23, అక్టోబర్ 2022, ఆదివారం

వున్నకాలాన్ని సద్వినియోగం చేసుకొ

 శ్లోకం.


ఆయుర్వర్ష శతం నృణాంపరిమితం,రాత్రౌ తదర్ధం గతం

తస్యార్ధస్య పరస్య చార్ధమపరం బాలత్వవృద్దత్వయోః

శేషం వ్యాధివియోగదుఃఖసహితం సేవాదిభిర్నీయతే,

జివే వారితరఙ్గచఞ్చలతరే సౌఖ్యం కుతం ప్రాణినామ్॥


బ్రహ్మదేవుడు మనిషికి వంద సంవత్సరాలు ఆయుష్షును ఇచ్చాడు. అందులో సగం అంటే యాభై సంవత్సరాలు నిద్రకే సరిపోతుంది. ఇక ముసలితనంలో రోగాలు రొచ్చులతో ఇరవైఐదు సంవత్సరాలు గడపాల్సి. వస్తుంది. మిగిలింది ఇరవై ఐదు సంవత్సరాలే, ఆ ఇరవైఐదు సంవత్సరాలు కూడా రోగాలకు, ఎడభాట్లకు దు:ఖానికి సేవకా వృత్తికి అంటే ఉద్యోగానికే సరిపోతుంది. కనుక ఓ మనిషి నీకు జీవితంలో సుఖమనేది వుందా ? సుఖమనేది మనశ్శాంతనేది తృప్తిపై ఆధారపడివుంటుంది. కనుక వున్నకాలాన్ని సద్వినియోగం చేసుకొని తృప్తిగా మనశ్శాంతితో జీవించు.


............ భర్త్రహరి సుభాషితమ్.

కామెంట్‌లు లేవు: