23, అక్టోబర్ 2022, ఆదివారం

శ్రీపాద శ్రీవల్లభ స్వామి

 శ్రీపాద శ్రీవల్లభ స్వామి 1320 సంవత్సరంలో వినాయకచవితి నాడు చిత్తా నక్షత్ర శుభ దినాన శ్రీ క్షేత్ర పీఠికాపురంలో జన్మించి, 1336 సంవత్సరంలో భరతఖండంలోని వివిధ పుణ్య ప్రదేశాల్లో సంచరించి, నేటి తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా, మఖ్తల్ పట్టణానికి సమీపంలో కృష్ణావేణీ నదీ సంగమంలోని, " కురువపురమనే ద్వీపంలో ", 1336 సంవత్సరం నుంచి 1350 సంవత్సరంలో ఆశ్వయుజ మాసంలో కృష్ణ పక్ష ద్వాదశి వరకు తపమాచరించి, అనేక మంది భక్తులకు భారతీయ సంస్కృతి, వేద ధర్మాచరణ గురించి బోధించిన పిదప 1350 సంవత్సరంలో ఆశ్వయుజ మాసంలో కృష్ణ పక్ష ద్వాదశినాడు హస్తా నక్షత్ర పుణ్య తిథి నాడు కృష్ణావేణీ నదీ సంగమంలో అంతర్హితులై, నేటికీ కురువపురానికి వచ్చే భక్తులకు శుభాశీస్సులు అందిస్తున్నారు. " నేడు ఆశ్వయుజ కృష్ణ పక్ష ద్వాదశి. శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఆశీస్సులు యావత్ విశ్వ జీవరాశికి అందాలని మనసారా ఆశిస్తూ... 🙏🌹💐🌹🙏 గుళ్లపల్లి ఆంజనేయులు 

కామెంట్‌లు లేవు: