10, మార్చి 2021, బుధవారం

దొంగ పిల్లులను

 దొంగ పిల్లులను తరిమేసిన కాశ్మీరి ప్రజలు.

...............................................................

పూర్వం కాశ్మీరదేశాన్ని సహమిత్రుడనే రాజు పరిపాలించేవాడు. అతని భార్య పేరు గిరిభద్ర. నిష్టాగరిష్టులైన సంప్రాదాయవాదులు. సర్వమత సహనం కలవారు. ఎన్నో పూజలు వ్రతాలు చేసుకోవడం వలన వారికి లేకలేక సంతానం కలిగింది. పుట్టిన పిల్లవాడికి క్షారచక్షువు అనే పేరు పెట్టారు. చారచక్షువంటే గూఢచారిలాంటి కన్నులు కలవాడని అర్థం. పరిసరాలను నిశితంగా గమనించేవాడని కదా !


ఆ బాలుడికి మూడునెలల వయసు వున్నపుడు తల్లి ఆ బాలుడిని ఊయలలో పడుకొబెట్టి జోలపాట పాడుతోంది. ఉన్నట్టుండి ఆ పసిబాలుడు ఫక్కున నవ్వసాగాడు. తల్లికి ఆశ్చర్యమేసింది, పసిబాలుడేమిటికి గట్టిగా నవ్వడమేమిటని.

ఆ బాలుడు నవ్వు ఆపడంలేదు.


ఆ రాణికి  ఏం చేయాలో తోచలేదు.

మహరాజుకు కబురుపెట్టింది. మహరాజును చూచినప్పటికి ఆ పసిబాలుడు ఇంకా బిగ్గరగా నవ్వసాగాడు.


ఆ రాజు విషయం తెలుసుకోవాలని ఆస్థాన పురోహితుడిని, జ్యోతిష్కుడిని, మహమంత్రిని, ఆస్థాన వైద్యడిని పిలిపించాడు. ఎవరు వచ్చి ఎన్ని ప్రయత్నాలు చేసిన ఆ బాలుడు నవ్వు ఆపడం లేదు. రాజవైద్యుడి వైద్యప్రక్రియ అంతా నిరర్థకమే అయింది.


ఎవరికి ఏం చేయాలో తోచలేదు. చివరికి రాజుగారి జ్యోతిష్కుడు ఆలోచించి, ఓ రాజా పసిబాలుడు నవ్వుతూవున్నాడంటే ఇతను సామాన్యుడేమి కాదు. ఈ బాలుడికి పూర్వజన్మ జ్ఞానముంటుంది. అందుకే ఏదో తెలిసి ఇలా నవ్వుతున్నాడు. ఆ బాలుడు తప్ప ఇతరులెవ్వరు ఆ నవ్వుకు సమాధానం చెప్పలేరు.కనుక ఆ బాలుడినే అడగడం శ్రేయస్కరమంటూ విన్నవించాడు.


ఇది నిజమేననుకొన్న ఆ రాజదంపతులు "బాబు నీ నవ్వుకు కారణమేమిటని " అడిగారు.


 అందుకా బాలుడు మహరాజా జాతహరిణి అంటే ఏమిటని అడిగాడు. అందుకా రాజు ఓ పసిబాలుడా! ఈ నెలల వయసుకే నువ్వు నవ్వడం మాటాడటం విచిత్రంగా వుంది,


అయినా అడిగావు కనుక చెబుతున్నా విను! జాత అంటే జాతి.నా ప్రజలు, నా వారు, నా వారసులు, నా భాష, సంప్రాదాయబద్ధులు, ఇంకా హరిణి అంటే నశింపజేయునది అని సమాధానమిచ్చాడు.


అందుకా బాలుడు చిన్నగా నవ్వి, మహరాజా, నిజమే జాతహరిణి అంటే ప్రజలను నశింపచేయునదనే అర్థమే. నీ రాజ్యంలో జాతహరిణి అనే పిల్లి, తన పరివారంతో ప్రవేశించింది. ఈ పిల్లులు నీ దేశంలో ఏ ఒక్కరిని నశింపచేయవు, చంపవు. నీ సంస్కృతి సంప్రాదాయాలు ఆచారాలు వ్యవహారాలు పూజలు కట్టుబాట్లు మొదలైనవాటిపై దాడి చేస్తాయి.


ఈ పిల్లులకు  విదేశిశక్తుల అండదండలు ధనసాయం దండిగా వుంది. కత్తిపట్టి యుద్ధం చేయవు. ఘటికా స్థానాలలో ఆశ్రమగురుకులాలలో అన్ని రకాల విద్యా సంస్థలలో, సేవ పేరుతో వైద్యశాలలలో ప్రవేశిస్తాయి. ఇవి సేవచేస్తున్నట్లు సంస్కరిస్తున్నట్లు కనబడతాయి.


కాని నీ రాజ్యంలో పేదరికాన్ని, అవిద్యను, అనారోగ్యాన్ని, మూఢ నమ్మకాలను ఆశ్రయించి మెల్లమెల్లగా తమ దేవుడిని అందులో జొప్పిస్తాయి. ఎంతగానంటే కన్నతల్లి, స్వంతమతాల కంటే వీరి దైవవాక్కులు, ప్రార్ధనలే గొప్పవి అనేంతగా.


వారి ఉచ్చులో పడినవారందరు కన్నతల్లిని వదలి వారి తల్లి వైపు మారుతారు.


మహారాజా ! నీ రాజ్యంలో వున్న ప్రతి జాతహరిణి ప్రమాదమే. ఇపుడు కూడా దైవబోధనల పేరుతో మంత్రించిన నూనె తీసుకొని నా మీద చల్లటానికి, తద్వారా నీకు మేలుచేస్తున్ననే మిషతో ఓ జాతహరిణి గుమ్మం బైట వేచివుంది. ఆ జాతహరిణి చేష్టలు చూస్తుంటే నవ్వు వచ్చిందిఅందుకే నవ్వా నంటూ, రాజా మేలుకోమంటూ ఆ బుడతడు సమాధానమిచ్చాడు.


అందుకా రాజు ఈ పిల్లులన్ని నాకు రాజకీయంగా మద్దత్తు ఇస్తూ నేను ఎదగటానికి ఓటు రూపంలో సాయంచేస్తున్నాయి. అంతేకాదు స్వదేశీవిదేశీ దండయాత్రలపుడు నాకు వీరంతా ధనసాయం కుడా చేస్తున్నారు. బాగా పలుకుబడి ఉన్నవాళ్ళు, నాకు అధికారమే ముఖ్యం కదా ! వీరినెలా నేను విడిచిపెట్టను అంటూ ఆ రాజు ప్రశ్నించాడు.


ఓ రాజా వారి సాయం ఎంతవరకునంటే నీ సంస్కృతి, సంప్రాదాయాలు, నాగరికతలు, పూర్వీకులు ఇచ్చిన వారసత్వాన్ని కబలించేటంత వరకే. నీ దేశ నాగరికతను ధ్వంసం చేసిన తరువాత నీ సింహాసనాన్ని ఆక్రమిస్తారు. నీ ప్రజలు అమాయకులు తెల్లనివన్ని పాలేననుకొనే మనస్తత్వం వారిది. ఈ పిల్లులను నమ్మి స్వంత కొంపను ముంచుకొన్న తరువాత


కట్టేబట్ట, తినేతిండి, పూజలు, దేవతలు, నడక, నడత ఇవన్ని వారి చేతులలోనే వుంటాయి. వారు చెప్పినట్లుగా మీరు వినాలి, విని తీరాలి.


అంతా మంచిదే అన్ని మతాలు అందరు దేవుళ్లు సమానమనే నీవు నీ రాజ్యప్రజలు ఇకనైనా మేలుకోకపోతే ఇంటింటా జాతహరుణులు తయారైతారు!

కాబట్టి ఓ రాజా రాబోయే ఆపదలను నివారించేందుకు భారతీయ జనతను బలోపేతం చేయి,


 ఓ రాజా నీ రాజ్యంలో పేదరికాన్ని, అవిద్యను, అనారోగ్యాన్ని, మూఢ నమ్మకాలను ఆశ్రయించి సంఘ సంస్కరణల పేరుతో మెల్లమెల్లగా తమ దేవుడిని అందులో జొప్పిస్తాయి. ఎంతగానంటే కన్నతల్లి, మాతృభాష, స్వంతమతాల కంటే వీరి దైవవాక్కులు, ప్రార్ధనలే గొప్పవి అనేంతగా.


వారి ఉచ్చులో పడినవారందరు కన్నతల్లిని వదలి వారి తల్లి వైపు మారుతారు.అంతా అయిపోయిన తరువాత మనం ఈ దేశంలో జీవిస్తూ కూడా జీవచ్ఛవాలుగా బ్రతకాల్సిందే.


మహారాజా ! నీ రాజ్యంలో వున్న ప్రతి జాతహరిణి ప్రమాదమే. ఇపుడు కూడా దైవబోధనల పేరుతో మంత్రించిన నూనె తీసుకొని నా మీద చల్లటానికి, తద్వారా మేలు చేస్తున్ననే మిషతో ఓ జాతహరిణి గుమ్మం బైట వేచివుంది. ఆ జాతహరిణి చేష్టలు చూస్తుంటే నవ్వు వచ్చిందిఅందుకే నవ్వా నంటూ, రాజా మేలుకోమంటూ ఆ బుడతడు సమాధానమిచ్చాడు. ఏం చేస్తావంటూ ప్రశ్నించాడా చారచక్షువు. దాంతో రోషం తెచ్చుకొన్న ఆ రాజు బడిత తీసుకొని నాలుగు పీకేసరికి ఆ పిల్లి కుయ్యో, మొర్రో అంటూ పరుగుపెట్టింది. ప్రజలందరూ తిరగబడి పిల్లులను తరిమేసి, తమ రాజ్యవారసత్త్వాన్ని కాపాడుకొన్నారు.


జైహింద్.

..............................................................................................................జి.బి.విశ్వనాథ.9441245857. అనంతపురం.

కామెంట్‌లు లేవు: