15, అక్టోబర్ 2022, శనివారం

మహర్షుల చరిత్రలు..

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

*మన మహర్షుల చరిత్రలు..*


*🌹ఈ రోజు 50,వ బకదాల్భ్య మహర్షి గురించి తెలుసుకుందాము..🌹*


🍁☘️🍁☘️🍁☘️🍁☘️🍁☘️


🍁ఇపుడు మనం తెలుసుకోబోయేది ఒక అతి అద్భుతమైన మహర్షి గురించి . నిజంగా ఏం గొప్పతనం ! ఎంత ఆయుషు ! ఎంత వినయం ! మహాద్భుతం . 


☘️చాలా చాలా యుగాలకి పూర్వం దాల్బ్యుడనే మహర్షి ఉండేవాడు. ఆయన విష్ణుమూర్తిని ప్రార్థించి ఎన్నికల్పాలయిపోయినా సరే మరణం లేకుండా ఉండే కొడుకు కావాలని వరం పొంది ఒక కొడుకుని పొందాడు.


🍁ఆహా ! ఎంత అదృష్టం. ఆయన ఎంత పుణ్యాత్ముడో! అంత గొప్ప కొడుకుని కన్న తండ్రి తక్కువ వాడు కాదు కదా! 


☘️ఆ పిల్లవాడు బక పుష్పం ఉన్నంత అందంగా చక్కటి సువాసనతో ఉన్నాడని బకుడని పేరు పెట్టారు.


🍁 తండ్రి పేరు కూడా కలిసి బకదాల్బ్యుడు అని, ఇతడ్ని పెంచిన తల్లిదండ్రులవల్ల ద్వ్యాముష్యాయణుడు, గ్లావుడు, గ్లావమైత్రేయుడు అని కూడ పేర్లున్నాయి.


☘️బకదాల్ఫ్యుడు చిన్నతనంలోనే ముఖ్య ప్రాణోపాసనం చేసిన మహాతపశ్శాలి, మహాత్ముడు అయ్యాడు.


🍁ఒకసారి ఒక తెల్లకుక్క కొన్ని చిన్న కుక్కలను ఒకదానితోక ఒకటి నోటితో పట్టుకుని వలయాకారంలో తిరిగి కూర్చుంటే చూసి ఋత్విజుల విధుల్ని నిర్ణయించి బకదాల్బ్యుడు

ద్వైతవనంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. 


☘️గొప్ప తపస్సు చేసి మరణాన్నే జయించి, అపర శివుడిలా తేజస్సుతో వెలిగిపోతున్నాడు. కొంతకాలం తర్వాత పాండవులు ద్వైతవనంలో ఉండడానకి వచ్చారు. వాళ్ళని పెద్ద పెద్ద మునులందరూ వెళ్ళి పలకరించి వస్తున్నారు.


🍁బకదాల్భ్య మహర్షి ఒకసారి పాండవులని చూడ్డానికి వెళ్ళి ధర్మరాజు దగ్గర అతిథి సత్కారం తీసుకుని,


☘️నాయనా ! ఉత్తములైన బ్రాహ్మణులు మీ దగ్గరికి వచ్చి పోతూ వుంటే అగ్నికి, వాయువు తోడైతే అరణ్యాన్ని ఎలా దహిస్తాయో, మా బ్రాహ్మణులు, మీ క్షత్రియులు కలిసినప్పుడు శత్రువులు కూడా అలాగే నశిస్తారు అన్నాడు.


🍁యుద్ధంలో ఏనుగుకి దారి చూపించడానికి అంకుశం ఎలా ఉపయోగపడుందో, రాజుని ధర్మమార్గంలో త్రిప్పడానికి బ్రాహ్మణుడు అలాగే ఉపయోగపడతాడన్నాడు.


☘️తర్వాత బకదాల్యుడు చిరంజీవుల్లో ఒకడై బ్రహ్మచారై ఎన్నో యుగాలు బ్రతికి సముద్రం మధ్యన ఒక దీవిలో తపస్సు చేసుకుంటున్నాడు.


🍁ఒకసారి ధర్మరాజు అశ్వమేథయాగం చెయ్యడానికి యజ్ఞాశ్వాన్ని విడిచి పెట్టినప్పుడు కృష్ణార్జునులు గుఱ్ఱంతో తిరుగుతూ మహర్షి ఉన్న చోటుకి వచ్చారు.


☘️అక్కడ కొన్ని యుగాలుగా పెరిగిన శరీరం, జడలు, గడ్డంతో, కోటి సూర్యుల తేజస్సుతో ఉన్న బకదాల్ఫ్యుణ్ణి చూసి కృష్ణార్జునులు రథం దిగి నడిచి వెళ్ళి నమస్కారం చేశారు.


🍁అర్జనుడు మహర్షిని చూసి ఆశ్చర్యపోయాడు. శరీరం చుట్టూ పుట్టలు, మోకాళ్ళు మోచేతులు నించీ చెట్లు, పుట్టల్లో ఎన్నో రకాల పాములు ఆ చెట్లమీద ఎన్నో రకాల పక్షులు చూసి అర్జనుడు మహర్షికి నమస్కారం పెట్టి ఈ మీ వింతకి పరమార్థం ఏమిటని అడిగాడు. 


☘️అర్జునా ! క్షణంలో పోయే ఈ శరీరానికి తూగుటుయ్యాలలు, పూలపాన్పులు ఎందుకు? ఈ మట్టి ఆకులు చాలవా? అన్నాడు బకదాల్బ్యడు. అర్జునుడు స్వామీ! మీ వయస్సెంత? అన్నాడు.


🍁బక దాల్ఫ్యుడు నేను పుట్టాక ఇరవై మంది బ్రహ్మలు వెళ్ళారు. ఎంతో మంది మార్కండేయులు వెళ్ళిపోయారు. నీకొక చిత్రమైన విషయం చెప్తాను విను. 


☘️ప్రళయ కాలంలో ఏడు సముద్రాలు, ముల్లోకాలు కొట్టుకొచ్చి ఇక్కడికి చేరాయి. అప్పుడిక్కడ ఒక మఱ్ఱి చెట్టుండేది. దాని కొమ్మలు వెయ్యి పైగానే ఉన్నాయి. ఒక్కొక్క కొమ్మకి వెయ్యేసి బ్రహ్మాండాలు వ్రేలాడుతున్నాయి.


🍁ఆ మఱ్ఱి చెట్టుకి చిటారుకొమ్మ మీద ఒక చిగురాకు మీద పడుక్కుని కుడి కాలి బొటన వేలు నోట్లో పెట్టుకుని ఒకసారి నవ్వుతూ ఒకసారి ఏడుస్తూ నన్ను ప్రేమతో చూసి భయం లేదని అభయమిచ్చాడు ఒక బాలుడు.


☘️రమ్మనేవాళ్ళు లేక పొమ్మనే వాళ్ళు లేక అంతటికి తానే నాయకుడయ్యి హాయిగా పడుకుంటే అతని నాభిలోంచి ఒక కమలం దాంట్లోంచి ఒక బ్రహ్మ వచ్చి ఈ సృష్టినంతా చేశాడు. 


🍁అతడే శ్రీకృష్ణుడుగా పుట్టి నీకు బావై ఈ బాధలన్నీ పడుతున్నాడని చెప్పి కృష్ణుడ్ని కౌగిలించుకుని ఎలావున్నావయ్యా మూడులోకాల కుటుంబీ! అన్నాడు బకదాల్భ్య మహర్షి శ్రీకృష్ణుణ్ణి.


☘️కృష్ణుడు బకదాల్బ్యుణ్ణి పొగుడుతుంటే, పొగడ్త ఎంతటి గొప్పవాడ్నయినా నాశనం చేస్తుంది, ఒక కథ చెప్తాను వినమన్నాడు మహర్షి.


🍁అర్జనుడికి కథలంటే ఇష్టం వెంటనే చెప్పండి చెప్పండి అన్నాడు. నేను ఒక మఱ్ఱి చెట్టు దగ్గర తపస్సు చేసుకుంటుంటే నాలుగు ముఖాల బ్రహ్మ వచ్చి నీకేం కావాలో కోరుకో ఇస్తానన్నాడు.


☘️నీలాంటి వాళ్ళని ఇరవైమందిని చూశాను. నువ్వు నాకేమిస్తావన్నాను,నేను. బ్రహ్మకి కోపం వచ్చి వెఱ్ఱి వాడ్ననుకుంటున్నావా? అన్నాడు.


🍁నేను నవ్వుతున్నాను. ఈలోగా మా ఇద్దరి మధ్యా భూమి చీలి పెద్దగాలి వచ్చి మమ్మల్ని వేరే బ్రహ్మాండంలో పడేసింది. అక్కడ ఎనిమిది తలల బ్రహ్మ మీరెవరో నాకనవసరం నాసేవ చెయ్యండన్నాడు.


☘️మళ్ళీ అలాగే జరిగి పదహారు తలల బ్రహ్మ తన సేవ చెయ్యమన్నాడు. బ్రహ్మాండాలు దాటుతూ బ్రహ్మల్ని చూస్తూ అలా వెడుతూనే వున్నాం.


🍁చాలా ముఖాలున్న బ్రహ్మల్ని చూస్తూనే వున్నాం. చివరికి వెయ్యి తలలు, అమితమైన తేజస్సు కలవాడు అయిన బ్రహ్మ మమ్మల్ని చూసి ఎదురొచ్చి యోగక్షేమాలడిగి నేను నా పరివారం అంతా మీ ఆధీనంలోనే వున్నాం.


☘️మీకేం కావాలో అడగండి చేస్తాం అన్నాడు. బ్రహ్మలందరు సిగ్గుతో తలవంచుకుని గర్వం నశించి మహాపురుషా! నువు విష్ణుమూర్తివని, మా గర్వం అణగాలనే ఇలా చేశావని అర్ధమయింది. క్షమించమని అడిగారు.


🍁అందుకని అర్జునా! గర్వం పనికిరాదు అన్నాడు బకదాల్ఫ్యడు. కృష్ణార్జునులు బకదాల్భ్య మహర్షిని స్తుతించి ధర్మరాజు చేస్తున్న అశ్వమేధయాగానికి రమ్మని బ్రతిమలాడారు. 


☘️నవరత్నాలు పొదిగిన బంగారు పల్లకీలో మహర్షిని కూర్చోబెట్టి ధర్మరాజుకి కబురు చేసి మహర్షిని తీసుకువెళ్ళారు.


🍁ఋత్విజుల్ని మంత్ర పాఠకుల్ని నియమించి తాను బ్రహ్మగా ఉండి అశ్వమేధయాగం పూర్తి చేయించాడు మహర్షి. కొంతకాలం తర్వాత బకదాల్బ్యుడు తన దగ్గర చాలినన్ని కోడెదూడలు లేవని ధృతరాష్ట్రుణ్ణి అడిగాడు. 


☘️ధృతరాష్ట్రుడు చచ్చిపోయిన దూడల్నిచ్చి తీసుకోమన్నాడు. మహర్షి కోపంతో బ్రహ్మర్షులంటే నీకు వెటకారంగా ఉందా? నిన్ను సర్వనాశనం చేస్తానని దృతరాష్ట్రుడి రాజ్యం అంతరించిపోయేలా అభిచారిక హోమం ప్రారంభించాడు.


🍁ధృతరాష్ట్రుడు పరుగెత్తుకు వెళ్ళి మహర్షి కాళ్ళ మీద పడ్డాడు. మాలాంటి వాళ్ళు లేకపోతే నీలాంటి వాళ్ళకి పట్టపగ్గాలుంటాయా! క్షమించాను ఫో! అన్నాడు మహర్షి.


☘️ధృతరాష్ట్రుడు వెంటనే గోవుల్ని పంపించాడు మన భారత బ్రహ్మర్షులు దుష్టశిక్షణ, శిష్టరక్షణ చెయ్యడంలో పరమేశ్వరుడంతటి వాళ్ళు.


🍁ఇదండీ బకదాల్భ్య మహర్షి కథ. రేపు మరో మహర్షి గురించి తెలుసుకుందాము స్వస్తి..


  సేకరణ: కె.వి. రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్. 

☘️🍁☘️🍁☘️🍁☘️🍁☘️🍁

కామెంట్‌లు లేవు: