10, మార్చి 2021, బుధవారం

ఆచార్య సద్బోధన*

 *ఆచార్య సద్బోధన*


అంతఃశుద్ధి కొరకు ప్రయత్నించని ప్రతీ వ్యక్తి తనను తాను వంచించుకుంటున్నాడు. మన ఆచరణకు పవిత్రతను జత కలిపితే మనకు మనం మేలు చేసుకున్నవారమవుతాము. దైవభీతి ఒక్కటే ఉన్న చాలదు, ధర్మబద్ధుడై మెలగాలి.



ఒక వ్యక్తిలో నిమ్న విషయాల పట్ల ఆసక్తి అధికంగా ఉంటే వాటి వలన అతనికి చివరకు హానియే జరుగుతుంది. అదే ఉన్నత విషయాల పట్ల ఉంటే ఫలితం కూడా ఉన్నతంగానే ఉంటుంది.


మన ఆలోచనా పరిధి భగవత్ సంబంధిత విషయాల గురించి యోచించడం ద్వారా విస్తరిస్తుంది. ఈ విశాల విశ్వం మనవైపు చేతులు చాచి చూస్తోంది కానీ మనం దానిపై సరియైన రీతిలో దృష్ఠిపెట్టలేకున్నాం. 


ఈ విశ్వం నుంచి గ్రహించవలసినవి ఎన్నో ఉన్నాయి అవే పాఠాలు, ప్రేరణలు, ఆశీర్వాదాలు.


*శుభంభూయాత్*

కామెంట్‌లు లేవు: