19, సెప్టెంబర్ 2024, గురువారం

Panchaag

 


ఆచార్య సద్బోధన

 .✳️*ఆచార్య సద్బోధన:*✳️

                    ➖➖➖


*ఈ జీవితంలో  సగ భాగం నిద్రలో,     నారీ జన సంగమంతో  వ్యర్థం చేస్తున్నారు.*


*కొంత కాలం బాల్యం మ్రింగుతున్నది.* 


*మరి కొంత కాలం సంసార పోషణకు ధనార్జనలో  పోతున్నది.* 


*ఇలా చూస్తే పరమాత్మను ఆరాధించడానికి అవకాశమే ఉండడం లేదు.* 


*సంసారం, సంతానం, సిరిసంపదలు ఇవన్నీ అశాశ్వతాలు.* 


*శాశ్వతమైనది నారాయణుని అనుగ్రహం.*


*అది సాధించడానికే జీవితాన్ని అంకితం చెయ్యాలి.*


*అది గుర్తుంచుకుని మెసలుకో! శ్రీమన్నారాయణుని మనసులో స్మరిస్తూ అడుగులు వెయ్!*

         *✳️సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*🙏

సంస్కృత వాక్యాలు*

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*వాడుకలోని సంస్కృత వాక్యాలు*

      *వాటి పూర్తి శ్లోకాలు*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

       *"సత్యమేవ జయతే"*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*సత్యమేవ జయతే అనేది ముండక ఉపనిషత్తులోని ఒక మంత్రంలో భాగం.*


*శ్లోకం :~*


*సత్యమేవ జయతే నానృతమ్*

*సత్యేన పంథా వితతో దేవయానః।*


*యేనాక్రమాంతి  ఋషయో హి ఆప్తాకామా।*

*యత్ర తత్సత్యస్య పరమం నిధానమ్॥*


*భావం:~*


*సత్యమే జయిస్తుంది. అసత్యం కాదు. సత్యం వలన దేవతల మార్గం కనిపిస్తుంది. సత్యం వలన మహర్షులు కోరికలు లేని వారై పరమేశ్వరుని పొంద గలుగు తున్నారు. ఈశ్వరుడు సత్య స్వరూపుడు.*


*వ్యాఖ్య:-*


*సత్యం ఒక్కటే జయిస్తుంది. దైవాన్ని చేరుకునేందుకు ఆ సత్యంతోనే మార్గం ఏర్పడుతుంది. నిష్కామమైన రుషులంతా ఆ సత్యమార్గం ద్వారానే పరమాత్మను చేరుకుంటారు,’ అన్నదే పై శ్లోకంలోని భావం. ఇందులోని మొదటి పాదాన్ని పండిత మదన్‌మోహన్ మాలవ్యా ప్రచారంలోకి తీసుకువచ్చారు. స్వాతంత్ర్య సంగ్రామంలో బ్రిటిషర్లను ఎదిరించి ధైర్యంగా నిలిచేందుకు ఈ సూక్తి ఒక మంత్రంలా పనిచేసింది. తర్వాత ఇదే సూక్తిని జాతీయ నినాదంగా రూపొందించారు. మూడు సింహాల రాజముద్ర ఉన్న ప్రతి సందర్భంలోనూ ఈ నినాదాన్ని కూడా ప్రచురించి తీరాల్సిందే అని ప్రభుత్వం ఆదేశించింది.*


*శ్రీ గురుభ్యో నమః।*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*ఓం శాంతిః శాంతిః శాంతిః!*

*సర్వేజనా సుఖినోభవంతు!!*

*ఓం తత్సత్!!*


*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*

*ఓం నమః శివాయ!!!*

🛐🛐🛐🛐🛐🕉️🛐🛐🛐

*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*

🛐🛐🛐🛐🛐🛐🕉️🕉️🛐

హైందవం వర్ధిల్లాలి 5*

 *హైందవం వర్ధిల్లాలి 5*




మన గ్రూప్ లో నాలాంటి సాధారణ సభ్యులతో పాటు ఆధ్యాత్మిక పండితులు, వారి వారి రంగాలలో శిఖరాగ్రాన ఉన్న మరియు విశ్రాంత మాన్యులు, జ్ఞానులు, విజ్ఞానులు ఉండవచ్చును. *మళ్ళీ ఈ బాలశిక్ష పాఠాలు ఎందుకని విస్మయం చెందగలరేమో*, దయచేసి మన దేశంలో *హైందవ ధర్మానికి మరియు ఆచారాలకు విఘాతం కలుగుచున్న ప్రస్తుత ప్రయత్నాలను ఒకసారి అవలోకించగలరు*. 


విధర్మీయమైన/అధర్మయుక్త ఆలోచనలతో, విదేశీయమైన (పాశ్చాత్య) అలవాట్లతో కలుషితమైన మనుష్యుల మనస్సులు ఒక పట్టాన సనాతన ధర్మ ప్రబోధాలను, సాంస్కృతిక సదాచారాలను వంటబట్టిచ్చుకోలేక పోవుచున్నాయి. పైపెచ్చు మన *సమోన్నత సనాతన ధర్మ విలువలను జీర్ణించుకోలేక ఈర్ష్య అసూయలతో మన హైందవ ధర్మనాశనానికి ముప్పేట(ఇస్లాం, క్రిస్టియన్, కమ్యూనిస్టు) దాడి* జరుగుచున్నది.


 అధునాతనులు పెద్దల ప్రవచనాలను అంతరంగమున ఒప్పుకున్నా, బహిరంగంగా వారి స్వప్రయోజనాలు, స్వార్ధము కొరకు దైహిక మరియు మానసిక బలహీనతలకు తల ఒగ్గి విదేశీ సంస్కృతికి లోబడుతూనేఉన్నారు. ధర్మ మరియు దేశ ప్రయోజనాలను ఉపేక్షిస్తున్నారు.


ఆధ్యాత్మిక సాధనకు, వ్యక్తిగత సంస్కారాలకు (ఉపాధి, జీవన యాత్ర ఇత్యాది) మాత్రమే మతాన్ని, ఋజు వర్తనను అన్వయించుకునే హిందువులకు *మతాన్ని రాజకీయము కొరకు మరియు సామాజిక ప్రాబల్యము కొరకు వినియోగించుకునే స్వభావము ఉండదు*. ఈ ధోరణి *అన్యులకు గూడా ఉంటే అన్ని మతాలు, వర్గాలు సామరస్యముతో ఉంటాయి*.


*కాని, ఆలా జరుగడము లేదు*. చరిత్ర చెబుతున్న సత్యమిది. దేశాన్ని ఏలాలనే ఉద్దేశ్యంతో, దేశాభిమానము కల నాయకులపై (పార్టీలకతీతంగా) ప్రత్యర్థి వర్గము వారు, హైందవ ధర్మానికి, దేశానికి హాని కల్గిస్తూనేవున్నారు. *హైందవ వ్యతిరేకతను అడుగడుగునా ప్రత్యక్షంగాకూడా ప్రకటిస్తున్నారు, ప్రదర్శిస్తున్నారు*. 

ఇంతే కాదు కదా దేశ భద్రతను, రక్షణను విస్మరించి కొందరు రాజకీయ నాయకులు ముష్కర మూకలను/విధ్వంసకారులను హద్దు దాటించి మనదేశంలోకి నిస్సిగ్గుగా దొంగ దారిలో ప్రవేశం కల్పించి మితిమీరి బుజ్జగించడము, ఓటు బ్యాంకుగా వాడుకుని 

వారి అకృత్యాలను నిర్లజ్జగా సమర్థిస్తున్నారు గూడా. *క్రమం తప్పకుండా నేటి దేశ సమాచారాన్ని గమనించే వారికి పైవన్నియు కరతలామకములే*.


హిందువులకు ఐకమత్యము పట్ల ధృఢ సంకల్పము, భావన లేదని, రాదని గట్టి నమ్మకము అన్యులకు కల్గుతున్నది. ఇందుకు కారణము ముమ్మాటికీ అధిక భాగము, అధిక శాతము హిందువులే. ఆశ్చర్యకరంగా కొన్ని ప్రసార మాధ్యమాలు కూడా తమ ఉనికి, మనుగడ, అభివృద్ధి నిమిత్తమై ఎవరికీ హాని కూడా తలపెట్టిని *హిందు వ్యతిరేకతను బలంగా, బాహాటంగా చాటుతున్నాయి. సెక్యులర్ అనే పదము వీటన్నిటినీ సమర్థిస్తున్నది, దీనికి సగటు పౌరుడు నిశ్చేష్టుటవుతున్నాడు*. ఈ సెక్యులర్ *అనే పదము దేశ ద్రోహులకు భేదింపబడని కవచము*.


ఈ నేపథ్యంలో దేశ మరియు ధర్మ రక్షణ కొరకు భారతీయులు ముఖ్యంగా *హిందువులు తమ ఐక్యతను, బలాన్ని స్పష్టంగా, సంఘటితంగా* కుహానా రాజకీయ నాయకులకు, అందులోనూ హిందు దేవుళ్ళను కించ పర్చే మరియు ధర్మాన్ని బలహీనపర్చే కుత్సితులకు, *స్వదేశీ, విదేశీ ఉగ్రవాదులకు తెలియజేయాలి*. 


*హిందువులై ఉండి హిందు ధర్మాన్ని వ్యతిరేకించే వారిని, చేరదీసే బుజ్జగించి స్వధర్మ ఔనత్యము గురించి వివరించాలి, సరైన దారిలో పెట్టే బాధ్యత మన ప్రతి భారతీయుడికి ఉన్నది*, ఉంటుంది. ఉండాలి కూడా.... *లేకుంటే భారత దేశవాసులు ముఖ్యంగా మన భవిష్యత్తరాల హిందువులకు "తమ ఉనికికి తామే ప్రమాదము కలిగించుకున్న వారవుతున్నారు"*.  

తమకే కాక దేశ భద్రతకు, సమగ్రతకు విఘాతము కల్గించిన వారు కూడా అవుతారు. *ఇది క్షమించలేని నేరము*. 


*గమనిక*

స్వధర్మ రక్షణ అంటే పర ధర్మజన హింస కాదు. *కావున హిందూ ధర్మానికి, సంస్కృతికి ఊపిరులూదడానికి ప్రతి పౌరుడు కంకణం కట్టుకోవాలి, ఐకమత్యంమే మనముందున్న ఏకైక సాధనం, తద్వారా హిందూ మతానికి పునర్వైభవం తేవాలి* 

ఇప్పుడే పూనుకోకపోతే..... *ఆలస్యం అమృతం విషం* 


ధన్యవాదములు.

*(సశేషము)*

*శ్రీ కాత్యాయిని బాణేశ్వర ఆలయం*

 🕉 *మన గుడి : నెం 444*


⚜ *ఉత్తర కర్నాటక  : అవెర్స* 






⚜ *శ్రీ కాత్యాయిని బాణేశ్వర ఆలయం*



💠 శ్రీ కాత్యాయని బణేశ్వర్ ఆలయం కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో, అంకోలా సమీపంలోని అవెర్సా తీరప్రాంత పట్టణంలో ఉన్న ఒక హిందూ దేవాలయం.  


🔆 *స్థలపురాణం*


💠 మహిషాసురుడు తీవ్రమైన తపస్సు తర్వాత శివుని నుండి అద్వితీయమైన శక్తులను పొందాడు. ఆ శక్తి అతనిని అహంకారంతో మత్తెక్కించింది, అతను ఋషుల పవిత్ర కర్మలలో భంగం కలిగించడం మరియు దేవతలపై దాడి చేయడం ప్రారంభించాడు. 

అతను ఇంద్రుడిని ఓడించి, అతని రాజధాని అమరావతిని స్వాధీనం చేసుకున్నప్పుడు, అతని పరాక్రమానికి భయపడి, ఋషులు మరియు దేవతలు బ్రహ్మ, రుద్ర మరియు నారాయణుడిని సంప్రదించి తమ కష్టాలను వివరించారు. 


💠 మహావిష్ణువు మహిషాసురుని దుశ్చర్యల వివరాలను విన్నప్పుడు అతని ప్రశాంతమైన ముఖం భీకరంగా మారింది మరియు అతని ముఖం నుండి తీవ్రమైన దివ్య జ్యోతి వెలువడింది. 

బ్రహ్మ మరియు రుద్ర ముఖాల నుండి ఇలాంటి కిరణాలు వెలువడ్డాయి. ఈ కిరణాల ప్రకాశంలో శ్రీ దేవి దివ్య రూపం కనిపించింది.


💠 రుద్రుడు తన త్రిశూలాన్ని, విష్ణువు తన చక్రాన్ని, వరుణుడు తన శంఖాన్ని, వాయువు తన విల్లు బాణాన్ని ఇచ్చాడు. 

అగ్ని తన షష్టాయుధాన్ని, యముడు కాలదండాన్ని, ఇంద్రుడు వజ్రాయుధాన్ని & ఐరావతను, బ్రహ్మకు తామరపువ్వును, క్షీరసాగరుడు తెల్లని హారాన్ని, తెల్లని వస్త్రాన్ని, చూడామణిని, చెవి ఉంగరాలు, చంద్రవంక హారము మరియు పాదరక్షలు ఇచ్చాడు. సముద్ర దేవుడు తామర పువ్వుల దండను, హిమాలయాలు శ్రీ దేవికి సింహం (వాహనం)గా రూపాంతరం చెందాయి.


💠 ఈ దృగ్విషయాన్ని కాత్యాయన అనే మహర్షి చూశాడు. అతను శ్రీ దేవి ఆరాధకుడు మరియు ఆమె తన కుమార్తెగా జన్మించాలనే కోరికను తీర్చుకున్నాడు.

ఈ భక్తికి ఎంతో సంతోషించిన  దేవత తనకు కాత్యాయని అని పేరు పెట్టుకుందని పురాణాలు వెల్లడిస్తున్నాయి.


💠 స్కాంద పురాణాలు సరస్వత్ బ్రాహ్మణులు ఉత్తర వింద్యగిరి (కాశ్మీర్)కు అలవాటు పడ్డారని పేర్కొన్నారు. వారు సరస్వతీ నది ఒడ్డున నివసించారు. 

ఈ వంశంలోని సభ్యులు అసాధారణమైన సాంస్కృతిక మరియు సామాజిక నేపథ్యాలు కలిగిన ఉన్నత విద్యావంతులు

వారి జనాభా పెరిగేకొద్దీ వారు వారి నివాస స్థలం ఆధారంగా ఐదు విభాగాలుగా వర్గీకరించబడ్డారు.


1. సరస్వతులు - సరస్వతీ నది ఒడ్డున నివసించేవారు. 

2. కన్యా కుబ్జాలు - కనోజ్ నది వెంబడి నివసించేవారు. 

3. గౌడ్స్ - దక్షిణ గంగానది ఒడ్డున నివసించేవారు 

4. ఉత్కళలు - ఒరిస్సాలో నివసించిన ప్రజలు. 5. మైథిలీలు - బీహార్‌లోని మిథిలా నది ఒడ్డున నివసించేవారు.


💠 12 సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు తీవ్రమైన కరువు మరియు కరువు సరస్వతీ నది ఒడ్డున అలుముకుంది. 

సరస్వతులు ప్రస్తుత గోవాలోని గోమంతక్ వైపు వలస వెళ్ళవలసి వచ్చింది . 


🔆 ఆలయ చరిత్ర


💠 ఒకప్పుడు పౌలేకర్ అనే ధనవంతుడు ఒక పెద్ద పడవలో విలువైన సరుకులను రవాణా చేస్తున్నాడు. 

బెలెకేరి సమీపంలో, అతని పడవ కుంభకోణంలో చిక్కుకుంది మరియు క్రాఫ్ట్ ఒడ్డున కూరుకుపోయింది. 

అతను తన దుస్థితిని చూసి నిరుత్సాహపడి ఆవెర్సాలోని ఆలయానికి వచ్చాడు. 


💠 అతను ఆలయంలో  సాష్టాంగం చేసి, తన కష్టాలను వివరించాడు మరియు శ్రీ దేవి అతనిని కష్టాల నుండి విముక్తి చేస్తే పడవ ఆకారంలో ఆలయాన్ని నిర్మిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అతను తన పడవకు తిరిగి వచ్చి బాగా నిద్రపోయాడు. 

తెల్లవారుజామున ఒక ఎనిమిదేళ్ల బాలిక తన పడవను పెద్ద స్తంభంతో నెట్టడం మరియు తేలుతున్నట్లు అతనికి కల వచ్చింది. 

అతను ఒక్కసారిగా మేల్కొన్నాడు మరియు అది కేవలం కల కాదు, వాస్తవం అని కనుగొన్నాడు. 


💠 అతని పడవ సముద్రంలో తేలుతోంది. అతను ఆలోచిస్తున్నప్పుడు, గుడిలోని విగ్రహం ముఖానికి మరియు తన కలల చిన్న అమ్మాయి ముఖానికి మధ్య ఉన్న సారూప్యతను చూసి అతను ఆశ్చర్యపోయాడు. 

శ్రీ కాత్యాయని తనని విపత్తు నుండి కాపాడిందని అతను నిశ్చయించుకున్నాడు. 


💠 అతను అవర్సాలోని ఆలయానికి వెళ్ళాడు, అక్కడ అతనికి గొప్ప ఆశ్చర్యం ఎదురుచూసింది. అతను ఇసుకతో గుర్తించబడిన పాదముద్రలను చూశాడు మరియు శ్రీ కాత్యాయని తన పడవ మరియు సరుకులను కాపాడిందని సందేహం లేకుండా నమ్మాడు. అతను చాలా వినయంతో దేవుడి ముందు నిలబడి, పూజలు చేసి, వీలైనంత త్వరగా ఆలయాన్ని నిర్మిస్తానని ప్రతిజ్ఞ చేశాడు.


💠 పరులేకర్ యొక్క వ్యాపార లావాదేవీల ఫలితంగా అతను దేవతకి చేసిన ప్రతిజ్ఞ మరచిపోయాడు. 

కొన్నేళ్ల తర్వాత ఆయన పడవ బెలెకేరి దగ్గర్లో వెళ్తుండగా ఒక్కసారిగా ఆగిపోయింది. 

దీంతో శ్రీ కులదేవికి తాను చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చలేదని గుర్తు చేశారు. 

అతను తన లోపాలను క్షమించమని వేడుకున్నాడు. అప్పుడు అతను బోల్తా పడిన పడవను పోలిన పైకప్పు ఉన్న ప్రస్తుత ఆలయాన్ని నిర్మించాడు.


💠 గోవా నుండి 100 కిమీ, బెంగళూరు నుండి 500 కిమీ మరియు హుబ్లీ నుండి 136 కిమీ దూరంలో ఉంది.

పంచాంగం 19.09.2024 Thursday,

 ఈ రోజు పంచాంగం 19.09.2024 Thursday,


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు భాద్రపద మాస కృష్ణ పక్ష ద్వితీయ తిధి బృహస్పతి వాసర: ఉత్తరాభాద్ర తదుపరి రేవతి నక్షత్రం వృద్ధి యోగ: తైతుల తదుపరి గరజి  కరణం. ఇది ఈరోజు పంచాంగం.


విదియ రాత్రి 12:41 వరకు.

ఉత్తరాభాద్ర పగలు 08:04 వరకు తదుపరి రేవతి రా. తె 05:14 వరకు.


సూర్యోదయం : 06:08

సూర్యాస్తమయం : 06:12


వర్జ్యం : సాయంత్రం 06:39 నుండి 08:04 వరకు .


దుర్ముహూర్తం : పగలు 10:09 నుండి 10:58 వరకు తిరిగి మధ్యాహ్నం 02:59 నుండి 03:47 వరకు.


అమృతఘడియలు : రాత్రి 03:07 నుండి రా.తే 04:32 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.


యమగండం:  ఉదయం 06:00 నుండి 07:30 వరకు.



శుభోదయ:, నమస్కార:

సత్సంగం

🔔 *సత్సంగం* 🔔


*ఒకప్పుడు భక్తుడు తులసీదాసుని అడిగాడు.*


“మీరు రాముడిని చూశారా ?" దానికి తులసీదాస్ "అవును నేను చూసాను: అన్నాడు. భక్తుడు “అప్పుడు నాకు కూడా శ్రీరామదర్శనం చేయించండి". తులసీదాసు "ఎందుకు కాదు నీకు కూడా... శ్రీరామదర్శనం సాధ్యమే! అది చాల సులభం. మీరు ఏ వ్యక్తిని చూసిన అక్కడ మీ కోసం రాముడు కనిపిస్తాడు!" భక్తుడికి అర్థం కాలేదు. " ఎలా చెప్పండి"


తులసీదాసు అన్నారు : చూడండి, దీనికి సులభమైన సూత్రం ఉంది. భక్తుడు మరింత ఉత్సుకతతో, ఆశ్చర్యంతో ఆ సూత్రం ఏమిటి? అని అడిగాడు. అప్పుడు తులసీదాస్ ఇలా అంటాడు:

*_"నామ చతుర్గుణ పంచతత్త్వమిలన తాసం ద్విగుణ ప్రమాణ తులసీఅష్టసౌభాగ్యే అంత మే శేష రామ హీ రామ ||"_* దీని ప్రకారం, ఏ పేరు అయినా సరే, అందులోని అక్షరాలను లెక్కించండి.


నాలుగు (నాలుగు రెట్లు) ద్వారా గుణించండి. దానితో ఐదు (పంచతత్త్వ మిలన్) జోడించండి. అప్పుడు మీరు పొందిన సంఖ్యను రెట్టింపు చేయండి. దాన్ని ఎనిమిదితో భాగించండి (అష్టసౌభాగ్యం). మిగిలేది అదే. ఆ రెండు


అక్షరాలు *_"రామ"!_*


భక్తుడు ఆశ్చర్యపోతాడు. అతని పేరు "నిరంజన".

4X4=16; ౧౬ ప్లస్ 5=21;

21X2=42; 42/8= ఆన్సర్ 5. శేషం 2.


అతని భార్య పేరు "నిర్మల". అక్కడ ఉన్నదానికి సూత్రం ప్రకారం . 3X4=12;

12 + 5=17; 17X2=34; 34/8 =

ఆన్సర్ 4. శేషం 2.


అతని కూతురు పేరు "నిధి". ఫార్ములా వర్తింపజేయబడింది. 2X4=8; 8 + 5=13;

13X2=26; 26/8 = ఆన్సర్ 3. శేషం = 2


అవును! పేరు ఏదైనా, అక్షరాలు ఎన్ని ఉన్నా ముగింపు రెండు అక్షరాలు"రామ" మాత్రమే ! మరియు సూత్రంలోని సంఖ్యలు... గణిత కార్యకలాపాల ప్రాముఖ్యత మీకు తెలుసా?


చతుర్గుణ = ధర్మము, అర్థము, కామము, మోక్షము నాలుగు పురుషార్థాలు.


పంచతత్త్వం = భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం 


ద్విగుణ = మాయ మరియు బ్రహ్మ.


అష్టసౌభాగ్య = ఆహారం, అర్థం, ఆధిపత్యం,యవ్వనం, కీర్తి, ఇల్లు, బట్టలు, ఆభరణాలు


వీటన్నింటి కోసమే మనం జీవిస్తున్నాం. కానీ... చివరికి మిగిలేది భగవంతుని నామం మాత్రమే...




🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

20. " మహాదర్శనము

 20. " మహాదర్శనము --ఇరవయ్యవ భాగము-- విచిత్రానుభవములు


20. ఇరవయ్యవ భాగము---విచిత్రానుభవములు 



           మరుసటిరోజు తెల్లవారింది . కొడుకుకు తల్లి స్నానము చేయించినది . ఎప్పటివలె వాడూ అగ్నిమందిరములో శాంతముగా కూర్చున్నాడు . అగ్ని పరిచర్యమంతా అయిపోయింది . కొడుకు శాంతముగా నున్నది చూసి , వీడు ఈ దినము ఆవుల వెంట వెళ్ళడేమో అనుకున్న తల్లి ఎప్పటిలా గోశాలకు బయలుదేరింది . 


కొడుకు , ’ అమ్మా , ఈపూట నేను వెళ్ళవలెను, హవిస్సు చేసినావా ? " అని అడిగినాడు . 


          బయలుదేరిన తల్లి నిలచి ,’ ఇదిగో చేస్తాను ’ అని ఇంత బియ్యము వేయించి పొయ్యిపైన ఉంచి వచ్చింది .( గంజిని వార్చకుండా , వేయించిన బియ్యముతో చేసిన అన్నమునకు హవిస్సు యని పేరు ) ఆవుపాలను పిండు వేళకు హవిస్సయింది . దానిని తిని యాజ్ఞవల్క్యుడు గోపాలుర వెంటే ఆవుల వెనక బయలుదేరినాడు . 


         ఆలంబినికి ఆలోచన . మూడు సంవత్సరముల వాడిని ఆవులవెంట పంపించినానే , అని . అయితే , చూచుటకు ఐదు సంవత్సరముల వయస్సు వాడికన్నా పెద్దవాడిలా కనిపించు కొడుకు బయలుదేరుటకు సిద్ధమైనపుడు ఆ ఆలోచనే అడ్డురాలేదు . " దిగులెందుకు ? జట్టులో పెద్దలు , పిల్లలు అందరూ ఉన్నారు కదా ? " అని తనకు తానే చెప్పుకొని తన పనిలో నిమగ్నమైనది . 


         ఆవులు మందలో అంతసేపు ఉండి , ఎండ ఎక్కువ కాగానే ముందుకు సాగినాయి . అదే సమయమునకు గోపాలుర పెద్దలు కూడా తెల్లటి కండువాలతో తలపాగాలు చుట్టుకొని , భుజాన గొంగళి వేసుకొని , చేతిలో ముల్లుగర్రలూ పట్టుకొని , నోటిలో వక్కాకులు , పొగాకు వేసుకొని , ’ ఈబూతి ’ ధరించి వచ్చినారు . వారిలో పెద్దవాడొకడు ముందు నడుస్తున్నాడు . వాడి వెనక ఆవులు , వాటి వెనుక ఇతరులు . వారితో యాజ్ఞవల్క్యుడు . 


         వారిలో నడి వయస్సు వాడొకడు ఆ బాలుడిని చూసి , ’ ఏందయ్యా , నువ్వు వచ్చిండావు ? ఈ దావలో రాళ్ళు , ముండ్లే ఎక్కువ , దా , నా బుజము పైన కూకో ’ అని ఎత్తుకున్నాడు . 


          అతడికి రెండడుగులు వేసేలోపే ఆశ్చర్యమైనది . కుమారుడు తన వయసు వారికన్నా బరువు ఎక్కువ అనునది వాడి ఆకారమే చెబుతుండినది . అదెలా ఉన్నా , వాడిని భుజముపైన కూర్చోబెట్టుకుంటే వాడినుండీ ఏదో సొన వలె తన దేహమునకు దిగుతున్నట్లు తోస్తున్నది . ఏదో కారణము చెప్పి , పిల్లవాడిని దింపి చూచినాడు , ఏమీ లేదు. మరలా ఎత్తుకున్నాడు . మరలా ఆ సొన ప్రవహిస్తున్నది . ఆ వాహిని తనకు వద్దనపించలేదు , ఏదో హితముగా ఉండినది , సుఖముగా ఉండినది , ప్రియముగా ఉండినది . 


          ఇంకొక పది అడుగులు వేయగానే అతడికే తెలియకుండా నిద్ర వచ్చేసింది . ఆ నిద్రలోనే సరిగా ఊపిరి వదలుతూ , అడుగులు కొంచము కూడా తప్పకుండా సరిగ్గా వేస్తూ అందరికన్నా వెనుక దారి ఏమాత్రమూ తప్పకనే వెళ్ళినాడు . ఆవుల మంద గడ్డి మేయు పచ్చికబయలు ఊరినుండీ చాలా దూరమేమీ లేదు . కుమారుని ఎత్తుకున్న వాడు మైదానమునకు చేరు వరకూ ఒక్క అడుగు కూడా తప్పుగా వేయలేదు . మంద వెళ్ళి పచ్చిక మేయుటకు ఆరంభమగు వేళకు అతడు కూడా అక్కడికి చేరినాడు . అక్కడికి వెళ్ళగానే మెలకువ అయినది , కుమారుని దింపినాడు . 


          అతడికి , తాను నిద్రపోయినది నిజమేనా ? అని సందేహము . కానీ నిద్ర లేచినవాడికి ఉండే తాజాతనముంది . ఒంట్లో కొంచము కూడా ఆయాసము లేదు . దారిలో ఏమైనదన్నది ఒక్కటీ తెలీదు . కళ్ళు తెరచే ఉన్నానా , లేదా అన్నదీ తెలీదు . ఇలా ఉన్నపుడు నిద్ర రాలేదు అనుట ఎలా ? 


అయినా వాడు ఎవరితోనూ ఆ విషయము ప్రస్తావించలేదు . కానిమ్ము , వెళ్ళునపుడు చూద్దాము అని ఊరకున్నాడు . 


         కుమారుడు ఇతరులు ఆటకు పిలచినా పోలేదు . తనపాటికి తాను కూర్చున్నాడు . వాడికి , ఇంతవరకూ ఎవరో తన వెనుక వెనుకే ఉన్నట్లు అనిపించు చుండినది . ఇప్పుడు మనసుకు నమ్మకము వచ్చింది , ఎవరో అంగ రక్షకులవలె వెంట ఉన్నట్లు తెలిసింది . ఎవరు అని అడుగవలె ననిపించలేదు .


        మందలోని పశువులు అపరాహ్ణము దాటే వరకూ మేత మేసి , నీరు త్రాగి , నీడలో పడుకున్నాయి . కుమారుడు వెళ్ళి , తనతో మాటాడిన హోమధేనువు వద్ద కూర్చున్నాడు . 


" మొత్తానికి మాతో వచ్చినావే ? " 


" మీరు చెప్పిన తర్వాత ఇంకేమి , వచ్చేసినాను " 


" సరే , ఈ దినము ఏదైనా విశేషమును చూచినావా ? "


" ఏమీ చూడలేదు "


" నీతో పాటు నీ కాపలాకు ఒకరు వస్తున్నట్లు లేదూ ? "


" ఎవరో ఉన్నట్లు , చూచినట్లు అనిపించినది. , అయితే అది నిజమేనా , ఒకరు ఉన్నారా ? "


" ఆతడే అగ్ని పురుషుడు . ఈ లోకములో మంటయై మండువాడు , దీపమై వెలుగువాడూ ఆతడే . చూడు , అతడు నీ పక్కనే ఉన్నాడు . జనాలతో పూజలు చేయించుకొని , కావలసినది ఇస్తాడు . " 


" పూజ చేయకుంటే ? "


" ఆతడు తన పాటికి తానుంటాడు . దేవతలను మనుషుల వైపుకు తిరుగునట్లు చేసేదే పూజ. "


ఆనాడు తల్లి అగ్ని మందిరము వైపుకు తిరిగి నమస్కరించినది గుర్తొచ్చింది . అడిగినాడు , ’ అట్లయితే నమస్కారము చేసేది కుడా పూజేనా ? ’ 


" సందేహమే లేదు . ధూప దీప నైవేద్యములను అర్పించు పూజ ఒకటైతే , ఊరికే నమస్కారము చేసేది కూడా ఇంకొక రకము పూజ. సరే , నీ వెనకా, పక్కనా వస్తున్న అగ్ని దేవుడిని చూచినావా ? "


" ’ నేనున్నానని తెలుసుకుంటే చాలు , చూడవద్దు , తర్వాత ఆవు చెప్పేది విను ’ అంటున్నాడు . అందుకే నమస్కారము చేసి పూజ చేసినాను "


" సరే , విను . ఈతడు భూలోకము నందున్నట్లే , ఆకాశము లోనూ , భూమ్యాకాశాల మధ్య అంతరిక్షములోనూ ఉన్నాడు . "


" అంటే ఈతడే పైనున్న ఆకాశములోనూ , మధ్యలోని అంతరిక్షము లోనూ ఉన్నాడా ? " 


" ఔను . ఆకాశములో ఆదిత్యుడైయున్నాడు . అంతరిక్షములో వాయువై యున్నాడు "


" అట్లయితే కాల్చే సూర్యుడూ , వీచే వాయువూ ఈతడేనా ? "


" కాదేమో అతడినే అడుగు .నువ్వు దీనిని జ్ఞాపకము ఉంచుకో . అగ్ని , ఆదిత్యుడు , వాయువు ముగ్గురూ ఒకరే ! " 


" ముగ్గురూ వేరే వేరే అనునదేమో తెలిసింది . కానీ ఒకటే అనేది ఎలాగ ? "


" పిచ్చీ , మొక్కలో వేరూ చిగురూ ఒకటే కాదా ? అయినా రెండూ ఒకటేనా ? అలాగే వీరు ముగ్గురూ ఒకటే అన్నదీ నిజము , వేరే వేరే అన్నదీ నిజము . ఆలోచించి చూడు నీకే తెలుస్తుంది "


          కుమారుడు ఆలోచించినాడు , " అమ్మ కూడా ఈ మాట ఎప్పుడో చెప్పింది . ఎప్పుడు ? ఆ ! తెలిసింది , భద్రం కర్ణేభిశ్శ్రుణుయామ దేవాః అన్నపుడు: దేవాః అన్నది , నేను అడిగినాను , అప్పుడు , ఔనయ్యా ! ప్రాణ మండలము నుండీ దేవతలు అందరూ వస్తారు . మంట మండునపుడు నిప్పు కణములు ఎగురుతాయి కదా అలాగే ! అన్నది . అట్లయితే ఈ ధేనువు చెప్పేది కూడా అదేనా ? అమ్మ ఇంకా చెప్పింది : పూర్ణమదః చెప్పునపుడు ఆ బ్రహ్మ పూర్ణుడు , ఎందుకంటే , ఈ దేవతలందరూ వారిలో ఉండేవారు . వీరు వేరే వేరే అయినపుడు జగత్తు వచ్చింది అని . అడిగితే మంచిది కదా , ’ ధేనువా , నువ్వు చెప్పేది ఇలా ఉండాలి , మొదట కలసి ఉన్నారు , తర్వాత వేరే వేరే అయినారు , అని ! " 


" ఔను , దానితో పాటు ఇంకోమాట చెప్పాలంటే , మరలా ఒకటవుతారు అని " 


" అట్లయితే ఎవరైనా కావాలీ అంటే మరలా ఒకటవుతారా ? "


        " అవుతారు . ఎవరి కోసము వారు ఒకటవుతారో వారు , శ్రేయస్సు దారి యొక్క ఆ చివరను చూచువారు . అలా కాక , ఎవరి ఇఛ్చయూ లేక , వారే తాముగా ఒకటవుతే అది ప్రళయము . " 


         కుమారుడు మరలా ఆలోచించినాడు , ఇది కూడా అమ్మ చెప్పింది ,’ శ్రేయస్సు దారిలో వెళ్ళువారు మొదట దేవతలు వేరే వేరే అనుకొని చివరికి అందరినీ ఒకటిగా చూస్తారు . అప్పుడు పూర్ణ దర్శనము , అదే మహా దర్శనము .’ తల్లి పక్కనే నిలబడి చెప్పినట్లాయెను . ఆ గొంతు విని అతనికి ఏదో విచిత్రమైన సంతోషమై తిరిగి చూచినాడు , తల్లి : ఆమె ఎదలో తండ్రి : మాట తల్లిది: అర్థము తండ్రిది : ఏమో ఎందుకో ఇంకోవైపుకు తిరిగి చూచినాడు , అక్కడ మరలా తల్లిదండ్రులు. అయితే ఈ సారి వారిద్దరినీ ఆవరించిన అగ్ని . అగ్ని ప్రసన్నుడై ఉన్నాడు . వారిని ఆవరించిననూ వారిని కాల్చడు అని కొడుకుకు ఎటులో మనోగతమైనది . 


ఉన్నట్టుండి ఏదో మరచినానే అనిపించెను , అమ్మ , ’ పశువు మాట్లాడింది అంటే ఏమిటీ ? ’ అన్నది గుర్తొచ్చింది . ధేనువును అడిగినాడు :


" సరే , నువ్వు చెవికి వినిపించునట్లు మాట్లాడలేదు , అయితే , నేను నీ మాటను విన్నాను . ఇది అమ్మకు ఎలా చెప్పేది ? " 


          ధేనువు నవ్వింది " నీకెందుకు అంత తొందర ! నువ్వు పుట్టినదే జగత్తుకు చెప్పడానికి . దీనిని తల్లికి చెప్పకనే ఉందువా ? సరే , ఇది విను . ప్రతి దేహములోనూ ప్రాణమున్నది . ఆ ప్రాణమే భూమినుండీ ఆకాశము వరకూ సర్వమునూ వ్యాపించియున్నది . ఆ ప్రాణము ప్రతి దేహములోనూ ప్రాణము , అపానము , వ్యానము , ఉదానము , సమానము అని ఐదు రూపములుగా ఉంది . వాటిలో మాట్లాడు పని అంతా ఉదానముది . నా దేహములో నున్న ఉదానము ఈ నా దేహయంత్రములో ప్రకటిత మైనపుడు మాత్రమే నీ చెవి దానిని వింటుంది . అటులకాక, అదే ఉదానము వాక్కుగా ప్రకటితము కాకుండా , వెనక్కు తిరిగి నా ప్రాణమునకు వచ్చినపుడు , మాటగా పలకవలసిన అర్థమంతా భావముగా మారి , నా ప్రాణము ఆ భావమును నీ ప్రాణమునకు ఇస్తుంది . అప్పుడు నువ్వు దానిని భావముగా మాత్రమే గ్రహిస్తావు . అయితే నీ ఉదానము దానిని పెంచినపుడు నీ మనసు దానినే మాటగా గ్రహిస్తుంది . ఇది దూర శ్రవణ విద్య . దీనిని ఎవరు కావాలన్నా చేయవచ్చు , చేయరంతే ! " 


ధేనువును మరలా అడిగినాడు , " అయితే అమ్మ కూడా చేయవచ్చునా ? " 


        " చేయలేదేమో అడుగు ! ఎన్నో రోజులు పొయ్యి ముందర కూర్చున్నపుడు ఆమె నిన్ను చూడవలె ననుకొంటుంది . ఎక్కడో ఉన్న నీకు అది తెలిసి పిలవకున్ననూ నువ్వు మీ అమ్మ దగ్గరికి పరుగెత్తి వస్తావు ఔనా , కాదా ? అది దూర శ్రవణ విద్య కాదా ? " 


" మరి , అందరూ దీనిని నమ్మరెందుకు ? "


         కాల దేశముల వలన కలుగు పరిమితులను ఒప్పుకున్న మనసు దీన్నెలాగ నమ్ముతుంది ? వారిని అడుగు , ’ మీరు కలలు కనరా ? అప్పుడు మాట్లాడుతున్నారు కదా ? నాలుక ఆడలేదు , పెదవి కదపలేదు , చెవులు వినలేదు , అయినా మీరు మాట్లాడినారు , విన్నారు , అది ఎలాగ ? అని అడుగు " 


         ఆ వేళకు ఎండ పడమరకు దిగింది . ఇంటికి వెళ్ళు పొద్దయిందని కాపరులు మందలోని పశువులను హెచ్చరిస్తూ వచ్చినారు . కుమారుడు వారి అర్థములేని శబ్దములను విన్నాడు . పశువులు అది విని అర్థము చేసుకున్నట్లే లేచినాయి . " ఔను , ధేనువు చెప్పినది సరియే , ప్రాణ ప్రాణమూ జగత్ప్రాణుని పిల్లలు . అవి భావమును ప్రాణము నుండీ సంగ్రహించును . " 


ఇంకొంచము సేపటిలోగా వచ్చినప్పటి లాగానే జాతర బయలుదేరింది . ముందర ఒకడు , వాని వెనుకే పశువులు , వాటివెనుక పిల్లలు , ఇతరులు . 


         వచ్చినపుడు తనను ఎత్తుకొని వచ్చినవాడు మరలా కుమారుని వద్దకు వచ్చి , " రావయ్యా , ఎత్తుకుంటాను " అన్నాడు . కుమారుని ఎత్తి భుజముపైన కూర్చోబెట్టుకున్నాడు . అతడికి పొద్దున కలిగిన అనుభవము అబద్ధము కాదు అని అర్థమైనది . అతడికి కుమారుని దేహము నుండీ ఏదో వాహిని వచ్చి తన దేహమునంతా వ్యాపించునది అనుభవమైనది . దాని వెనకే చిన్నగా సుఖ నిద్ర అల ఒకటి వచ్చింది . దానివలన మెలకువ అగు వేళకు పశువులన్నీ ఇంటి వాకిలి వద్దకు వచ్చియున్నాయి . 


Janardhana Sharma

దాన విశిష్ఠత !

 


"నకర్మణా న ప్రజయా న ధనేన దానేనైకేనామృతత్వ మానసుః""-


దాన విశిష్ఠత !


             ఉ: దాన కళా కలాప సముదంచిత సార వివేక సంపదన్


                   మానిత యాచమాన జనమానస వృత్సభిపూర్తి బుధ్ధి యె


                   వ్వానికి లేదొకింతయును వాడొకరుండు భరంబు ధాత్రికిన్,


                  కానలుగారు , వృక్షములుగారు నగంబులు గారు భారముల్; 


శృంగార నైషథము--శ్రీనాథమహాకవి.


భావము: దానంచేయటం ఒక కళ. దాని విశిష్ఠతను తెలిసికొని ,మాన నీయులైన యాచకజన మనోరథములను తీర్చెడి

కుతూహలము యెవనికి లేదో ఈపుడమికి వాడొక్కడే భారము.


                       అడవులుగాని , వృక్షములుగానీ , పర్వతములు గానీ , భారములుగావు.


      విశేషాంశములు: దానకళా విజ్ఙాన వంతుడే దానంచేయగలడు. దానం చేయటానికిముందు యాచకుని యోగ్యతనుగుర్తించి,తదుచితమైన దానంచేయాలి.అది కష్టసాధ్యమైనవిషయమే!. దాత ముందుగా ఆవివేకాన్ని సంపాదించాలట.

యాచకులను హీనులుగా చూడరాదు.వారుపుడమికిసందేశహారులట!ఏమిటాసందేశం?"ఎన్నడూ యెవరికీ యేమీ పెట్టనివానిబ్రతుకు మాబ్రతుకులాగేఉంటుంది.దానంచేనిన వారిజీవితం మీలాగేహాయిగాఉంటుంది"- అని; అందువలనవారిని గౌరవనీయులుగా భావించాలి. వారి మనసెరిగి దానంచేయాలి. అరకొర దానం చేయరాదు. అలాంటి ఉత్తముడే దాత అతడు పుడమికి అలంకారం. తక్కినవారు (లోభులు ) భూమికి బరువని కవియభిప్రాయం.

పర్వతాదులు గూడా భూమికి భారము కాదని భావము.🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷👏🌷🌷👏🌷🌷

18, సెప్టెంబర్ 2024, బుధవారం

*శ్రీ శంకరాచార్య చరిత్రము 16


*శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము 15 వ భాగము.*_ 

❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️


*విజయ యాత్ర:&


వాదోపవాదములు చేసి శత్రువులను జయించమని ఈశ్వరుని ఆజ్ఞ. విష్ణుసన్నిభుడైన వ్యాసభగవానుని బోధ. ఇక జ్ఞాన యుద్ధమే తరువాయి.


ధర్మయుద్ధమైన కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణపరమాత్మ అండ పాండవులకు లభించినట్లుగానే శివకేశవుల కరుణ శ్రీశంకరాచార్యులకు లభ్యమైంది. అర్జునుని అక్షయ తూణీరాల వంటివి శంకరుని సూత్ర భాష్యాలు. పార్థునకు దివ్యరథాలు ప్రాప్తించి నట్లు శంకరునికి ఉపనిషత్తులు చాలు. పదునెనిమిది అక్షౌహిణుల సేనల పోరాటమది. పదునెనిమిది రోజులుగా సాగినది. పదునెనిమిది అధ్యాయాల భగవద్గీత శంకరుని హృదయంలో చేరింది. ద్రుపద పుత్రుడు ధృష్టద్యుమ్నుడు పాండవ సేనకు అధ్యక్షుడైనాడు.


ఇక్కడ 'స్వయం మంత్రీ స్వయం రాజా' అన్నట్లుగా శ్రీశంకరుడే అన్నీ నిర్వహిస్తాడు. అర్జునునకు తోడుగా నలుగురు సోదరులు ఉండగా ఇక్కడ దిగ్గజాల లాంటి పద్మ పాదాది శిష్యప్రకాండు లున్నారు. పాండవుల పక్షాన ధర్మము ఉన్నట్లే శంకరుని పక్షాన ధర్మముతో కూడిన ఆత్మవిశ్వాస శక్తి ప్రబలంగా ఉన్నాయి.


పాంచజన్యాన్ని మధు సూదనుడు, దేవ దత్తాన్ని విజయుడు పూరించి నట్లు ఒక సుముహూర్తాన శ్రీశంకరాచార్యుడు తత్త్వ శంఖారవం చేశారు. ఆ శంఖా రావము కాశీలోనే కాదు యావద్భారత దేశములోని ధర్మ శత్రువుల గుండెలు దద్దరిల్లేలా వినిపిం చింది. విన్న యతులు, యోగులు, ముముక్షువులు, సాధుజనులు కర్ణానందంగా విన్నారు. ఆ అవతార మూర్తి రాకకై చంద్రునికి సముద్రునిలా ఎదురు చూస్తు న్నారు. గంగాస్తవాలు చేసికొంటూ, గంగాస్మర ణలతో తనకు దగ్గరలోనే మెలగు చున్న శంకరసేనను చూచి గంగ ఉత్తుంగ తరంగాలతో ఉప్పొంగి పోతోంది. హరిహరులకు భేదము లేదని ఆచార్యులవారు బోధించేవారు. శంకరాచార్యుని వైష్ణవులు సాక్షాద్విష్ణువుగాను, శైవులు సాక్షాత్తు శివునిగాను భావించి నమస్కరించేవారు. శివుడు, విష్ణువు, సూర్యుడు, గణపతి, అంబిక అనే పంచాయతనాన్ని పూజించమని ఆదేశించేవారు. అందు ఎవరికి ఏది అభిమతమో దానిని ప్రధానంగా ఎంచి అర్చించు కొమ్మన్నారు. ఆనాడు శంకరుని వాక్కు వేదవాక్కు, శంకరాచార్యుల బోధాసుధారసం హృదయాంత రాళాలలో స్థిరీకరించని వారు లేరు. ఎండ మిక్కుటంగా ఉన్నపుడు చెట్లనీడల నాశ్రయించి విశ్రమించేవారు. సూర్యుడస్త మించు వరకు ప్రయాణము సాగిస్తూ సంధ్యను ఉపాసిస్తూ, రాత్రి వేళల గంగాతీరమందే ఉండి నిద్రించువరకు ధర్మ ప్రవచనాలతో కాలక్షేపం చేసేవారు.సర్వభూతాలు ఆ వైదిక వాక్కులకు పరవశ మయ్యేవి. దారిలో ఆచార్యుల బోధలు విన్నవారు ఈ శిష్యపరి వారంలో చేరి వీరివెంట వచ్చేవారు. శంకరపరివారం అలా దినదినాభివృద్ధి చెందింది. వారు వెళ్ళే దారిలో చరణాద్రి, తరువాత వింధ్యాద్రి కనిపించాయి. ఆచార్యుల వారు శిష్యులకు చెప్పారు వింధ్యాద్రి కథ. అగస్త్యుడు ఎలా ఆ నగాన్ని అణచి వుంచాడో.


*ప్రయాగ మహిమ:*


ప్రజాపతి బ్రహ్మ యాగాలనేకం చేసిన చోటు అవడం చేత దానికి ప్రయాగ అనే సార్థకనామం ఏర్పడింది. 'ప్రజాపతి అగ్ని వేది' అని కూడా దానికి నామాంతరం ఉన్నది. ఏ అంత రాయం లేకుండా అక్కడ నిరంతరం అగ్నికుండాలు వెలుగు తుండేవి. నూరు యాగాల ఫలితాన్ని మించిన ఫలం ప్రయాగలో నివసించినవారికి లభిస్తుంది. ఈ రహస్యం తెలిసిన మునులు మున్నగు వారెందరో అక్కడే నివాసం ఏర్పరచుకొని ఉంటారు. చతుర్వేదాధ్యయనం, రాజసూయ యాగం, నిత్యసత్య వ్రతం ఆచరించిన ఫలం ప్రయాగ తీర్థాన్ని దర్శించి సేవిస్తే వస్తుంది. భరతునికి భరద్వాజ మహర్షి విందు చేసినది ఈచోటనే. శ్రీరామ చంద్రుడు తన పాదధూళితో పావనం చేసిన భరద్వాజ ఆశ్రమం ఉన్నచోటు ఇదే. బహ్మ చతుర్వేదాలనూ వెలువరించినది ఇచ్చోటనే. అట్టి పరమ పవిత్ర మైన ప్రయాగను శంకరా చార్యుడు శిష్యగణం తో దర్శించుకొన్నాడు.


*అక్షయ వట వృక్షము* :


కల్పాంతంలో సకలమూ నశించగా శ్రీమహావిష్ణుని దయచేత

మార్కండేయమహర్షి మాత్రం సజీవుడై ఉంటాడు. అలా ఉండడానికి ఆశ్రయం ఇచ్చి నశ్వరం కానిది ఆ మహావట వృక్షం. ఆ వటవిటపి కథ అపూర్వం.


మొగలాయిల ప్రభుత్వకాలంలో హైందవ మతాన్ని కూల ద్రోసి వారి మతాన్ని మాత్రమే భారతదేశంలో నిల బెట్టడానికి వారు చేసిన యత్నాలు ఇంతా అంతా కాదు. అగ్బరు పాలనలో జరిగిందిది. ఈ వటవృక్ష మహిమ విని తమ మత వ్యాప్తికి పెద్ద అంత రాయంగా ఇది ఉందనుకొన్నారు. "అగ్బరు ది గ్రేట్!" అనే బిరుదు అంటించారు అగ్బరు కు పాశ్చాత్య చారిత్రకులు. సర్వమత సహనం కల వాడన్న పొల్లు గుణం కూడా ఆ మహావ్యక్తికి ఆపాదించారు. ఆయన చేసిన మతసహన మహాకార్యం ఏమిటి? ఆ వృక్షం ఆర్ష మతానికి ఆలంబనం గా ఉందన్న భావనతో దాని కొమ్మలు నరికించి మ్రోడుగా చేశాడు! మర్రి చావలేదు సరిగదా సహస్రముఖాలుగా చిగిర్చి ఇతోధిక ప్రాబల్యం సంతరించు కొంది. 


అగ్బరు గతించినా ఆతురుష్కుల ‘మత అసహనగుణం’ మాత్రం అంతరించ లేదు! తండ్రికి పట్టిన పిచ్చి వదలని జహంగీరు చెట్టు మొదల్నే నరికించాడు ఔరా! మన మహా విటపి మాత్రం మరింత చైతన్య శోభతో విస్తరిల్లింది. పట్టు వదలని ఆ రాజు మరగకాచిన నూనెనుపోయించాడా తరువు మొదట్లో! అయినా చెక్కు చెదరక నేటికీ కోటలా ఉన్న ఆ చెట్టు అక్షయవృక్ష మనే సార్థకనామంతో విరాజిల్లు తోంది.


గంగా యమునా సరస్వతులు ప్రయాగ లో కలిసి త్రివేణీ సంగమమయ్యింది. ఈ తీర్థంలో స్నాన మాడిన వారికి పరమ కైవల్యపదం లభిస్తుంది. కోరికలతో స్నానమాడితే సఫలీ కృతులవు తారు. లక్షలాది జనాలు నిరంతరమూ వచ్చి ఆ ప్రయాగ గంగలో మునిగి అనంతమైన పుణ్యాలు మూట కట్టుకొని పోతుంటారు. 'కుంభమేలా’ జరిగేది ఇక్కడే. యాత్రికులు హిరణ్యాలు పెట్టి పితృతర్పణాలను అర్పిస్తారు. అమావాస్య నాటికి ప్రయాగ చేరుకొన్న శంకరబృందం త్రివేణీ సంగమ స్నానము ఆచరించారు.


,*కుష్ఠురోగి బాగుపడుట:*


శిష్యు డొకడు అక్షయ వటవృక్షాన్ని చూద్దా మని వెళ్ళాడు. అక్కడ ఒక కుష్ఠురోగి ఆత్మహత్యాప్రయత్నంలో ఉన్నాడు. కాళ్ళు, చేతులు, శరీరమంతా పుండ్లు పడి రక్తహీన మైన శరీరం తెల్లబడి చెప్పరాని బాధ పడుచున్నాడు. ఎందులకీ పాడు జన్మ అని విరక్తుడై ప్రాణత్యాగానికి సిద్ధ పడిన వానిని చూచి బ్రతికించాలన్న బీజాంకురం శిష్యుని హృదయంలో మొలకెత్తింది.


ఎలాగో గురువుగారి కడకు చేర్చాడా దీనుణ్ణి. శంకరాచార్యుని సన్నిధానంలో ఉన్న వారంతా కుష్ఠురోగిని చూచి దూరంగా తొలగి వెళ్ళారు. శంకరుడు ద్వంద్వా తీతుడు. సుఖము గలిగించే సార్థక నాముడు. దగ్గరకు రమ్మని పిలచాడు. ఏవేవో చికిత్సలు చేశాడు. ఆ చికిత్సల వలననో, శంకరుని అమృతహస్తమో, యోగ మహిమయో గాని ఆ రోగి పుండ్లు ఊడి మచ్చలు మటుమాయమై శరీరం కరివేరు పువ్వు రంగుతో వెలుగుతూ ఆతడు అనారోగ్యం వీడి తేజోవంతుడయ్యాడు. చూచిన వారందరు విభ్రాంతులయ్యారు. ఉదంకుడు అనే పేరు పెట్టి అతణ్ణి సంఘం లోనికి పంపించారు శంకరులు.


*కుమారిలభట్టు:*


గౌతమబుద్ధుడు అవతరించి మత ప్రచార మొనరించిన కొంత కాలానికి ఆయన శిష్యులు భిన్నవిధాలుగా శుష్క తర్కాలతో పలు రకముల పోకడలు పోయారు. కడకు దేవుడు లేడనీ, వేదాలనూ ఉపనిష త్తులనూ నిరసించటం ఆరంభించారు. ఆ విధంగా బౌద్ధమత స్వరూపం మారింది. జైనులు బౌద్ధమతాన్ని ఆదరించడంతో అగ్నిలో ఆజ్యం పోసినట్లైంది. నేర్పూ, చురుకు దనంతో వారి భావాలను బహుళం గా ప్రచారం చేసి ఆ మతవ్యాప్తికి చాలా శ్రమపడ్డారు. బౌద్ధ గురువులు పాండిత్య ము కలవారు కావడంతో వారు భావించినవే సత్యంగా గ్రంథస్థం చేశారు. అదీ ఆ నాటి పరిస్థితి.


సుమారు 2575 సంవత్సరాల క్రిందటి మాట. మహానదీ తీరంలో జయ మంగళము అనే గ్రామం ఉండేది. అందులో చంద్రగుణ యజ్ఞేశ్వరులనే పుణ్యదంపతులకు కుమారిలభట్టు ఉదయించాడు. వేదాలు, శాస్త్రాలు క్షుణ్ణంగా అభ్యసిం చాడు. జైమిని మహర్షి అడుగు జాడలలో మెలగుతూ వేదవిహిత కర్మకాండ లను తానాచరిస్తూ ఇతరుల చేత చేయించుచుండేవాడు. బౌద్ధ జైన మతాలకు రాజాశ్రయం లభించ డంతో ఆ మతస్థులకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. వైదిక మతం ప్రజలలో ఆదరణను కోల్పోతూ ఉంది. ఇది సహించ లేక పోయాడు కుమారిలభట్టు. రాజాశ్రయం పొంది ఉన్న ఆ మతాలను వెడలగొట్టాలి. అందుకు ముందుగా ఆమతంలో ఏముందో కూలంకుషంగా తెలిసి కొనాలి. అందుకని కుమారిలభట్టు బౌధ్ధభిక్షు వేషం దాల్చి తక్షశిలలోని విశ్వ విద్యాలయంలో విద్యార్థిగా చేరాడు. అందరితోబాటు విద్య నభ్యసిస్తూ ఆ మతం లోని గుట్టుమట్టులు కనిపెట్ట గలిగాడు. వాళ్ళు చేసే వేద నిందలు దుర్భరం గా ఉన్నా కార్యసాధక దీక్షతో వాటిని అన్నిటిని భరించాడు. విద్యాభ్యాసం చివరికి వచ్చేసరికి సహ శిష్యులు ఇష్టాగోష్టిలో శ్రుతి స్మృతులను కర్మకాండలను దుయ్యబట్టుతున్నారు. ఘోరాతిఘోరంగా సాగుచున్న వారి మాటలకు సహించి మౌనంగా ఉండలేక పోయాడు. సహేతుకంగా వారి వాదనలు త్రోసిపుచ్చి వారి నోళ్ళు మూత పడేలా తెలియ జేసాడు. సహశిష్యులందరు కలిసి కుమారిలుని ద్రోహిగా నిశ్చయించి గురువులకు నివేదించారు. అది విన్న గురువు అట్టివాడుండకూడ దనుకొని నిద్రించే సమయంలో అతనిని మేడపై నుండి క్రిందకు పడద్రోయ’ మని ఆదేశించాడు. చూచారా! 'అహింస’ కు పెద్ద పీటవేసిన మతస్థాపకుని శిష్యపరంపర! గురువు చెప్పినంత పనీ శిష్యులు చేశారు. అలా పడుతున్న కుమారిలభట్టుకు స్పృహ వచ్చి 'వేదములే మహత్తు కలవైనచో నాకెట్టి అపాయము రాకుండు గాక' అని తనకున్న నమ్మకాన్ని ఒడ్డుకొన్నాడు. దూదిలో పడ్డట్టు పడినా చావు తప్పి ఒక కన్ను పోయింది. దానితో అక్కడి నుండి తప్పించుకొనాలని నిశ్చయించాడు. నూలు పోగుతో బిగించు కొన్న తన కంకణాన్ని ఈ మారు ఉక్కుతీగతో బిగించాడు. అమరావతీ పట్టణం చేరుకొని భట్టపాదుడు అనే మారుపేరు పెట్టుకొన్నాడు.


*కాలడి శంకర కైలాస శంకర* 


*శ్రీ శంకరాచార్య చరిత్రము*

*15 వ భాగముసమాప్తము.* 

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀


*శ్రీ శంకరాచార్య చరిత్రము 16 వ భాగము*_ 

♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️


*అమరావతిలో కుమారిలభట్టు:*


అమరావతీ పట్టణాన్ని అప్పుడు సుధన్వుడు అనే మహారాజు పరి

పాలిస్తున్నాడు. అతడు ధర్మిష్ఠి, సజ్జనసమ్మ తుడు. భట్టపాదుడన్న పేరుతో రాజ దర్శనం కోసం వేచి ఉన్నాడు కుమారిలభట్టు. మాసిన బట్టలతోఉన్నా అతని ముఖం బ్రహ్మ వర్చస్సుతో ప్రకాశి స్తోంది. రాజు వెంటనే స్వాగతం పలికాడు. భట్టపాదుడు రాజును వేదోక్తంగా ఆశీర్వదిం చాడు. ఆ రాజు కొలువులో చార్వాకులు చర్చలు చేస్తుంటారు. భట్ట పాదుడు వారితో వాదించి శాస్త్రాధారా లను ఎత్తి చూపుతూ వేద మత ప్రామాణ్యాన్ని నిరూపించాడు. బౌద్ధు లకూ వేదాలు సరి పడవు. కుమారిల భట్టు రాజాస్థాన చర్చలలో పాల్గొని సభకు ఒక విలువ తెచ్చాడు.అది గమనించినా రాజు ఏ పక్షమూ చేరకుండా మౌనం వహించేవాడు.


సుధన్వుని రాణి పూర్వాచార పరాయణురాలు. దైవభక్తితో ఉండే ఆమెకు మహారాజు నాస్తికు డగుతాడేమో నన్న భయం ఉంది. భర్తతో మాటాడగా మహారాజు 'నాస్తిక్యాని దే పైచేయిగా ఉంది కాబట్టి నే నేమీ చేయలేను' అని చెప్పాడు. ఈ రహస్యం తెలిసికొన్న భట్ట పాదుడు పట్టపుదేవిని ఆశ్రయించాడు. భట్ట పాదుని మహానుభావత్వం మీద సుముఖం గా ఉంది మహారాణి. రాజసభలో మతాలను గురించి కఠోర పరీక్ష పెట్టేటట్లుగా సుధన్వుని ఒప్పించమని వేడు కొన్నాడు భట్టపాదుడు. రాజు అంగీకరించి మరునాటి సభలో మతపరీక్ష జరగాలని ప్రకటించాడు. 


భట్టపాదుడు లేచి “మహారాజా! ఎవరైతే పర్వత శిఖరాగ్రం నుండి క్రిందబడి బ్రతుకుతారో వారి మతమే శ్రేష్ఠమని ప్రభువులు నిర్ణయిం చాలి" అని కోరాడు. ముందుగా భట్టపాదుణ్ణి దింపు దామన్న భావంతో చార్వాకులు ఒప్పుకొన్నారు ఆ పరీక్షకు. ఈ సంగతి తెలిసిన మహారాణి భట్టపాదుని పిలిపించి అతనితో ఇలా అంది. "మహాశయా! ఏమిటీ ఘోరపరీక్ష? శాస్త్రాలఆధారములు చాలవా? యుక్తియుక్తమైన వాదనలతో వేదముల ఆధిక్యాన్ని నిరూపించ వచ్చు గదా! తొందర పడకండి భట్టూ!” అనిప్రార్థించింది. దానికి సమాధానంగా “అమ్మా! సకల శాస్త్రాలు వేదము అభ్యసించిన పిమ్మట జైన మతం లోని రహస్యాలను క్షుణ్ణంగా తెలిసి కొన్నాను. వేదములు పురుషులు సృష్టించినవి కావు. పరాత్పరుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అవి. వాటికీ భగవంతు నకూ అభేదము. ఈ విషయాలు నిరూపించా లంటే మాటలతో అయ్యేటట్లు లేదు. మాటకుమాట, యుక్తికి యుక్తి కలిగి తెలివి గల వాళ్ళు ఆ శుష్క పద్ధతులకే తల ఒగ్గు తారు. అందు చేత నాకు ఇప్పుడు ప్రత్యక్ష ప్రమాణము కన్న వేరుగతి కనిపించడం లేదు. తల్లీ! పరాత్పరుడు సత్య రూపుడు. ఆ సత్యాన్ని నమ్మిన నాకు భయ మేల?” అని బదులు పలికాడు.


మరునాడు పరీక్ష. పరీక్షకు మొదటి అవకాశం తాను తీసు కొంటానని అభిప్రాయం వెలిబుచ్చాడు భట్ట పాదుడు. చార్వాకులకు అది ఆనందదాయక మైంది. దీనితో తమ కొక పీడ విరగడ అవు తుందనుకొన్నారు జైనులు, బౌద్ధులు, చార్వాకులు! భట్టపాదుడు ఒక ఎత్తైన పెద్ద పర్వతం ఎక్కి అమాంతం క్రిందికి దూకివేసాడు. చెక్కు చెదరకుండా నిక్షేపంగా ఉన్న భట్టపాదుని చూచి ఆ క్షణంలోనే జయజయ ధ్వానాలతో ఆయనకు నీరాజనాలు సమర్పించారు. భట్ట పాదునికి మహారాజ సభలో అగ్రస్థానంలో వేదఘోషల మధ్య సత్కారం చేశారు. సుధన్వ మహారాజు వేదమతమే సర్వ శ్రేష్ఠమనీ,సర్వోన్నతమనీ ప్రకటించాడు. చార్వాకులు అంతటితో వదలి పెట్టలేదు. ఇంద్రజాలం, మంత్ర తంత్ర విద్యలతో భట్టపాదుడు మనల్ని మభ్యపెడుతున్నాడు అన్న వాదనలను లేవదీశారు. రాజు ఆ వాదనలను అంగీక రించ లేదు. అయినా మరొక పరీక్ష పెడదా మని నిర్ణయించాడు. మూతి గట్టిగా బిగించిన ఒక భాండాన్ని తెప్పించి 'ఈ భాండంలో ఏముందో” రహస్యంగా పత్రాలపై లిఖించండి. సరిగా చెప్పగల వారి మతమే గొప్పదని నిర్ణయిస్తాము తక్కిన వారికి మరణ శిక్ష.' అని ప్రకటించాడు. చార్వాకులకు అది ఒక గడ్డు సమస్యగా ఉండి వ్యవధి కోరారు. రాత్రంతా కలిసిఒకచోట మీన మేషాలు లెక్కలు కట్టారు. భట్టపాదుడు కుత్తుక బంటి నీటిలో నిలబడి రాత్రంతా పరమేశ్వరుణ్ణి ధ్యానం చేశాడు. తెల్లవారింది. రాజ్యసభ కిటకిట లాడుతుండగా రాజు పత్రాలు తెమ్మన్నాడు. భాండం లోపల పాము ఉందని చార్వాకులు వ్రాసి ఇచ్చారు.


భట్టపాదుడు అందు శేషశాయి ఉన్నాడు అని వ్రాశాడు. ఇంతలో ‘భట్టపాదునిదేసరియైన ది' అన్న ఆకాశవాణి వినిపించింది. సందేహ నివృత్తి కొరకు భాండము తెరచి చూచారు. రాజు ఆశ్చర్యచకితుడై నాడు. శేషశాయియే కన్పడ్డాడు. నిజానికి రాజు లోన పెట్టినది పామునే. చార్వాకులు ఈ రహస్యాన్ని ఎవరి ద్వారానో సేకరించి ఉంటారు. ఈ పరీక్షలో కూడ భట్టపాదుడే నిర్ద్వందంగా నెగ్గినట్లు ప్రకటించి నాటి నుండి వేదాలే ఆదరణీయాలు అన్న రాజాజ్ఞ వెలువడింది.


అప్పుడు జైన బౌద్ధమతవాదులు రాజుతో ఇలా విన్నవిం చారు: “రాజా! ఇన్నాళ్ళూ ప్రత్యక్ష ప్రమాణం కల వేద మతాన్ని దూషించి మహాపాతకం చేశాము. అవతార పురుషుడైన ఈ మహాత్మునితో పోటీపడ్డాము. మేము శిక్షార్హులం. శిక్ష త్వరలో అమలు చెయ్యండి" అని వేడుకొన్నారు. వారు అంతా కూడి ఇరువది ఒక్కరు. వరుసగా నిలబడి ఉన్నారు. ఖడ్గం పుచ్చుకొని శిరచ్ఛేదం చేద్దామని వధకారుడు సిద్ధమవుతున్నాడు. ఇంతలో అటు నుండి నరకమని కేక విన బడింది.


సరేనని ఆ పని చేస్తుంటే చివర నున్నవాడు అమర సింహడు తాను భట్టపాదునితో మాట్లాడ గోరాడు. ఆ వార్త విన్న మహారాజు భట్టపాదుని తోడ్కొని వచ్చాడు. వారికి నమస్కరించి అమర సింహుడు తన కోరికను ఈ విధంగా విన్నవించాడు: "స్వామీ! లోకోపకార దృష్ట్యా ఒక ఉద్గ్రంధా న్ని రచిస్తున్నాను. అది పూర్తి కావచ్చింది. అది సంస్కృత భాష అధ్యయనానికి మకుటాయ మాన మైనది. నా గ్రంథం పూర్తి అయ్యే వరకు నేను బ్రదికి ఉండడం అవసరం అనిపించి ఈ నా ప్రార్థన మన్నిస్తారని వేడుకొంటున్నాను. ఇది జీవితాశతో కోరు కొంటున్నది కాదు”. తరువాత తన గ్రంథము లోని కొన్ని శ్లోకాలనువినిపించాడు.

వెంటనే భట్టపాదుడు అది అత్యంత విశిష్టమైన గ్రంథము. అట్టి గ్రంథ రచయితను లేకుండా చేసి లోకానికి లోటు కలిగించ కూడదని చెబుతాడు. వధ మానిపించాడు. ఆ గ్రంథమే ‘అమర కోశము' అనే పేరుతో ప్రఖ్యాతి గాంచినది.


*తుషానల ప్రవేశము*:


'కర్మాచరణము కన్న మానవునకు కావలసినది వేరొండు లేదనే దృఢసంకల్పంతో చేసిన కృషిలో సఫలీకృతుడనయ్యాను. ఈ యత్నంలో కపటవేషం ధరించి గురుద్రోహం చేశాను. ఈ పాపానికి నిష్కతిగా నాకు నేనే శిక్ష విధించు కోవాలి' అని నిశ్చయించుకొన్నాడు కుమారిలభట్టు! ఊకను రాశిగా పోయించి అందులో తాను పరుండి నిప్పును తానే ముట్టించు కొన్నాడు. ఇలా చేస్తున్నాడన్న వార్త తృటిలో దేశ మంతా వ్యాపించి శంకరాచార్యుడు కుమారిల భట్టును దర్శించడానికి బయలు దేరాడు.


"కుమారిలా! ఏమిటీ ఘోరము? నీవు అపరాధాలు చేసే వాడవా? ఎందుకీ క్రూర కార్యం చేపట్టావు?” అని శంకరుడు అడుగగా "శంకరానందస్వామీ! మీరు ఇచ్చటికి వచ్చి నాకు తమ దర్శన భాగ్యం కల్పించారు. ధన్యుణ్ణి. నేను రెండు అపరాధములు చేసిన వాడను. ఒకటి శిష్యరికం కపటంగా చేసి ఆ గురువు మతాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకొన్న గురుద్రోహిని. రెండవది ఆత్మ తత్త్వాన్ని మరుగుపరచి కర్మ వాదాన్ని ఒక్కటీ అమలు పరచిన వాడను. అందు వలన ఆత్మద్రోహం చేశాను. దీనికి శాస్త్రరీత్యా తుషానల ప్రవేశం చేసి సజీవ దహనమే ప్రాయశ్చిత్తము” అని వినయంగా సమాధాన మిచ్చాడు కుమారిలభట్టు. 


అందుకు శంకరుడు "భట్టాచార్యా! నీవు కర్మమతాన్ని ఉద్ధరించు టకే కదా అవతార మెత్తితివి! నీవు చేయదలచినదంతా చేశావు. పవిత్రుడవు నీకు ప్రాయశ్చిత్త మెందుకు? లెమ్ము. ఈ శిక్ష మానుకొమ్ము!” అని ఆదరంగా పలికాడు శంకరుడు.


"అవతారమూర్తీ! నీకు తెలియనిదేమున్నది? సృష్టి స్థితి సంహారాలు నీ అధీనములు. శాస్త్రాన్ని కాదన జాలను. కాదంటే ప్రపంచమే నన్ను నిందిస్తుంది. ఇది మీకు తెలియనిది కాదు. నన్ను బ్రదికించడం తమ కొక లెక్కా? మీరు కేవలం శివావతారులు. మీకు జయం తప్పదు. మాహిష్మతీపురంలో మండనమిశ్రుడను పేరు కలవాడు ఉన్నాడు. అతడు నా శిష్యుడు. నా యంతటి వాడు. అతని భార్య అపర సరస్వతి. సూత్రభాష్యా నికి వార్తికాలు వ్రాయగల సమర్థుడు అతడే. ఆతనిని జయిస్తే మీ అవతార ఆశయం నెరవేరు తుంది. పరాత్పరా! అవసానకాలమందు అవతారమూర్తుల సన్నిధానం లభించడం నా పూర్వపుణ్యఫలం. నాకు ఆత్మ తత్త్వాన్ని ఉపదేశించి సర్వబంధ విముక్తుణ్ణి చేయండి" అని ప్రార్థించిన కుమారిలుని కోరిక మన్నించి తత్త్వోపదేశం చేయగా మరుక్షణం కుమారిలుడు బంధనా లను త్రెంచుకొని ముక్తుడై మౌనం దాల్చి కన్ను మూశాడు.తుషానలం ఒక్కసారి గుప్పుమన్నది. కుమారిలుడు కైవల్యం చేరుకొన్నాడు.


*ప్రభాకరాచార్యుడు:*

ప్రయాగ కెదురుగా గంగానదికవ్వల ఒడ్డున ఉన్నది ప్రతిష్ఠాన పురం. ఒకప్పుడు చంద్రవంశపు రాజులు దాన్ని రాజధానిగా చేసికొని పరిపాలించే వారు. ఒకప్పుడు అది దగ్ధం కాబడి నేటికీ శిథిలావస్థలో కాన వస్తుంది. కుమారిల భట్టు శిష్యులలో ఒకడు ప్రభాకరా చార్యుడు అనే వాడు ఆ పట్టణంలో నివసిస్తున్నాడు. అతడు మహాపండితుడు. కర్మ కాండ యందే నిష్ఠతో యజ్ఞ యాగాది క్రతువు లెన్నో చేసి దేవతలను తృప్తి పరచేవాడు. కర్మకాండలో నూతన పద్ధతులను ప్రవేశ పెట్టినవాడు. తనంతటి వాడు లేడన్న ధైర్యంతో ఎవ్వరినీ లెక్క చేసేవాడు కాడు. అందు చేతనే కాబోలు శంకరాచార్యుల ప్రశస్తి విన్నా శంకరుని దర్శనానికి వచ్చే యత్నం చేయలేదు. ప్రయాగలో ఉండగా శంకరునికి ఆయన సంగతి తెలిసి ప్రభాకరాచార్యుని చూడడానికి శంకరా చార్యులే బయలు దేరాడు. తన్నుచూడడా నికి వస్తున్నాడంటే తానే అధికుడననే భావన చోటు చేసు కుంది ప్రభాకరా చార్యుని మనస్సులో!


శంకరాచార్యులను కలిసిన తర్వాత ఆ మనోదౌర్బల్యం చెల్లా చెదరయ్యింది. శంకరుని తన మతంలో కలుపుకొనడానికి ఇది మంచి అదనని కలగన్న ప్రభాకరుడు శంకరుల వాక్పటిమకు తట్టుకోలేక దాసోహమన్నాడు. ఆ శ్రీ శంకరాచార్య వాఙ్మయ మహా సముద్రంలో ఎన్ని ఏఱులు అప్పటికే చేరాయో కదా! ఇదొక లెక్కా! 


ప్రభాకరాచార్యులకు ఒక మూగగా పుట్టిన కొడుకు ఉన్నాడు. అప్పటికి పదమూడేండ్ల వయస్సు. పేరు పృథివీ ధరుడు. అయిదేళ్ళ ప్రాయంనుండి మాటా మంతీ లేకుండా మౌనంగా ఉండి పోయాడు. అతనికి పైపెచ్చు ప్రాపంచిక దృష్టి లేదు. అమ్మా అని పిలిచి ఎరుగడు. వైద్యాలకు ఏ విధం గాను పిల్లవాడి పరిస్థితి మెఱుగుపడటం లేదు. శ్రీశంకరుల దగ్గరకు తీసికొని వచ్చి "స్వామీ! ఈ నా పుత్రుని మామూలు మనిషిగా మార్చగల సర్వశక్తి సంపన్నులు మీరు.


నా పైన దయతో మమ్ములను కాపాడ వలసినదనిప్రార్థించాడు ప్రభాకరాచార్యుడు.


శంకరాచార్యుడు ఆ బాలుని బాగుగా పరిశీలించారు. అంతర్గర్భితమైన గొప్ప భావాలు ఆ బాలునిలో ఉన్నట్లు తెలిసి కొన్నారు. తండ్రిది కర్మజీవనం. ఆ వయస్సులోనే బాలునికి జ్ఞానదృష్టి పెంపొంది తనతో మాటలాడి తన భావాలు వినేవారు ఎవ్వరూ లేరన్న నిర్ధారణతో చిన్నప్పటి నుండే మౌనం వహించినటుల తెలిసిపోయింది శంకరునికి. ప్రేమ, ఆదరము చూపి బాలుని యథా జీవన స్రవంతి లోనికి తేవచ్చు నని గ్రహించారు. బాలకుని తలపై చేయి వేసి “బాలకా! నీవు ఎవ్వడవు? నీకు ఎవరితో సంబంధ మున్నది? ఎక్కడి నుండి ఇక్కడికి వచ్చావు? నీ పేరేమిటి? నాప్రశ్నలకు సమాధాన మిచ్చి నన్ను సంతోష పెట్టుము” అని అడిగారు శంకరస్వామి.


*హస్తామలకుడు:*


శంకరాచార్యుల వారి ప్రశ్నలకు ఆ బాలకుడు ప్రబుద్ధుడై, వెనువెంటనే అపూర్వమైన వాగ్ధాటి తో ఈ క్రింది శ్లోకాలుగా సమాధానాలు చెప్పాడు:


*“నాహం మనుష్యో న చ రేవ యక్షా,*

*న బ్రాహ్మణో నైవచవైశ్య శూద్రాః*

*న బ్రహ్మచారీ న గృహీ వనస్థో,*

*భిక్షుర్న చాహం నిజబోధ రూపః|*

*మనశ్చక్షురాదేర్వియుక్తః స్వయంయో,* 

*మనశ్చక్షురాదే ర్మనశ్చక్షురాదిః*

*మనశ్చక్షురాదే రగమ్యస్వరూపః*

*సనిత్యోపలబ్ధి స్వరూపోహమాత్మా!॥*


అట్లు పృథివీధరుడు తన అనుభూతిని శంకరాచార్య స్వామికివిన్నవించు కొన్నాడు. విన్న అందరూ ఆ దృశ్యాన్ని చూచి విభ్రాంతులయ్యారు. శంకరుని మహిమకు జోహారులర్పించారు. ఆమలకం హస్తంలో ఎంత స్పష్టంగా కనిపిస్తుందో ఆత్మ తత్త్వం పృథివీధరు నిలో వ్యక్తం కావడంతో అతనికి ‘హస్తామలకుడు' అని నామకరణంచేశారు శంకరాచార్యులు.


అప్పుడు శంకరుల వారు ప్రభాకరా చార్యునితో "ప్రభాకరా చార్యా! చూచావు కదా! ఈ నీ పుత్రుడు ఎట్టివాడో! ఈతడు సర్వజ్ఞుడు. ఇటు వంటి వాళ్ళు చూచే వాళ్ళకు పిచ్చివాళ్ళలా కనబడ తారు. ఇతడు నీ దగ్గఱ ఉండడం కల్ల. వీని చిత్తమేనాడో పరమేశ్వ రాయత్త మయింది. బాహ్య ప్రపంచంతో నిమిత్తం లేనివాడు. మాతో ఉండదగ్గవాడు. కావున నాతో పంపి వేయి” అని చెప్పగా అంగీకరించి సంతోషం తో కుమారుని శంకరులకప్పగించాడు. ఈ విధంగా పృధివీ ధరుడు హస్తామలకుడుగా శ్రీశంకరాచార్యుల శిష్యుడు అయ్యాడు.


*కాలడి శంకర కైలాస శంకర*

*శ్రీ శంకరాచార్య చరిత్రము* 

*16 వ భాగము సమాప్తము* 

🥦🥦🥦🥦🥦🥦🥦🥦🥦🥦🥦🥦


_*శ్రీ శంకరాచార్య చరిత్రము 17 వ భాగము.*_

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻


*మాహిష్మతీ పురము:*


మాహిష్మతీపురంలోని మండనమిశ్రుని కలవాలని ఆయత్త పడుచున్నారు శంకరా చార్యులు. అది చాలా దూరంలో ఉంది. ఎక్కడికి వెళ్ళాలన్నా కాలినడకే తప్ప వేరు సాధనాలు లేనిపరిస్థితి. ఈనాడు యంత్రాలతో జరుగుతున్నవి ఆనాడు యోగశక్తులతో జరిగేవి. వ్యవధి చాలా తక్కువ గా ఉండడంతో యోగ బలంతో శంకరుడు శిష్యపరి వారంతో సహా గగనమార్గాన మాహిష్మ తీపురం సమీపించారు. దగ్గరలో నున్న ఒక చక్కని ఉద్యానవనంలో ఒక చెట్టు నీడన విశ్రాంతి తీసికొన్నారు.


మాహిష్మతీపురం ఆ నాటి మహానగరాలలో ఒకటిగా పేరెన్నిక గన్నది. తారలకెగబ్రాకు సౌధరాజములు, బహు సుందరమైన దివ్య భవనాలు వారికి దర్శన మిచ్చాయి. బిందెలు చంకన పెట్టుకొని వచ్చే పరిచారికలు కనబడగా మండనమిశ్రుని నివాస గృహం జాడఅడిగారు శిష్యులు. ద్వారం దగ్గర 

పంజరాలు, అందులో రామచిలుకలు, గోరు వంకలు ఉంటాయి. అవి ఈవిధంగా చర్చిస్తుంటాయి:


“స్వతః ప్రమాణం, 

పరతః ప్రమాణం

ఫలప్రదం కర్మ

ఫల ప్రదోషః

జగధ్రువం స్యా 

జ్జగ దధ్రువం స్యాత్”


అని గీర్వాణభాషలో బదులు పలికారా భామలు! చిలుకలు, గోరువంకలు, పరిచారిక లు సంస్కృతంలోనే మాటలాడడం చూచిన వారంతా ఆశ్చర్య పడ్డారు ఆ మండన మిశ్రుడు ఇంక ఎంత మహా పండితుడో కదా అని. శిష్యులకు ఆ చిలుక పలుకులకు అర్థం తెలియక తికమకపడి గురువు గారిని అడిగారు. అపుడు శంకరులు “చిలుకలు మన మాడిన మాటలే విన్నంత మాత్రాన తిరిగి చెప్పుతాయి. వాటికి ఆ నేరుపు ఉండడం సృష్టివిచిత్రం. దేశంలోని పండితులకు అన్నీ సందేహాలే. మండనమిశ్రుని వద్దకు వచ్చి అడుగు తుంటారు. శాస్త్ర ఆధారాలతో వారి సందేహనివృత్తి చేస్తాడు మండనమిశ్ర పండితుడు. ఆ ప్రశ్నలూ జవాబులూ వినిన చిలుకలు వాటినే మననం చేసుకొంటూ ఉంటాయి. మనకు చెప్పిన మాటలకు అర్థం ఇది.


మీమాంసకులు స్వత: ప్రమాణము అందురు. జ్ఞానులు అపౌరుషే యాలు అంటారు. మిగిలిన వాళ్ళు పరత ప్రమాణములంటారు. అంటేపౌరుషేయాలని. తరువాతి దానికిది మూలం: ఎవడు చేసికొన్న కర్మననుస రించి దాని ఫలాన్ని వాడే పొందుతాడు. సత్కర్మ అయితే సత్ఫలితాన్నీ, దుష్కర్మ అయితే చెడ్డ ఫలితాన్ని పొందుచున్నాడు. దుఃఖ ప్రారబ్ధమయినా, సుఖ ప్రారబ్ధమయినా అనుభవించి తీరాలని శాస్త్రాలు ఎలుగెత్తి చాటుతున్నాయి. ఇందులో పరాత్పరునికి సంబంధంలేదు. అతడు కర్మనూ ఇవ్వడు ఫలితాన్నీ ఇవ్వడు. కేవలం సాక్షీభూతుడు.


ఇంక మూడవ భాగం : జగత్తు నిత్యం కాదని వేదాంతులంటారు. త్రాడును చూచి పాము అనుకొంటారు. అది పాము కాదని తేలే వరకు అది పాము లాగే కనిపిస్తుంది. త్రాడు పాము కాదని తెలిసిన తర్వాత త్రాడు త్రాడుగనే ఉంటుంది. అలాగే జగత్తును తెలిసికొన్న తర్వాత జగత్తు అనిత్యమే అవుతుంది. ఇది ఇట్లుండగా విజ్ఞులు జగత్తును 'మిథ్య' అన్నారు. చూపులకు నిజంలా గోచరిస్తుంది. అట్టిది నిజం కానిది ఎట్లు? ఈ జగత్తు ఒకప్పుడు నాశం కావలసిందే. అందుకే దీనిని 'మిథ్య అన్నారు.” అని వివరంగా బోధించారు. 


పరిచారికలు చెప్పిన గుఱుతులు ఆధారంగా తెలిసికొన్నారు వారు మండనమిశ్రుని ఇల్లు. అది మహారాజ గృహంలాఉంది. శంకర బృందాన్ని చూచిన చిలుకలు కిలకిలా రావాలు చేశాయి.


మండనమిశ్రుని ఇంట ప్రవేశము:


సింహద్వారం గట్టిగా బిగించబడి ఉంది. అన్ని ద్వారాలు మూసివేయబడి ఉన్నాయి. ఇక మార్గాంతరం లేక శిష్యుల్ని అరుగు మీద కూర్చోబెట్టి శంకరుడు ఒక్కసారిగా గగనాని కెగిరి మండువా లోనుండి ఇంట్లోనికి ప్రవేశించాడు. శంకరుని సమదృష్టి పుట్టుకతో వచ్చినదే. ఇది నా ఇల్లు అది వారిది అన్న భేదం ఆయనకు ఎప్పుడూ లేదు. ఆ రోజు మండనమిశ్రుని తండ్రి తద్దినం. ఏ లోపమూ రాకూడదని గృహద్వారాలు అన్నీ మూసివైచాడు. భోక్తలు మరెవరో కాదు. విష్ణు సన్నిభుడైన వ్యాస మహర్షి. ఆయన శిష్యుడు జైమిని మహర్షి! 


మంత్రపూతంగా వారిద్దరినీ ఉచితాసనాలపై కూర్చుండ బెట్టి కాళ్ళు కడుగుతున్నాడు మండనమిశ్రుడు. 


ఆ సమయంలో శంకరా చార్యస్వామి ఆ ముగ్గురి ఎదుట ప్రత్యక్ష మయ్యాడు. కర్మ భ్రష్టులన్నా యతులన్నా మండనుడు మండి పడతాడు. వాళ్ళను చూస్తేనే సచేల స్నానం చేయాలన్న మతమా యనది. తలుపులన్నీ బిగించి ఉన్నా ఎలా చొరబడ్డాడీతడు? అని కోపంతో పరవళ్ళు త్రొక్కుచున్నాడు. ఆ నాడు బౌద్ధ భిక్షువుల ప్రాబల్యం మూలాన వేదమతస్థులలో సన్న్యసించే వారు తక్కువ. అందుచేత సన్న్యాసులకు ఆదరణ లేదు. తద్దినం పెట్టే టప్పుడు మౌనంగా ఉండాలన్న నియమాన్ని కూడా త్రోసిపుచ్చి మండనమిశ్రుడు అతి క్రుద్ధుడై చింత నిప్పుల లాంటి కళ్ళతో శంకరుని ఇలా అడిగాడు:


మండనుడు: కుతో ముండీ! (ఓ బోడీ! ఎక్కడ నుండి నీ రాక? ఎక్కడి వరకు ముండ నం చేసి కొన్నావు?)


శంకరుడు: ఆగళాన్ముండీ! ( కంఠం వఱకే ముండనం చేయించు కొన్నాను. కంఠం వరకే క్షౌరం చేయించుకొనే వాడను)


మండనుడు : పన్థస్తే పృచ్ఛతే మయా. (నీ మార్గము నాచే

అడుగబడుచున్నది)


శంకరుడు: కిమాహి పంథా: (నిన్ను గూర్చి మార్గ మేమనెను?)


మండనుడు : త్వ న్మాతా ముండే త్యాహ! (ముండ అని చెప్పింది మీ యమ్మ!)


శంకరుడు : తథైవహి! (బాగు! బాగు! నీవు మార్గం అడిగి నందుకు మీ అమ్మ ముండ అని నీకు తగినదేచెప్పింది!)


మండనుడు : సురా పీతా కిమ్? ( కల్లు త్రాగావా ఏమిటి? కల్లు పచ్చగా ఉంటుందా?)


శంకరుడు : నైవ శ్వేతాయత స్మర! (కల్లు పచ్చగా ఉండదు. తెల్లగ ఉంటుంది. మరచితివా! జ్ఞాపకం తెచ్చుకో!)


మండనుడు : త్వం తద్వర్ణం జానాసి కిం? (నీకు అలవాటు కనుక దాని వర్ణం బాగా తెలుసు కాబోలు!)


శంకరుడు : అహం వర్ణం, భవా న్రసం! (నాకు రంగు తెలిస్తే నీవు రుచి తెలిసిన వాడవు!)


మండనుడు : మత్తో జాత: కలం జాశీ విపరీతాని భాషతే! (కలంజ భక్షణంతో విపరీతంగా మాటాడు చుంటివే! నా వలన కుమారుడు కలంజాన్ని తిన్న వాడై విపరీతంగా మాట్లాడుచున్నావు)


శంకరుడు : సత్యం బ్రవీతి! పితృవ త్వత్తో జాత: కలంజ భుక్! (నా వలన కలంజం తినువాడు పుట్టెనని నిజమే పల్కావు!)


మండనుడు : కంథాం సహసి దుర్బుద్ధే! గర్దభే నాపి దుర్వహమ్! శిఖాయజ్ఞోపవీతాభ్యాం కస్తే భారో భవిష్యతి? (దుర్బుద్దీ! గాడిద మోయలేని బరువును ఎలా మోస్తున్నావు? జుట్టూ జందాలు బరువయ్యాయా?)


శంకరుడు : దుర్బుద్ధే! తవ పిత్రాపి దుర్భరామ్ కన్థం వహామి శిఖా యజ్ఞోపవీతాభ్యాం శ్రుతిర్భారో భవిష్యతి! (మీ తండ్రి మోయలేని బరువును మోస్తున్నాను. శిఖాయజ్ఞోప వీతాలు శ్రుతికి బరువు కాని నాకు కాదు. శ్రుతులు చదువ లేదా? విరాగులైన యతులకు అది ధర్మమే. నా ధర్మం గ్రహించే శక్తి నీకు లేకపోయింది!)


మండనుడు: వేదవిహితంగా పెళ్ళాడి పెళ్ళాన్ని పోషించలేక ఆమెను విడచి, శిష్యులంటూ ప్రోగు పెట్టుకొని వాళ్ళచేత మూటా ముల్లె మోయిస్తూ త్రిప్పుకొనే నీ బండారం బయటపడిందిలే! ఇదంతా వేషంగాక మరేమిటి?


శంకరుడు: బ్రహ్మచారివై గృహాన్ని విడిచి గురువు నాశ్రయించి సకల విద్యలు నేర్చి అందులో ఉన్న రహస్యాన్ని గ్రహించలేక స్త్రీలోలుడైన వానికి బ్రహ్మసాక్షాత్కారం పొందాలంటే ఏం తెలుస్తుంది?


మండనుడు: నవమాసాలూ మోసి కని పెంచే తల్లులనే దూషిస్తున్నావు. ఇంత కన్న దారుణముందా?


శంకరుడు : ఎంత తెలివి లేనివాడవోయి! నేనేమీ తల్లిని దూషించడం లేదు. ఆడుదాని యోని నుండి బయట పడ్డావా! ఆమె స్తన్యం కుడిచితివా! అలాటి ఆడు దాని కుచాలను పట్టి కులుకుతావా! పుట్టిన స్థానాన్నే కామిస్తావా! నీకు పశువులకు తేడా ఏమిటి?


మండనుడు: త్రేతాగ్నులను వదలితే వీరహత్యను పొందు చున్నాడని వేదాలే వచిస్తున్నవి. ఇది నీకు ధర్మమే?


శంకరుడు: భవబంధనాలను తెంచే వేదాంత తత్త్వాన్ని తెలిసికోని వాడు ఆత్మహత్య చేసికొన్నట్లే అని వేదంలోనే ఉన్నది. అన్నిటి కన్న మిన్న కదా ఆత్మ హత్య!


మండనుడు: తలుపులు బిగిస్తే లోనికి రాకూడదన్న జ్ఞానం ఉండ నక్కఱలేదా? దొంగ వలె దూరావు!


శంకరుడు : డేగ ఆహారాన్ని తన్నుకొని దూరంగా పోయి మ్రింగుతుంది. ఆ డేగ వలె యతుల కివ్వ దగ్గ దాన్ని ఇవ్వకుండా చేస్తున్నావు. కర్మాను ష్ఠానం చేయడం లేదా? గృహస్థాశ్రమంలో ఉండి ఎవరికీ కనిపించకుండా అతిథుల్నీ అభ్యాగ తుల్నీ పూజించడం మానుకొన్నావా?


మండనుడు : కర్మకాలే న సంభాష్య అహమ్! (పవిత్ర మైన శ్రాద్ధకర్మ సమయంలో ఒక మూర్ఖునితోసంభాషించ వలసి వచ్చిందే!)


శంకరుడు: పండితుడవే! కవివే! విద్య లేని వాని వలె, సామాన్యుని వలె మాటాడుచున్నావు. నీవు అనవలసినది 'కర్మకాలే న సంభాషాహమ్!’ యతి భంగంగా మాటలాడే తెలివి కలవాడివి!


మండనుడు: యతిభంగానికై వర్తించే వానికి యతిభంగ దోషం రాదులే!


శంకరుడు : యతిని అవమానింప వచ్చన్న మాట? 


మండనుడు : ఈ కలి లోనా సన్న్యాసం? దురాచారాలు, దుష్ట బుద్ధులుచెలరేగుతుంటే బ్రహ్మజ్ఞానమా? పలురకాల రుచుల కోసం కాక యోగివేషా లెందుకు?


శంకరుడు: అవునులే! కలికాలంకాక ఇలాంటి దురాచారాలు అగ్ని హెూత్రాలు ఎందుకు? విషయ వాంఛలు చంపుకోలేక వేసే వేషాలు కాక?


మండనుడు : జడుని వలె అయిపోయావు. అందుకే వేదాలకు వ్యతిరేకంగా పలుకు తున్నావు!


శంకరుడు: పాంచభౌతిక శరీరమే జడం. చిదాత్మ కాదు.


మండనుడు: దరిద్రుడా! పరమ పవిత్రమైన పురుష జన్మ ఎత్తి జడత్వాన్ని పొంది ?


శంకరుడు : యతిని పూజింపని వాడే దరిద్ర చక్రవర్తి!


మండనుడు: మాటలు మంచిగా రావా?


శంకరుడు : పాపం చేస్తే మాటలు పరుషములవుతాయి.


మండనుడు : దొంగవై దొంగలచే ఆశ్రయింప బడ్డావు.


శంకరుడు: అరిషడ్వర్గాలచే పీడింపబడ్డవాడే దొంగలచే ఆశ్రయింప బడిన వాడని తెలిసికోలేవా?


మండనుడు : నా పిలుపు లేకుండా నా ఇంట్లో ఏల ప్రవేశించావు?


ఆ వాద ప్రతివాదనలు ఇప్పుడప్పుడే ముగిసే లా లేవని ఎంచిన వ్యాసమహర్షి కలుగ జేసికొని మండన మిశ్రునితో ఇలా చెప్పాడు:


"మండనమిశ్రా! తనంతట తానుగా వచ్చిన యతిని ఆదరింపక ఏవేవో అసందర్భపు మాటలు చెబుతావెందుకు? వచ్చిన యతి సామాన్యుడుకాదు. విజ్ఞానఖని. స్వయంగా వచ్చిన అభ్యాగతుడు విష్ణువుతో సమానుడై యుండగా పూజించడం మాని దూషిస్తున్నావు. నీ యింటికి నిజంగానే విష్ణువు వచ్చి యున్నాడు. ఆలస్యం చేయక యతిని ఆనందంతో యథావిధి గా సత్కరించు.” వ్యాస మహర్షి ఆజ్ఞతో మండనమిశ్రుడు కోపం చంపుకొని శాంతం వహించాడు.


*కాలడి శంకర కైలాస శంకర* 


*శ్రీ శంకరాచార్య చరిత్రము* 

*17 వ అధ్యాయము సమాప్తము*

🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

*శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము 15

 _*శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము 15 వ భాగము.*_ 

❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️


*విజయ యాత్ర:&


వాదోపవాదములు చేసి శత్రువులను జయించమని ఈశ్వరుని ఆజ్ఞ. విష్ణుసన్నిభుడైన వ్యాసభగవానుని బోధ. ఇక జ్ఞాన యుద్ధమే తరువాయి.


ధర్మయుద్ధమైన కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణపరమాత్మ అండ పాండవులకు లభించినట్లుగానే శివకేశవుల కరుణ శ్రీశంకరాచార్యులకు లభ్యమైంది. అర్జునుని అక్షయ తూణీరాల వంటివి శంకరుని సూత్ర భాష్యాలు. పార్థునకు దివ్యరథాలు ప్రాప్తించి నట్లు శంకరునికి ఉపనిషత్తులు చాలు. పదునెనిమిది అక్షౌహిణుల సేనల పోరాటమది. పదునెనిమిది రోజులుగా సాగినది. పదునెనిమిది అధ్యాయాల భగవద్గీత శంకరుని హృదయంలో చేరింది. ద్రుపద పుత్రుడు ధృష్టద్యుమ్నుడు పాండవ సేనకు అధ్యక్షుడైనాడు.


ఇక్కడ 'స్వయం మంత్రీ స్వయం రాజా' అన్నట్లుగా శ్రీశంకరుడే అన్నీ నిర్వహిస్తాడు. అర్జునునకు తోడుగా నలుగురు సోదరులు ఉండగా ఇక్కడ దిగ్గజాల లాంటి పద్మ పాదాది శిష్యప్రకాండు లున్నారు. పాండవుల పక్షాన ధర్మము ఉన్నట్లే శంకరుని పక్షాన ధర్మముతో కూడిన ఆత్మవిశ్వాస శక్తి ప్రబలంగా ఉన్నాయి.


పాంచజన్యాన్ని మధు సూదనుడు, దేవ దత్తాన్ని విజయుడు పూరించి నట్లు ఒక సుముహూర్తాన శ్రీశంకరాచార్యుడు తత్త్వ శంఖారవం చేశారు. ఆ శంఖా రావము కాశీలోనే కాదు యావద్భారత దేశములోని ధర్మ శత్రువుల గుండెలు దద్దరిల్లేలా వినిపిం చింది. విన్న యతులు, యోగులు, ముముక్షువులు, సాధుజనులు కర్ణానందంగా విన్నారు. ఆ అవతార మూర్తి రాకకై చంద్రునికి సముద్రునిలా ఎదురు చూస్తు న్నారు. గంగాస్తవాలు చేసికొంటూ, గంగాస్మర ణలతో తనకు దగ్గరలోనే మెలగు చున్న శంకరసేనను చూచి గంగ ఉత్తుంగ తరంగాలతో ఉప్పొంగి పోతోంది. హరిహరులకు భేదము లేదని ఆచార్యులవారు బోధించేవారు. శంకరాచార్యుని వైష్ణవులు సాక్షాద్విష్ణువుగాను, శైవులు సాక్షాత్తు శివునిగాను భావించి నమస్కరించేవారు. శివుడు, విష్ణువు, సూర్యుడు, గణపతి, అంబిక అనే పంచాయతనాన్ని పూజించమని ఆదేశించేవారు. అందు ఎవరికి ఏది అభిమతమో దానిని ప్రధానంగా ఎంచి అర్చించు కొమ్మన్నారు. ఆనాడు శంకరుని వాక్కు వేదవాక్కు, శంకరాచార్యుల బోధాసుధారసం హృదయాంత రాళాలలో స్థిరీకరించని వారు లేరు. ఎండ మిక్కుటంగా ఉన్నపుడు చెట్లనీడల నాశ్రయించి విశ్రమించేవారు. సూర్యుడస్త మించు వరకు ప్రయాణము సాగిస్తూ సంధ్యను ఉపాసిస్తూ, రాత్రి వేళల గంగాతీరమందే ఉండి నిద్రించువరకు ధర్మ ప్రవచనాలతో కాలక్షేపం చేసేవారు.సర్వభూతాలు ఆ వైదిక వాక్కులకు పరవశ మయ్యేవి. దారిలో ఆచార్యుల బోధలు విన్నవారు ఈ శిష్యపరి వారంలో చేరి వీరివెంట వచ్చేవారు. శంకరపరివారం అలా దినదినాభివృద్ధి చెందింది. వారు వెళ్ళే దారిలో చరణాద్రి, తరువాత వింధ్యాద్రి కనిపించాయి. ఆచార్యుల వారు శిష్యులకు చెప్పారు వింధ్యాద్రి కథ. అగస్త్యుడు ఎలా ఆ నగాన్ని అణచి వుంచాడో.


*ప్రయాగ మహిమ:*


ప్రజాపతి బ్రహ్మ యాగాలనేకం చేసిన చోటు అవడం చేత దానికి ప్రయాగ అనే సార్థకనామం ఏర్పడింది. 'ప్రజాపతి అగ్ని వేది' అని కూడా దానికి నామాంతరం ఉన్నది. ఏ అంత రాయం లేకుండా అక్కడ నిరంతరం అగ్నికుండాలు వెలుగు తుండేవి. నూరు యాగాల ఫలితాన్ని మించిన ఫలం ప్రయాగలో నివసించినవారికి లభిస్తుంది. ఈ రహస్యం తెలిసిన మునులు మున్నగు వారెందరో అక్కడే నివాసం ఏర్పరచుకొని ఉంటారు. చతుర్వేదాధ్యయనం, రాజసూయ యాగం, నిత్యసత్య వ్రతం ఆచరించిన ఫలం ప్రయాగ తీర్థాన్ని దర్శించి సేవిస్తే వస్తుంది. భరతునికి భరద్వాజ మహర్షి విందు చేసినది ఈచోటనే. శ్రీరామ చంద్రుడు తన పాదధూళితో పావనం చేసిన భరద్వాజ ఆశ్రమం ఉన్నచోటు ఇదే. బహ్మ చతుర్వేదాలనూ వెలువరించినది ఇచ్చోటనే. అట్టి పరమ పవిత్ర మైన ప్రయాగను శంకరా చార్యుడు శిష్యగణం తో దర్శించుకొన్నాడు.


*అక్షయ వట వృక్షము* :


కల్పాంతంలో సకలమూ నశించగా శ్రీమహావిష్ణుని దయచేత

మార్కండేయమహర్షి మాత్రం సజీవుడై ఉంటాడు. అలా ఉండడానికి ఆశ్రయం ఇచ్చి నశ్వరం కానిది ఆ మహావట వృక్షం. ఆ వటవిటపి కథ అపూర్వం.


మొగలాయిల ప్రభుత్వకాలంలో హైందవ మతాన్ని కూల ద్రోసి వారి మతాన్ని మాత్రమే భారతదేశంలో నిల బెట్టడానికి వారు చేసిన యత్నాలు ఇంతా అంతా కాదు. అగ్బరు పాలనలో జరిగిందిది. ఈ వటవృక్ష మహిమ విని తమ మత వ్యాప్తికి పెద్ద అంత రాయంగా ఇది ఉందనుకొన్నారు. "అగ్బరు ది గ్రేట్!" అనే బిరుదు అంటించారు అగ్బరు కు పాశ్చాత్య చారిత్రకులు. సర్వమత సహనం కల వాడన్న పొల్లు గుణం కూడా ఆ మహావ్యక్తికి ఆపాదించారు. ఆయన చేసిన మతసహన మహాకార్యం ఏమిటి? ఆ వృక్షం ఆర్ష మతానికి ఆలంబనం గా ఉందన్న భావనతో దాని కొమ్మలు నరికించి మ్రోడుగా చేశాడు! మర్రి చావలేదు సరిగదా సహస్రముఖాలుగా చిగిర్చి ఇతోధిక ప్రాబల్యం సంతరించు కొంది. 


అగ్బరు గతించినా ఆతురుష్కుల ‘మత అసహనగుణం’ మాత్రం అంతరించ లేదు! తండ్రికి పట్టిన పిచ్చి వదలని జహంగీరు చెట్టు మొదల్నే నరికించాడు ఔరా! మన మహా విటపి మాత్రం మరింత చైతన్య శోభతో విస్తరిల్లింది. పట్టు వదలని ఆ రాజు మరగకాచిన నూనెనుపోయించాడా తరువు మొదట్లో! అయినా చెక్కు చెదరక నేటికీ కోటలా ఉన్న ఆ చెట్టు అక్షయవృక్ష మనే సార్థకనామంతో విరాజిల్లు తోంది.


గంగా యమునా సరస్వతులు ప్రయాగ లో కలిసి త్రివేణీ సంగమమయ్యింది. ఈ తీర్థంలో స్నాన మాడిన వారికి పరమ కైవల్యపదం లభిస్తుంది. కోరికలతో స్నానమాడితే సఫలీ కృతులవు తారు. లక్షలాది జనాలు నిరంతరమూ వచ్చి ఆ ప్రయాగ గంగలో మునిగి అనంతమైన పుణ్యాలు మూట కట్టుకొని పోతుంటారు. 'కుంభమేలా’ జరిగేది ఇక్కడే. యాత్రికులు హిరణ్యాలు పెట్టి పితృతర్పణాలను అర్పిస్తారు. అమావాస్య నాటికి ప్రయాగ చేరుకొన్న శంకరబృందం త్రివేణీ సంగమ స్నానము ఆచరించారు.


,*కుష్ఠురోగి బాగుపడుట:*


శిష్యు డొకడు అక్షయ వటవృక్షాన్ని చూద్దా మని వెళ్ళాడు. అక్కడ ఒక కుష్ఠురోగి ఆత్మహత్యాప్రయత్నంలో ఉన్నాడు. కాళ్ళు, చేతులు, శరీరమంతా పుండ్లు పడి రక్తహీన మైన శరీరం తెల్లబడి చెప్పరాని బాధ పడుచున్నాడు. ఎందులకీ పాడు జన్మ అని విరక్తుడై ప్రాణత్యాగానికి సిద్ధ పడిన వానిని చూచి బ్రతికించాలన్న బీజాంకురం శిష్యుని హృదయంలో మొలకెత్తింది.


ఎలాగో గురువుగారి కడకు చేర్చాడా దీనుణ్ణి. శంకరాచార్యుని సన్నిధానంలో ఉన్న వారంతా కుష్ఠురోగిని చూచి దూరంగా తొలగి వెళ్ళారు. శంకరుడు ద్వంద్వా తీతుడు. సుఖము గలిగించే సార్థక నాముడు. దగ్గరకు రమ్మని పిలచాడు. ఏవేవో చికిత్సలు చేశాడు. ఆ చికిత్సల వలననో, శంకరుని అమృతహస్తమో, యోగ మహిమయో గాని ఆ రోగి పుండ్లు ఊడి మచ్చలు మటుమాయమై శరీరం కరివేరు పువ్వు రంగుతో వెలుగుతూ ఆతడు అనారోగ్యం వీడి తేజోవంతుడయ్యాడు. చూచిన వారందరు విభ్రాంతులయ్యారు. ఉదంకుడు అనే పేరు పెట్టి అతణ్ణి సంఘం లోనికి పంపించారు శంకరులు.


*కుమారిలభట్టు:*


గౌతమబుద్ధుడు అవతరించి మత ప్రచార మొనరించిన కొంత కాలానికి ఆయన శిష్యులు భిన్నవిధాలుగా శుష్క తర్కాలతో పలు రకముల పోకడలు పోయారు. కడకు దేవుడు లేడనీ, వేదాలనూ ఉపనిష త్తులనూ నిరసించటం ఆరంభించారు. ఆ విధంగా బౌద్ధమత స్వరూపం మారింది. జైనులు బౌద్ధమతాన్ని ఆదరించడంతో అగ్నిలో ఆజ్యం పోసినట్లైంది. నేర్పూ, చురుకు దనంతో వారి భావాలను బహుళం గా ప్రచారం చేసి ఆ మతవ్యాప్తికి చాలా శ్రమపడ్డారు. బౌద్ధ గురువులు పాండిత్య ము కలవారు కావడంతో వారు భావించినవే సత్యంగా గ్రంథస్థం చేశారు. అదీ ఆ నాటి పరిస్థితి.


సుమారు 2575 సంవత్సరాల క్రిందటి మాట. మహానదీ తీరంలో జయ మంగళము అనే గ్రామం ఉండేది. అందులో చంద్రగుణ యజ్ఞేశ్వరులనే పుణ్యదంపతులకు కుమారిలభట్టు ఉదయించాడు. వేదాలు, శాస్త్రాలు క్షుణ్ణంగా అభ్యసిం చాడు. జైమిని మహర్షి అడుగు జాడలలో మెలగుతూ వేదవిహిత కర్మకాండ లను తానాచరిస్తూ ఇతరుల చేత చేయించుచుండేవాడు. బౌద్ధ జైన మతాలకు రాజాశ్రయం లభించ డంతో ఆ మతస్థులకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. వైదిక మతం ప్రజలలో ఆదరణను కోల్పోతూ ఉంది. ఇది సహించ లేక పోయాడు కుమారిలభట్టు. రాజాశ్రయం పొంది ఉన్న ఆ మతాలను వెడలగొట్టాలి. అందుకు ముందుగా ఆమతంలో ఏముందో కూలంకుషంగా తెలిసి కొనాలి. అందుకని కుమారిలభట్టు బౌధ్ధభిక్షు వేషం దాల్చి తక్షశిలలోని విశ్వ విద్యాలయంలో విద్యార్థిగా చేరాడు. అందరితోబాటు విద్య నభ్యసిస్తూ ఆ మతం లోని గుట్టుమట్టులు కనిపెట్ట గలిగాడు. వాళ్ళు చేసే వేద నిందలు దుర్భరం గా ఉన్నా కార్యసాధక దీక్షతో వాటిని అన్నిటిని భరించాడు. విద్యాభ్యాసం చివరికి వచ్చేసరికి సహ శిష్యులు ఇష్టాగోష్టిలో శ్రుతి స్మృతులను కర్మకాండలను దుయ్యబట్టుతున్నారు. ఘోరాతిఘోరంగా సాగుచున్న వారి మాటలకు సహించి మౌనంగా ఉండలేక పోయాడు. సహేతుకంగా వారి వాదనలు త్రోసిపుచ్చి వారి నోళ్ళు మూత పడేలా తెలియ జేసాడు. సహశిష్యులందరు కలిసి కుమారిలుని ద్రోహిగా నిశ్చయించి గురువులకు నివేదించారు. అది విన్న గురువు అట్టివాడుండకూడ దనుకొని నిద్రించే సమయంలో అతనిని మేడపై నుండి క్రిందకు పడద్రోయ’ మని ఆదేశించాడు. చూచారా! 'అహింస’ కు పెద్ద పీటవేసిన మతస్థాపకుని శిష్యపరంపర! గురువు చెప్పినంత పనీ శిష్యులు చేశారు. అలా పడుతున్న కుమారిలభట్టుకు స్పృహ వచ్చి 'వేదములే మహత్తు కలవైనచో నాకెట్టి అపాయము రాకుండు గాక' అని తనకున్న నమ్మకాన్ని ఒడ్డుకొన్నాడు. దూదిలో పడ్డట్టు పడినా చావు తప్పి ఒక కన్ను పోయింది. దానితో అక్కడి నుండి తప్పించుకొనాలని నిశ్చయించాడు. నూలు పోగుతో బిగించు కొన్న తన కంకణాన్ని ఈ మారు ఉక్కుతీగతో బిగించాడు. అమరావతీ పట్టణం చేరుకొని భట్టపాదుడు అనే మారుపేరు పెట్టుకొన్నాడు.


*కాలడి శంకర కైలాస శంకర* 


*శ్రీ శంకరాచార్య చరిత్రము*

*15 వ భాగముసమాప్తము.* 

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

19. " మహాదర్శనము

 19. " మహాదర్శనము --పంతొమ్మిదవ భాగము --గోవుల వెంబడి


19. పంతొమ్మిదవ భాగము--   గోవుల వెంబడి


          

         సూర్యోదయమైన కొంచము సేపటిలోపలే అగ్నిహోత్రమును ముగించుకొని , ఆలంబిని పాల కోసమని గోశాలకు వెళ్ళినది . ఆ రోజు కొడుకు ఎప్పటివలె అగ్ని మందిరములో కూర్చోక , తల్లితో పాటు గోశాలకు వెళ్ళినాడు . పాలు పిండుట అంతా ముగిసినాక , గోపాలకుడు ఆ గోవులన్నిటినీ మందగా బయటికి పంపించినాడు. పశువులు వెళ్ళునపుడు యాజ్ఞవల్క్యుడు ప్రతియొక్క ఆవునూ ముట్టి ముట్టి చూచినాడు . ఏదీ కూడా ఆ స్పర్శను వద్దనలేదు . వాటికి ఏమి సుఖము అనిపించినదో , ఒక్క ఘడియ నిలచి , ఆ స్పర్శను స్వీకరించి , ముందుకు సాగినవి . 


కుమారుడు తల్లి వీపునెక్కి ఊగుతూ , ’ అమ్మా, నాకు ఒక కోరిక కలిగింది ’ అన్నాడు .


" ఏమిటయ్యా ? " అన్నది తల్లి ఆప్యాయంగా . 


" ఈ ఆవులతో పాటూ నేను కూడా పోయివస్తాను " 


" పోవచ్చు , అయితే అవి తిరిగి వచ్చేది సాయంత్రానికే . అంతవరకూ నువ్వు ఏమీ తినకుండా ఉండుట సాధ్యమా ? " 


" ఆ గోపాలకుడు రోజూ ఏమి చేస్తాడు , మరి ? "


" అతడు ఇప్పుడు చద్దన్నము తిని , మధ్యాహ్నానికై బుట్ట తీసుకొని వెళతాడు " 


" నేను అయోధ్య ధౌమ్యుల శిష్యుడు చేసినట్లే చేస్తాను " 


" అంటే ఏమి చేస్తావూ ? " 


" వాడు ఆవుల పొదుగు దగ్గర నోరు పెట్టి పాలు తాగేవాడట ! " 


" సరిపోయింది , పుణ్యాత్మా , నువ్వు అలాగ చేసేవాడవే ! ! అయితే హోమధేనువు దగ్గర మాత్రము అట్లా చేయవద్దు " 


" ఎందుకమ్మా ?"


          " చూడు , హోమధేనువంటే దాని పాలను దినమూ హోమానికి ఉపయోగించవలెను . దానికి ముందే దూడ తాగవలెను . మరి అలాంటపుడు , పొదుగులోని పాలన్నీ నువ్వే తాగేస్తే , పాపం , దాని దూడ గతి ఏమి ? హోమానికి ఏమి చేసేది ? " 


         " అయితే నువ్వు ఆ ఎర్రావునే కదా , ఈ సారి హోమధేనువు చేసినది ? అది నాకు వద్దులే , తెల్లావు గంగ కానీ , నల్లావు కాళి కానీ అయితే ఫరవాలేదు కదా ? , అమ్మా , ఈ రోజు ఒకటైంది . " 


" ఏమిటీ ? " 


" ఆవులు మాట్లాడుతున్నాయి . నేను వాటిని ముట్టి ముట్టిఅడిగినాను , నేను కూడా ఈ దినము మీతో పాటే  కాచేందుకు రానా ? అని . ఒక్కొక్క ఆవు , ’ ఊ ’ అన్నాయి "


" ఊ అన్నాయి ! నీ తలకాయ . ఆవులు మాట్లాడినాయి అని ఇంకెవరి దగ్గరైనా అంటే నవ్వుతారు " 


" నిజంగా , అమ్మా ! అవి మాట్లాడినాయి .... అంటే నేను అబద్ధం చెప్పుతానా ? " 


         పిల్లవాడి ముఖము ఎర్రనైంది . అబద్ధము చెప్పుట మహాపాపము అన్న నమ్మకము ఉన్నవాడివలె , స్పష్టముగా మాట్లాడిన కొడుకును చూసి , ఇక వికోపమునకు వదలరాదు అని , " అలాగేమి ? నువ్వు అబద్ధము చెప్పేవాడివి కాదు , అయినా వారికి ఒకమాట చెప్పి వెళ్ళుట మంచిది . ఈ దినము వారు అధ్యాపనములో నున్నారు . సమయము సరిపోదు , రేపు వెళ్ళవచ్చులే , నీతో ఆవులు మాట్లాడుతున్నాయన్నావు కదా ? నాకు కూడా వినపడేటట్లు మాట్లాడతాయా ? " అన్నది . 


కొడుకు అది బహు సామాన్యమైన సంగతి అన్నట్లు , " దానికేమి , రేపు నీ హోమధేనువునే మాట్లాడిస్తాను . చూడు , నువ్వీ దినము వారితో మాట్లాడి రేపు నన్ను పంపించమ్మా ! " అని చేతులు పట్టుకొని అడిగినాడు . 


        కొడుకు ఆశపడుటను చూసి తల్లి , ’ దానికి ఇంతగా అడగవలెనా ? అలాగే కానీ ! అదేం పెద్ద పని ? ఇక వెళ్ళి నేను పెరుగు చిలకవలెను . నువ్వు వెళ్ళి నడిమింట్లో కూర్చో . అధ్యయనము అవుతున్నది " అని వెళ్ళిపోయినది . 


         ఆ సాయంత్రము అగ్నికార్యమైన వెంటనే కొడుకు తల్లికి సైగ చేసినాడు . " తండ్రిని అడిగినావా ? అనుమతి ఇచ్చినారా ? " అన్నది ఆ సైగ భావము . తల్లి , కొడుకు సైగ చూచి , విస్మయపడుతూ భర్తకు చెప్పింది , " మీ కొడుకు రేపు ఆవులతో పాటూ వెళ్లవలె నంట " 


" అంటే ? "


" వాడినే అడగండి . వివరమంతా చెపుతాడు . అయోధ్య ధౌమ్యుని శిష్యుడు చేసినట్లే ఆవు పాలు తాగి సాయంత్రానికి ఇంటికి వస్తాడంట" 


" ఏమిటయ్యా సంగతి ? " 


        " ఏమీ లేదు , ఈదినము నేను గోశాలలో ఉన్నపుడు ,’ నువ్వు కూడా మా జట్టులో ఎందుకు రాకూడదు ? " అని ఒక గొంతు వినిపించింది . చూస్తే , ఆవు మాట్లాడించి నట్లయింది . ’ నిజమా , చూద్దాము ’ అని ఒక్కొక్క ఆవునూ ముట్టీ నేను మీతో పాటూ వచ్చేదా అని అడిగినాను , ’ రావయ్యా ’ అన్నాయి . అందుకని వెళ్ళి రావాలి అనుకున్నాను " 


          ఆచార్యుడు గంభీరుడైనాడు . ఆవులు , కావాలన్నపుడు మౌనము గానే మాట్లాడగలవు అని అతడు వినియున్నాడు . అదీకాక , అతనికి ఒక యోగి దర్శనమై యుండినది . ఆతడు , జగత్తంతా శాంతముగా నిద్రకు జారిన పిమ్మట , ఈతనితో నిద్రలోనే సంభాషణ చేసినాడు . ఆతడు మాట్లాడినది ఇతడికి బాగా వినిపిస్తుంది . ’ ఈతడు దానికి తన మనస్సులో ఇచ్చిన ఉత్తరము అతనికి వినిపించును . ఇప్పుడు మనము కర్మేంద్రియముతో ఈ వ్యాపారము జరుపుతున్నాము , అలాగే కర్మేంద్రియము తో కాక, జ్ఞానేంద్రియముతో కూడా ఈ వ్యాపారమును జరపవచ్చునా ? ఆ జ్ఞానేంద్రియముతో వ్యాపారము చేయుట సామాన్యులకు సాధ్యము కాదా ? కలలలో కర్మేంద్రియములు లేకనే కదా , వ్యాపారము సాధ్యమయ్యేది ? మరి అది మెలకువ లోనూ సాధ్యమా " అని అనేక ప్రశ్నలు పుంఖానుపుంఖములుగా వచ్చినవి . దానికి సరియైన సమాధానము దొరకలేదు . అయిననూ ఇప్పుడు ఆచార్యుడు కొడుకును అడిగినాడు , " అలాగయితే , పొద్దున్నే ఏమి తిని వెళతావు ? " కొడుకు ఏమీ చెప్పకుండా తల్లి ముఖము చూసినాడు . తల్లి , ’ నువ్వు కూడా ఆవులను తోలుకుని వెళ్ళేవారి వలెనే చద్ది తిని వెళ్ళవలెను ’ అంది .


          ఆచార్యుడు , ’ నీ కొడుకుకు ఎప్పుడూ చద్దన్నము పెట్టవద్దు . వండిన వంటలో ప్రాణము అది వేడిగా ఉన్నంతవరకే ఉండును . ఆరిపోయినాక, దానిని ప్రాణము వదలును . దేహములో జరుగు కార్యములన్నీ , ప్రత్యక్ష , అప్రత్యక్షముగా ప్రాణము వలననే జరుగును . ఇక్కడ అన్నమై అన్నమయ కోశములనూ , అక్కడ అన్నాదుడై ప్రాణ పంచకమునూ , మనోబుద్ధులనూ నడిపించు ప్రాణమునకు చద్దన్నము హితము కాదు . కాబట్టి వేరేగా హవిస్సు వలె అన్నము చేసి , దానికి ఉప్పు , నెయ్యి , పెరుగు వేసి వడ్డించు . వాడు వెళ్ళిరానీ. చూడు నాయనా , నిన్ను రమ్మన్న ఆవును , నీకు ఆకలైనపుడు మాట్లాడించు . ఏమి చేయవలె నన్నది అదే తెలియజేయును " అన్నాడు . 


           ఆరాత్రి ఆచార్యుడు , కొడుకు నిద్రపోయిన తర్వాత వాడిదగ్గర కూర్చొని రక్షోఘ్న మంత్రములను పారాయణము చేసి ’ రేపు వీడు పశువులను కాచుటకు వెళ్ళినపుడు వీడికి చెడ్డదేమీ జరగకుండనీ , అంతా మంచే జరగనీ ’ అని ప్రార్థించాడు . కొడుకును వెళ్ళిరమ్మని ఎందుకు చెప్పినాడు ? అని అతనికే చోద్యము . అది కూడా వాడి ప్రభావమేమో ? 


          ఈ మధ్య అతనికి ఒక విచిత్రానుభవము కలుగుచుండినది . కొడుకు వద్ద ఉంటే , కామ్యేష్టుల సంగతులు రావడమూ , వాటికి బదులుగా పశుయజ్ఞముల విచారము తలలో నిండిపోవడము జరుగుతున్నది " ఆ యజ్ఞముల అర్థము ఇంకేమో అయి ఉండ వచ్చునా ? కావచ్చు. ఒక్క పశు యజ్ఞమేనా ? యజ్ఞ యజ్ఞమునకూ ఇంకేదో అంతరార్థము ఉన్నదై ఉండవచ్చును . యూపాదులను స్థాపించి , యజ్ఞములను చేయు అధికారమున్న వారి విషయము సరే , ఆ అధికారము లేని వారుకూడా ఆ యజ్ఞ ఫలము పొందవలెనన్న ఏమి చేయవలెను ? ఏ రీతిలో చేస్తే ఆ యజ్ఞము బ్రహ్మ యజ్ఞమగును ? " అని కొన్ని విచిత్రమైన ప్రశ్నలు తరంగములుగా వస్తాయి . 


          అతడు కొన్ని సార్లు , దీనికి కారణమేమి యని వెదకి చూచినాడు . జ్ఞాతముగా ఏ కారణమూ తెలియలేదు . " సరే , ఇతడి ప్రభావమే అయిఉండాలి . లేకుంటే అలాగెందుకవుతుంది ? ’ అని ఆలోచించినాడు . కొడుకు సన్నిధానము లేనపుడు ఆ తరహా ప్రశ్నలు గుర్తు తెచ్చుకుందామన్నా రావు . ఇలాగ , అన్వయ వ్యతిరేకములతో , కొడుకు ప్రభావమే దీనికి కారణము అన్న సిద్ధాంతమునకు వచ్చినాడు . 

Janardhana Sharma

ఉద్దండ కవితా విన్యాసము -2



ఉద్దండ కవితా విన్యాసము -2


                    కొందరు పుట్టుకవులుంటారు. మరికొందరు పెట్టుకవులుంటారు. పుట్టుకవులలో  ప్రఖ్యాతిగన్న మహాకవి  వేముల వాడ భీమ కవి! దక్షారామ భీమేశ నందనుడైన  యీకవి  'ఉద్దండ కవితా వేశము కలవాడు. గద్దరించి బెదరించి శాపదిగ్ధమైన  కవితలతో  నాటిప్రభువుల భరతమును బట్టి  తనజీవనమును  మహోజ్వలముగా  గడపిన మహనీయుడు. 


                           భీమ కవి సంచార శీలుడు. అతడొక మారు కళింగ చొక్కరాజు  యాస్థానమునకేగినాడు. ఆప్రభువు  వేశ్యాలంపటుడు. భీమకవి యొచ్చువేళకతడు  రాజోద్యాన వనమున  వేశ్యా సమేతుడై  విహరింుసాగెను. ద్వారపాలకుడు  భీమకవి యరుదెంచిన విషయమును విన్నవింపగా  పొగరుబోతుతనమున  ఇక్కడికేరమ్మని కబురంపెను. భీమకవి యరుదెంచి వాని వాలకమునుగాంచి  తలవంచి నమస్కరించెను. 


                                        " భీమకవీ ! నీగురించి చాలవిన్నాము. నీ టక్కుటమారములు మా*కడ సాగవు. నీవెదియన్న నది జరుగునా?  ఓహో! అటులైన  యీపందిరి గుంజను  మహావృక్షముగావింపుమని "--పల్కెను. ఆసమయమున చొక్కరాజుకాలు మల్లెపందిరి గుంజకానుకుని

యుండెను. భీమకవి  గంభీరముగా  గళమెత్తి--


                      "శా:  "  ఆనీతాభ్యుపదాన శృంఖల  పదాభ్యాలంబిత  స్తంభమా!


                                  నేనే వేములవాడ  భీమకవినేనిం  జిత్రకూటంబులో


                                 భూనవ్యాపృత  పల్లవోప లతికా  పుష్పోప గుఛ్ఛంబులన్


                                 నానా పక్వ ఫల  ప్రదాయి వగుమా !  నాకల్ప వృక్షాకృతిన్."---- అనిపద్యం చెప్పాడు.  అంతే  ఆపందిరి గుంజ కాస్తా మహా వృక్షమైపోయింది.  రాజుగారికాలు  ఆచెట్టులో యిరుక్కుపోయింది. దెబ్బతో భీమకవి  మహిమెంతో ఆరాజుకు  తెలిసింది.

"మహాకవీ నాతప్పు మన్నించు. మళ్ళీ వృక్షాన్నిపందిరికి గుంజగాజేసి  నన్నుకాపాడమని " ప్రార్ధించాడు. కవి కరుణాళుడై. చొక్కరాజా!

కవుల నెన్నడు నవమానింపకుము. బుధ్ధిగలిగిప్రవర్తింపు మనుచు----


  

                ఉ: "  శంభువరప్రసాద  కవిసంఘ వరేణ్యుడ నైన  నావచో


                          గుంభన  మాలకించి  యనుకూలత నొంది  యనూన భావనన్


                          కుంభిని  జొక్కనామ  నృపకుంజరు  పందిటి  మల్లెసాలకున్


                           స్తంభమురీతి  నీతనువు  దాలిచి   యెప్పటియట్ల  నుండుమా! "--- అనేపద్యం  చెప్పాడు. వృక్షం పందిరి గుంజయిపోయింది.రాజుగారి  పాదానికి  విముక్తి లభించింది.


                                               భీమకవి  మహిమకు అక్కడివారందరూ  ఆశ్చర్యంలో  మునిగిపోయారు.


                                                                  ఇదండీ  భీమకవిగారి  ఉద్దండ కవిత్వం !🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

హైందవం వర్ధిల్లాలి 4*

 *హైందవం వర్ధిల్లాలి 4*




మన భారత దేశంలో గత పాతిక (25) సంవత్సరాల క్రితం వరకు కుటుంబ వ్యవస్థ బలంగా ఉండేది. తండ్రుల నుండి వారి సంతానం,   బాల్యం నుండే అప్పటి, అక్కడి ఆచార వ్యవహారాలను, సంప్రదాయాలను, విద్యలను ఒక్క మాటలో చెప్పాలంటే ఆ *జీవన శైలిని  అలవర్చుకుంటూ, అభ్యసిస్తూ ప్రవీణులయ్యేవారు*. 

ఈలా వంశ పారంపర్యంగా సంప్రదాయాలకు కట్టుబడి, క్రమ శిక్షణతో నియమాలను పాటించే వారు, ఎట్టి ఉల్లంఘనలు ఉండేవి కావు. 


ఇంతకు ముందు తెలుసుకున్నాము సామాజిక బాధ్యతలను పంచుకోవడానికి ప్రజలు నాలుగు విభాగాలుగా ఏర్పడి, సమాజ సేవ మరియు సమాజ సంరక్షణ చేస్తూ ఉండేవారు. తదుపరి కాలంలో ఆ విభాగాలే కుల వృత్తులుగా రూపాంతరం చెందాయి. కాని, ఈ ఆధునిక కాలంలో ప్రజలు, ఆ కాలంలో ఏర్పడిన వృత్తులకు మాత్రమే పరిమితం కాలేదు. కాల మాన పరిస్థితులను బట్టి ప్రజల వృత్తులలో మార్పు వచ్చినది, కులం ప్రకారము జనుల వృత్తిని నిర్ణయించు అవకాశం ప్రస్తుతం లేదు.

 *అవకాశాలను బట్టి అందరు అన్ని వృత్తులు నిర్వహిస్తున్నారు*. 


*చాతుర్వర్ణాలలో అందరి క్షేమము, ప్రగతి, అభ్యుదయాన్ని చూడవలసిన ధర్మం  పాలకులదని రామాయణాది హైందవ గ్రంథాలు చాటాయి*. సరిగ్గా అదే బాధ్యతను పాలకులు కుల వివక్ష లేకుండా ఈ కాలంలో కూడా అమలు పర్చినట్లయితే మరి మరీ ప్రశస్తము.*ఇంత చక్కటి పరంపరను నెలకొల్పిన హిందూ మతం పలు రాజకీయ కారణాల వలన బలహీన పడుతున్నది. బలహీన పడుతున్నదని మిన్నకుంటే హిందువులందరు బలహీనులని ఒప్పుకున్నట్లె*. 

అవుతే, *ఆవేశకావేశాలతో తాత్కాలికంగా  "చట్టం సహాయంతో"  దుర్మార్గుల దౌర్జన్యాన్ని అరికట్టు ప్రయత్నాలు*, మరియు

హిందూ జీవన సరళిలో పూర్వ *సంప్రదాయాలు పునరుద్ధరించాలి*, స్వాభావికంగానే ప్రజలు జాగృతులు కావాలి, సమాజ పెద్దలు ప్రజలను  జాగృతం చేయాలి.


రోగ గ్రస్థమైన వ్యవస్థను ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దాలంటే ముందు రోగ లక్షణాలను పరిశీలించాలి,

 ఆ పైన చికిత్సా విధానాన్ని అమలు పరచాలి. బహిరంగంగా దృశ్యమగుచున్న రుగ్మతలలో కొన్ని. 

 1) సముచిత హిందూ జన జీవన శైలిని పునరుద్ధరించుకోవాలి. 

2) ఆధునికత పేరుతో, నాగరికత పేరుతో ఆచార వ్యవహారాల భ్రష్టత్వం తొలగాలి.

 3) వర్ణాల కతీతంగా హిందువులలో ఐకమత్యం పెరగాలి  

4) ధర్మ ద్రోహులను (మత  మార్పిడి) నిరోధించాలి. 

5) నాస్తిక వాదుల  వ్యాఖ్యానాలను కట్టడి చేయాలి. 

6) ప్రవచన కారులు, ఆశ్రమ అధిపతులు, పీఠాధిపతులు, ధర్మ ప్రచారకులు,  హైందవ మత పెద్దలు, హిందూ నాయకులు   ధర్మ సంరక్షణ కొరకై ప్రజల మధ్యకు రావాలి. 

7) అవసరమైనప్పుడు హిందూ ధర్మ సంరక్షణకు చట్టాలను ఖచ్చితంగా వినియోగించుకోవాలి. 

8) అశ్లీలతకు తావివ్వని,

  వివక్ష లేనివిధంగా సమున్నత మాతృ స్థానం స్త్రీలకివ్వాలి.


ధన్యవాదములు

*(సశేషం)*.

వ్యక్తిత్వం

 🔔 *వ్యక్తిత్వం* 🔔


👉ఒకటికి రెండుసార్లు వివరించిన తర్వాత కూడా ఎవరికీ అర్థం కాకపోతే, అవతలి వ్యక్తికి వివరించండం *వదిలెయ్*

👉పిల్లలు ఎదిగినప్పుడు, వారు వారి స్వంత నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెడతారు, వారి వెనుకాలా పడడం *వదిలెయ్*

 👉కొంతమంది వ్యక్తులతో మన ఆలోచనలు కలుస్తాయి. ఒకరిద్దరితో కనెక్ట్ కాకపోతే, అటువంటి వాళ్లను

*వదిలెయ్*

👉ఒక వయస్సు తర్వాత, ఎవరూ మిమ్మల్ని పట్టించుకోకపోతే లేదా మీ వెనుక ఎవరైనా మీ గురించి తప్పుగా మాట్లాడుతుంటే, దానిని మనసులో పెట్టుకోకుండా 

*వదిలెయ్*

 👉మనచేతుల్లో ఏమీ లేదు, మీరు ఈ అనుభవాన్ని పొందినప్పుడు, భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం

*వదిలెయ్*

 👉మనలోని కోరికకు, మన సామర్థ్యానికి చాలా తేడా ఉంటే, నీ గురించి నువ్వే ఎక్కువ ఆశించడం 

*వదిలెయ్*

👉ప్రతి ఒక్కరి జీవితం భిన్నంగా ఉంటుంది. అంతెందుకు, ఓ మనిషి ఎత్తు, రంగు మొదలుకొని అన్నీ భిన్నంగా ఉంటాయి కాబట్టి సరిపోల్చడం

*వదిలెయ్*

👉నేను మంచి స్నేహితుడిగా కనిపిస్తే సరేసరి, లేదంటే నన్ను కూడా

*వదిలెయ్*

👉వృద్ధాప్యంలో జీవితాన్ని ఆస్వాదించండి, రోజువారీ పేరుకుపోయిన ఖర్చుల గురించి చింతించడం

*వదిలెయ్*

👉మీకు ఈ సందేశం నచ్చితే సరి. ఒకవేళ మీకు నచ్చకపోతే, సీరియస్ గా తీసుకోకుండా

*వదిలెయ్*... 🙂


https://youtu.be/VtjHEH7-Mio


🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻