25, జులై 2020, శనివారం

పగరుడ పంచమి

పగరుడ పంచమి సందర్భంగా ఎవరైతే సర్పసూక్తం భక్తి శ్రద్దలతో పారాయణ చేస్తారో వారికి ఉండే సమస్త సర్పదోషాలు తగ్గి, విష బాధల నుండి విముక్తి పొందగలుగుతారు. ఈ పర్వదినాన ఈవిధంగా చేసిన వారికి వంశాభివృద్ధి, సంతానోత్పత్తి, కార్యసిద్ధి కలుగటంతో పాటు, కాలసర్ప/నాగ దోషాలు తగ్గుముఖం పడతాయి. రోగాలు నశిస్తాయి, అయితే ఈ గరుడ పంచమి గురించి క్లుప్తంగా చెప్పాలి అంటే దీని ప్రాముఖ్యతని సాక్షాత్తు పరమేశ్వరుడే స్కంద పురాణంలో వివరించాడు. శ్రావణ శుద్ధ పంచమిని గరుడ పంచమిగా జరుపుకుంటారు. ఆదిశేషుని సేవకు సంతోషించిన విష్ణుమూర్తి ఏదైనా వరం కోరుకోమని అడిగితే.. తాము ఉద్బవించిన పంచమి రోజు సృష్టిలోని మానవాళి సర్ప పూజలు చేయాలని కోరుకున్నాడు. ఆదిశేషుని కోరికను మన్నించిన శ్రీమహావిష్ణువు శ్రావణ శుక్ల పంచమి రోజున జనులు సర్ప పూజలు చేస్తారని వరమిచ్చాడు. కావున అప్పటి నుండి ఈ రోజున సర్ప దేవతలని పూజించటం వంటివి చేస్తారు. తద్వారా వారి దోషాలు తొలగి కోర్కెలు నెరవేరతాయని ప్రతీతి.

ఇలాంటి విషయాలు నేను ఎప్పటికప్పుడు నా వాట్సాప్ స్టేటస్ ద్వారా తెలియ పరుస్తాను (ఏ పర్వదినాన ఎవరిని ఏ విధంగా కొలవాలి వంటివి) కావున మీలో ఎవరైనా నా నెంబర్ సేవ్ చేసుకోకపోతే సేవ్ చేసుకుని నా స్టేటస్ ను ఫాలో అవ్వొచ్చు. అలానే మీ నెంబర్ నేను సేవ్ చేసుకోకపోతే మీరు సేవ్ చేసుకోమని మేసేజ్ పెడితేచాలు, సేవ్ చేసుకుంటాను. అలానే మీ అందరి సౌలభ్యం కోసం నేడు సర్ప సూక్తాన్ని పంపిస్తున్నాను. ఇంకేమైనా సందేహాలు ఉంటె అడుగగలరు. ఈ సర్పసూక్తాన్ని 1,3,11,108 సార్లు పారాయణ చెయ్యవచ్చు. అది వారి ఇష్టాన్ని/ఓపికను బట్టి ఉంటుంది.

జై హింద్.
హిందూ ధర్మం వర్ధిల్లాలి
Whatsapp: +91 95814 51419

కామెంట్‌లు లేవు: