27, ఆగస్టు 2024, మంగళవారం

నిత్యపద్య నైవేద్యం-1592

 నిత్యపద్య నైవేద్యం-1592 వ రోజు

సంస్కృత సుభాషితం-అనువాద పద్యం-227. సేకరణ, పద్యరచన: సహజకవి, డా. అయినాల మల్లేశ్వరరావు, తెనాలి, 9347537635, గానం: గానకళారత్న, శ్రీ వెంపటి సత్యనారాయణ, తెనాలి

ప్రోత్సాహం: "గీతాబంధు" శ్రీ గోలి లక్ష్మయ్య, గుంటూరు


సుభాషితం:

ధీర: శోకం తరిష్యంతి 

లబంతే సిద్ధిముత్తమామ్l

ధీరై: సంప్రాప్యతే లక్ష్మీ 

ధైర్యం సర్వత్ర సాధనమ్ll


తేటగీతి:

తేట ధీరులు దుఃఖమున్ దాటగలరు

బుద్ధితో సిద్ధియును కూడ పొందగలరు 

పుడమిపై ధనలక్ష్మినీ పొందగలరు 

సకల సిద్ధికి ధైర్యమ్ము సాధనమ్ము.


భావం: ధీరులు దుఃఖాన్ని దాటగలరు. సిద్ధి కూడా పొందుతారు. ఐశ్వర్యాన్ని అంటే లక్ష్మినీ పొందుతారు. ధైర్యం అన్నిటికీ ఒక సాధనంగా ఉంటుంది.

కామెంట్‌లు లేవు: