25, సెప్టెంబర్ 2021, శనివారం

రఘువంశం ప్రార్ధనా శ్లోకం

వాగర్ధావివ సంపౄక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే

జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ”:

మనం ఎన్నో సంవత్సరాలుగా  వింటున్నాము ఆలపిస్తున్నాము ఈ చక్కటి శ్లోకాన్ని.  కానీ దీని గూర్చి మనలో ఎంతమందికి తెలుసు.  ఈ శ్లోకం కాళిదాసు వ్రాసిన రఘువంశం ప్రార్ధనా శ్లోకంలో వాక్కు-అర్థము అన్నవి విడిగాఉన్నా విడదీయలేనివి, అటువంటి ఆదిదంపతులగు పార్వతీపరమేశ్వరులకు నా వందనం అన్నాడు. శ్లోకం ఇన్ని వేల సంవత్సరాలుగా ఎన్ని కోట్లమంది జపించి వుంటారో తెలియదు.  కాళిదాసు రచన ఒక చక్కటి సరళమైన ధార కలిగి జనాకర్షణగా ఉంటుంది. ప్రతి పదం సుష్మముగా ఉన్నట్లు ఉంది అత్యంత అర్ధవంతంగా ఉంటుంది అని అనటానికి ఈ ఒక్క శ్లోకమే చాలు.  ఇటువంటి అనేక శ్లోకాలు పుంఖాను పుంఖంగా వ్రాసిన కాళిదాసు మనకు చిరస్మరనీయుడు. 

కామెంట్‌లు లేవు: