6, సెప్టెంబర్ 2024, శుక్రవారం

వరాహ జయంతి"

 # నేడు "వరాహ జయంతి" #


బమ్మెర పోతన రచించిన భాగవతం ప్రకారం మహా ప్రళయం

సంభవించి భూమి జలంలో మునిగిపోయింది. జగత్తుకు ఆధారమైన భూమండలాన్ని తిరిగి పైకి తేవడానికి బ్రహ్మదేవుడు పుండరీకాక్షుని స్మరించ సాగాడు. ధ్యాన నిమగ్నుడైన బ్రహ్మ నాసిక

నుంచి, బొటనవేలు పరిమాణమున్న వరాహంగా

శ్రీహరి లోకోద్ధరణకై ఉద్భవించాడు. సకల దేవతలు చూస్తుండగానే, క్షణం లోపల

ఏనుగంత ప్రమాణం పెరిగి చూసే వారికి అద్భుతాశ్చర్యములు కలిగించారు.


వరాహస్వామి హిరణ్యాక్షుని సంహరించి భూమిని తన కోరలపై నిలిపి సముద్ర గర్భం నుంచి భూమిని పైకి తీసి ఉద్దరించాడు. అనంతరం స్వామి తిరుమల

కొండపై సంచరించినట్లుగా ఆధారాలున్నాయి. అందుకు నిదర్శనం తిరుమల కొండపై ఉన్న భూవరాహ స్వామి ఆలయం. భాద్రపద శుద్ధ తదియ రోజు వరాహ జయంతి సందర్భంగా

శ్రీమహావిష్ణువును వరాహ అవతారంలో పూజించిన వారికి ఐశ్వర్యం, ఆరోగ్యం

చేకూరుతాయని నమ్మకం.🙏

కామెంట్‌లు లేవు: