొయ్యి తీసి అందులో పాతిపెట్టవలెను. 


67. ఉపవాసం ఉన్నపుడు, జాగరణ చేసినపుడు పరులదోషాలు తలుచుకోరాదు. 


68. శివాలయంలో నందికి దగ్గరగా దీపారాధన చేయరాదు. కొంచెం దూరం ఉంచాలి. 


69. తల వెంట్రుకలతో కూడిన అన్నం పండితులకు, గురువులకు పెట్టరాదు. సాధ్యమైనంత జాగ్రత్త వహించాలి. పొరపాటున అన్నంలో వెంట్రుకలు వస్తే ఆ అన్నం తీసివేసి మళ్ళీ వడ్డించి నేయి వేయాలి. 


70. అన్నం తింటున్న వారెవరినీ తిట్టరాదు, దెప్పి పొడవరాదు.


71. కొడుకు పుట్టిన వెంటనే తండ్రి కట్టుబట్టలతో స్నానం చేయాలి. ఆ కుమారుడు మరణించినట్లైతే తండ్రితో పాటు అందరూ కట్టు బట్టలతో స్నానం చేయాలి. 


72. ఇస్తానని వాగ్దానం చేసి దానమివ్వనివాడు వందజన్మలు దరిద్రుడై పుడతాడు, వాక్ భంగం చాలా దోషం.


73. కొబ్బరికాయ కొట్టాక వెనుకవైపు పీచు తీయాలనే నియమం కూడా తప్పనిసరి కాదు. శుభ్రత కోసం పీచు తీయవచ్చు, తీయకపోతే దోషం లేదు. 


74. తరచుగా కాలినడకన పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచి జన్మలు కలుగుతాయి. దీనిని కాయిక తపస్సు అంటారు.


75. గురువునకు ఉపదేశ సమయాలలో కాని, పురాణాదులు వినేటప్పుడు కాని పాదాలు ఒత్తితే 7 జన్మల పాపాలు తొలుగుతాయి.


76. కొబ్బరికాయను నీళ్ళతో కడిగి కొట్టడం చాలా తప్పు, కొబ్బరికాయను పీచు ఒలిచివేశాక నీళ్ళతో కడగరాదు. 


77. దీపారాధనకు ఒక కుంది మాత్రమే వాడినపుడు మూడు వత్తులు వేయాలి. 


78. అష్టమి, పూర్ణిమ, చతుర్థశి కాలలో స్వయంపాకం దానం చేస్తే అన్నపానాలకు ఏనాడు లోటుండదు. 


79. ఎక్కువ వేడిగా, ఎక్కువ చల్లగా ఉండే పదార్థాలు స్వీకరించరాదు.


80. భోజనం చేసిన వస్త్రాలు ఉతికి ఆరవేయకుండా వాటితో దైవపూజ చేయరాదు.


81. నిత్యం తామువాడే పాత్రలలో పండితులకు ఆహారం పెట్టుట దోషం, కనుక ఆకులలోకాని, క్రొత్త పాత్రలలోకాని వారికి ఆహారం పెట్టాలి. 


82. గృహప్రవేశ కాలంలో గాని, ఏడాదిలోపు గాని ఆ ఇంట మణిద్వీప పరాయణం చేయడం మంచిది. ఇది వాస్తుదోషాలను పరిహరిస్తుంది. 


83. భోజనానికి ముందు, అనంతరం కూడా కాళ్ళు కడుక్కోవాలి. 


84. సకల పురాణేతిహాస కోవిదుడు కాని వాని వద్ద మంత్రోపదేశం పొందరాదు. 


85. రేపు చేయవలసిన పనిని ఈ రోజు, ఈ రోజుపని ఈ క్షణమే చేయాలి. వాయిదాలు పనికిరావు. 


86. తలకి నూనె రాసుకొని ఆ చేతులతో పాదాలకు ఆ నూనెజిడ్డు పులమరాదు. 


87. శుక్ర, శనివారం వంటి వార నియమాలు పెట్టుకున్నవారు హోటలు టిఫిన్లు తినుటగానీ, ఆనాటి అల్పహారాదులలో ఉల్లి వాడుట కాని నిషేదము. ఇది ప్రయాణ మధ్యంలో ఉన్న వారికి వర్తించదు. 


88. చీటికి, మాటికి యజ్ఞోపవీతం తీసి పక్కనపెట్టడం, తాళి తీసేస్తుండటం రెండూ భయంకర దోషాలే. 


89. పుష్కర సమయాలలో స్నానం, శ్రాద్ధకర్మ ఎవరైనా చేసి తీరాల్సిందే. 


90. ప్రదక్షిణలు చేసేటపుడు, మంత్ర పుష్పం ఇచ్చేటపుడు ఆసనాలపై నిలబడరాదు. కింద నిలబడి చేయాలి. పూజా సమయాలలో కొందరు చాపలు పీకుట, దర్భాసనాలు తుంచటం చేస్తారు. ఇవి మహా పాపాలు.


91. గణపతి గరికపూజ మహాప్రీతి ఏ పరిస్థితులలోనూ తులసితో పూజ చేయరాదు(వినాయక చతుర్థినాడు కుడా తులసిని సమర్పించరాదు.


92. మనుష్యుని పాపం వాడి అన్నం లోనే ఉంటుంది. అందువలన పాపాత్ముల ఇంటి భోజనం చేయరాదు. మంత్రోపదేశం చేసిన గురువు భోజనానికి పిలిస్తే వెళ్ళని వానికి ఏనాటికీ మోక్షంరాదు.


93. జపమాల మెడలో వేసుకొనరాదు. మెడలో వేసుకొన్న మాలతో జపం చేయరాదు. 


94. బంగారం దొరికితే దానిని ఇంట్లోకి తెచ్చుకోరాదు. దాని వల్ల చాలా అనర్థాలు జరుగుతాయి. దొరికిన బంగారం వెంటనే దానం చేయుట కాని, లేదా దేవాలయాలకు ఇచ్చివేయుట కాని చేయాలి. 


95. దీపారాధనకు అగ్గిపెట్టె వాడకూడదని ఏ శాస్త్రాలు చెప్పలేదు. కనుక అగ్గిపెట్టెతో దీపం వెలిగించుకోవచ్చు. 


96. భోజనసమయంలో వేదములు చదువుట, గిన్నె మొత్తం ఊడ్చుకొని తినుట పనికిరావు. ఏడుస్తూ అన్నం తినరాదు. 


97. దేవాలయం నీడను, దేవతల నీడను, యజ్ఞం చేసే వారి నీడను, గోబ్రాహ్మణుల నీడను దాటరాదు. 


98. శ్రాద్దములో భోక్తగా మిత్రుడు పనికిరాడు. అతిథులుగా భోజనం పెట్టుకొనవచ్చు. 


99. విశిష్ట వ్యక్తులను, మహాత్ములను అగౌరవపరచి, నిందించు దుర్మార్గుని పాపం చిత్రగుప్తుడు కూడా వర్ణించలేడు


100. దేవాలయం లేని ఊరిలో భోజనం చేయరాదు

SRIRAMANA MAHARSHI At the Age of Sixteen

 DEATH EXPERIENCE OF BHAGAVAN SRIRAMANA MAHARSHI At the Age of Sixteen


PAMANA MANARSNI realized the self te wos a las of aktos, attached to took a ak step and nowhed the gok MANARSNI himself described how this happened.


"It was to weeks tekee ert Asapal fe that the great che ne p It was quite auxk I was attig alve ba on the fest fix of my un home 1 mokk at any times and on that there we the word with my health but a masters violent fee of death overhe There was nothing state of health to atte axt 1 okt not try to soste it as to find out alsout w masayf the t eta goly to de' and tegen theday what to e assit R. Itky not sur te e te avut a doctora ay akse on I felt that I fod to aste the pobok there and thens


The ask of the fear of death drove my b I to yoelf mentally without actually family the word: Now death com what see it? Whet laitthat Indy Thin Ang And at ose dethed the wxxxce of death by with my #ffs INugh od bet in and beated a come so as to ghe greater reality to the holy booth and kept my lipe that the wo Twoe any other word d de utensx Will then I to yer this y


to dosk. It will be careled stiff to the burning around and there burnt and reduced to ashes. But with the death of this body am I dead in the body 17 It la ellent and hert til I feel the full force of my personality and even the vole of the 'T' within me apart from it. So I am spirit transcending the boobs The bob dles but the apleit that transcende it cannot be touched by death. That means I am the deathtosa mpielt. All this was not doll thought It flashed thesh me viokity an living truth which I pesolved directly almost without thought process


Two something very real, the only real thing my present state, and all the conecious activity connected with my body was centred on that T. From that moment onwards the 'T' or Self used attention on Itinelf by a powerful solation foon of death had windshed once and for all.


Abeption in the Belf continued unteolien from that the on. Othes thoughts might come and go the the veke nten of mue, but the continued Be the eximental se note that underlies and Noude with all the other notes. Whether the body weeped in baking, reading anything else. Tsabit contred on Previous to that criola I ception of my Self and was not acter to Ib. 1 feltre peseptible os et een in, much less ang inclination


case that no assicsil) escapaso to chvell pormenorbby in it."


Copied from the wall of ramansramam


21, మార్చి 2022, సోమవారం

పునర్జన్మ

 సనాతన ధర్మం - పునర్జన్మ


ఒకసారి మన సనాతన ధర్మంపై, వేదాంత శాస్త్రంపై మక్కువ ఉన్న ఒక విదేశీయుడు పరమాచార్య స్వామివారిని దర్శించాలని కంచి మఠానికి వచ్చాడు. అతను కొన్ని సందేహాలను అదగాలని అనుకున్నాడు. వెంతనే అతనికి స్వామివారి నుండి పిలుపు వచ్చింది. సమయం వృధా చెయ్యకుండా తన సందేహాలను స్వామివారి ముందుంచాడు. 


”స్వామిజి, నేను మీ సనాతన ధర్మ యొక్క అన్ని సిద్ధాంతాలను అర్థం చేసుకున్నాను, వాటిని గౌరవిస్తాను కూడా. కాని ఈ ‘ఒకే ఆత్మ పాప పుణ్యాల ఫలం వల్ల మళ్ళీ జన్మించడం క్రిందటి జన్మ కర్మఫలం ఈ జన్మకు రావడం’ అనే ఈ పునర్జన్మ సిద్ధాంతం నాకు అర్థం కావడం లేదు. మీరు ఈ విషయంలో నాకు కొంచం చెప్పగలరా?” అని అడిగాడు. 


”ఎందుకంటే మా ధర్మం ప్రకారం. ఈ జన్మలో చేసిన పాపపుణ్యాల ఫలితం ఈ జన్మలోనే అనుభవిస్తాము. అంటే మేము నిజాయితీగా ఉంటే దేవుడు మాకు మంచి చేస్తాడు. కపటంతో ప్రవర్తిస్తే మాకు చెడు ఫలితాలను ఇస్తాడు” అని చెపాడు.


అప్పుడు మహాస్వామి వారు అతని దగ్గర కారు ఉన్నదా అని అడిగి ఈ కంచీపురంలో వెళ్ళి కొంచం సమాచార గణాంకాలను సేకరించుకు రాగలవా అని కనుక్కున్నారు. అతను వెంటనే ఒప్పుకున్నాడు. కాని తన ప్రశ్నకు ఎందుకు వెంటనే సమాధానం చెప్పలేదు అని అనుకున్నాడు. 


”సరే స్వామిజి, ఏమి చెయ్యమంటారో సెలవివ్వండి” అని అడిగాడు. అందుకు మహాస్వామి వారు, “కాంచీపురంలోని ఒక పది ప్రసూతి వైద్యశాలలకు వెళ్ళు. అక్కడ గత రెండు రోజులలో పుట్టిన పిల్లల వివరాలు, వారి ఆరోగ్యం, తల్లితండ్రుల పేర్లు, వారి స్థితి, వారి విద్యార్హతలు, పుట్టిన సమయం వంటివి తెలుసుకుని రా” అని చెప్పారు. 


ఆ విదేశీయుడు, “సరే ఇదేమి పెద్ద పని కాదు” అని తన కారులో వెళ్ళిపోయాడు. సాయిత్రం లోపల కావల్సిన వివరాలతో మహాస్వామి వారి ముందు వచ్చాడు. ఆ వివరాలకు స్వామి వారికి చెప్పాడు. 


“ఈ రెండు రోజులలో పది ఆస్పత్రులలో 15 మంది పిల్లలు పుట్టారు. 7గురు మగపిల్లలు, 8మంది ఆడపిల్లలు. వారిలో ముగ్గురికి పోషకాహార లోపం ఉంది. ఇద్దరు ధనికులైన తల్లితండ్రులకు ప్రథమ సంతానం. వారు అత్యంత ఖరీదైన ఆస్పత్రులలో పుట్టారు. నలుగురు పిల్లలు రోజుకూలి చెసుకునే వారికి పుట్టారు. వారికి అప్పటికే పిల్లలు ఉన్నారు” అని చెప్పుకొచ్చాడు. 


స్వామివారు అతణ్ణి చూసి, కొన్ని ప్రశ్నలు వెయ్యడం మొదలుపెట్టారు. 


”వీరు పుట్టిన ఈ రెండు రోజులలొ వారు నిజాయితీగా ఉందడమో లేదా కపట బుద్ధితో ప్రవర్తించడమో చేసారని నువ్వు అనుకుంటున్నావా?”


“లేదు వారు కనీసం తమ తల్లిని కూడా గుర్తించలేని చంటిపిల్లలు. కాబట్టి ఈ జన్మలో వాడికి పాపము పుణ్యము అనేది ఏమి లేదు” అని చెప్పాడు. 


మహాస్వామి వారు ”మీ సిద్ధాంతము ప్రకారం ఈ పిల్లలందరూ ఏ పాపము పుణ్యము చెయ్యలేదు కాబట్టి అందరూ ఒకేలాగా ఉండాలి. కాని లేరు. కొంత మంది అరోగ్యం బాగులేదు. కొంత మంది ధనవంతుల పిల్లలు, కొంతమంది కూలివాని పిల్లలు. ఒకేరోజు, ఒకే అక్షాంశం, రేఖాంశం ఒకే ఊరిలో పుట్టిన పిల్లలైనా ఒక్కొక్కరు ఒక్కొక్క పరిస్థితిలో ఉన్నారు. ఇదే పునర్జన్మ సిధ్ధాంతం”


ఆ విదేశీయుడు ఈ మాటలను విని స్థాణువైపోయాడు. ఇక్కడే పునర్జన్మ సిద్ధాంతం నిజం అనేది తేటతెల్లమవుతోంది. ఈ పిల్లలందరూ వారి వారి పూర్వజన్మ పాపపుణ్యాల ఫలితంగానే ఈ జన్మలో ఇలా పుట్టారు.


ఆ విదేశీయుడిని చూసి సనాతనధర్మ సాకారరూపం చిరునవ్వుతోంది.


సనాతన ధర్మానికి పుర్జన్మ సిద్ధాంతం ప్రాణం. దాన్ని నమ్ముతాను అని చెప్పడానికే నుదుట బొట్టు పెట్టుకోవడం.


పునరపి జననం పునరపి మరణం

పునరపి జననీ జఠరే శయనం ||


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

గ్రహించగలరనుకుంటాను

 *♦️శూద్రులు వేదాలు చదివితే నాలుకలు కోసారు ... వేదాలు వింటే శూద్రుల చెవులలో సీసం పోశారు ... అంటూ విషప్రచారం చేస్తున్నారు.♦️*

*👽 వాస్తవానికి అసలు అటువంటి సంఘటనలు జరగకపోయినా బ్రిటీష్ దురాక్రమణ దారులు చేసిన ప్రక్షిప్తాలను పట్టుకొని మెకాలే - మాక్స్ ముల్లర్ మానస పుత్రులు, పాశాంఢ ఎడారి మత మార్పిడి మాఫియాలు, వామపక్ష చరిత్రకారులు, రచయితలు కల్పించి రాసిన తప్పుడు రాతలను చూపించి ఇప్పటికీ కొంతమంది రైస్ బ్యాగ్గాళ్ళు, మొండిగాళ్ళు, ఫేక్ క్యాస్ట్ సర్టిఫికెట్ గాళ్ళు "మా వంటి శూద్రులను (author of this article)" హిందూ ధర్మం నుండి దూరం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. 👽👇*


*♦️అసలు చరిత్రలో ఎన్నడైనా శూద్రులు వేదాలు చదివితే నాలుకలు కోసారా...???*


*వేదాలు వింటే శూద్రుల చెవులలో సీసం పోశారా...???*


*(RK)*


*✅ పరమ పవిత్ర శ్రీమద్ రామాయణ మహా కావ్యాన్ని రచించిన బోయవాడు అయిన రత్నాకర పూర్వ నామం కలిగిన వాల్మీకి మహర్షుల వారు శూద్రుడు కాదా...???*


*✅ మత్స్య గ్రంధికి జన్మించి పంచమ వేదం శ్రీమద్ భగవద్గీత, మహా భారతం వంటి పరమ పవిత్ర సనాతన గ్రంధాలను లిఖించిన కల్పి అనే పూర్వ నామం కలిగిన వ్యాస మహర్షుల వారు శూద్రుడు కాదా...?? ఆయనను నారాయణుడి అంశగా, విశ్వ గురువుగా గౌరవించుకోవడం లేదా...? ఆయన జయంతి రోజును గురుపూర్ణిమగా జరుపుకుంటున్నాము కదా...!*

*✅ శూద్రునిగా పుట్టి దస్య కుమారుడు అయినా వేద జ్ఞానాన్ని ఆర్జించి రుషి అయి ఆత్రేయోపనిషత్తు, ఆత్రేయ బ్రాహ్మణమును రచించిన ఆత్రేయ ఋషి వారు శూద్రుడు కాదా...???*

*✅ పుట్టుకతో శూద్రునిగా జూదగానికి పుట్టినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ఋగ్వేదంలో గొప్ప గొప్ప పరిశోధనలు చేసి, ఋషిగానే కాదు ఆచార్యులుగా ప్రఖ్యాతి గాంచిన ఐలశు ఋషి వారు శూద్రుడు కాదా...???*


*✅ శూద్రురాలికి పుట్టిన జాబల కుమారుడైన సత్యాకాం వేద సారాలను గ్రహించి, గొప్ప బ్రహ్మ జ్ఞానం, సత్యానికి నిలువెత్తు గుర్తుగా, వినయం, గురు విధేయతతో గౌతమ మహర్షుల వారినే మెప్పించి, గొప్ప పేరు ప్రఖ్యాతులు గాంచి యజర్వేదం అందలి కొంత భాగానికి కర్తయైన సత్యాకాం, జాబల మహర్షుల వారు శూద్రుడు కాదా..???*

*✅ శూద్రురాలికి పుట్టినా కూడా వేదాలను అభ్యసించి, గొప్ప బ్రహ్మ జ్ఞానం, పాండిత్యంతో ప్రఖ్యాతి గాంచిన బ్రహ్మర్షి మాతంగి మహర్షుల వారు శూద్రుడు కాదా. ??మాతంగి మహర్షుల వారి గురుంచి శ్రీమద్ రామాయణంలోనూ, మహా భారతం అనుశాసనిక పర్వములో ప్రస్తావనలు ఉంటాయి...!*

*✅ పుట్టుకతో శూద్రురాలి కుమారుడైనా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ఖ్యాతి గాంచిన విదురుడు హస్తినాపుర రాజ్యంలో మంత్రిగా సేవలు అందించాడు.ఇతడు శూద్రుడు కాదా.???*


*✅ పుట్టుకతో శూద్రుడు అయిన వత్సుడు గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ఋషివత్స గా ప్రఖ్యాతిగాంచలేదా...? వీరు శూద్రుడు కాదా...??? Ref:-(ఆత్రేయ బ్రాహ్మణము - 2.19)*

*✅ శూద్రునికి జన్మించినప్పటికీ అద్భుత మేధో సంపత్తి, బ్రహ్మ జ్ఞానంతో ఋగ్వేదంనందలి కొన్ని ఋక్కులకు కర్తయై బ్రాహ్మణత్వం పొందిన "కవష ఐలుషుడు" శూద్రుడు కాదా...???*

*✅ సాక్షాత్తు శ్రీ కృష్ణ పరమాత్ముడు శూద్రులు అయిన గొల్ల వారి ఇంట్లో పెరిగాడు యశోదమ్మకి మాతృ ప్రేమని పంచాడు !! సాక్షాత్తు దేవుడే అన్నీ వర్ణాల యంధు జన్మించి అన్నీ వర్ణలని పావనం చేశాడు !!! ఎవరిని ఎవరికి బానిసలుగా చూడమని ఎక్కడ కూడా చెప్పలేదు..*


*✅ మహర్షులకి కూడా దక్కని శ్రీరాముడి ఆలింగనం నిమ్న జాతివాడుగా భావించబడే పల్లెకారుడు (మత్స్యకారుడు) గుహుడికి దక్కింది. ఆనాడు అంత తేడాలు ఉంటే మరి శ్రీ రాముడికి పల్లెకారుడితో స్నేహం ఎలా ఉంటుంది..? మరి గుహుడు శూద్రుడు కాదా...???*

*✅ అద్భుతమైన వేద జ్ఞానంతో, సుమధుర గానంతో సాక్ష్యాత్ ఆ శ్రీరామచంద్రుల వారికే తన ఎంగిలి ఫలాన్ని తినిపించిన శబరి శూద్రురాలు కాదా...???*


*✅ స్వయంగా కవి పండితుడు, సాహితీ సమరాంగణ సార్వభౌముడు, వేద జ్ఞానం, బ్రహ్మ జ్ఞానం కలిగి గొప్ప రాజనీతిజ్ఞుడు, సైనికాధికారి, భుజబల సంపన్నుడు, ఆర్థిక వేత్త, మత సహనము కలవాడు, వ్యూహ నిపుణుడు, పట్టిన పట్టు విడువని వాడు, కవి పోషకుడు, రాజ్య నిర్మాత మొదలగు సుగుణాలు కలిగి విజయ నగర సామ్రాజ్య చక్రవర్తి, తెలుగు ప్రబంధ కవి, ఆంధ్ర భోజుడిగా ప్రఖ్యాతుడు అయిన శ్రీ కృష్ణ దేవరాయలు వారు శూద్రుడు కాదా...???*

*✅ అఖండ భారతాన్ని అప్రతిహతంగా పాలించిన, ముర అనే శూద్ర మహిళకు జన్మించినా వేద జ్ఞానం, బ్రహ్మ జ్ఞానం కలిగి గొప్ప రాజనీతిజ్ఞత, మేధస్సు, భుజబల సంపన్నుడు, ఆర్థిక వేత్త, శౌర్యం కలిగి, వ్యూహ నిపుణత, పట్టిన పట్టు విడువని వాడుగా అఖండ భారతాన్ని అప్రతిహతంగా పరిపాలించిన మౌర్య సామ్రాజ్య స్థాపకుడు సామ్రాట్ చంద్రగుప్త మౌర్య శూద్రుడు కాదా...???*

*✅ మట్టిబొమ్మలను మహారణానికి జట్టునడిపిన శాలివాహనుడు కుమ్మరివృత్తికి చెందినవాడు. మరి ఆయన శూద్రుడు కాదా...???*


*✅ విశ్వ కర్మలలో 6 తెగలు ఉన్నాయి. వడ్రంగి, కంసాలి మొదలైనవి వారు యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు. మంగలులను నాయీ బ్రాహ్మణులు అంటారు, వారిలో కూడా యజ్ఞోపవీతాన్ని ధరించేవారు ఉన్నారు. ఇక కుమ్మరులు వీరిలో యజ్ఞోపవీతాన్ని ధరించే సంప్రదాయం ఉంది. ఇక మాదిగలలో వారికి ప్రత్యేక పురోహిత వర్గం ఉంది. వారు యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు. వీరిలో అనేక లక్షల మంది వేద జ్ఞానం, బ్రహ్మ జ్ఞానం కలిగి పౌరోహిత్యం చేస్తున్నారు. మరి వీరందరూ శూద్రులు కాదా...???*

*✅ వేద కాలంలో పుట్టుకతో శూద్ర కుటుంబంలో పుట్టినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ఋషిగా మారి, తన వంటి మిగిలిన శూద్రులకు వేదపాండిత్యాన్ని, బ్రహ్మ జ్ఞానాన్ని పంచి జనశృతి పౌత్రయణ జరిపిన రైక్వ ఋషి వారు శూద్రుడు కాదా...???*


*✅ కుమ్మరి వృత్తి చేసేవారి కుటుంబంలో జన్మించినా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో, భక్తితో, సుమధుర గానంతో సాక్ష్యాత్ పండురంగడినే ముగ్దుడ్ని చేసిన భక్త తుకారాం శూద్రుడు కాదా...? ఆయన ముని బహినాభాయ్ కు గురువుగా వ్యవహరించారు.*

*✅ జన్మతః శూద్రునిగా జన్మించినా కూడా వేద జ్ఞాన సముపార్జన, బ్రహ్మ జ్ఞానంతో ఋషిగా మారిన ఋషి నారాయణగురు వారు శూద్రుడు కాదా...???*

*✅ జన్మతః శూద్రునిగా జన్మించినా కూడా వేద జ్ఞాన సముపార్జన, బ్రహ్మ జ్ఞానం సంపాదించిన కబీర్_దాస్ శూద్రుడు కాదా...??? కబీర్ దాస్ సూరత్ గోపాల్, జగుదాస్ వంటి జన్మతః బ్రాహ్మణులు అయిన పండితులకు గురువుగా ఉన్నారు...!*

*✅ జన్మతః శూద్రునిగా జన్మించినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో బెంగాలీ మహారాజు లక్ష్మణ్ సేన్ కు రాజగురువుగా ఎనలేని సేవలు అందించిన ఋషి ధోయి శూద్రుడు కాదా...???*

*✅ శూద్రునిగా పుట్టినా కూడా కళంగినథార్ శిష్యరికంలో వేదాలను అభ్యసించి, గొప్ప బ్రహ్మ జ్ఞానం, పాండిత్యంతో బంగారం తయారీపని చేసే తమిళ బోగర్ చైనా దేశం వెళ్లి హిందూ ధర్మ ప్రచారం చేశారు. మరి ఈయన శూద్రుడు కాదా...???*

*✅ మత్స్యకారుల కుటుంబంలో పుట్టిన కూడా అద్భుతమైన జ్ఞానం, వేద పఠనం, గొప్ప బ్రహ్మ జ్ఞానంతో 63 శైవ నాయనార్లలో ఒకరిగా ప్రఖ్యాతి చెందిన "ఆదిపట్టన్" శూద్రుడు కాదా...???*

*✅ కళింగ రాజ్యాన గోవులు కాసే వారి ఇంట పుట్టి వేదాలను అభ్యసించి, గొప్ప బ్రహ్మ జ్ఞానం, పాండిత్యంతో ఐదుగురు పంచసఖాలలో ఒకరిగా ప్రఖ్యాతి చెందిన "అచ్యుతానంద" శూద్రుడు కాదా...???*

*✅ చర్మ కారుల వృత్తి చేసే కుటుంబంలో పుట్టిన కూడా అద్భుతమైన జ్ఞానం, వేద పఠనం, గొప్ప బ్రహ్మ జ్ఞానంతో ప్రఖ్యాతి చెందిన తమిళనాడు "అలగై" శూద్రుడు కాదా...???*   

*✅ కళింగ రాజ్యాన కాటికాపరి వృత్తి చేసేవారి ఇంట పుట్టి వేదాలను అభ్యసించి, గొప్ప బ్రహ్మ జ్ఞానం, పాండిత్యంతో ఐదుగురు పంచసఖాలలో ఒకరిగా ప్రఖ్యాతి చెందిన "బలరాం దాస్" శూద్రుడు కాదా...???*     

*✅ కళింగ రాజ్యాన మత్స్యకారుల కుటుంబంలో పుట్టిన కూడా అద్భుతమైన జ్ఞానం, వేద పఠనం, గొప్ప బ్రహ్మ జ్ఞానంతో ఋషిగా వెలుగొందిన "భీమ దిబారా" శూద్రుడు కాదా...???*

*✅ జన్మతః శూద్రునిగా జన్మించినా కూడా వేద జ్ఞాన సముపార్జన, బ్రహ్మ జ్ఞానం సంపాదించిన ఋషి రవిదాస్ శూద్రుడు కాదా...??? ఋషి రవిదాస్ మీరాభాయ్, చిత్తోర్ ఘడ్ మహారాణి జలి, పాటికి మహారాణి మైనమతి లకు రాజగురువుగా విశేష సేవలు అందించారు...!*

*✅ జన్మతః శూద్రునిగా జన్మించినా కూడా వేద జ్ఞాన సముపార్జన, బ్రహ్మ జ్ఞానం సంపాదించిన ముని నామ్ దేవ్ శూద్రుడు కాదా...???*

*✅ శూద్రుల ఇంట పుట్టి వేదాలను అభ్యసించి, గొప్ప బ్రహ్మ జ్ఞానం, పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "చోఖ మేళ" శూద్రుడు కాదా...???*

*✅ జన్మతః శూద్రునిగా జన్మించినా కూడా వేద జ్ఞాన సముపార్జన, బ్రహ్మ జ్ఞానం సంపాదించిన "సంత్ కణ్హోపుత్ర" శూద్రుడు కాదా...???* 

*✅ " మహారాజు కవార్ధ" రాజ గురువు వేద జ్ఞాన సముపార్జన, బ్రహ్మ జ్ఞానం సంపాదించిన శూద్రుడైన "గురు బాలాక్ దాస్" ...!*

*✅ జష్పూర్ యువరాజు రాజ్ కుమార్ దిలీప్ సింగ్ రాజ గురువు శూద్రుడైన "గురు రామేశ్వర్ ప్రసాద్ గాధర".!*

*✅ సాక్ష్యాత్ ఆది శంకరాచార్యుల వారు గురువుగా స్వీకరించి, తలవంచి నమస్కారం పెట్టింది కాటికాపరి అయిన ఒక శూద్రునికి, ఆ సందర్భంలో లిఖించేదే మనిష పంచక...!*

*✅ జన్మతః శూద్రునిగా జన్మించినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "సంత్ ఘాసిదాస్" శూద్రుడు కాదా...???*

*✅ జన్మతః శూద్రునిగా జన్మించినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతి చెందిన తమిళులకు ఆరాధ్యుడు అయిన, 63 శైవ నాయనార్లలో ఒకరైన "తిరు వల్లువార్" శూద్రుడు కాదా...???*


*✅ జన్మతః శుచికారునిగా జన్మించినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతి చెందిన "వఖ్న" శూద్రుడు కాదా...???*  

*✅ మరాఠా రాజ్యంలో చెప్పులు కుట్టువారు కుటుంబంలో జన్మించినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "గురు విఠల్ రాంజీ షిండే" శూద్రుడు కాదా...???*

*✅ మరాఠా రాజ్యంలో చెప్పులు కుట్టువారు కుటుంబంలో జన్మించినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతి చెందిన "సోయరా భాయ్"శూద్రురాలు కాదా...??*


*✅ మధ్య భారతంలో చెప్పులు కుట్టువారు కుటుంబంలో జన్మించినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెంది శివ, వైష్ణవ బేధాలను రూపుమాపిన "శోభి రామ్" శూద్రుడు కాదా...???*  


*✅ పౌరవ రాజ్యమున చెప్పులు కుట్టువారు కుటుంబంలో జన్మించినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "పిపాల్ దాస్" ఆయన కుమారుడు "శర్వణ దాస్" శూద్రులు కాదా...???*  

*✅ పౌరవ రాజ్యమున చెప్పులు కుట్టువారు కుటుంబంలో జన్మించినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "రామదాసు" శూద్రుడు కాదా...???*  

*✅ ఉత్తర భారతంలో చెప్పులు కుట్టువారు కుటుంబంలో జన్మించినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతి చెందిన "పరశురాం" శూద్రుడు కాదా...???*


*✅ పంజాబ్ లో రజక వృత్తి చేయువారు కుటుంబంలో జన్మించినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "నామ్ దేవ్" శూద్రుడు కాదా...???*  

*✅ ఉత్తర భారతంలో చెప్పులు కుట్టువారు కుటుంబంలో జన్మించినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతి చెందిన "మోహిని దేవి" శూద్రురాలు కాదా...??*


*✅ తమిళనాట వీధులు శుభ్రం చేయు వారి కుటుంబంలోపుట్టి గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "ముని బాణన్" శూద్రుడు కాదా.?*

*✅ మరాఠా రాజ్యంలో చర్మకార వృత్తి చేయువారు కుటుంబంలోపుట్టి గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "బహిరామ్ చోఖమేల" శూద్రుడు కాదా.??*


*✅ మరాఠా రాజ్యంలో చర్మకార వృత్తి చేయువారు కుటుంబంలోపుట్టి గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతి చెందిన "బాలక్ దాస్" శూద్రుడు కాదా.??*

*✅ మరాఠా రాజ్యంలో చర్మకార వృత్తి చేయువారు కుటుంబంలోపుట్టి గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "బంకా మహర్" శూద్రుడు కాదా.??*


*✅ మరాఠా రాజ్యంలో చర్మకార వృత్తి చేయువారు కుటుంబంలోపుట్టి గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "భాగు" శూద్రుడు కాదా.??*

*✅ ఉత్తర భారత దేశంలో చెప్పులు కుట్టువారు కుటుంబంలోపుట్టి గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "బీర్ భాన్" శూద్రుడు కాదా.??*


*✅ మరాఠా రాజ్యంలో చెప్పులు కుట్టువారు కుటుంబంలోపుట్టి గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "చన్నయ్య" శూద్రుడు కాదా.??*    

*✅ మరాఠా రాజ్యంలో చెప్పులు కుట్టువారు కుటుంబంలోపుట్టి గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "చిక్కయ్య" శూద్రుడు కాదా.??*  


*✅ మరాఠా రాజ్యంలో చెప్పులు కుట్టువారు కుటుంబంలోపుట్టి గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "చొఖ మేల" శూద్రుడు కాదా.??*   

*✅ మరాఠా రాజ్యంలో చెప్పులు కుట్టువారు కుటుంబంలోపుట్టి గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతి చెందిన "దామాజీ పంత్"శూద్రుడు కాదా.??* 

   

*✅ ఉత్తర భారతంలో చెప్పులు కుట్టువారు కుటుంబంలోపుట్టి గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతి చెందిన "దేవి దాస్"శూద్రుడు కాదా.??*    


*✅ ఉత్తర భారతంలో చెప్పులు కుట్టువారు కుటుంబంలోపుట్టి గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "ధాన్నా"శూద్రుడు కాదా.??* 

   

*✅ మధ్య భారతంలో చెప్పులు కుట్టువారు కుటుంబంలోపుట్టి గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "ఘసి దాస్"శూద్రుడు కాదా.??*   

 

*✅ ఉత్తర భారతంలో పారిశుద్ధ్య వృత్తి చేయు కుటుంబంలోపుట్టి గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతి చెందిన "గోపాలానంద్ మహరాజ్ " శూద్రుడు కాదా.?? ఈయన ఆర్య సమాజ్ లో కీలక సభ్యునిగా సేవలు అందిస్తూ బలవంతంగా ఇస్లాంలోకి మత మార్పిడి చేయబడ్డ అనేక వందల మంది హిందువులను ఘర్ వాపసీ చేసి, హిందూధర్మంలోకి తీసుకువచ్చారు... ఈయన అనేక భక్తి పాటలు, పద్యాలు రాసి, గానం చేశారు...!*


*✅ ఉత్తర భారతంలో పారిశుద్ధ్య వృత్తి చేయు కుటుంబంలో పుట్టి గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "సాధు జీతౌ జీత్ బహదూర్" శూద్రుడు కాదా.??*


*✅ మరాఠా రాజ్యంలో చెప్పులు కుట్టువారు కుటుంబంలోపుట్టి గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతి చెందిన "కరమమేలం" శూద్రుడు కాదా.??*

*✅ జన్మతః శూద్రులుగా జన్మించినా కూడా వేద జ్ఞానాన్ని, బ్రహ్మ జ్ఞానాన్ని సముపార్జించి ఋషులుగా, మునులుగా ప్రఖ్యాతి చెందిన...-👇*


🔯 సమ్ఖ్యాక (శుచికార వృత్తి) 

🔯 అగస్త్య (వేట వృత్తి)

🔯 దుర్వాస (cobbler)

🔯 దాధిచి (lock smith)

🔯 కశ్యప (blacksmith)

🔯 రామాజా (copper smith)

🔯 కౌండిల్య (barber)

🔯 గోరా (గ్రామీణ పౌరోహిత్యుడు)

🔯 చోఖా (గోసంరక్షకుడు)

🔯 సావత (గ్రాసం తొలగించు వృత్తి)

🔯 కబీర్ (Weaver garments)

🔯 రోహిదాస్ (Colored hide )

🔯 సజనా (మాంస అమ్మకం)

🔯 నరహరి (Melted gold)

🔯 జనాభాయ్ (గో వ్యర్ధల సేకరణ వృత్తి)..


*✅ మరి వీరందరూ వేదాలు నేర్చుకుని ఋషివర్యులుగా,మునులుగా ఖ్యాతి గడించిన వారు. వీరు శూద్రులు కాదా...???*


*✅ ఇలా చెప్పుకుంటే పోతే అనేక లక్షల మంది శూద్ర హిందువులు వేదాలు చదివి, బ్రహ్మ జ్ఞానం పొంది ఋషులుగా, మునులుగా, పంత్ లా, సాధు లా ఎనలేని ఖ్యాతి పొందారు, పొందుతూ హిందూ ధర్మానికి ఎనలేని సేవ చేస్తున్నారు...!*

*🔹 వేదాలలో కూడా ఇదే చెప్పారు.*


జన్మనా జాయతే శూద్రః

కర్మణా జాయతే ద్విజః

వేద జ్ఞానేషు విప్రాణాం

బ్రహ్మ జ్ఞానంతు బ్రాహ్మణాః


*🔹 (ఇది ఋగ్వేదం లోని ఐదవ మండలం లోని ఆత్రేయ స్మృతి లోని 141-142 వాక్యాలు)*


*✅ అనగా పుట్టగానే అందరూ శుద్రులే (అనగా శిసువుకి జన్మతః జ్ఞానం అనేది అసహజం). వేదం నేర్చిన వారే విప్రులు, బ్రహ్మ జ్ఞానం కలవారే బ్రాహ్మణులు అని అర్థం. అదేవిధంగా "వేద విధులతో సంచరించక, దేవతలను పూజించక, వివేకములు లేక, కేవలం లౌకిక వాక్కులు నాశ్రయించువారు బ్రాహ్మణ కులంలో పుట్టిన వారైననూ వారు బ్రాహ్మణులు కానే కారు. శూద్రులే అగుదురు.*


"జన్మనా జాయతే శూద్రః,

సంస్కారాద్ది్విజ ఉచ్యతే!

వేదపాఠీ భవేద్వ్దిప్రః,

బ్రహ్మ జానాతి బ్రాహ్మణః!!


*✅ ఒక బ్రాహ్మణునికి జన్మించినా పౌరుషం కల్గి యుద్ద విద్యలు నేర్చి క్షత్రియుడు కావచ్చు. ఒక శూద్రునికి జన్మించినా మేధోసంపత్తితో బ్రాహ్మణుడు కావచ్చు.*


వర్ణాశ్రమా అపి గుణకర్మాచరతో హిభవంతి.అత్రాహ మనుః

శూద్రే బ్రాహ్మణ తామేతి బ్రాహ్మణ శ్చైతి శూద్రతాం

క్షత్రియాజ్ఞాత మేవం తు, విద్యాత్ వైశ్యాత్తథైవచ"

(ఇది మను ధర్మ శాస్త్రం 10-65 మంత్రం.)

*✅ భావం : బ్రాహ్మణ గుణాలు కలిగిన శూద్రుడు బ్రహ్మణుడే యగును. శూద్ర గుణాలు కలిగిన బ్రాహ్మణుడు శూద్రుడగును. అదే విధంగా క్షత్రియ జాతి, వైశ్య జాతి కూడా కేవలం గుణ, కర్మాచరణల వలననే యేర్పడును.*


అష్టాపాద్యం తు శూద్రస్య స్తేయే భవతి కిల్బిషమ్I

షోడశైవ తు వైశ్యస్య ద్వాత్రంశత్ క్షత్రియస్యచII

భ్రాహ్మణస్య చతుః షష్ఠిః వూర్ణం వా అపి శతం భవేత్I

ద్విగుణావా చతుః షష్ఠిః తద్ధోషగుణః విద్ధి సఃII


*♦️ దొంగతనం మొదలైన అపరాధాలలో శూద్రునకు 8 రెట్లు దండన విధిస్తే, వైశ్యునకు 16 రెట్లు, క్షత్రియునకు 32 రెట్లు బ్రాహ్మణునకు 64 లేక 100 లేక 128 రెట్ల దండన విధించాలని మనువు ఆదేశించారు. శిక్షల విషయంలో ప్రక్షిప్త శోకాలు కనిపించిన మహానుభావులకు ఈ శ్లోకాలు ఎందుకు కనిపించలోదో విజ్ఞులైన మీరు గ్రహించగలరనుకుంటాను.!*

*🔹 ఇక హిందూ ధర్మంలో వేదాలు, శాస్త్రాలు అభ్యసించి బ్రహ్మ జ్ఞానం పొంది ఋషులుగా, మునులుగా, పంత్ లా, సాధు లా ఎనలేని ఖ్యాతి పొందుతున్న శూద్ర హిందువుల గురుంచి రెండవభాగంలో సవివరంగా తెలియ జేస్తాను.*


- *✍️ Rajender (RK), Sarpanch Velmakanna- 9849390054 ✍️*

16, మార్చి 2022, బుధవారం

పడవ యుండవలసిందే

 శ్లోకం:☝️

*నావార్ధీ హి భవేత్తావత్*

    *యావత్పారం న గచ్ఛతి |*

*ఉత్తీర్ణే తు సరిత్పారే*

    *నావయా కిం ప్రయోజనమ్ ||*


భావం: ఎంతవరకు నది ఆవల చేరదో, అంతవరకు నదిని దాటుటకై పడవ యుండవలసిందే. ఏరు దాటిన మీద ఆ నావ ఉపయోగం లేదు.

15, మార్చి 2022, మంగళవారం

కవిత్వమునకు ప్రాధమిక లక్షణం.

 సౌందర్యాన్ని లయాకత్మకంగా సృష్టించడం,   అర్థ గాంభీర్యాన్ని కలిగియున్న వాక్యాల కూర్పు కవిత్వం అవుతుంది. నిగూఢతను కలిగి, సాధారణం వాక్యానికి భిన్నంగా ఉండి చదవగానే మనసును రంజింపజేసి, ఆలోచింపజేసే రచనను కవిత్వం అనవచ్చు. 


కవిత్వం అను పదం,ఆంగ్లం లోని ""ఫ్రీవర్స్"" పదమునకు సమానార్ధకంగా వచన కవిత పదము ప్రయోగించబడుతోంది. తెలుగు కవిత్వంలో అనాదిగా వస్తున్న పద్యకవిత్వాన్ని ఆస్వాదించలేకపోతున్న కొంతమందికి సాహిత్యం పై అభిమానం,గౌరవం కలిగించే విధంగా ఛందస్సు లేని వ్యావహారిక భాషా పదజాలాన్ని ఉపయోగించి భాషపై పట్టు సడలకుండా రాసే అర్ధగాంభీర్య రచనలే వచన కవిత్వం అని గ్రహించవచ్చు.

      రచనలు చేసేవారు భాషపై అధికారం కలిగి ఉండి,

అవగాహన తో పదప్రయోగ కౌశలం,పదబంధ నిర్మాణంలోని నేర్పు, వాక్యవిన్యాసంలోని ప్రావీణ్యత

అనేవి కలిసి "శైలి""  గా రూపొందుతాయి.రచనోద్దేశాన్ని,సమర్థవంతంగా నిర్వహించే రచనా విధానం అంటే ఉత్తమమైన శైలిగానే పేర్కొనవచ్చు. రచనలో భాషను వాడుకుని

శక్తి,నైపుణ్యాన్ని ప్రత్యేకతను " శైలి"" గా చెప్పవచ్చు. 

      ఆధునిక   వచన శైలిలో పదాల కూర్పు ఎంత  నిరాడంబరంగా, సంగ్రహంగా ఉంటే శైలి అంత గంభీరంగా, ప్రసన్నంగా సూక్ష్మగ్రాహ్యంగా ఉంటుంది. 

రచనల్ని అంశాలను పాఠకులు గ్రహించడానికి,

అనుభవించడానికి,ఎక్కువ అవకాశం ఉంటుంది. సరళ శైలి ఆధునిక వచన రచనకు అనుకూలమైనది.

దీర్ఘసమాసరచనతో కూడిన పదగుంఫన శైలి ఆమోదయోగ్యంకాదు...

సామాజిక చైతన్యాన్ని రగిలించే కవితా వస్తు నిర్మాణం వచన కవితకు ప్రత్యేకం. అదేవిధంగా 

భావుక ప్రాధాన్యత కలిగి ఉండాలి. ఆకర్షణీయమైన 

అంత్యప్రాసలు వచన కవితకు అలంకారం కావాలి. 

నిరాడంబరం,అనవసర పద ప్రయోగం చేయకుండా 

జనజీవితంలోని అలంకారాలకు ప్రాధాన్యం ఇవ్వడం వచన కవిత్వమునకు ప్రాధమిక లక్షణం.

        కవి భావుకతకు,భావ ప్రకటనకు స్వేచ్ఛకు 

ఆటంకం లేకుండా సర్దుబ�

మానసిక ఒత్తిడి

 *నా సబ్జెక్టులో మంచి రిజల్ట్ రావాలని Subject Teacher.....*


*మా పాఠశాల ఫలితాలు 100% రావాలని Headmaster......*


*మా జిల్లా అగ్రశ్రేణిలో ఉండాలని DEO ........*


*రాష్ట్ర ఫలితాలు ఢంకా* *భజాయించాలని GOVT.*

*తలమునకలౌతుంటే,*


*నాకేం అవసరం లేదు అన్నట్లు.*

*చచ్చినట్టు టీచర్ రే* *చూచుకుంటాడు అన్నట్లు*

*STUDENT హాయిగా ఉన్నాడు*


*పరీక్షలు ఎలా రాయాలని విద్యార్థులు భయపడి, అనారోగ్యాల పాలై, ఒత్తిడి కి గురి అయ్యే రోజులు పోయాయి.*


*ఈ పరీక్ష నాకే అన్నట్టు గా*

*ఉపాధ్యాయులు భయపడిపోయే రోజులు వచ్చాయి .*


*మనగూర్చి ఆలోచించే వారున్నంతకాలం మనకు రక్షణే*


*సాగరసంగమం సినిమాలో  బావిమీద డ్యాన్స్ చేస్తుంటే కమలహసన్ కన్నా ప్రేక్షకులే ఎక్కువగా భయపడ్డారట.*


*ఏది ఏమైనా పాత రోజుల్లో టీచర్ కు లేని.., ప్రస్తుతం టీచర్కు వున్న మరియు రోజు రోజుకు పెరుగుతున్న ఒకే ఒక భయంకర ఆరోగ్య సమస్య*


*"మానసిక ఒత్తిడి"*

Hindu

 *The Govt of India has abolished "The Roshni Act" of Jammu & Kashmir!*


*Imagine that till date, your TOI & The Indian Express, and the entire Leftist controlled media have never told us about "The Roshni Act"!*


*Now because of the power of Facebook and WhatsApp you will know, understand what was done by Farooq Abdullah and Mufti Muhamed Syed, Gulam Nabi Azad and Kashmiri bureaucrats!*


*This "Roshni Act" was a conspiracy,  made by Farooq Abdullah, to legally give away to the Muslims of Kashmir, the houses, shops, gardens and fields of the Hindus who had fled Kashmir in 1990*


 *All the Hindus who fled Kashmir in the 1990s were not killed by Pakistani Muslims, but by their own Kashmiri neighbours, with whom they used to eat breakfast and lunch together, celebrate festivals together, consume tea together, for generations together!*


*After that, when the entire Kashmir valley became empty of Hindus, then the Muslims, with the help of the bureaucracy and Farooq Abdullah, petitioned that some rules be framed so that these houses, shops, lands, fields and barns of Hindus be given to the Muslims!*


*So the Farooq Abdullah as the Chief Mnister of Jammu & Kashmir, signed "The Roshni Act" and through this "Roshni Act", the land, farm, , house or shop of any Hindu became that of a Muslim for just ₹ 101 (USD 1.30)!*



*The trick used was as follows:*


*Since  three hundred thousand Hindus were slaughtered, raped and thrown out of the Kashmir Valley  over 6 months in 1990, with their bag and baggage and left everything else behind in Kashmir like all immovable properties like houses, shops , offices and building buildings and farms!*


*They could not pay the Electricity bill, due to the fear of death on returning to the Kashmir Valley to their homes and so the electricity connections of their fields or shops or houses were first disconnected by the Govt of J&K because of non payment of dues!*


*It was omitted in the disconnection orders that the Hindus who stayed around the houses of the Muslims, are no longer in Kashmir!*


*Due to disconnection of the electricity meters, there was darkness around these properties, which was a danger to the neighbouring Muslims!*


*That is why it was necessary to light such properties!*


*In this way,  the fabric of "The Roshni Act" was woven by Farooq, Omar and supported by other CMs like Mehbooba Mufti and the Congress swines!*


*Then Farooq Abdullah got The Roshni ( Light) Act passed by the State Assembly!*


*Through this Act, any Muslim could apply in his name to get an electricity connection for the farm, farm house or shop of that Hindu by paying only ₹ 101 fee!*


*In this way, first the electricity bill was generated in the name of the applying Muslim, and after that in a few years the full ownership of the house, shop or farm of the Hindu was given to that Muslim!*


*In this way, by this "Roshni ( Light ) Act", Chief Minister Farooq Abdullah and all the swines mentioned above gave the valuable properties of 300,000 Hindus of the Kashmir Valley to the Muslims for just Rs 101. (Today's USD 1.30 )!*


*And the most surprising thing is that the Left media of India never discussed this "Roshni Act" in the last 30 years, and so today by the power of the Social Media I came to know about it!*


*By the way, the same was done in Europe with the wealth of the massacred Jews by the Nazis and the neighbours of the Jews!*


*Your duty is to make all Indians aware of this information by sharing this news so that Farooq, Mehbooba Mufti and Ghulam Nabi Azad and the Kashmiri bureaucrats are made to stand trial and are put to death for the killing of 10,000 Hindus and the systematic driving out of 300,000 Kashmiri Hindus from their Motherland!!*


The Hindu  👍🕉️🌹

ఎంత అదృష్టమో

 ఎంత అదృష్టమో!


     "ఆహా!  మీరు ఎంత అదృష్ట వంతులయ్యా! ధర్మరాజా!" అన్నాడు  నారద మహర్షి. 

 ఇంతకీ ఏమిటి ఆ  అదృష్టం?


జలజాత ప్రభవాదులున్ మనములో చర్చించి  భాషావళిన్ 


పలుకన్ లేని జనార్దనాహ్వయ పరబ్రహ్మంబు మీ యింటిలో 


చెలియై మేన మరందియై  సచివుడై చిత్త ప్రియుండై మహా 


ఫల సంధాయకుడై చరించుటలు మీ భాగ్యంబు రాజోత్తమా!


 (ఆంధ్ర మహా భాగవతం- 

- బమ్మెర పోతన)


  'శ్రీకృష్ణుడు సామాన్యుడా?

 వర్ణించటానికి మాటలకూ

ఊహించటానికి మనస్సుకూ  అందని వాడు. 

 'కృష్ణుడు' అనే పేరుతో  ఆవిర్భవించిన  ఆది దేవుడు.  

ఆ పరబ్రహ్మ తత్త్వమే  ఈ రూపంతో దిగి వచ్చింది.  

"యతో వాచో నివర్తన్తే అప్రాప్య మనసా సహ.."

అన్న ఉపనిషత్సూక్తికి ఆలంబనం ఈ స్వామి. 

సత్యమూ, జ్ఞానమూ, అనంతమూ అయిన ఆ పరబ్రహ్మే   కృష్ణుడుగా  అవతరించాడు.

సత్యము- అంటే  ఎప్పుడూ ఉండేది.  భూత భవిష్య ద్వర్తమానాలు అనే తేడా లేకుండా అన్ని కాలాల లోనూ ఉండే  అసలు సిసలు తత్త్వమే సత్యం.

అలాంటి సత్య స్వరూపుడు  కృష్ణుడు.  

ప్రతి జీవుడూ  తప్పక తెలుసుకో వలసిన 'జ్ఞానం' అతడే. 

అంతటి వాడు మీ ఇంటిలో  మీకు ఎంత సన్నిహితుడుగా ఉన్నాడు!

 మీకు స్నేహితుడుగా మెలగుతున్నాడు.   బావగా మీతో  బంధుత్వం పాటిస్తూ మీకు ఆనందం కలిగిస్తున్నాడు.    మీకు మంత్రిగా ఉంటూ మీ పనులన్నీ  సక్రమంగా, సార్థకంగా  సాగటానికి దోహదం చేస్తున్నాడు.  

మీ హృదయాలకు ఎంతో చేరువై,   మీకు ప్రీతిపాత్రుడుగా ఉన్నాడు అతడు.  అన్నింటినీ మించి  మోక్ష  సామ్రాజ్యాన్ని కరతలామలకం చేసి,  మీకు గొప్ప  ఫలాన్ని కట్టబెట్టగల ముకుందుడు ఆ స్వామి.   అంతటివాడు  మీకు ఇంత దగ్గరివాడై  మెలగటం  మీ అదృష్టం కదా! " అన్నాడు  నారద మహర్షి. 


   అంతటి వాడు పాండవులకు ఇంతటి సన్నిహితుడై  ఎందుకు ఉన్నాడు ?  

ఏమిటి  పాండవులు చేసిన పుణ్యం?

అని ఆలోచిస్తే,  ఒకే ఒక్క కారణం కనిపిస్తుంది. 

సత్య ధర్మాలకు కట్టుబడి ఉండటం పాండవుల స్వభావం.  కష్టమైనా  నష్టమైనా  భరిస్తూ, ధర్మ మార్గాన్ని మాత్రం వదలని దీక్షా దక్షులు పాండవులు. 


వాసుదేవుడు పాండవ పక్షపాతి.   కాదు కాదు.

ధర్మ పక్షపాతి " అని తమ నాటకాలు పలికించారు  తిరుపతి వేంకట కవులు.  


"యతో ధర్మో యత స్సత్యం 

యతో హ్రీ రార్జవం యతఃl

 తతో భవతి గోవిందః 

యతః కృష్ణ స్తతో జయఃll"

(సత్యమూ ధర్మమూ కూడని పనులకు వెనుకంజ వేసే స్వభావమూ మనసూ మాటలూ  చేతలూ ఒకే విధంగా ఉండటం అనే స్వభావం   ఉన్నచోట 

ఆ వ్యక్తులకు అండగా  ఉంటాడు శ్రీకృష్ణుడు.  

వారిని గెలిపించే విజయ సారథి అవుతాడు  శ్రీకృష్ణుడు.

  

   అర్జునుడి రథానికే కాదు, 

పాండవుల జీవిత రథాలకూ  సారథి శ్రీకృష్ణుడే. 


కారణం...?

పాండవులు అవకాశ వాదులవలె  సుఖ సన్నివేశాలు పట్టుకుని వేళ్ళాడే  వాళ్ళు కాదు. 

ధర్మమే ఊపిరిగా ఉన్నవారు పాండవులు. 


కనుక వారి "భక్తికి" మెచ్చి 

వారి దగ్గరే ఎప్పుడూ ఉన్నాడు శ్రీకృష్ణుడు. 


పరికింపగ పరమాత్ముడె 

పరమాప్తుడు జగతిలోని 

                 ప్రాణుల కెల్లన్

వరదుండగు  ఆతనిపై 

పరమంబగు  ప్రేమ కాదె 

                  భక్తి యనంగా.

                 (-స్వీయం)


నమస్సులతో 


మీ 


మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి.

ఈ ప్రశ్నకు సమాధానం

 శ్రీ సీతారామాభ్యోనమః. శ్రీ హనుమతే నమః


ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడం కొంచెం ఇబ్బందే.


అసలు ప్రశ్నకు సమాధానం ఇచ్చే ముందు శ్రీ హనుమ జన్మ ఉద్దేశ్యం ఏంటో చూద్దాం. అలాగే ఆయన అవతరించిన అపూర్వమైన విధానం కూడా చూద్దాం.


ఆయనను .. మారుతాత్మజుడు(వాయు నందనుడు) రుద్రవీర్య సంభవుడు, కేసరీ నందనుడు..ఇలా కదా పిలుస్తాం. అంటే శ్రీరామచంద్రమూర్తి భూమి మీద చేయవలసిన కార్యంలో హనుమకు వున్న ప్రాముఖ్యత కు అనుగుణంగా..వాయుదేవుడు, పరమశివుడు..తమ తమ శక్తులు ఇస్తే, కపి రూపం కావాలి కాబట్టి.. కేసరి,అంజనాదేవి ల సహాయంతో భూమి మీదకు వచ్చాడు ఆ అప్రమేయ పరాక్రముడు. పరమశివుడే, శ్రీరాముల వారి మీద వున్న పరమ భక్తితో , ఆంజనేయస్వామి గా వచ్చాడంటారు కూడా కదా.


సరే. మనకు వాల్మీకి మహర్షి రామాయణంలో కిష్కింధ కాండలో మొదటి సారి కనపడతారు..శ్రీ హనుమ. అనన్యసామాన్యమైన కార్యాలు చేస్తాడు..రావణ వధ జరిగే వరకు. ఆ తర్వాత రామానుగ్రహం చేత, ఆయన ఆజ్ఞ తీసుకొని,కలియుగాంతం వరకు వుంటానని వుండి పోతాడు. అదికూడా తపస్సు చేసుకుంటూ. మహాభారతంలో భీమసేనుడికి కూడా కనప డేది..హిమాలయాలలో కదా. అవతార ఉద్దేశ్యం అయిపో యింది కనుక ఆయన ఇంకా ఎక్కడా కనపడడు.


మహానుభావులు,తపస్సు చేసుకునేవారు ..ఇలా చాలా మందికి దర్శనం ఇచ్చాడు అంటారు. నా బోటి సామాన్యులకు కష్టకాలంలో ఆదుకుంటో వుంటాడు.


మరి వివాహం ఎప్పుడు అయింది స్వామికి. పరాశర సంహిత, ఇంకా కొన్ని సంహితలలో ఉందంటారు. దానిని సహాయంగా తీసుకొని మన తెలుగునాట చాలా దేవాలయాలు కూడా కట్టారు. ఈ మధ్యకాలంలో రాసిన సుప్రభాతంలో వుంటుంది "సువర్చల" ప్రస్తావన. కానీ హనుమ అష్టోత్తరంలో కానీ సహస్రనామాల్లో కానీ మనకు వివాహం విషయం కానరాదు. కనీసం వెయ్యి ఎనిమిది పేర్ల లో .... "సువర్చలా ప్రాణనాధాయ నమ: " అని వుండాలి కదా! అదే నాకు ..ఈ ప్రస్తావన ను ఆనాటి పెద్దలే నమ్మ లేదేమో అని అనిపిస్తుంది.


ఇకపోతే ఇంకొక రకమైన లెక్క కూడా ఉంది. అది నాలుగు యుగాలు అయిపోయిన తర్వాత మళ్లీ సృష్టి మొదలవుతుందని అప్పుడు ఈ నాలుగు యుగాలు పునరావృతం అవుతాయని చెప్తారు. అంటే మళ్లీ శ్రీరాముడు శ్రీకృష్ణుడు వస్తారని. అలా వచ్చిన ఒక యుగంలో హనుమంతుల వారికి వివాహం అయిందని ఒక వర్గం ప్రజలు చెప్తారు. దాని ఆధారంగానే హనుమంతుల వారికి సువర్చలాదేవికి వివాహం అయిందని చెప్పి చెప్తారు. ఇంకా చెప్పాలంటే దేశంలో యింకో రాష్ట్రంలో ఎక్కడా భార్యతో కూడి వున్న హనుమ దేవాలయాలు చూడలేదు.

కూర్చునే సమయంలో

 🪔 *ॐ卐 _-|¦¦|శుభోదయమ్-సుభాషితమ్|¦¦|-_ ॐ*💎


శ్లో𝕝𝕝 “ఆసనే శయనే దానే భోజనే వస్త్రసంగ్రహే। 

వివాదే చ వివాహే చ క్షుతం సప్తసు శోభనమ్”।


తా𝕝𝕝 *కూర్చునే సమయంలో*..

*పడుకునే సమయంలో*..

*దాన సమయంలో*..

*భోజన సమయంలో*..

*వస్త్ర సంగ్రహ సమయంలో*..

*వివాద సమయంలో*..

*వివాహ సమయంలో*..


ఈ ఏడు సందర్భాల్లో తుమ్ము శుభ సూచకం☝️.....

-----------------------


*||క్షుతఫలం...||* 

[అంటే తుమ్ము గురించి] 

శ్లో|| ఔషధే వాహనారోహే వివాదే శయనే౭శనే!

బీజావాపే నిత్యపాఠే శుభదం సప్తసు క్షుతమ్!!


తా||  *ఔషధసేవ, వాహనారోహణము కలహము, శయనము, భోజనము, విత్తులు  చల్లుట , అధ్యయనము*


ఈ ఏడిటియందు తుమ్ము శుభప్రదమైనది.!!

------------------------


*!!విషఘటికాకర్తవ్యములు!!*

[అంటే!?వర్జ్యములో చేయదగిన పనులు] 


*!!శ్లోకము!!*


స్నానే దానేజపే హోమే వైశ్వదేవే సూరార్చనే!

ప్రాయశ్చిత్తే తథా శ్రాద్ధే విషనాడీ ప్రశశ్యతే!!


*!!తాత్పర్యము!!*


*స్నానము, కన్యాప్రదానముగాక మిగిలినదానములు, జపము, హోమము, వైశ్వదేవము, దేవతార్చనము ప్రాయశ్చిత్తము, శ్రాద్ధము*

వీనికి విషఘడియలు మంచివి ....🙏

ఆయుర్వేద వైద్యం - బొమ్మల కొలువు

 ఆయుర్వేద వైద్యం - బొమ్మల కొలువు


అది మహారాష్ట్రలోని సతారాలో ఉత్తర శ్రీ నటరాజ స్వామి వారి దేవాలయం కడుతున్నప్పటి రోజులు. మహాస్వామి వారు అక్కడే ఉంటూ అన్నీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. పరమాచార్య స్వామి వారి దర్శనానికి భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. 


ఒకనాటి ఆదివారం మద్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో 30 సంవత్సరముల వయస్సుగల ఒక యువకుడు మహాస్వామి వారికి సాష్టాంగం నమస్కారం చేసి నుంచున్నాడు. అతని కళ్ళల్లో కన్నీటి ధారను మహాస్వామి వారు చూసి ప్రేమతో “ఏమప్పా! ఎవరు నీవు? ఎక్కడనుండి వచ్చావు? నీ కళ్ళల్లో ఆ తడి ఎందుకు?” అని అడిగారు. అతను ఏమి సమాధానం చెప్పకుండానే పెద్దగా ఏడ్వటం మొదలుపెట్టాడు. చుట్టూ ఉన్న వారు అతన్ని ఊరడించి మహాస్వామి వారిముందు కూర్చోపెట్టారు. 


”ఎక్కడినుండి వచ్చావు అప్పా?” మహాస్వామి అడిగారు. ”పాలక్కాడ్ కేరళ”


వెంటనే మహాస్వామి వారు “పాలక్కాడ్ నుండి ప్రయాసపడి ఇక్కడిదాకా వచ్చావా?” అని అడిగారు. ”అవును పెరియావ మీకొసం అక్కడినుండి వచ్చాను”


“సరే. నీ పేరు ఏంటి?” 


“హరిహర సుబ్రమణియన్”


“భేష్! చాలా మంచి పేరు. మీ తండ్రి గారు ఏం చేస్తుంటారు?” అని అడిగారు. ”మా తండ్రి గారు ఇప్పుడు శరీరంతో లేరు. వారు పాలక్కాడ్ లో ఆయుర్వేద వైద్యుడు. వారి పేరు డా. హరిహర నారాయణన్”


అతను ముగించక ముందే మహాస్వామి వారు కుతూహలంతో ”ఓ నువ్వు పాలక్కాడ్ ఆయుర్వేద వైద్యులు హరిహర నారాయణన్ కుమారుడవా. మంచిది! సరే చెప్పు. అలా అయితే నువ్వు డా. హరిహర రాఘవన్ గారి మనవడివి కదూ! వారందరూ ఆయుర్వేద వైద్యంలో మంచి పేరు సంపాయించారు” అని చెప్తూ వచ్చిన అతణ్ణి పరిశీలనగా చూస్తూ కనుబొమ్మలు పైకెత్తారు.


”అవును పెరియావ” సమాధానమిచ్చాడు ఆ యువకుడు.


మహాస్వామి వారు నవ్వుతూ “భేశ్! ఉన్నతమైన వైద్య వంశం మీది. అది సరే నువ్వు నీ పేరు ముందు డాక్టర్ అని పెట్టుకోలేదా?” అని అన్నారు. 


”నేను అది చెదవలేదు పెరియావ. మా తండ్రి గారు నన్ను ఆ మార్గంలో పెంచలేదు” కొంచం నిర్లక్ష్యంగా అన్నాడు. ”నువ్వు అలా చెప్పరాదు. మీ తండ్రిగారు చెప్పించలేదా లేదా నీకే దానిపైన శ్రద్ధ లేదా?”


అతను ఏమి చెప్పలేదు. “అంతటి మహా వైద్యుల వంశంలో పుట్టి నువ్వు నేర్చుకునే భాగ్యం పోగొట్టుకున్నావు. సరే ఎంతదాకా చదువుకున్నావు?” అడిగారు మహాస్వామి వారు. ”తొమ్మిది దాకా పెరియావ”


“ఏం మరి చదువుకోవాలని అనిపించలేదా?”


“ఏమో నాకు అప్పుడు అనిపించలేదు. కాని ఇప్పుడు చింతిస్తున్నాను.”


“నీకు వివాహం అయ్యిందా?”


“అయ్యింది పెరియావ. మాకు ఏడు సంవత్సరముల కూతురు ఉంది”


“సరే. ఇప్పుడు ఏమి చేస్తున్నావు?”


అతని కళ్ళల్లో నుండి నీరు జారసాగింది. “నాకు మంచి చదువు లేకపోవడం వల్ల మంచి ఉద్యోగం లభించలేదు పెరియావ. నేను ఒక రైస్ మిల్లులో సూపర్వైజర్ గా పనిచేస్తున్నాను. నా జీతం ఏడు వందల రూపాయలు. దాంతోనే మా కుటుంబం గడుస్తోంది.”


“ఓహో అలాగా? సరే నీకు మీ పూర్వీకులు స్వంత ఇల్లు వదిలివెళ్ళారా?”


అతను కళ్ళు తుడుచుకుంటూ “మా తాత గారు ఒక ఇంటిని కట్టించారు. నేను ఇక్కడకి రావటం ఆ ఇంటి గురించే పెరియావ. కాలా ఏళ్ళ క్రితం మా అత్తయ్య (నాన్న గారి చెల్లెలు) భర్త చనిపోవడంతో తన ఇద్దరు కూతుళ్లను తీసుకుని పాలక్కాడ్ వచ్చింది. నవరాత్రులప్పుడు మా నాన్న గారు మేము ఉన్న ఇంటిని 25వేల రూపాయలకు తకట్టుపెట్టారు. మా అత్తగారి పిల్లల పెళ్ళిళ్ళు చేసారు. తరువాత మా నాన్న మా అత్త ఇద్దరూ కాలం చేసారు.”


“పెరియావ నా బాధ ఏంటంటే నవరాత్రి సమయంలో లక్ష్మీకారకం అయిన ఇంటిని తాకట్టు పెట్టి పోయారు. ఇప్పుడు ఆ అప్పు 45వేల రూపయలు అయ్యింది. ఇక ఇల్లు నా నుండి వెళ్ళీపోతుంది”

పరమాచార్యస్వామి వారు ధ్యానంలోకి వెళ్ళారు. కొద్దిసేపటి తరువాత చిరువవ్వుతో “సరే ప్రతి నవరాత్రికి నువ్వు ఇంట్లో బొమ్మల కొలువు పెద్తున్నావు కదూ?”


“లేదు పెరియావ. మా తండ్రి గారు ఉన్నప్పుడు పెట్టేవారం. వారు వెళ్ళీపోయిన తరువాత నేను పెట్టడంలేదు.”


మహాస్వామి వారు అడ్డుపడుతూ “పూర్వీకుల గురించి నువ్వు అలా మాట్లాడకూడదు. వారు చాలా గొప్పవారు. నాకు తెలుసు. వారు చాలా మంచి పనులు చేసి వెళ్ళిపోయారు. నువ్వు మనసులో ఏదో పెట్టుకుని తరతరాలుగా వస్తున్న ఆచారాలను వదలరాదు. మరొక్క వారంలో నవరాత్రి మొదలు అవుతుంది. పాలక్కాడ్ లోని మీ ఇంటిలో బొమ్మలు కొలువు పెట్టి దేవిని ఆరాధించు. నీ కష్టాలు తీరి ఊరట లభిస్తుంది.” అని చెప్పి అతనికి ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించి పంపించారు. 


ఇరవై రోజులు గడిచాయి. ఆ రోజు ఆదివారం. సతారా లో మహాస్వామి దర్శనార్థం చాలా మంది భక్తులు వచ్చారు. శ్రీ మఠం పరిచారకుడు ఒకరు ఆ భక్తుల మధ్యలో త్రోవ చేసుకుంటూ ఒక 60 65 సంవత్సరముల వయస్సు ఉన్న ఒక పెద్దాయనను తీసుకుని వచ్చారు. వారు కాషాయ వస్త్రములు ధరించి మెడలో ఎన్నో తుళసి రుద్రాక్ష మాలలు ధరించి ఉన్నారు. వారు మహాస్వామి వారికి సాష్టాంగం చేసి హిందీలో మాట్లాడారు. పరమాచార్య స్వామి వారు కూడా అతనితో హిందీలో మాట్లాడి తమ ఎదురుగా ఉన్న వేదిక పైన కూర్చోమన్నారు.కొద్దిసేపటి తరువాత పాలక్కాడ్ హరిహర సుబ్రమణియన్ వచ్చి మహాస్వామి వారికి నమస్కరించాడు. అతని చేతిలో చిన్న ట్రంకు పెట్టె ఉంది. మహాస్వామి వారు అతణ్ణి అతని చేతిలోని ట్రంకు పెట్టెని చూసారు. ఆ యువకుడు ఆ దబ్బా తెరిచి అందులో ఉన్న పట్టు బట్టలో చుట్తబడియున్న కొన్ని తాళపత్రాలను బయటకు తీసాడు. మహాస్వామి వారు ఏమి తెలియనట్టు ఏంటవి? అన్నాట్టుగా చూసారు. 


అతను అమాయకంగా “మీరు ఈ సంవత్సరం నుండి బొమ్మల కొలువు పెట్టమని నాకు అనుజ్ఞ ఇచ్చారు. నేను బొమ్మల కోసం వెతికితే నాకు ఈ డబ్బా దొరికింది. నేను ఎప్పుడూ దీన్ని చూడలేదు. నేను తెరచి చూసి అందులో ఉన్న భాష అర్థం కాక ఇక్కడకి తెచ్చాను.” 


మహాస్వామి వారు నవ్వుతూ తమ ఎదురుగా కూర్చొని ఉన్న ఆ కాషాయ వస్త్రధారిని చూసి హిందీలో “కొద్దిసేపటి ముందు నువ్వు నన్ను అడిగిన ఆ అపూర్వ వస్తువు వచ్చింది. వచ్చి చూడు” అని అన్నారు. అతను కింద కూర్చుని ఆ తాళ పత్రాలను నిశితంగా పరిశీలించసాగాడు. అతని మొహం ఆనందమయమైంది. వాటిని ఎత్తుకుని తలపై ఉంచుకొని ఆనందంతో గట్టిగా “ఓ పరమ ఆచార్య పురుషా! ఈ అపూర్వ అయుర్వేద గ్రంథం కోసం ఎన్నో ఏళ్ళుగా వెతుకుతున్నాను. నువ్వు ప్రత్యక్ష దైవానివి. అరగంటలో నేను అడిగినదాన్ని నాకు ప్రసాదించావు. నేను ధన్యుణ్ణి.” అని పరమాచార్య స్వామి వారికి సాష్టాంగ నమస్కారం చేసాడు.


హరిహర సుబ్రమణియన్ ఏమి అర్థం కాక నిలుచుండిపోయాడు. మహాస్వామి వారు దగ్గరకు పిలిచి “ఇతను పండరీపురం నుండి వచ్చిన ఆయుర్వేద సిద్ధాంతి. అరగంట క్రితం తను ఒక అపూర్వ గ్రంథం కోసం వెతుకుతున్నానని నాతో చెప్పాడు. నా మనస్సుకు ఏదో తోచినట్టయ్యి కొద్దిసేపు వేచియుండమని చెప్పాను. తరువాత నువ్వు ఈ ట్రంకు పెట్టెతో వచ్చావు. వారికి ఇవి ఉపయోగపడతాయి. నీ తండ్రిని తాతని తలచుకొని నీ చేతులతో వాటిని ఆయనకు ఇవ్వు” అని ఆజ్ఞాపించారు. 


ఆ యువకుడు వారు చెప్పినట్టే చేసాడు. వాటిని తీసుకుంటున్నప్పుడు ఆ పెద్దమనిషి కళ్ళలో ఆనందభాష్పాలు కారాయి. అతను ఆ యువకుడితో “నీ వల్ల నాకు అపూర్వ గ్రంథము దొరికింది. దానికి వెల నేను కట్టలేను. అలాగని ఈ అపూర్వ సంపదని ఉచితముగా తీసుకోలేను” అని ఒక పళ్ళెంలో యాభైవేల రూపాయలు, పళ్ళు ఉంచి వినయంగా ఇచ్చాడు. ఆ యువకుడు మహాస్వామి వారి వంక చూసాడు. వారు చిరునవ్వుతో తీసుకుమ్మన్నారు. వణుకుతున్న చేతులతో అతను దాన్ని అందుకున్నాడు.


మహాస్వామి వారు దగ్గరకు పిలిచి “నువ్వు నీ పూర్వీకుల గురించి తప్పు గా మాట్లాడినప్పుడు నేను నీకు ఏమి చెప్పానో గుర్తుందా? వారు చాలా గొప్పవారు. చాలా మంచి పనులు చేసారు. చూసావా బొమ్మల కొలువు పెట్టమన్నందుకు నీకు ఇది దొరికింది. ఇంటి అప్పు 45వేలు అన్నావుగా! చంద్రమౌళీశ్వరుడు నిన్ను అనుగ్రహించాడు. పాలక్కాడ్ కి తిరిగి వెళ్ళు. డబ్బు జాగ్రత్త” అని చెప్పి అశీర్వదించి పంపించారు.


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


https://t.me/paramacharyavaibhavam


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

14, మార్చి 2022, సోమవారం

నిమ్మకాయతో చికిత్స

 నిమ్మకాయతో చికిత్స  - 


  అజీర్ణం  ( Dyspepsia ) - 


   గుండెల్లో మంటకు , పులిత్రేపులకు నిమ్మపండు మంచి మందు. కొద్దినీటిలో ఒక చెక్క నిమ్మరసం కలిపి దానిని ఒక మోతాదుగా పుచ్చుకొనవలెను.దీనివలన జీర్ణాశయం గోడలు శుభ్రం అగును. ఉపవాసం ఉన్నప్పుడు కాని , జీర్ణకోశం ఖాళీగా ఉన్నప్పుడు కాని నిమ్మరసం సేవించవలెను. 


  మలాశయం బాధ  ( Bowel Trouble ) - 


    నిమ్మరసం అతిసారం , అతివిరేచనమును కట్టును. నిమ్మపండు నిజరసమును గాని కొంచం నీటితో కాని ఆసన మార్గము ( Enema ) ద్వారా పంపించిన కలరా , ఆమపాతం ( Macocolitis ) , ఆంత్రభ్రంశము ( prolapse of the bowels ) మొదలుగా గల కఠినమగు పేగు బాధలు నివారణ అగును. ఇంతే కాకుండా ఆమపాతంతో కూడిన శీతబేది ( Dysentry with slonghing of the mucous membrens ) అనగా జిగట విరేచనాలు తీవ్రమయిన ఈ జబ్బుతో రోగికి 12 ఔన్సుల మోతాదు ఇవ్వవలెను.


 స్థూలకాయం  ( Obesity ) - 


    నిమ్మనీరు కాని , ఉడికించిన నిమ్మ పండ్లు కాని అతి స్థూలకాయమునకు మంచి మందు. మూడు నాలుగు గ్లాసుల తీపి కలపని నిమ్మనీరు కాని దానికి సరిపోవు పూర్తి పండ్ల పదార్ధం కాని దినదినము పుచ్చుకొనవలెను . దీనితో పాటు మితముగా భుజించుటయు , మధ్యాహ్నం రెండు గంటల తరువాత భోజనం చేయకుండా ఉండుట అభ్యాసం చేయవలెను . మధ్యాహ్నం 2 గంటల తరువాత తినిన ఆహారం అతిగా కొవ్వును పెంచును. అదే విధముగా శరీరం నందు నీరు , అంతర్మలములు     ( Waste Poisons ) కూడా పెంచును. వీటన్నిటిని నిమ్మరసం తొలిగించును.


 ముఖ సౌందర్యం  ( cosmetic ) - 


   సామాన్యంగా ముఖము పైన దీనిని వాడినప్పటి కంటే లొపలికి తీసుకున్నప్పుడు అద్భుతంగా పనిచేయును. నిమ్మకాయ చెక్కని తలపైన రుద్దిన చుండ్రు ( Dandruff ) పోవును . మొటిమలు         ( acne spots ) , శరీర నిగారింపు ( oily skin ) కలవారు నిమ్మరసం వాడుట చాలా మంచిది. ముఖం పైన , చేతుల పైన మచ్చలు , వాపు , గజ్జి వంటివాటిని నిమ్మరసం పోగోట్టును . 


  చలి జ్వరం  - ( Maleria ) 


     నిమ్మరసం పాలు కలపని కాఫీ లో ఇచ్చిన సమర్ధవంతంగా పనిచేయను. కాలిక వ్యాధులు        ( Chronic Disorders ) అన్నింటిలో పండు పదార్థం వాడినంతను అద్భుతంగా పనిచేయను.నిమ్మ తొక్కలో క్రిమిసంహారకం అగు నూనె , నిమ్మ కాయ దూది యందు స్వాభావిక జీర్ణం అగు సారములు ఎన్నొ కలవు. చాలాకాలం నుంచి చలి జ్వరమునకు , రొంపలకు ముందుగా వాడుచున్న సింకోనా క్వయినా తయారగు చెట్టు బెరడును ఉండు గుణములు అన్నియు దీనియందు కలవు. 


   అపస్మారం వల్ల కలిగిన గుండెదడ కి 15 గ్రాములు నిమ్మరసం ఇచ్చిన నిమ్మళించును.


 రక్తస్రావం  - 


    శ్వాసకోశములు ( Lungs ) , అన్నకోశం , ప్రేగులు మూత్రపిండములు మొదలగు వాటినుండి లోపల భాగాలలో రక్తస్రావం అవుతున్నప్పుడు నిమ్మరసం ఇవ్వవలెను.  ఉప్పు కలిపి రోజుకి ఒక నిమ్మకాయ తినుచున్నచో ప్లీహవృద్ధి అనగా Enlargement of Spleen కడుపులో బల్ల పెరుగుట హరించును. 


    నిమ్మతైలము ని మర్దన కొరకు వాడవచ్చు. 


  దంతశుద్ధి  - 


     దంతములు బలహీనంగా గాని , రంగుమారి కాని ఉన్నచో వాటిబాగుకై పేస్ట్ వాడరాదు. అవి హానిచేయును. అటువంటి సమయాలలో నిమ్మపండ్ల రసంలో తడిపిన కట్టెబొగ్గు లేదా నీళ్లతో పలుచన చేసిన నిమ్మపండ్ల రసం. కాని ఇది వాడిన తరువాత నీటితో నోరు బాగా పుక్కిలించవలెను. చిగుళ్ల వాపుకు , నోటి పూతకు నిమ్మకాయ రసమును నీటిని సమాన భాగాలుగా తీసుకుని పుక్కిటబట్టుట మంచిది.


           మరెంతో విలువైన మరియు అతి సులభ  యోగాలకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 

    


   గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            కాళహస్తి వేంకటేశ్వరరావు 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు .


              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                          9885030034