24, జూన్ 2023, శనివారం

శాస్త్రీయ విధానాన్ని

 ఎసోఫెగస్ (Esophagus ) అనేది మన గొంతుని పొట్టకు కలిపేటువంటి ఒక ట్యూబు. ఇది కండరాలతో నిర్మితమై వుండి, ఎప్పుడూ మూసుకునే ఉంటుంది. ఆహారం లోనికి తీసుకునేటప్పుడు మాత్రం తెరుచుకుని మళ్ళీ వెంటనే మూసుకుపోవాలి. అలా మూసుకుని జీర్ణాశయంలో ఉన్న ఏసిడ్, ఆహారాలను బయటకు రాకుండా ఆపి రక్షిస్తూ ఉంటుంది. ఏసిడ్ బయటకి లీక్ అయ్యి వస్తే దాన్నే మనం ఎసిడిటీ అంటాము. 


భోజనం చేసే ముందు ఈ ఎసోఫెగస్  సాఫీగా తెరుచుకోవడానికి బ్రాహ్మణులు చేసే "ఆచమనం" అనే పద్దతిని అందరూ పాటించాలి. పరిశీలిస్తే ఈ ఆచమనం అనే ప్రక్రియ ఒక శాస్త్రీయ దృష్ఠితో అలవరచుకున్న ఆరోగ్యకరమైన విధానం అని తెలుస్తుంది. కొందరు అనుకున్నట్టు ఒక మూఢాచారం కాదు. కొంచెం నీరు తీసుకుని ఆహారం మొదలుపెడితే  ఎసోఫెగస్‌కి లూబ్రికేషన్ జరుగుతుంది, ఆహారం సాఫీగా పొట్టలోకి జారుతుంది. అంతేనా? ఆలాగైతే ముందుగా కాస్త నీళ్ళుతాగి భోజనం చెయ్యమని చెప్పచ్చుగా? కేశవ నామాలు దేనికి అని అనుమానం రావచ్చు. ఈ ఆచమనం భోజనం చేసే ముందే కాదు, ఏ పూజచేసేటప్పుడైనా కూడా చేస్తారు.   అన్నిటికీ కలిపి ఒకే ప్రాసెసుని మనకు నేర్పారు అన్న విషయాన్ని మనం గమనించుకోవాలి. 


గొంతులో ఎసోఫెగస్ ఒక్కటే కాదు. సున్నితమైన శ్వాసనాళము, స్వరతంతంత్రులు వంటివి అనేకం ఉంటాయి. మంత్రోచ్చారణ చేయడానికి ముందు వాటికి కూడా కొంచెం ఒక నిర్ధిష్థపద్దతిలో వ్యాయామం (వార్మ్ అప్) అవసరం. దానికి భగవన్నామాలతో మొదలు పెట్టమన్నారు. అదీ ఏ నామం పడితే అది అని చెప్పలేదు. కేశవ, నారాయణ, మాధవ అని మాత్రమే అనమన్నారు. 


ఎందుకంటే, "కేశవ" నామం గొంతులోనుంచీ వస్తుంది. "నారాయణ" నామం నాలిక సహాయంతో వస్తుంది. "మాధవ" నామం పెదాల సహకారంతో వస్తుంది.  అంటే నోటిలో అన్ని భాగాలకూ ఒక ఎక్సర్సైజు అన్న మాట.


మరి నీళ్ళు చేతిలో పోసుకుని నోట్లో ఎందుకు పోసుకోవాలి? ఉద్ధరిణితో నేరుగా నోట్లో పోసుకోవచ్చుకదా? మన చేతిలో ఎప్పుడూ కొంత విద్యుత్తు (స్టాటిక్ పవర్) ఉంటుంది. ఆ చేతితో నీరు పోసుకుని మింగితే, దానితో చేతిలో ఉన్న విద్యుత్తు, నోటిలోకి పొట్టలోకి ప్రవహించి  అన్నిటినీ ఉత్తేజపరచి, సమతుల్యం చేస్తుంది. దానితో ఆహారం స్వీకరించడం తేలికవుతుంది. అలాగే కంఠంలో ఉన్న స్వరతంతంత్రులు కూడా ఉత్తేజితం అవుతాయి. ఇది ఒక దృక్పదం. కొందరు మరొక విధంగా చెప్పవచ్చు. కానీ ఈ విధానంలో ఒక శాస్త్రీయత (మనకి పూర్తిగా అర్థం కాకపోయినా) కనిపిస్తుంది.


ఇలాగే ఇంకా మనలో చాలా ప్రశ్నలు సహజంగానే రావచ్చు. వస్తాయి. రావాలి. ఐతే అన్నిటికీ మనకు సమాధానం వెంటనే దొరుకకపోవచ్చు. అంటే దాని వెనుకనున్న నాలెడ్జిని మనం కోల్పోయాము. కనుక తిరిగి సంపాదించుకోవాలి అని ప్రయత్నిస్తే, సమాధానాలు అన్నీ ఒకరోజుకి దొరుకుతాయి. 


PS: ఒక శాస్త్రీయ విధానాన్ని సింపులుగా మూఢనమ్మకం అని కొట్టేయడాన్ని మించిన మూఢనమ్మకం మరొకటి వుండదేమో.



 


 


 


 


 

నమస్కారం విలువ

 *_🙏నమస్కారం విలువ.. ఎంతో తెలుసా!?🙏_*

_[ప్రస్తుతం సమాజంలోని అనేక సమస్యలకు మూల కారణం ఒకరి నొకరు గౌరవించుకోక పోవడమే! అహంకారం వదిలి, ఎదుటి వారిని చులకనగా చూడడం వలన అనర్థాలు జరుగు తున్నాయి.]_

 *===(((🙏🙏🙏)))===*


*మహాభారత యుద్ధ సమయంలో "మీరు పక్షపాతంగా యుద్ధం చేస్తున్నారు" అని దుర్యోధనుడు అనిన వ్యంగ్యమైన మాటలకు బాధపడిన భీష్మ పితామహడు _"నేను రేపు పాండవులను చంపుతాను"_ అని ప్రకటించాడు.*

*అంతే... పాండవుల శిబిరంలో ఆందోళన పెరిగింది. భీష్ముని సామర్ధ్యం గురించి అందరికీ తెలుసు కాబట్టి, జరగబోయే పరిణామాల గురించి భయంతో కలవరపడ్డారు. అప్పుడు.. శ్రీ కృష్ణుడు తన వెంట ద్రౌపదిని తీసుకొని భీష్ముని శిబిరానికి వెళ్ళాడు.*

*తను బయటే నిలబడి ద్రౌపదితో "నీవు వెళ్లి భీష్మునికి నమస్కరించు, ఆయన _"అఖండ సౌభాగ్యవతీ భవ"_ అని ఆశీర్వదిస్తాడు. తర్వాత జరిగేది గమనించు అన్నాడు.*

*ద్రౌపది అలానే చేసింది, భీష్ముడు దీవించి, "ఏంటమ్మా! ఇంత రాత్రి ఒంటరిగా వచ్చావు. నిన్ను కృష్ణుడు తీసుకు వచ్చాడు కదా!" అన్నాడు.*

*దానికి ద్రౌపది "అవును తాతయ్యా..! అన్న శిబిరం బయట నిలబడి ఉన్నారు" అనింది. భీష్ముడు బయటకు వెళ్ళగా.. ఇద్దరూ ఒకరికి ఒకరు నమస్కరించు కున్నారు.*


*వెంటనే భీష్ముడు.. "నాకు తెలుసు కృష్ణా, మీరు ఇలా చేస్తారని. ప్రతిజ్ఞ కన్నా దీవెనకు ప్రభావం ఎక్కువ. నేను పాండవుల జోలికి రాకుండా ఉండేందుకు ఇలా చేయండి" అని ఒక మార్గం ఉపదేశించాడు.*


*శిబిరం నుండి తిరిగి వస్తున్నప్పుడు, శ్రీ కృష్ణుడు ద్రౌపదితో "నీవు వెళ్లి భీష్మునికి నమస్కరించడం ద్వారా నీ భర్తలు జీవితాన్ని పొందారు".*

*"ఇలాగే.. నీవు ప్రతిరోజూ భీష్ముడు, ధృతరాష్ట్రుడు, ద్రోణాచార్యుడు లాంటి పెద్దలకు నమస్కరిస్తూ ఉండు. అలాగే దుర్యోధనుడు, దుశ్శాసనుడి భార్యలు కూడా ఆ పెద్దలతో పాటు పాండవులకు కూడా నమస్కరిస్తూ ఉంటే బహుశా ఈ యుద్ధం ఆగిపోవచ్చు. ఒక్క నమస్కారానికి అంతటి భాగ్యం కలుగుతుంది" అన్నాడు.*


*👌ఇంటిలోని పిల్లలు మరియు కోడళ్లు ప్రతిరోజూ ఇంటి పెద్దలకు నమస్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకుంటే ఆ ఇంటిలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. పెద్దల ఆశీర్వాదాలు కవచం లాగా పనిచేస్తాయి.*

*ఎందుకంటే...*


*🙏నమస్కారం ప్రేమ.*


*🙏నమస్కారం క్రమశిక్షణ.*


*🙏నమస్కారం చల్లదనం.*


*🙏నమస్కారం గౌరవాన్ని నేర్పుతుంది.*


*💠నమస్కారం మంచి ఆలోచనలను ఇస్తుంది.*


*💠నమస్కారం సంస్కారాన్ని నేర్పుతుంది.*


*💠నమస్కారం కోపాన్ని తొలగిస్తుంది.*

 

*💠నమస్కారం కన్నీళ్లను కడిగివేస్తుంది.*


*🔶ఎక్కడ సజ్జన సాంగత్యం లభిస్తుందో అక్కడ ప్రతిభ ఇనుమడిస్తుంది. మంచి సంస్కారాలు అలవర్చుకొంటే తరతరాలుగా వంశాభివృద్ధి  జరుగుతుంది.*

_(శ్రీ శిష్ట్లా తమ్మిరాజు గారి సౌజన్యముతో... 🙏)_ 

_🙏🙏🙏ఇదీ మరి నమస్కారం విలువ అంటే..._🙏🙏🙏

సన్యాసి సంకల్పం

 సన్యాసి సంకల్పం


ఒకసారి పరమాచార్య స్వామివారు ఆంధ్ర దేశంలోని కర్నూలులో చాతుర్మాస్యం చేస్తున్నారు. పరమాచార్య స్వామివారిని సాక్షాత్ ఈశ్వర స్వరూపంగా భావించే శ్రీ జనార్ధనానంద సరస్వతి అనబడే సన్యాసి ఒకరు ఈ పుణ్యదినాలలో మహాస్వామివారితో గడపాలని నిశ్చయించుకున్నారు. వారు పాదయాత్రగా విజయావాడ నుండి బయలుదేరి వస్తున్నారని మహాస్వామి వారికి కబురందింది.


ఆ విజయవాడ స్వామి పాదయాత్ర మొదలుపెట్టిన రెండు మూడు రోజులకి, పరమాచార్య స్వామివారు మఠంలో పనిచేస్తున్న శ్రీ ఏకాంబరం మరియు శ్రీ మెట్టూర్ రాజులను ఒక కారులో విజయవాడ వెళ్లవలసినదిగా ఆదేశించారు. అలాగే పూజ్యశ్రీ విజయవాడ స్వామివారిని కలిసి వారిని కారులో ఇక్కడికి తీసుకురావలసిందిగా చెప్పారు.


అక్కడున్న భక్తులు ఈ మాటలను విని అయోమయంలో పడ్డారు. సన్యాసులు కారులో తిరగడం మహాస్వామివారు ఎన్నటికి ఒప్పుకోరు. అలా చెయ్యమని ఆదేశించరు కూడా. ఎందుకంటే అది సన్యాస ధర్మానికి విరుద్ధం కనుక.


ఆ విజయవాడ స్వామివారిని ఎలా కలుసుకోవాలో వీరికి తెలియదు. జనార్ధనానంద సరస్వతి స్వామివారు తమ పర్యటనకు ముందుగానే ప్రణాళిక వేసుకోలేదు కనుక వార్తాపత్రికలలో కూడా ఎక్కడా సమాచారము లేదు. వారిద్దరూ గుంటూరు చేరుకొని చుట్టుపక్కల ప్రాంతాలలో వెదకసాగారు. చివరికి వారికి ఆ స్వామివారు శివాపురం అనే ఒక చిన్న గ్రామంలో తారసపడ్డారు.


వచ్చినవారి నోటివెంట పరమాచార్య స్వామివారి ఆదేశాన్ని వినగానే విజయవాడ స్వామివారు అమితాశ్చర్యానికి లోనయ్యారు. ఆనందంతో, సంభ్రమాశ్చర్యాలతో పరమాచార్య స్వామివారిని సాక్షాత్తు ఆ కైలాస వాసి పరమేశ్వరుడే అని వేనోళ్ళ కొనియాడారు.


మహాస్వామివారిని దర్శించాలనే కోరికతో ఆ ముందురోజు వరకూ కర్నూలు వైపు పాదయాత్ర చేశారు. హటాత్తుగా కాలినరం ముడిపడి ఇబ్బంది పెట్టడంతో శివపురంలో ఆగవవలసి వచ్చింది. చాలా ఆందోళన చెందిన స్వామివారు మహాస్వామి వారిని ఇలా కొనియాడారు. “ఈశ్వరా! కైలాసనాథుడవైన నీకు కనీసం ఒక ముసలి ఎద్దు అయినా వాహనంగా ఉంది. కానీ ఇప్పుడు కంచినాథుడుగా, పరమాచార్యులుగా వచ్చిన నీవు, ఉన్న ఆ ఎద్దును కూడా వదిలిపెట్టి మొత్తం దేశం అంతా పాదచారియై తిరగడానికి నిర్ణయించుకున్నావు”


వారు చికిత్స తీసుకుని పాదయాత్రగానే కర్నూలుకు వెళ్లాలని నిర్ణయించుకుని ఉంటే వారు తడుపారు చాతుర్మాస్యానికే చేరేవారు. విజయవాడ స్వామీ బాధను చూసి మహాస్వామివారే వారికి చేయూతనివ్వదలచి వారిని పిలుచుకుని రావడానికి కారుని పంపారు. వారు సాక్షాత్ శంకరావతారులు కాబట్టే ఇది స్వామివారికి సాధ్యమైందని గ్రహించారు జనార్ధనానంద సరస్వతి స్వామి.


కాలినెప్పితో బాధపడుతున్న స్వామివారు అతికష్టంపై కారు ఎక్కి కూర్చున్నారు. కర్నూలుకు ప్రయాణించి పరమాచార్య స్వామివారి దివ్యసన్నిధికి చేరుకున్నారు. చాతుర్మాస్య సంకల్పంతో పాటు వారి కాలి నరం బాధను కూడా మహాస్వామివారు కరుణతో తొలగించారు.


--- ‘ప్రదోషం మామ గృహం న్యూస్ లెటర్’ నుండి


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

సౌందర్యలహరి- 22

 సౌందర్యలహరి- 22 - “భాస్కర ప్రియ”

సౌందర్యలహరి- 22


భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం

ఇతి స్తోతుం వాంచన్కథయతి భవాని త్వమితి యః |

తదైవ త్వం తస్మై దిశసి నిజసాయుజ్యపదవీం

ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పదామ్ || 22


తల్లీ, భవాని! నేను నీ దాసుణ్ణి, నీ కృపా కటాక్ష వీక్షణం నాపై ప్రసరింపజేయుము అని ఉపాసకుడు ప్రార్థించినంతనే, అతడికి, ముకుందబ్రహ్మేంద్రులు తమ రత్నకిరీటాలచేత నీరాజనం గావించబడే  నీ పాదపద్మాల యొక్క సాయుజ్యాన్ని కల్పిస్తున్నావు.

శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్,

నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం.


  భాస్కర ప్రియ  (భాస్కరానందనాథ  భావము)

చాలా అత్భుతమైన శ్లోకము. ఆచార్యులు వారు మనకు దేవతార్చనలో నిత్యం చదువుకొనేదానికి ఇచ్చిన గొప్ప శ్లోకము ఇది. ఆత్మార్పణము అంటే ఏమిటి, శరణాగతి అంటే ఏమిటి  అనేది మనకు ఈ శ్లోకము ద్వారా నేర్పిస్తున్నారు.

భవాని త్వం.... భవానీ నీవు ....అని  అనీ అనే లోపల అమ్మ మనకు మోక్షం ఇచ్చేస్తుంది అట. అది ఎలాగో చూస్తాము.

భవానిత్వం అంటే  మోక్షత్వం.  భా అంటే ప్రకాశించునది. కాంతివంత మైనది. శుద్ధ తత్త్వం లోనే, సత్వ గుణం తోనే  ఆత్మ ప్రకాశిస్తూ వుంటుంది.   సదా ప్రకాశిస్తూ ఉండడమే మోక్షత్వం లో వుండడం. భవానిత్వం అంటే  మోక్షత్వం, మోక్షత్వం అంటే ప్రకాశించడం అని అర్ధం. కర్మలు లేకుండా వుండడటమే ప్రకాశించడము.

మోక్షం దేని నుంచి అంటే కర్మ నుంచి. కర్మ నుంచి విముక్తి పొందడమే మోక్షం. కర్మలు లేకుండా ఉండడమే  కైవల్యము.

భ అంటే భవము. అంటే సంసారము. సంసారము నుంచి విముక్తి ప్రసాదించేది గనుక భవాని.


భవస్య పత్నీ భవానీ, భవుని భార్య భవాని.  

భవతి భవతేవా సర్వమితి భవః.....అంతయూ తానైన వాడు.   అంతయూ నిండిన వాడు. భవుడు అంటే శివుడు. మహాదేవుడు.

భవము  అంటే పుట్టుక, సంసారము, ప్రాప్తి, శుభము  అని కూ



ఇలాంటి మరిన్ని పోస్ట్‌లను చూడటానికి మరియు తెలంగాణ బ్రాహ్మణ సే�


 

సాలగ్రామం_అంటే_ఏమిటి

 #సాలగ్రామం_అంటే_ఏమిటి......!!


సాలగ్రామం అనేది ఒక రకమైన రాయి. అయితే, ఇది ఓ పురుగువల్ల.. అంటే ఓ జలచరం వల్ల తయారౌతుంది అంటే అతిశయోక్తి కాదు. సాలాగ్రామాలు చాలా చాలా అరుదైనవి. ఇవి నర్మదానదిలో దొరుకుతాయి. అలాగే ఖాట్మండు నగరానికి ఉత్తరాన గండకీనదిలో దొరుకుతాయి. ఈ గండకీనది తీరంలో ”ముక్తినాథం” పేరుతో సాలగ్రామం ఉంది. ఈ ప్రాంతాల్లో మాత్రమే సాలగ్రామాలు దొరుకుతాయి. మరెక్కడా ఇవి లభ్యం కావు.


సంస్కృతంలో ”శిలగా మారిన శలభమే సాలగ్రామం” అంటూ నిర్వచనం చెప్తారు. సాలగ్రామం ఎంత ఎక్కువ సంవత్సరాలు గడిస్తే అంత మహత్తరమైంది. అలాగే, ఎంత చిన్నది అయితే అంత గొప్పది. కాలం గడిచిన తర్వాత సాలగ్రామానికి ఔషధ గుణాలు వచ్చి చేరతాయి.


ఒక విధమైన పురుగు సాలగ్రామంగా రూపొందుతుంది. అయితే కొన్ని వేల సంవత్సరాలు గడిచిన తర్వాత మాత్రమే అది రాయిలా గట్టిపడుతుంది. రసాయనికంగా చూస్తే సాలగ్రామం సిలికాన్ డయాక్సైడ్. దీనికి చెకుముకి రాయి లక్షణాలు ఉంటాయి. గట్టిపడకముందు సాలగ్రామంలో సున్నపు లక్షణం ఉంటుంది.


సాలగ్రామం విశిష్ట శిలారూపం. ఇవి వేల, లక్షల సంవత్సరాలు యథాతథంగా ఉంటాయని రుజువైంది. నీళ్ళలో ఉండే ఒక జీవి సుదీర్ఘకాలం తర్వాత సాలగ్రామంగా రూపాంతరం చెందుతుంది. అంటే ఇది జరాసిక్ టెతీన్ కాలానికి చెందినది.


సాలగ్రామం సంపాదించి, దేవుడి మందిరంలో ఉంచుకుంటే ఎంతో మంచిది. దీన్ని నియమనిష్టలతో పూజించాలి. ఏ మంత్రాలూ రానివారు మనసునే అర్పించుకుంటూ ప్రార్ధించాలి. సాలగ్రామం ఒకవేళ పగిలిపోయినా, దాని విలువ తగ్గదు. సాలగ్రామాన్ని అభిషేకించిన నీటిని సేవించడం శ్రేష్టం.

 



 

 వాట్సప్ లో వచ్చిన తప్పులన్నీ పునరావృతమౌతున్నాయి. సరే అది అటు ఉంచుదాం. వరరుచి సిధ్ధాంతకౌముది-అనేవ్యాకరణంలో వార్తికకారుడు.

చక్కని సంస్కృత పరిణతికలవాడు.అతడు అర్ధాలకోసం దేశాలు పట్టుకుతిరగటం.విక్రమార్కుడు.ఇవన్నీ కట్టు కథలు.

     అసలాశ్లోకానికి 18 అర్ధాలున్నాయా?పండితులతో చర్చించటం జరిగింది.

  1రామాయణపరంగా-

హేతాత!-ఓనాయనా! 

రామం-రాముని,

దశరథంవిధ్ధి-దశరధుడనుకో,

జనకాత్మజాం-జానకిని

మాం విధ్ధి-నేననుకో

అటవీం- అడవిని

అయోధ్యాం విధ్ధి-అయోధ్యయనుకో

యధాసుఖమ్-సంతోషంగా ,

గఛ్ఛ-పోయిరా,

నాయనా లక్మణా!రాముడు మీనాన్నే అనుకో,సీతను మీయమ్మేఅనుకో,అడవే అయోధ్యయనుకో , ఉత్సాహంగాపోయిరా!

అని రామాయణకధాపరంగా అర్ధం.

   ఇదిగాక,

రామందశరథంవిధ్ధి-రాముని విష్ణువనుకో.

    జనకాత్మజను మాం లక్ష్మి అనిభావించు.

అని వారియవతారస్వరూపములను తెలియజెప్పుట

రెండవయర్ధము.

      ఇంతకు మించి కృతకముగా అర్థప్రకల్పనమొనరింపయోగ్యముగాదు.కావున పైపోస్టులోని 18 అర్థములనుమాట పొసగదు.🙏🙏

నిత్యాన్వేషణ

 నిత్యాన్వేషణ:


రామునికి గల 16 సద్గుణాలు ఏవి?




యుక్త వయసు అమ్మాయిల్ని అందరు దీవించే మాట నీకు రాముడు లాంటి భర్త రావాలి అని..


మన హిందూ పురాణాల్లో అనేకమంది దేవుళ్ళు దేవతా మూర్తులు వున్నారు, కానీ రాముడి లాంటి భర్త రావాలి అని రాముడితో పోల్చడానికి కారణం లేకపోలేదు..


తల్లిదండ్రుల మాటను తచ తప్పక పాటించడం, సోదరులను అత్యంత ఆదరంగా చూడటం, తన భార్యను అత్యంత ప్రేమించడం, తన పాలనలో ప్రజలను తన కన్న బిడ్డల్లా చూడటం, వారికి ఎటువంటి కష్టాలు లేకుండా పాలించడం; దుష్టులను శిక్షించడానికి, ధర్మాన్ని రక్షించడానికి ఎంతదూరమైనా వెళ్ళటం వంటి సద్గుణాలు మూర్తీభవించిన వ్యక్తి; స్త్రీ వ్యామోహం, ధన వ్యామోహం, పదవీ వ్యామోహం వంటి దుర్గుణాలు లేని వ్యక్తి కనిపించడం చాలా అరుదు. కానీ విలువలకు పట్టం కట్టే మన సనాతన భారతదేశంలో ఈ అన్ని గుణాలు కలిగిన వ్యక్తులు అనేకులు ఉన్నారు. కానీ వారందరికీ ఆదర్శం నాటి శ్రీరాముడు.


ఒకానొక సందర్భంలో వాల్మీకి మహర్షి నారద మహర్షిని ‘ఈ భూమిలో ఈ క్రింది 16 లక్షణాలు లేక సద్గుణాలు కల్గిన ఆదర్శపురుషుడు ఎవరైనా ఉన్నారా? అని అడిగారు. ఆ 16 సద్గుణాలు ఇవి :


గుణవంతుడు

వీర్యవంతుడు (ధైర్యవంతుడు)

ధర్మం కలవాడు

కృతజ్ఞత కలవాడు

సత్యాన్ని పలికేవాడు

దృఢవ్రతుడు (శక్తివంతుడు)

చరిత్రను లిఖింపగల యోధుడు

సర్వప్రాణుల హితం కొరుకునేవాడు

విద్వాంసుడు (పండితుడు)

సమర్ధుడు (ప్రావీణుడు)

ఆత్మను ధర్మించేవాడు

జితక్రోధుడు (అందరిని కలిపే గుణం)

ద్యుతిమాన్

అసూయ లేనివాడు

వాస్తవాన్ని గ్రహించేవాడు

యుద్ధ రంగంలో మూర్తీభవించిన ఆగ్రహం కలవాడు.


వాల్మీకి అడిగిన ప్రశ్నకు సమాధానంగా నారదుడు..అన్నాడు. అంతే కాదు మరో 67 గుణాలున్న మహానుభావుడు కూడా ఉన్నాడు. ఆయనే శ్రీరామచంద్రుడు’ అని చెప్పాడు.


రాముడికి ఈ 16 సద్గుణాలు( మంచి లక్షణాలు) ఉండడం చేత, ఆ 16 మంచి లక్షణాలు ఉన్న వరుడై ఉండాలని అందరూ రాముడి లాంటి భర్త రావాలని దీవిస్తారు..