శ్రీమద్భగవద్గీత: రెండవ అధ్యాయం
సాంఖ్యయోగం: శ్రీభగవానువాచ
దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ధనంజయ
బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః (49)
బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృతదుష్కృతే
తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలమ్ (50)
ధనంజయా.. ప్రతిఫలాపేక్షతో ఆచరించే కర్మ నిష్కామకర్మకంటే హీనం, ఫలితం ఆశించి కర్మచేసేవాళ్ళు అల్పులు. అందువల్ల నీవు సమబుద్ధినే ఆశ్రయించు. సమభావన కలిగిన పురుషుడు పుణ్యపాపాలు రెండింటినీ ఈ లోకంలోనే వదిలేస్తున్నాడు. కనుక సమత్వబుద్ధి అయిన నిష్కామకర్మనే నీవు ఆచరించు. కౌశలంతో కర్మలు చేయడమే యోగమని తెలుసుకో.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి