25, జులై 2020, శనివారం

నక్షత్రముల శక్తి

నక్షత్రముల శక్తిని వాటి కాంతి లక్షణాలు భూమిని ఏఏ డిగ్రీల కు సంభంధమెూ నిర్ణయించి కాలగమనంలో అనగా భూ చలనం ద్వారా వాటి శక్తిని తెలియజేసిరి. కాని అట్టి కాంతి లక్షణం ప్రత్యక్షంగా కనబడుట లేదు. రూపం మారిన గాని అదియును వస్తురూపంగానే తెలియును. అదియును ఆవస్తువుకూడా అనుభవించిన కొంతవరకు తెలియును. రాహువు యెుక్క కాంతి అసలు తెలియనే తెలియదు. అది రుద్ర శక్తి గనుక. అది మూల అగ్ని తత్వం యువి లక్షణము కలది. మిగిలిన ఏడు గ్రహముల ద్వారానే ఏడు వారముల రూపంలో గల గ్రహ శక్తి వలననే మనకు తెలియును. యిక చిత్ర, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, పూర్వాభాధ్ర, అశ్వని, కృత్తిక, మృగశీర్ష, పుష్యమి, మఖ, ఉత్తరఫల్గుణీ, మాసనామముల ప్రకృతి లక్షణమే ఆయా నక్షత్రముల కాంతి ని ఆయా నెలలో చంద్రుని పౌర్ణమి తిధి ద్వారానే మనకు మన భూమిపై యున్న వారికి మాత్రమే యని తెలియును.యిందు అశ్వనీ ఆశ్వయుజ శక్తి ప్రకృతి మార్పునకు,మఘ నక్షత్రము మాసమైన మాఘమాసమునకు కూడా విశిష్ట కాంతి లక్షణము యున్నట్టు తెలియుచున్నది. మనకు  యివే లక్షణములు ఆయా ఋుతు ధర్మం ప్రకారమే ప్రకృతిని  మార్పు చెందుచున్నది. అనేకమైన జీవ లక్షణములు  ప్రకృతి ద్వారానే తెలియనగును. వేరే సూత్రములు ఏమియు వీటికి ప్రాతిపదిక కాదు. ఏ మానవ ప్రకియకైనా సంవత్సర కాలము గల ఋతు ధర్మ లక్షణమే మూలమని అట్టి ఋతుధర్మంలేని జీవం నిర్జీవ మని తెలియును. ప్రకృతి వినాశనం జీవ వినాశనం. ప్రతీ సంక్రమణం ప్రతీ పౌర్ణమి. వివిధ రకాలైన ఋతు ధర్మ లక్షణములు గల ప్రకృతి సంబంధియైన దిగా చంద్ర సూర్యుని మూల కారణంగా తెలియుచున్నది.యింత బృహత్తరమైన విజ్ఞానం గురించి తెలుసుకొనుట యే దైవమని అది మానవ మేధస్సుకు తెలియనిది. ఆత్మ ద్వారానే సాధన ద్వారానే అనుభవము.దానివలననే భూమికి ఔషధీగుణం కలుగుచున్నది. లేనిదే సస్య వృధ్ది జరుగదు. సస్యవృధ్ది లేని భూమి నిర్జీవం. అందుకే ఆయా కాలానుగుణంగా ప్రకృతి సమతుల్యం సాగవలెనన్న హవన పూర్వక అగ్ని కార్యమే దీనికి శరణాగతి. యిది ఋగ్వేద నిరూపణమే. రుద్ర శక్తి యే విషు గా మారి ఆత్మ పరంగా మారి ఉప మన సమీపంలో దేహంలో మాత్రమే కలిగియున్నది. యిది తెలుసుకొనుటకు ప్రయత్నించిదాం మౌనంగానే .

కామెంట్‌లు లేవు: