6, సెప్టెంబర్ 2024, శుక్రవారం

అక్షింతలు

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*తల ఫై అక్షింతలు ఎందుకు వేస్తారు?*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసు కోనేపుడు పాదాల కెందుకు నమస్కరిస్తాం?*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*అక్షింతలు అంటే మన కందరికీ తెలుసు..*


*బియ్యం లో పసుపు కలిపి ఏ పండగ వచ్చినా, ఏ దైనా శుభకార్యాలు జరిగినా, దేవాలయాల లోను మన పెద్దలు మనల్ని అశీర్వదించడానికి  మనఫై అక్షింతలు వేస్తారు.*


*అయితే ఈ అక్షింతలు వెయ్యడం లోని పరమార్దం ఏమిటో  తెలుసు కుందాం..*


*అక్షింతలు అంటే  క్షతం కానివి.అని అర్ధం. అంటే రోకలి పోటుకు విరగనివి అని..  శ్రేష్ఠమైన బియ్యం అన్నమాట. అలాంటి బియ్యాన్ని పసుపు మరియు  నెయ్యితో లేక, నూనె తొ కలిపి అక్షింతలు తయారు చేస్తారు.*


*నవ గ్రహాల్లో ఒక్కో గ్రహానికి ఒక్కో ధాన్యాన్ని...దాన వస్తువుగా పేర్కొంటారు.ఆ రకంగా నవ గ్రహాలలో చంద్రుడికి ప్రీతి కరమైన దాన వస్తువు బియ్యం.  చంద్రుడు మనస్సుకు అధినాయకుడు.*


*మనిషి మనసు, బుద్ధి, గుణము, వ్యసనము వీటన్నిటికి చంద్రుడే  కారణమని, మనిషిపై చంద్రుడి ప్రభావం ఎక్కువగా  ఉంటుంది. అని మన  పెద్దల నమ్మకం.*


*అందుకే  ఆ చంద్రుడికి సంకేతమైన బియ్యం కూడా మనిషి మనస్సు పై ప్రభావం చూపు తుందని, మనో ధర్మాన్ని నియంత్రిస్తాయి.అని గట్టిగా విశ్వసిస్తారు.. అందు కే అక్షింతలను తల ఫై వేసి ఆశీర్వదిస్తారు..*


*సైంటిఫిక్ గా చెప్పా లంటే బియ్యానికి విద్యుత్ శక్తిని గ్రహించే  తత్వం ఉంది.  దేహం ఓ విద్యుత్‌ కేంద్రం.విద్యుత్‌ సరఫరాల్లో హెచ్చుతగ్గులు సాధారణం. ఈ వ్యత్యాసాలు మనిషి మనస్సు మీద, ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపుతాయి.*


*పెద్దలు మన ఫై అక్షింతలు వేసి ఆశీర్వదించే సమయంలో, వారి దేహం లోని విద్యుత్తులో కొంత బాగం ఈ అక్షంతలను తాకుతాయి. ఆశీస్సులు ఇచ్చే వాళ్ల నుంచి, పుచ్చుకొనే వాళ్లకి కొంత విద్యుత్‌ బదిలీ అవుతుంది. అంతే కాదండీ!*


*మనిషి దేహంలో విద్యుత్‌ కేంద్రాలు ఇరవై నాలుగు ఉంటాయట. వాటిలో ప్రధాన మైనది. శిరస్సు. ఇది విద్యుదుత్పత్తి కేంద్రమే కాదు,  విద్యుత్‌ ప్రసార కేంద్రం కూడా...*


*తలపై అక్షింతలు వేయడం ద్వారా వాటి లోని విద్యుత్‌ను గ్రహించి దేహానికి ప్రసారం చేస్తుంది. శిరస్సు. ఈ కారణం గా అక్షింతల ద్వారా  పెద్దలలో ఉండే సాత్విక గుణం పిల్లలకు లభిస్తుంది.*


*ఇక పసుపు క్రిమి సంహారకం, ఆశీస్సులు ఇచ్చే వారికీ ఎటువంటి చర్మ వ్యాదులు లాంటివి. ఉన్నా అవి ఆశీస్సులు పుచ్చు కొనే వారికి రా కుండా ఉంటాయి.*


*పెద్దలు, విద్వాంసులు, గురువులు, తల్లిదండ్రులు  మనకు అక్షింతలు వేసి శిరస్సును తాకి ఆశీర్వదించడంలోని ఆంతర్యం, పర మార్థం ఇదే!*


*ఆధ్యాత్మికంగా చెప్పాలంటే జీవుడికి సంకేతం బియ్య మేనట...*


    *‘అన్నాద్భవన్తి భూతాని’*


*అని భగవద్గీత లో మూడవ అధ్యాయం లో చెప్ప బడింది.*  


*జీవులు అన్నం చేత పుడతారట. ఈ అన్నం తయారీకి మనం ఉపయోగించే ధాన్యం బియ్యం...భగవంతునిపై అక్షింతలు వేసి నమస్కరించడం అంటే, జీవుడు...ఈ అన్నంలో పుట్టీ, తిరిగి ఈ జీవుడిని భగవంతుడి లోకి చేర్చడమే...*


*పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకొనేటప్పుడు పాదాల  కెందుకు నమస్కరిస్తాం?*


*పెద్దల దగ్గర మన ఆశీర్వాదం తీసు కొనేటపుడు వారి పాదాలకు నమస్కరించడం మన సంప్రదాయం. 

అయితే అలా... చెయ్యడం లోని అర్ధం ఏమిటో తెలుసు కుందాం..*


*మన  శరీరం లో...తల ఉత్తర దృవంఅయితే... పాదాలు దక్షిణ దృవం.. వ్యతిరేక దృవాలేఆకర్షించుకుంటాయి.. అప్పుడే గా శక్తి విడుదల అవుతుంది.*


*అలానే మనం పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసు కొనే టపుడు మన తలను వారి పాదాలకు తాకించి ఆశీర్వాదం తీసు కుంటాం. అప్పుడు వారి పాదాల లోని దక్షిణ దృవం మన తలలో గల ఉత్తర దృవం తో ఆకర్షితమై శక్తిని వెలువరిస్తుంది... అందుకే మన హిందూ  సాంప్ర దాయం లో పెద్దల కాళ్ళకు నమస్కరిస్తాం.*


*మన సంప్రదాయం లో  ప్రతీ దానికి ఏదొక పర మార్దం దాగి ఉంటుంది.*


*మన సంప్ర దాయాలను అర్దం లేని వని కొట్టి పారేయ కుండా వాటిలోని పరమార్దం తెలుసు కొని  ఆచరిద్దాం...*


*సర్వేజనా స్సుఖినో భవంతు*


*లోకాస్సమస్తా స్సుఖినో భవంతు*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*ఓం శాంతిః శాంతిః శాంతిః!*

*సర్వేజనా సుఖినోభవంతు!!*

*ఓం తత్సత్!!*


*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*

*ఓం నమః శివాయ!!!*

🛐🛐🛐🛐🛐🕉️🛐🛐🛐

*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*

🛐🛐🛐🛐🛐🛐🕉️🕉️🛐

కామెంట్‌లు లేవు: