15, అక్టోబర్ 2022, శనివారం

భగవద్గీత

 🙏 ప్రతిరోజూఒక్క భగవద్గీత శ్లోకం పారాయణం చేద్దాము, చేయిద్దాము 🙏

  🌿భగవద్గీత 1వఅధ్యాయం, అర్జున విషాద యోగం,🌿

               -------------------------------------------------

🌺 -38- వ,శ్లోకం-యద్యప్యేతే నపశ్యంతి,లోభోప హతచేతసః |

  కులక్షయ కృతం దోషం,మిత్ర ద్రోహేచ పాతకం॥🌺

🌻39-వ,శ్లోకం-కథంనఙ్ఞేయ మస్శాభిః, పాపాదస్శాన్నివర్తితుమ్|

  కులక్షయ కృతం దోషం,ప్రపశ్యద్ద్భిర్ జనార్దన॥🌻

అర్థం-అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అంటున్నాడు! ఓ జనార్దన!రాజ్యాన్ని సంపాదించాలి అన్న చెడు మనస్సుతో దుర్యోధనుడు మొదలైన వారు వంశనాశనము వలన కలుగు దోషం మరియు మిత్ర ద్రోహం వలన కలుగు పాపం వస్తుంది అని ఒకవేళ వాళ్లకి తెలియదేమో. ఆ రెండు పాపాల గురించి తెలిసిన మనం ఎందుకు విరమించ కూడదో నాకు అర్థం కావట్లేదు.

-----------------------------------------------------------------

 వ్యాఖ్య- కామము,క్రోధము, లోభము ఈ మూడు నరక ద్వారాలు. ఈ మూడు మనిషి మనస్సుని కలుషితం చేస్తాయి. దుర్యోధనుడి మనస్సు లోభంతో కట్టి వేయబడి ఉంది. అందుకే గీతలో "లోభోపహత చేతసః" అని చెప్ప బడింది. శ్రేయస్సును కోరేవారు ఈ మూడిటితో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే నరక ప్రవేశం తప్పదు. దుర్యోధనుడు మొదలైన వారిలా ఎప్పటికైనా పతనం తప్పదు.అందుకే రామకృష్ణ పరమహంస అంటారు కామ, క్రోధ,లోభాలను భగవంతుడి వైపు ( ధర్మం వైపు )త్రిప్పండి తద్వారా మీరు ఇహ, పరాలలో రక్షింపబడతారు. అర్జునుడు ఇంకా కొన్ని శ్లోకములలో తన విషాదాన్ని శ్రీకృష్ణుడికి తెలియజేస్తాడు. ఆ తరువాత గీతామృతం ప్రారంభమవుతుంది.

------------------------------------------------------------------------------

🙏షేర్ చేసి కొన్ని కోట్లమంది ప్రతిరోజు ఒక్క భగవద్గీత శ్లోకం పారాయణం చేసే అదృష్టాన్ని కల్పిద్దాము. శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహాన్ని,ఈ భగవద్గీత పారాయణ మహాయజ్ఞ ఫలితాన్ని అందరం పొందుదాము. గీతామృతాన్ని అందరం త్రాగుదాము, 🙏

              ------------------------------------------

కామెంట్‌లు లేవు: