23, జనవరి 2026, శుక్రవారం

అమ్మ మదంబ

 ఓం శ్రీ మాత్రే నమః 

23-1-26


వాసర వాసినిన్ సుమతి ప్రార్థన జేసిన జాలు సన్మతిన్ 

ధ్యాసను నిల్పి జ్ఞాన సముదాయము గూర్చుచు రక్ష సేయుచున్ 

భాసిత రీతులన్ జనుల వర్ధిల జేయుచు నుండు సర్వదా 

దోసములన్ క్షమించ మది తోయజ గర్భుని రాణి వేడనౌ!


అమ్మా నిన్ను నుతించి వేడెదము సమ్యగ్భావనన్ నిత్యమున్ 

మమ్మున్ రక్షణ జేసి జ్ఞానమును సంప్రాప్తింపగా జేయ చే

కొమ్మా సన్నుతులన్ విశేషముగ వాక్శుద్ధిన్ ప్రసాదింపగన్ 

సమ్మానంపు వసంత పంచమిని మా సారస్వత ప్రార్థనల్


శా.అమ్మా వాసర వాణి! లోకమున సమ్యగ్దృష్టి కావ్యాళి, ర

మ్యమ్మైనట్టి రసోచిత ప్రభలతో నానందమున్ గూర్చు భా

వమ్ముల్ మానస మందిరమ్మున సదా వర్ధిల్లి పెంపార  స

ర్వమ్ము న్నీ మహిమాప్తి మూలములుగా రంజిల్లెడున్ భారతీ


ఉ.అమ్మ మదంబ! పేర్మి భువి నాప్తుల  నాదుకొనంగ నెంచు పె

ద్దమ్మ!  దయాంబు రాశివి గదమ్మ! ననుం దయ జూచు వేడ్క రా

వమ్మ! నినున్ మదిన్ నిరత మర్చన జేయుచు వేడు కొందు నీ

విమ్ముగ మార్గదర్శనము నేర్పడ జేయగ వాసరేశ్వరీ!౹౹ 


ఉ.వాణిని అక్షదామ శుక పాణిని, సత్కవితార్థ పుష్ట గీ

ర్వాణిని, దుష్ట దుర్మద నివారిణి, నాత్మ భువుండు ధాతకున్

రాణిని, గొల్చి వేడెదను రమ్య వినూత్న కవిత్వ సిధ్ధికిన్

క్షోణిని తాకి మ్రొక్కెద నకుంఠిత దీక్ష నొసంగగా మదిన్


మిత్రులందరికీ వసంత పంచమీ శుభాకాంక్షలతో


మీ

డా. రఘుపతి శాస్త్రుల 

విశ్రాంత ప్రాచార్యులు

భాషకు వ్యాకరణం


*కాఫీ విత్…తెలుగు వ్యాకరణం..3006.*


*తెలుగు వ్యాకరణ దీపం చిన్నదేం కాదు!!*


'తెలుగు వ్యాకరణ దీపం చిన్నదని' తిరుపతి వెంకట కవులన్నారు. కానీ మనకందు బాటులోవున్నవ్యాకరణాల్ని పరిశీలిస్తే తిరుపతి కవులు చెప్పినట్లు తెలుగువ్యాకరణదీపం చిన్నదేం కాదని స్పష్టమవుతుంది.


తెలుగు భాషకు ప్రాచీన చరిత్ర ఎంతవున్నదో అంతే ప్రాచీనత తెలుగువ్యాకరణానికీవుందంటే"అతిశయోక్తి కాదు. భాషతో పాటే వ్యాకరణమూ సమాంతరంగా వర్ధిల్లుతోంది. భాష వెలుగైతే వ్యాకరణం దాని నీడలా అంటిపెట్టుకొని వుంటుంది. అయితే భాషకు వ్యాకరణం చివరి దశలో వచ్చే లక్షణమని కొందరంటారు. కానీ ఇందులో నిజం పాలు తక్కువనే చెప్పాలి.!!


*భాషకు వ్యాకరణం అవసరమా?* 


ఈ విషయమై తర్జన భర్జనలు చాలానే జరిగాయి. 

అసలు వ్యాకరణం లేకుండా భాషలుంటాయా? వ్యాకరణం లేని భాషలు మన గలుగుతాయా? వ్యాకరణం లేనంత మాత్రాన భాషకొచ్చిన ఇబ్బందేమిటి? అన్న ప్రశ్నలూ తలెత్తాయి. అయితే ప్రపంచంలోని నాగరిక భాషలన్నిటికీ వ్యాకరణం వుంది. అంతమాత్రాన… వ్యాకరణం నేర్చుకున్న తర్వాతనే భాష మాట్లాడాలన్న నియమం కానీ, శాసనం కానీ ఏదీ లేదు. ఒకవేళ అటువంటి శాసనమున్నా ఎవరూ దాన్ని ఖాతరు చేయరు ఆ మాటకొస్తే భాష మాట్లాడేవారిలో వ్యాకరణం అనేదొకటి వుంటుందని తెలిపిన వారి సంఖ్య చాలా తక్కువ. వ్యాకరణం తెలీకుండా భాషమాట్లాడే వారికేమైనా యిబ్బందులెదురవుతున్నాయా? అంటే అదీ లేదు. వ్యాకరణం తెలీకుండా మాట్లాడే వారికి, వ్యాకరణం తెలిసి మాట్లాడే వారికి మధ్యవ్యత్యాసం కూడా కనిపించదు. ఉభయుల లక్ష్యం భావప్రకటన, భావ వినిమయం కాబట్టి వాగ్వ్యవహారంంలో వీరి 

మధ్య అంతరమూ లేదు.... అంతరాయమూ లేదు. అటువంటప్పుడు భాషకు వ్యాకరణంఎందుకన్న ప్రశ్న తలెత్తక మానదు.!


ఏ భాషకైనా పుట్టుకతోనే వ్యాకరణం అంతర్గతమై వుంటుంది. కాబట్టి వ్యాకరణం లేకుండా భాషను.. ఊహించలేము గాసటబీసటగా వున్న భాషను వ్యాకరణం ఒక గాడిలో పెడుతుంది. చెట్టుకు పాదులాగా, చేనుకు కంచెలాగా, చెరువుకు గట్టులాగా, బిడ్డకు… తల్లిలాగ భాషకు వ్యాకరణం రక్షాకవచంలా ఉపయోగపడుతుంది.


ఋతువుల్ని బట్టి ప్రకృతిలో మార్పులు జరగటం సహజం. అలాగే ప్రకృతి సిద్ధమైన మనిషి మాట్లాడే భాషలో కూడా మార్పులు జరగడమూ అంతే సహజం.. స్థూలంగా ఈ మార్పులు మనకంటికి కనిపించకపోయినా ఇది అంతర్గతంగా జరిగే అత్యంత సహజమైన పరిణామ ప్రక్రియ. కాలాన్ని బట్టి, వ్యవహారాన్ని బట్టి భాషలో మార్పులు కలగడం, దాని కనుగుణంగానే వ్యాకరణలో కూడా మార్పులు జరుగుతుంటాయి. ఒకప్పుడు కావ్య భాషకే పరిమితమైన వ్యాకరణం యిప్పుడు వ్యావహారభాషకు కూడా విస్తరించడమే యిందుకు నిదర్శనం. దీన్ని బట్టి వ్యాకరణం అనేది భాషలో అంతర్లీనంగా మిళితమై వున్నదే కానీ, కృతకంగా ఎక్కడినుంచో తెచ్చిపెట్టుకున్నది కాదని అర్ధమవుతుంది.


వ్యాకరణం తెలిసినవారు, లేక తెలియనివారు ఎవరు

మాట్లాడినా కూడా భాషలో అక్షర, పద, వాక్య, సమాస, విభక్తి ప్రత్యయాలు, కర్త, కర్మ, క్రియలు విధిగా.. వుంటాయి. ఇవేవీ లేకుండా మాట్లాడటం కష్టం. ఒకవేళ మాట్లాడటానికి ప్రయత్నించినా అది అర్ధరహితమై, భావ ప్రకటనకు, భావవినిమయానికి ఆటంకం కలుగుతుంది. అంటే మనం మాట్లాడే భాష ఎదుటి

వారికి అర్థమై, భావవినిమయానికి ఉ పకరిస్తే అందులో కచ్చితంగా వ్యాకరణం వుందన్నమాటే. ఏతావాతా భాషలో పదసమాసాలు, సంధులు, కర్త, కర్మ, క్రియ ప్రత్యయాదుల్లో జరిగే మార్పుల్ని గమనించి వాటిని ఒక క్రమ పద్ధతిలో పెడితే అది వ్యాకరణం అవుతుంది అలా క్రమపద్ధతిలో పెట్టేవారు వైయాకరుణులవుతారు.


ప్రాచీన కాలంలో సంస్కృతపద్ధతి, దేశపద్ధతుల్లో వ్యాకరణం రెండు ముఖాలుగా విస్తరించింది. సంస్కృత పద్ధతిని అనుసరించి ఆంధ్రశబ్దచింతామణి దాని సంప్రదాయానికి చెందిన రచనలు ఒక ముఖమైతే.. దేశపద్ధతిని అనుసరించిన ఆంధ్ర భాషాభూషణం తదితర పద్యాత్మకసంగ్రహరచనలు, ఆధునికయుగంలో చారిత్రక దృక్పథంతో వెలసిన బాలకవిశరణ్యము ఆంధ్రభాషానుశాసనం వంటి రచనలు మరో ముఖ్యంగా చెప్పుకోవచ్చు.


నన్నయ కాలం క్రీ.శ. 11వ శతాబ్ది నుండి పరిశీలిస్తే ప్రతిశతాబ్దంలో కూడా వ్యాకరణాలు వెలువడినాయి. ఇక 17,18,19 శతాబ్దాల్లో అయితే వ్యాకరణ 

రచన మూడు వువ్వులూ ఆరుకాయలుగా వర్ధిల్లింది. ఇక 20వ శతాబ్దిలో అయితే విద్యార్ధి వ్యాకరణాలు కోకొల్లలుగా వచ్చాయి.


తెలుగుకు సంబంధించిన వ్యాకరణాన్ని ప్రాచీనములు, అర్వాచీనములుగా విభజించి చూస్తే దాదాపు రెండు వందలకు మించి కనిపిస్తాయి. ఇందులో కొన్ని సంస్కృతంలోను, కొన్ని తెలుగు పద్యాత్మకంగాను, మరికొన్ని సూత్రాత్మకాలుగానూ వున్నాయి.


ఆంధ్రశబ్ద చింతామణి (క్రీ॥శ॥11వ శతాబ్దము)మొద

లుకొని ఆనందరంగరాట్ఛందము (క్రీ॥శ॥18వ శతాబ్దము) వరకు గల వ్యాకరణాల్ని ప్రాచీనములుగా.. పట్టాభిరామ పండితీయము(క్రీ॥శ॥19వశతాబ్దము) నుంచి నేటి వరకు వెలిసిన వ్యాకరణాల్ని అర్వాచీన వ్యాకరణాలుగా భావించవచ్చు. తెలుగుభాషకు నాటి నుండి నేటి వరకు సంస్కృత, ఆంధ్ర, ఆంగ్ల, లాటిన్, రష్యన్ భాషల్లో రచించబడిన వ్యాకరణాలు,వ్యాఖ్యలు, విద్యార్థి వ్యాకరణాలు, ఏకదేశి వ్యాకరణాలు వందల సంఖ్యలో వున్నా వీటి మధ్య సమతుల్య

తను సాధించడంలో మనం వెనుకబడి వున్నాం.


*తొలి తెలుగు వ్యాకరణకర్త కేతన.!!


ఆంధ్ర శబ్ద చింతామణి (సంస్కృతంలో) తొలి తెలు

గు వ్యాకరణమని, దీన్ని నన్నయ 11వ శతాబ్దంలో రచించాడని చెబుతున్నటికీ ఇది నన్నయ్యదే అనడానికి సరైన సాక్ష్యాధారాలు లేవు. అయితే తెలుగులో తొలి వ్యాకరణకర్త తానే అని మూలఘటిక కేతన (1200-1280) తన ఆంధ్రాభాషా భూషణంలో చాలా స్పష్టంగా చెప్పాడు.


"మున్ను తెనుగునకు లక్షణ మెన్నడు నెవ్వరును

 జెప్పరే జెప్పెద విధ్వన్నికరము మది మెచ్చగ నన్నయ భట్టాదికవి జనంబులకరుణన్"


కేతన చెప్పిన దాన్ని బట్టి నన్నయ భట్టాదికవుల గ్రంధాల్లోని లక్ష్యాలు ఆధారంగా ఆంధ్ర భాషా భూషణాన్ని రచించాడని భావించాలి. అయితే నన్నయ రచించినట్లు చెప్పబడుతున్న చింతామణి' ఆధారంగా తాను ఆంధ్రభాషా భూషణాన్ని రచించినట్లు… కేతన చెప్పలేదు. దీన్ని బట్టి చింతామణి వ్యాకరణ సంప్రదాయం అప్పటికి ప్రచారంలోనికి రాలేదనిచెప్పవచ్చు. పైగా కేతన ఆంధ్రభాషాభూషణం స్వచ్ఛమైన తెలుగులో రచింపబడిన తొలివ్యాకరణం.


"ఆదులు స్వరములు నచ్చులు తాదులొగిన్ వ్యంజనములు, హల్లులుననగా మేదిని నెల్లెడల 

జెల్లును కాదులనై దైదు కూర్పునగు వర్గంబుల్"


తిక్కనకు సమకాలికుడైన ఆధర్వుణుడు (క్రీ॥శ॥

1250) 'త్రిలింగ శబ్దాను శాసనం' అనే తెలుగు వ్యాకణాన్ని సంస్కృతంలో రచించాడు. ఇక 16వ శతాబ్దానికి చెందిన మంచెళ్ల వాసుదేవ కవి సిద్ధాంతకౌముది 

అనే నామాంతరంగల'వైకృత చంద్రికా' అనే తెలుగు వ్యాకరణాన్ని సంస్కృతంలో రచించాడు.!!


*ఆంధ్రధాతుమాల..!!


వేదం పట్టాభిరామ శాస్త్రి (1760/1820) 1816లో ఆంధ్రధాతుమాలను రచించారు. వేదం వారు ఆంధ్రధాతు మాలను రచించారు. వేదం వారి శిష్యుడైన 

బ్రౌను దొర 1840-1841 లో ఆంధ్రధాతుమాల ప్రతిని చూచి, దానికి తగిన ఆదరణ లేనందుకు ఎంతో విచారం వ్యక్తం చేశాడు.


The original of this very valuble work is in the college and i am afraid that no copy Except the present was ever taken"(Journal of Literature 

and Science 1840-41 page, 10,11)


బ్రౌను దొర బాధపడినట్లుగానే ఆంధ్రధాతుమాల సూరేళ్లు మరుగున పడిపోయింది. 1930లో ఆంధ్రసాహిత్య పరిషత్తు, కాకినాడ వారు వేదం వారి ధాతుమాలను చిన్నయసూరి కృతంగా ప్రకటిచారు. నిజానికి చిన్నయసూరి రచించిన 18గ్రంధాల్లో (ఇవి కూడా కాకినాడ ఆంధ్రసాహిత్య పరిషత్తు వారు ప్రక

టించినవే)ఆంధ్రధాతుమాల లేదు. ఆ తర్వాత ఆచార్య

నిడుదవోలు వేంకటరావుగారు వేదం వారిపద్యాంధ్ర వ్యాకరణ పీఠికలో (1951) ఆంధ్రధాతుమాల రచయిత వేదం వారేనని తేల్చి చెప్పారు. వేదం వారు 'పట్టాభిరామ పండితీయము' పేరుతో 1816లో 

అంటే చిన్నయ సూరి బాలవ్యాకరణ రచనకు 40

సంత్సరాలకు ముందే ఆంధ్ర వ్యాకరణాన్ని పద్య రూపంలో రచించారు. పందొమ్మిదవ శతాబ్దంలో వేదం వారి ఈ పద్యాంధ్ర వ్యాకరణమే మొదటిదని చెప్పవచ్చు. తెలుగు వ్యాకరణ క్రమపరిణామ వికాసం తెలుసుకోడానికి ఇది ఉపకరిస్తుంది. కాగా వేదంవారు వచనంలో కూడా తెలుగు వ్యాకరణాన్ని రచించినట్లు..

చెబుతారు. కానీ, ప్రస్తుతం ఇది అలభ్యం. పందొమ్మిదవ శతాబ్ది ప్రథమార్ధంలో ఈకింది వ్యాకరణ గ్రంధాలు ప్రచారంలోకి వచ్చాయి.


1. పట్టాభిరామ పండితీయము (1816) రచయిత వేదం పట్టాభిరామశాస్త్రి


2. ప్రశ్నోత్తరాంధ్ర వ్యాకరణము(1830) (వఝల సీతారామశాస్త్రి -పుదూరు)


3.ఆంధ్రవ్యాకరణము (1836) 3. రావిపాటి గురుమూర్తి శాస్త్రి


4. లఘు వ్యాకరణము (1857) వేదం వెంకట

   రమణశాస్త్రి


5. తెలుగు వ్యాకరణము ఉదయగిరి శేషయ్య


6. బాల వ్యాకరణము (1858) పరవస్తు చిన్నయసూరి


7. ప్రౌఢ వ్యాకరణము (త్రిలింగ లక్షణ శేషము) బహుజనపల్లి సీతారామాచార్యులు (1827-1891)


తెలుగుసాహిత్యానికి సంబంధించినంత వరకు ఇప్పటికీ చిన్నయసూరి 'బాలవ్యాకరణ'మే ప్రథమ గణనీయ వ్యాకరణ గ్రంథంగా వుంది. దీనికి పొడిగింపుగా వచ్చిన బహుజనపల్లి వారి ప్రౌఢవ్యాకరణం ఆతర్వాత స్థానంగా చెప్పుకోవచ్చు. అలాగే బహుజనపల్లి వారి శబ్దరత్నాకరం పేరుకు నిఘంటువే అయినా ఇందులో చిన్నయసూరి అంగీకరించని ఎన్నో విశేష ప్రయోగాలకు లక్షణ శేషంగా రచించి దీనికి వ్యాకరణస్థాయిని సమకూర్చిన ఘనత బహుజనపల్లి వారిదే,


*బ్రౌన్ వ్యాకరణం..!!


సి.పి బ్రౌన్ 1940లో ఇంగ్లీషులో A Grammer of 

the Telugu Language అనే వ్యాకరణ గ్రంధాన్ని రచించాడు. ఇందులో చాలా వరకు వ్యావహారిక పదప్రయోగాలపై దృష్టిపెట్టాడు. బ్రౌన్ మాదిరిగానే ఆతర్వాత పాశ్చాత్యులు ఇంగ్లీషులో రచించిన తెలు

గువ్యాకరణాల్లో వ్యావహారిక భాషకే పెద్దపీట వేయడం చిన్నయసూరిని బాధించింది. అందుకే గ్రాంధికభాషకు పెద్దపీటను వేస్తూ బాలవ్యాకరణాన్ని రచించాడు. ఆతర్వాత కందుకూరి వీరేశలింగం, గురజాడ రామమూర్తి వ్యావహారిక భాషకు వ్యాకరణం అవసరంపై దృష్టిపెట్టారు. కందుకూరి తలపెట్టిన తెలుగు వ్యావహారిక భాషా వ్యాకరణంపూర్తియివుంటే తెలుగు భాషకు మరింత మేలు జరిగివుండేది. చాలా కాలంతర్వాత వడ్లమూడి గోపాలకృష్ణ వ్యావహారిక 

భాషా వ్యాకరణాన్ని రచించి ఆలోటు తీర్చేప్రయత్నం

చేశారు. కానీ ఇది సర్వజనామోదం పొందలేక….

పోయింది. ఇక విద్యార్ధి వ్యాకరణాల పేరుతోతెలుగు 

వ్యాకరణాలు వెల్లువెత్తాయి. 


దువ్వూరి వేంకట రమణ శాస్త్రి పేరు వినగానే బాలవ్యాకరణం చదువుకున్న వారందరికీ 'రమ ణీయం' గ్రంథం గుర్తుకొస్తుంది. దువ్వూరికి అత్యంత పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టిన రచన ఇది. బాల వ్యాకరణానికి అప్పటికే కొన్ని టీకలు ఉన్నప్పటికీ ఆ తీరులో వ్యాఖ్యాన రూపంగా కాకుండా సమీక్షగా ఈ గ్రంథాన్ని రాశారు. కావ్యనాటకాల్లా వ్యాకరణం ఆకర్షణీయమైన అంశంకాదు. అయితే, ఆ శాస్త్రాన్ని ఆకట్టుకునే శైలిలో బోధించడంలో విశేషప్రజ్ఞా పాటవాలు ప్రదర్శించారు. 'రమణీయం' గ్రంథం విశ్వవిద్యాలయ స్థాయిలో చిరస్మరణీయంగా నిలిచింది. దువ్వూరి వారి ప్రతిభకు మరో ప్రబల దృష్టాంతం ఉంది. చిన్నయ సూరి 18 ఏళ్లు అహోరాత్రాలు కృషి చేసి సంతరించిన బాలవ్యాకరణాన్ని శిష్టు కృష్ణమూర్తి శాస్త్రి కవి సంస్కృతీకరించి 'హరికారికావళి' అనే పేరుతో ప్రకటించారు. హరికారికావశేమూల గ్రంథమని, దానికి తెనిగింపే బాల వ్యాకరణమని కొందరుఒకవాదం లేవదీశారు. దువ్వూరి ప్రామా ణిక నిదర్శనాలతో బాలవ్యాకరణమే స్వతంత్రమైన మూలగ్రంథమని, 'హరికారికావళి' అనువాదమని సిద్ధాంతీకరించారు. ఈ మేరకు 40 పేజీల వ్యాసాన్ని 1993లో ఆంధ్రసాహిత్య పరిషత్ పత్రికలో ప్రకటించారు.


చేకూరి రామారావు తెలుగువాక్యం తెలుగువ్యాకరణ రచనలో కొత్త దారికి మార్గనిర్దేశనం చేసింది. ప్రస్తుతం వ్యావహారిక భాషకు సమగ్రమైన వ్యాకరణం లేదన్న కొరత వుంది. సమాచార విప్లవంతో అన్యదేశాలు తామరతంపరగా వచ్చితెలుగుభాషలో చేరిపోతు

న్నాయి. కాల ప్రవాహంతో కొత్తమాటలు పదాలు పుట్టు

కొస్తున్నాయి. తెలుగుకు విస్తారమైన వ్యాకరణగ్రంధా

లున్నా, వీటిన్నిటి సాయంతో తెలుగువెలుగులు మరింతగా పెంచే సమగ్రవ్యాకరణ దీపం అవసరం ఎంతైనా వుంది. అధికారభాషా సంఘం వారు కానీ విశ్వవిద్యాలయాలు కానీ దీనిపై దృష్టిపెట్టాల్సిన అవసరంవుంది.

22, జనవరి 2026, గురువారం

జీవితంలోని ఆఖరి 7 రోజులు*

 



   *జీవితంలోని ఆఖరి 7 రోజులు*

              ➖➖➖✍️

```

ఒకానొకప్పుడు,ఒక ఆశ్రమంలో ఒక సాధువు తన శిష్యులకు ఉపన్యాసం ఇస్తున్నాడు. అప్పుడే ఆశ్రమంలోకి ఒక అపరిచితుడు ప్రవేశించి సాధువును దుర్భాషలాడాడు. సాధువు ఆ వ్యక్తి వైపుచూసి,ఏమీ సమాధానమివ్వకుండా, మౌనంగా ఉన్నాడు. కాసేపటికి ఆ వ్యక్తి వెళ్లిపోయాడు.


అక్కడ ఉన్న శిష్యులలో ఒకరికి ఆ మాటలు విని కోపం వచ్చింది. తన గురువు ఎందుకు స్పందించకుండా వింటూ ఉండిపోయాడని ఆ శిష్యుడికి ఆశ్చర్యం వేసింది.


ఉపన్యాసం ముగిసిన తరువాత, అతను గురువు వద్దకు వచ్చి, “గురూజీ, ఆ వ్యక్తి మిమ్మల్ని క్రూరంగా తిట్టినప్పుడు, ఘోరంగా దూషించినప్పుడు మీరు మౌనంగా ఎలా ఉన్నారు? దయచేసి చెప్పండి, మీరు అలాంటి పరిస్థితిలో కూడా ఇంత ప్రశాంతంగా, నవ్వుతూ ఎలా ఉండగలిగారు? మీకు కొంచెం కూడా కోపం రాలేదు, కనీసం మీ ముఖ కవళికలు కూడా మారలేదు. మీ రహస్యం ఏమిటి?” అని అడిగాడు.


సాధువు చిరునవ్వుతో, “ఆ రహస్యాన్ని ఖచ్చితంగా నీకు చెప్తాను అయితే ముందుగా, నేను నీకు మరొక  ముఖ్యమైన విషయం చెప్పాలి” అని అన్నాడు.


శిష్యుడు ఆశ్చర్యపోయాడు. “ఏమిటి గురూజీ, దయచేసి చెప్పండి” అని అడిగాడు.


సాధువు ఇలా చెప్పాడు, “నీవు ఒక వారం తర్వాత చనిపోతావు, నీజీవితపు అంతం దగ్గర పడింది”


అది విని శిష్యుడు చలించిపోయాడు. కాళ్ల కింద నుంచి నేల జారిపోయినట్లనిపించింది. ఎవరో చెబితే తను ఎప్పటికీ నమ్మేవాడు కాదేమో, కానీ ఆయన తన గురువు, ఆయన పై పూర్తి విశ్వాసం, గౌరవం ఉంది. అందువల్ల, దానిని నిజం అని నమ్మాడు, అతను జీవించడానికి కేవలం 7రోజులు మాత్రమే మిగిలి ఉంది.


శిష్యుడు చాలా కృంగిపోయాడు. నిరాశా నిస్పృహ స్థితిలో సూటిగా ఆలోచించలేకపోయాడు. కానీ తరువాత ఒక క్షణం స్థిరంగా ఉండి, ప్రశాంతమైన మనస్సుతో ఆలోచించాడు. అతను తన జీవితంలోని ఆ చివరి ఏడు రోజులు సంపూర్ణంగా జీవించాలని నిర్ణయించుకున్నాడు. తన గురువు ఆశీర్వాదంతో ఆశ్రమాన్ని విడిచిపెట్టాడు.

దారిలో శిష్యుడు తన జీవితంలోని ఆ చివరి ఏడు రోజులను పూర్తిగా ఎలా సద్వినియోగం చేసుకోవాలా అనే ఆలోచనలో మునిగిపోయాడు!


చాలా ఆలోచించిన తరువాత, అతను తన గురూజీ బోధనలను అనుసరించి, వినమ్రత, ప్రేమ, భగవంతుని పట్ల భక్తితో జీవించడానికి మిగిలిన ఏడు రోజులను గడపాలని నిర్ణయించుకున్నాడు.


ఆ క్షణం నుండి అతని స్వభావం చాలా తీవ్రంగా మారిపోయింది! ఇప్పుడు అతను అందరినీ అత్యంత ప్రేమపూరిత హృదయంతో కలుస్తున్నాడు. దేనికీ ఎవరి పైనా కోపం తెచ్చుకోవట్లేదు! అతను ఎక్కువ సమయం దేవుడి స్మరణలో గడుపుతున్నాడు. అతను చేసిన పాపాలకు పశ్చాత్తాపపడ్డాడు, తెలిసి లేదా తెలియక ఎవరితోనైనా విభేదాలు ఉన్నా లేదా ఎవరినైనా బాధపెట్టి ఉంటే, వారందరినీ క్షమాపణ కోరాడు. తన దినచర్యను ముగించిన తర్వాత, అతను భగవంతుని స్మరణలో మునిగిపోయాడు. ఇలా ఆరు రోజుల పాటు సాగింది. 


ఏడవ రోజు, శిష్యుడు తన అంతః సమయానికి ముందు తన గురువును ఒకసారి చూడాలని, కలవాలని కోరుకున్నాడు. తన గురువును కలుసుకుని, అతని పాదాలను స్పృశించి, “గురూజీ, నా ముగింపు దగ్గర పడింది, నా చివరి క్షణాలు మీ వద్ద గడపాలనుకుంటున్నాను. దయచేసి చివరిసారిగా మీ ఆశీర్వాదం నాకు ఇవ్వండి!” అన్నాడు.                 

         

సాధువు ఇలా అన్నాడు, “నా ఆశీర్వాదాలు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి. నీవు దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించు!”    

 

ఏడు రోజుల క్రితం గురువు వద్ద విన్న విషయం తర్వాత, తన గురువు నోటి నుండి అలాంటి ఆశీర్వాదం విని శిష్యుడు కలవరపడ్డాడు.


తన శిష్యుడిని ఆశీర్వదించిన తరువాత, గురువు అడిగాడు, “ఇప్పుడు చెప్పు, గత ఏడు రోజులు ఎలా ఉన్నాయి? నీవు మునుపటిలా అందరిపై కోపంగా ఉన్నావా?”


ముకుళిత హస్తాలతో శిష్యుడు ఇలా జవాబిచ్చాడు, లేదు, అస్సలు కాదు, గురూజీ. నేను జీవించడానికి కేవలం ఏడు రోజులు మాత్రమే ఉంది. నేను అలాంటి పనికిమాలిన ప్రవర్తనతో వాటిని ఎలా వృధా చేయగలను? బదులుగా, నేను ప్రేమపూరిత హృదయంతో అందరినీ పలకరిస్తూ గడిపాను. నేను ఎప్పుడైనా ఎవరినైనా బాధపెట్టి ఉండినవారికి క్షమాపణ కూడా చెప్పాను.”


దానికి గురువు చిరునవ్వు నవ్వి, “చూడు, ఇప్పుడు నీకు నా రహస్యం తెలిసింది, నువ్వు కూడా అనుభూతి చెందావు. నేను ఏ క్షణంలో నైనా చనిపోవచ్చని నాకు తెలిసినప్పుడు, ఎవరియందైనా చెడు భావనలతో ఆ విలువైన సమయాన్ని ఎందుకు వృధా చేసుకుంటాను?  బదులుగా, అందరి ఎడలా నా హృదయాన్ని తెరిచి ఉంచి, నా సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను.”


పశ్చాత్తాపం,పగ,తగాదాలు,వాదనలతో వృధా చేయడానికి జీవితం చాలా చిన్నది. జీవితమంతా క్షమించడం, ముందుకు సాగిపోవడమే. జీవితపు నిజమైన లక్ష్యం ఆనందం. ఎవరు ఈ ప్రగాఢమైన జీవిత రహస్యాన్ని నిజంగా అర్థం చేసుకుంటారో, వారు ఏ పరిస్థితిలోనైనా ప్రశాంతంగా ఉంటారు. జ్ఞానం అంటే ఇదే. నీ జీవితంలోని ప్రతి క్షణమూ, అదే నీ చివరి క్షణమని భావించి జీవించు!”


ఈ మొత్తం ఉపాయమేమిటో శిష్యుడు వెంటనే అర్థం చేసుకున్నాడు. ఆ రోజు ప్రశాంతమైన, ప్రేమపూర్వక జీవితానికి సంబంధించిన గంభీరమైన రహస్యాన్ని తెలుసుకున్నాడు!

         

కేవలం ద్వేషాన్ని తొలగించండి, సార్వత్రిక ప్రేమ అక్కడే ఉంటుంది.✍️```

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

*“భగవంతుని విషయాలు గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి...  944065 2774. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏

శుక్రవారం*_ 🌹 *🪷23జనవరి2026🪷* *దృగ్గణిత పంచాంగం*

 **卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

   🌹 _*శుక్రవారం*_ 🌹

 *🪷23జనవరి2026🪷*     

   *దృగ్గణిత పంచాంగం* 

               

            *ఈనాటి పర్వం*

*శ్రీ పంచమి / వసంత పంచమి* 


          *స్వస్తి శ్రీ విశ్వావసు* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - శిశిర ఋతౌః*

*మాఘమాసం - శుక్ల పక్షం*


*తిథి  : పంచమి* ‌రా 01.46 వరకు ఉపరి *షష్ఠి* 

*వారం    : శుక్రవారం* (భృగువాసరే)

*నక్షత్రం  : పూర్వాభాద్ర* మ 02.33 వరకు ఉపరి *ఉత్తరాభాద్ర*

*యోగం : పరిఘ* సా 03.59 వరకు ఉపరి *శివ*

*కరణం  : బవ* మ 02.10 *బాలువ* రా 01.46 ఉపరి *కౌలువ*


*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 06.30 - 08.30 సా 05.00 - 06.00*

అమృత కాలం  : *ఉ 06.31 - 08.07*

అభిజిత్ కాలం  : *ప 11.57 - 12.42*

*వర్జ్యం    : రా 12.02 - 01.37*

*దుర్ముహూర్తం  : ఉ 08.55 - 09.41 మ 12.42 - 01.27*

*రాహు కాలం   : ఉ 10.54 - 12.19*

గుళికకాళం      : *ఉ 08.04 - 09.29*

యమగండం    : *మ 03.09 - 04.34*

సూర్యరాశి : *మకరం*                 

చంద్రరాశి : *కుంభం/మీనం*

సూర్యోదయం :*ఉ 06.50*

సూర్యాస్తమయం :*సా 06.07*

*ప్రయాణశూల   : పడమర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :*ఉ 06.40-08.55*

సంగవ కాలం         :     *08.55 - 11.11*

మధ్యాహ్న కాలం    :    *11.11 - 01.27*

అపరాహ్న కాలం    : *మ 01.27 - 03.43*


*ఆబ్ధికం తిధి     :మాఘ శుద్ధ పంచమి*

సాయంకాలం        :*సా 03.43 - 05.59*

ప్రదోష కాలం         :  *సా 05.59 - 08.31*

రాత్రి కాలం           :   *రా 08.31 - 11.54*

నిశీధి కాలం          :*రా 11.54 - 12.45*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.58-05.49*

******************************

         *🌷ప్రతినిత్యం*🌷

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🪷శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం🪷*


*భద్రకాళీ కరాళీ చ*

*మహాకాళీ తిలోత్తమా*


            *🪷ఓం శ్రీ🪷*

*🌷మహాలక్ష్మీ దేవ్యై నమః🌷*


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


           🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

*మాఘ పురాణం - 5వ* _*అధ్యాయము*_

  ``

🕉️🌹🌷🪔🛕🪔🌷🌹🕉️


*🌷శుక్రవారం 23 జనవరి 2026🌷*

_*మాఘ పురాణం - 5వ* 

      _*అధ్యాయము*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


      *23వ తేదీ శుక్రవారం*

         *వేకువఝామున*

        *చదువుకొనుటకు*

           

మాఘ పురాణంలోని ఐదవ అధ్యాయం, ధనవంతుడి కుక్క చనిపోయిన తర్వాత దాని గత జన్మ రహస్యాలు తెలియజేస్తూ, కర్మఫలితాల గురించి కథ చెబుతుంది. 

ధనవంతుడు తన ప్రియమైన కుక్క మరణించాక దాని ఆత్మకు శాంతి కలుగుతుందా అని ఆందోళన చెందుతాడు. ఋషి వాక్కుల ద్వారా, కుక్క గత జన్మలో దుర్మార్గుడిగా జీవించి, కర్మ ఫలితంగా కుక్కగా పునర్జన్మ పొందిందని, ఇప్పుడు తన కర్మ తీర్చుకుని స్వర్గానికి చేరిందని తెలుసుకుంటాడు. 

ఈ కథ మన జీవితాలు మన కర్మలచేత నిర్దేశించ బడతాయని, మంచి పనులు మంచి ఫలితాలను, చెడు పనులు చెడు ఫలితాలను ఇస్తాయని గుర్తు చేస్తుంది. 


*కుక్కకు విముక్తి కలుగుట*

```

దిలీప మహారాజా! సుమిత్రుని కథ 

ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన రీతిగా విన్నావుకదా! ఇంకొక కథను పార్వతికి ఈశ్వరుడు ఈ విధముగా చెప్పెను.. అదెట్లనగా మాఘమాసములో నదీస్నానములు చేయువారు గొప్ప ధనశాలులగుదురు. వర్తమానకాలమునందు ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నపటికి మాఘమాసము మొదలైన తరువాత, వారి కష్టములు క్రమముగా సమసిపోవును. మాఘశుద్ద దశమినాడు నిర్మలమైన మనస్సుతో

శ్రీమన్నారాయణుని పూజించినయెడల శ్రీహరి కటాక్షమునకు పాత్రులగుదురు. అందులో అణుమాత్రమైనను సంశయము లేదు అని పార్వతీదేవితో శంకరుడు వివరించుచుండగా పార్వతి

“నాధా! శ్రీ లక్ష్మినారాయణుల వ్రతము చేసినచో మనో వాంఛా ఫలసిద్ధి కలుగుతుందని చెప్పియున్నారు కదా! ఆ వ్రత విధానం ఎలాంటిదో, ఎలాగ ఆచరించవలెనో తెలియ పరచమని” కోరినది. 


అంత మహేశ్వరుడు పార్వతితో ఇట్లు చెప్పసాగెను. మాఘశుద్ధ దశమినాడు ప్రాతఃకాలమున కాలకృత్యములు తీర్చుకొని స్నానము చేసి నది ఒడ్డునగాని, ఇంటివద్ద కాని, మంటపమును ఉంచి ఆ మంటపము ఆవుపేడతో అలికి పంచరంగులతో ముగ్గులు పెట్టి మంటపము మధ్య యెనిమిది రేకుల పద్మము వేసి, అన్ని రకాల పుష్పములు, ఫలములు తీసుకువచ్చి లక్ష్మినారాయణులను మంటపపు మధ్యనుంచి, ఆ విగ్రహాలకు గంధము, కర్పూరము, అగరు మొదలగు ద్రవములు పూసి పూజించవలెను. రాగిచెంబులో నీళ్ళుపోసి మామిడిచిగుళ్లను అందులోవుంచి దానిపై కొబ్బరికాయ పెట్టి కొత్తవస్త్రము నొకదానిని కప్పి, లక్ష్మినారాయణుల ప్రతిమను ప్రతిష్టించి పూజించవలెను. ఆ మండపము మధ్యలో సాలగ్రామమును ఉంచి, ఒక సద్బ్రాహ్మణుని ఆహ్వానించి పూజించి వారిచేత ధూప దీప చందనాగరు పరిమళ వస్తువులుంచి నైవేద్యము పెట్టవలెను.


తరువాత రాగిపాత్రలో నీరుపోసి అర్ఘ్యప్రదానము చేయవలెను. అటు తరువాత సూర్యనారాయణ స్వరూపుడగు శ్రీరామచంద్ర ప్రభువును మదిలో ధ్యానించవలెను. మాఘమాస స్నానము చేయువారు వారి తల్లిదండ్రులు బంధుమిత్రుల సమక్షంలో మాఘమాస వ్రతము చేయవలయును. 

ఒక సద్బ్రాహ్మణునకు బియ్యము, బెల్లము,ఉప్పు,పప్పు,కాయగూరలు, పండ్లు మొదలగునవి ఏకపాత్ర యందు వుంచికాని, క్రొత్త గుడ్డలో మూటగట్టికాని దానమియ్యవలయును. మాఘపురాణమును స్వయముగా పఠించునపుడుగాని, లేక వినునప్పుడు కాని చేతిలో అక్షితలు ఉంచుకొని, చివరిలో శ్రీమన్నారాయణుని ధ్యానించుకొని కొన్ని అక్షతలు భగవంతునిపై ఉంచి మరికొన్ని అక్షతలు తమ తలపైవేసుకొనవలయును గాన ఓ శాంభవీ! మాఘ స్నానముచేసి మాఘశుద్ధ దశమినాడు లక్ష్మినారాయణులను నిష్ఠతో పూజించిన యెడల యెటువంటి మాహా పాపములైనను నశించిపోవును.


ఇందులకొక ఉదాహరణ కూడా తెలియజేసెదను, సావధానురాలవై వినుము. గౌతమమహర్షి, ఒకనాడు తన శిష్యులతోగూడి తీర్థయాత్రలు చేయుటకై ఉత్తరదిశకు బయలుదేరాడు. వారు అనేక పుణ్య నదులలో స్నానములు చేయుచు ప్రసిద్ధ క్షేత్రములను దర్శించుచు మార్గమందున్న మునిపుంగవులతో యిష్టా గోష్ఠులు జరుపుకొన్నారు. అప్పటికి మాఘమాసము ప్రవేశించుట వలన కృష్ణానదిలో స్నానము చేయవలయునని ఆ ప్రాంతమునకు వచ్చి విడిది చేసిరి. గౌతముడు తన శిష్యులతో కూడి కృష్ణా నదిలో సూర్యోదయ సమయమునందు స్నానము చేసి, తీరమున కలిగిన ఒక రావిచెట్టు చెంతకు వచ్చి```


*శ్లోకం: మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణే ।*అగ్రతశ్శివరూపాయ, వృక్షరాజాయతే నమో నమః॥*

```

అని రావి చెట్టుకు నమస్కరించి, ఆ చెట్టు మొదట ఆసీనుడయి శ్రీహరిని విధియుక్తముగా పూజించెను. తరువాత శిష్యులందరికి మాఘమాస ప్రభావమును వినిపించెను. ఈ విధముగా ప్రతి దినము ఆచరించుచుండగా మాఘశుద్ధ దశమి నాడు ఆ చెట్టు మొదట మండపమేర్పరచి ముగ్గులు, బొట్లు పెట్టి, మామిడాకుల తోరణాలు కట్టి అలంకరించారు. ఆ మండపము మధ్యలో శ్రీహరి చిత్రపటము నుంచి పూజించినారు.


ఆ విధముగా పూజించుచున్న సమయంలో ఒక ఆడ కుక్క వచ్చి భగవంతునికి చేయుచున్న పూజా విధానమంతయు రెప్ప వాల్చకుండా దీక్షతో చూచుచు ఆ రావి చెట్టునకు యెదురుగా కూర్చుని ఉండెను. శిష్యులు వారి వద్దనున్న దండముతో దానిని బెదిరించిరి. ఆ కుక్క అచట నుండి లేచి ఉత్తరం వైపు వెళ్ళి మరల తూర్పునకు తిరిగి, రావి చెట్టునకు యెదురుగా కూర్చుని ఉండెను. శిష్యులు వారి వద్దనున్న దండముతో దానిని బెదిరించిరి. 

ఆ కుక్క రావి చెట్టు చుట్టు తిరిగివచ్చినది. అప్పటికి మూడు సార్లు ఆ మండపము చుట్టు ప్రదక్షిణము చేసినందుకు, అది మాఘమాసము అయి ఉన్నందున అది వెంటనే తన కుక్క రూపము నుండి ఒక రాజుగా మారిపోయెను. 

ఆ రాజు సకలాభరణాలు ధరించిన వాడై మునులయెదుట నిలబడి వారందరికి నమస్కరించెను. అక్కడున్న ఆడ కుక్క రాజుగా మారిపోవుటచూచిన మునులూ, గౌతమ మహర్షి కూడా అమితాశ్చర్యము నొందిరి. “ఓయీ! నీవెవ్వరవు? నీవిట్లు మారుటకు కారణమేమి?” అని గౌతముడు ప్రశ్నించెను.


“ముని చంద్రమా! నేను కళింగ రాజును, మాది చంద్రవంశము. నాపేరు జయచంద్రుడు, నాకు అన్ని విద్యలయందు ప్రావీణ్యత గలదు. నా దేశ ప్రజలను ధర్మ మార్గమున పరిపాలన చేయుచూ వున్నాను, దాన ధర్మములనిన నాకు అతిప్రేమ, నేను అనేక దానాలు చేసియుంటిని, గో, భూ, హిరణ్య, సాలగ్రామ దానాలు కూడా చేసియున్నాను, ఎక్కువగా అన్న దానము, తిల దానము చేసియున్నాను. అనేక ప్రాంతాలలో చెరువులు త్రవ్వించాను. నూతులు త్రవ్వించి బాటసారులకు నీడనిచ్చు నిమిత్తం చెట్లను నాటించాను. ధర్మ శాలలను కట్టించాను. పశువులు త్రాగుటకు నీటి గుంటలు త్రవ్వించాను. నిత్యము బీద ప్రజల కొరకు అన్న దానములు, మంచి నీటి చలివేంద్రములును ఎన్నో పుణ్యకార్యాలు చేసి ఉన్నాను. అనేక దేవాలయాలను నిర్మించి, దైవ విగ్రహాలను ప్రతిష్టించాను. సద్బ్రాహ్మణులచే, వేదాలు చదువుకొన్న పండితుల చేతను ఎన్నో క్రతువులు చేయించాను. పురాణాలలో వున్న ధర్మాలన్నియును చేసియున్నాను. కాని, నేనిలా కుక్కనయ్యాను, దానికి కారణము లేకపోలేదు. ఆ కారణము కూడా నేను విశరపరచెదను వినుడు..


“ఒకానొక దినమున ఒకముని పుంగవుడు గొప్ప యఙ్ఞమొకటి తలపెట్టాడు. యజ్ఞము చేయుటన్న సామాన్య విషయము కాదు కదా ! దానికి ధనము, వస్తు సముదాయము చాలా కావలెను గాన, ఆ ముని పుంగవుడు నా వద్దకు వచ్చి అర్థించెను. ముని సత్తముడు వచ్చిన వెంటనే యెదురేగి కాళ్ళుకడిగి ఆ నీళ్ళు నా శిరస్సుపై జల్లుకొని కుశల ప్రశ్నలడిగితిని. ఆ మునియు నా సత్కారమునకు మిక్కిలి సంతసించి, ‘రాజా! నీకు గుప్త విషయములు తెలియ జేయుదును, ఈ మాసములో మకర రాశి యందు సూర్యుడు ప్రవేశించును. ఆ దినము సూర్యోదయము అయిన తర్వాత నీవు స్నానము చేసి భక్తి శ్రద్ధలతో మాఘమాస మహత్మ్యమును చదువుట కాని లేక వినుట కాని చేయుము. దాని వలన నీకు వైకుంఠ ప్రాప్తి కలుగును.


అంతియేకాగ, అశ్వమేధ యాగము చేసిన యెడల యెంతటి ఫలితము కలుగునో అంతటి ఫలము కాని, తీర్థస్నానములు చేయగా వచ్చిన ఫలముగాని లేక దానపుణ్యములు అనగా వంద యాగాలు చేసినంత ఫలముగాని పొందగలవు. మాఘ శుద్ధ సప్తమి ఆదివారం వచ్చినగాని, దశమి ఆదివారం వచ్చిన కాని ఉదయమే స్నానము చేసిననూ మరియు మాఘ పౌర్ణమి రోజు ఉదయమున స్నానము చేసిననూ మానవుడు యెటువంటి పాపములనైనను విడువగలడు.


ఒక వేళ యితర జాతుల వారైనను మాఘ మాసమంతా నిష్ఠతో నదీ స్నానమాచరించి, దాన ధర్మాలాచరించి మాఘ పురాణము పఠించినను లేక వినినను మరు జన్మలో బ్రాహ్మణులై జన్మింతురు” అని ఆ మునివర్యుడు నాతో చెప్పగా, నేను అతనిని అవమానించి నటుల మాటలాడి యిట్లంటిని.. ‘అయ్యా! మునిసత్తమా! మీరు పలికిన విషయములు నాకు తెలియును, అన్నియు బూటకములు. వాటిని నేను యదార్థములని అంగీకరించను. ఏవో అతిశయోక్తులు తప్ప మరొకటికాదు గాన నేను యే మాఘ మాసములు చేయుట కాని, దాన పుణ్యాదులు చేయుటగాని, పూజా నమస్కారములు ఆచరించుటకాని చేయును. చలి దినములలో చల్లని నీటితో స్నానము చేయుట ఎంత కష్టము? ఇక నాకు యీ నీతిబోధలు చెప్పకుడు. నాకు ఉన్న ఫలములు చాలని ఆ మునితో అంటిని. 


నా మాటలకు మునికి కోపము వచ్చింది. ముఖం చిట్లించుకొని ‘సరే, నేను చెప్పవలసినది చెప్పితిని. అది నా ధర్మము’ అని యజ్ఞమునకు కావలసిన ధనమును తీసికొనకుండానే వెడలి పోయినాడు. 


అంతట నేను ఆ మునిని చేతులుపట్టి బ్రతిమలాడగా, యెట్టకేలకు అంగీకరించి ధనమును తీసికొని పోయెను• ఆ విధముగా నేను కొంత కాలము రాజ్యమేలి ప్రాణములను విడిచితిని, తరువాత నాకు వరుసగా యేడు జన్మలూ కుక్క జన్మయే వచ్చినది. నా పాప ఫలమేమోగాని కుక్కగా యేడు జన్మలూ బాధపడితిని. ఇప్పుడు మీరు చేయు పూజాస్థలము చుట్టు మూడు పర్యాయములు ప్రదక్షిణము జేసితిని కాన నా పూర్వజన్మ స్మృతి నాకు కలిగినది. దైవ యోగమును యెవ్వరునూ తప్పించలేరు గదా! ఇటుల కుక్కజన్మలో ఉండగా మరల నాకు పూర్వజన్మ స్మృతి యెటుల సంక్రమించినదో వివరింపుడనివేడెదను’ అని రాజు పలికెను.


ఆ రాజు చెప్పిన వృత్తాంతము విని గౌతమ ముని ఆశ్చర్యపడి మాఘ మాసమును నీవు చులకనగా చూచుట వలన యెంతటి విపత్తు వాటిల్లెనో అనుభవమే చెప్పుచున్నది. నీ వద్దకు వచ్చిన మునిసత్తముడు ఉత్తముడు. అతను చెప్పిన విషయములు అన్నియు యదార్థములే, నీవు కుక్కవై యెటుల పవిత్రుడవైనావో ఆ వృత్తాంతమును వివరించెదను సావధానముగా ఆలకింపుము..


“నేను నా శిష్యులతో కృష్ణవేణీ తీరమందుండి ఈ మాఘ మాసమంతయు కృష్ణానదిలో స్నానములు,జపములు చేసి తిరిగి మరొక పుణ్యనదికి పోవుదమని వచ్చియుంటిని. మేమందరము ఈ వృక్ష రాజము క్రింద విష్ణు విగ్రహాన్ని పూజించు కొనుచున్నాము. కుక్క రూపములో నున్న నీవు దారిన పోతూ యిచ్చట నైవేద్యమును చూసి తినవలయుననెడి ఆశతో పూజా సమీపమునకు వచ్చి కూర్చుంటివి. అప్పుడు నీవు యెలాగున్నావో తెలుసా! నీ శరీరమున బురదమైల తగిలివున్నది. చూచుటకు చాలా అసహ్యముగా వున్నావు. పరిశుద్ధులమై భగవంతుని పూజ చేయుచున్న సమయములో అచటకు జంతువు కాని, పక్షికాని, వచ్చియున్న దానిని తరిమివేయుట సహజమేకదా! నీవు అసహ్యముగా వుంన్నందున నా శిష్యులు నిన్ను తపో దండములతో నిన్ను కొట్టబోవుటచే పారిపోయి, నైవేద్యమును తినవలెనని ఆశతో తిరిగి యధా స్థానమునకు వచ్చికూర్చుంటివి. మరల నా శిష్యులు నిన్ను కొట్టబోవుటచే పారిపోయి తిరిగి మళ్ళి వచ్చినావు.


అట్లు మూడు పర్యాయములు తిరుగుటచే భగవంతుడు నీ రూపమును మార్చి నిజ రూపమును ప్రసాదించినాడు. అనగా భగవంతుని మండపము చుట్టూ తిరుగుటవలన మాఘమాస ఫలము కలిగి పునర్జన్మ వచ్చినదన్న మాట. ఇక మాఘమాస మంతయు నదిలో స్నానం చేసి భగవంతుని ధ్యానించి, పురాణ పఠనము చేసినచో యెంతటి ఫలము వచ్చునో ఊహించుకొనుము, అని చెప్పగా రాజు వినుచుండగా, అంతలోనే ఆ రావి చెట్టునకున్న ఒక తొర్ర నుండి ఒక మండూకము బయటకు వచ్చి, గౌతమ ఋషి పాదముల పైపడి బెక బెకమని అరచి, అటునిటు గెంతుచుండెను. అలా గెంతుటలో మండపము వద్దకు వచ్చి చూస్తూ ఉండగా కొద్దిసమయములో హఠాత్తుగా కప్ప రూపమును వదలి ముని వనితగా మారిపోయెను. ఆమె నవ యవ్వనవతి, అతి సుందరాంగి, గౌతమ ఋషిని చూడగానే ఆమెకు జ్ఞానోదయమై తన యొక్క పూర్వజన్మ వృత్తాంతమంతయు జ్ఞప్తికి వచ్చినది. అంత గౌతమముని ‘అమ్మాయీ! నీ వెవ్వరిదానవు? నీ నామధాయమేమి? నీ వృత్తాంతము యేమి?’ అని ప్రశ్నించెను. 


ఆమె తన పూర్వజన్మ వృత్తాంతము తెలియ చేయుటకై యిట్లు చెప్పసాగెను..```



*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

            🌷🙏🌷```


*మాఘపురాణం ఐదవ* *అధ్యాయము సంపూర్ణము*


         *🌷సేకరణ🌷*

*న్యాయపతి నరసింహారావు*

మహాభారతము

 🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*గురువారం 22 జనవరి 2026*

``

            *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

  సరళ వ్యావహారిక భాషలో!

              1️⃣1️⃣2️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


      *సంపూర్ణ మహాభారతము*

            

                  *112 వ రోజు*                  

*వన పర్వము చతుర్థాశ్వాసము*


         *ఉదంకుడి కోరిక*```


ఆ తరుణంలో ఉదంకుడు బృహదశ్వుని వద్దకు వెళ్ళి “రాజా! నీవు అడవులలో ఉండి తపమాచరించే కంటే ప్రజా రక్షణ చేస్తూ రాజ్య పాలన చేయడం మేలు కదా! అలాగైతేనే సాధువులైన మాకు మేలు అధికం. మధుకైటబుల కుమారుడు దుంధుడు మా ఆశ్రమ సమీపంలో తపస్సు చేస్తున్నాడు. దుంధుడు బ్రహ్మదేవుని మెప్పించి వరాలు పొందాడు. అతడు విడిచేగాలికి రేగే ధూమం వలన మేము అనేక అవస్థలు పడుతున్నాము. కనుక నీవు దుంధుడిని సంహరించి మమ్ములను రక్షించాలి” అన్నాడు. 


విష్ణుమూర్తి కూడా ధుంధుడిని సంహరించడానికి యోగబలం అందిస్తానని చెప్పాడు. నీవు ఆరాక్షసుని సంహరించి మాకు రక్షణ కలిగించాలి" అని కోరాడు. 


బృహదశ్వుడు "మహాత్మా! దుంధుడిని సంహరించడానికి నా కుమారుని పంపుతాను. నాకు తపో వనాలకు వెళ్ళడానికి అనుజ్ఞ ఇవ్వండి” అని కోరాడు. 


ఉదంకుడు అందుకు అంగీకరించాడు. ఉదంకుని కోరిక ప్రకారం బృహదశ్వుడు కువలయాశ్వుని ధుంధుడిని సంహరించమని పంపాడు. 


విష్ణుమూర్తి తన యోగశక్తిని కువలయాశ్వునిలో ప్రవేశ పెట్టాడు. కువలయాశ్వుడు ఇసుక తిన్నెలను తవ్వించి అక్కడ నిద్రిస్తున్న రాక్షసుని నిద్ర లేపారు. 


అతడు వదిలిన గాలి అగ్నిజ్వాలలై కువలయాశ్వుని ముగ్గురు కుమారులు తప్ప అందరినీ చంపింది. 


కువలయాశ్వుడు ఆ రాక్షసునితో ఘోరంగా యుద్ధం చేసి చివరిగా బ్రహ్మాస్త్రం ప్రయోగించి రాక్షసుని సంహరించాడు. 


అప్పటి నుండి కువలయాశ్వుడు దుంధుమారుడుగా పిలువబడ్డాడు. అప్పుడు, ఉదంకుడు, దేవతలు, మహర్షులు కువలయాశ్వుని వరం కోరుకొమ్మని అడిగారు. 


కువలయాశ్వుడు “మహాత్ములారా! నాకు ఎల్లప్పుడూ విష్ణు భక్తి, బ్రాహ్మణభక్తి, దానం చేసే శక్తి అనుగ్రహించండి" అని వేడుకున్నాడు. 


అతను కోరిన వరాలు ప్రసాదించి అందరూ తిరిగి వెళ్ళారు.```


          *మధు కైటబులు*```


కువలయాశ్వుని వృత్తాంతంలో మధుకైటబుల ప్రస్తావన రాగానే ధర్మరాజు మార్కండేయుని మధుకైటబుల గురించి చెప్పమని కోరాడు. మార్కండేయుడు ధర్మరాజుతో "ధర్మరాజా! ముల్లోకాలు జలమయమై ఉండగా విష్ణుమూర్తి ఆది శేషునిపై నిద్రిస్తూ యోగ నిద్ర లో ఉన్నాడు. కొంత కాలానికి మధుకైటబులనే రాక్షసులు విజృంభించి దేవతలను బాధించి చివరకు విష్ణువు నాభి నుండి ఉద్భవించిన బ్రహ్మదేవుని కుడా బాధించారు. బ్రహ్మదేవుని ఆక్రందనతో యోగనిద్ర నుండి మేల్కొన్న విష్ణువు మధుకైటబుల ఆగడాలను విన్నాడు. విష్ణువు మధుకైటబులను చూసి "మధుకైటబులారా! మీ బలపరాక్రమాలకు మెచ్చాను. ఏమి వరం కావాలో కోరుకోండి" అని అడిగాడు. 


అందుకు వారు గర్వంతో “మేమే నీకు వరాలు ఇస్తాం ఏమి కావాలో కోరుకో!” అని చెప్పారు. 


విష్ణుమూర్తి “మధుకైటబులారా! నేను వరాలు కోరుకుంటున్నాను ఆడిన మాట తప్పక నాచే మృత్యువును పొంది లోకాలకు ప్రీతి కలిగించండి!” అన్నాడు. 


అందుకు వారు "దేవా! మేము ఆడిన మాట తప్పము మేము ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధం! 

అయితే జలం లేని చోట మమ్ములను సంహరించండి” అన్నారు. 


ఆ సమయంలో ముల్లోకాలు జలమయమై ఉన్నాయి కనుక విష్ణువు వారిని తన తొడపై కూర్చుండబెట్టి చక్రాయుధంతో సంహరించాడు.```


          *వన పర్వము* 

*చతుర్థాశ్వాసము సమాప్తం*


             *(సశేషం)*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

             🌷🙏🌷```

 

*🚩జై శ్రీ కృష్ణ!   జై శ్రీ కృష్ణ!🚩* 


ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

కాకరకాయ ఉపయోగాలు -

 కాకరకాయ ఉపయోగాలు - 


     కాకరకాయలో రెండు రకాలు కలవు. పెద్ద కాకర , పొట్టికాకర అని పిలుస్తారు . పెద్ద కాకర కాయలో రెండురకాలు కలవు. అవి ఆకుపచ్చ కాకర మరియు తెల్లకాకర కాయల రకం ఒకటి . 


           వంకాయలో తెల్ల కాకర కాయలు అపథ్యమై ఉండగా కాకర కాయల్లో తెల్లనివి అత్యంత శ్రేష్టమైనవి. కాకరకాయ స్వస్థకరం అయినది. రసాయనిక గుణం కలది. జీర్ణశక్తిని కలిగిస్తుంది. కాకరకాయలు పైత్యశాంతిని కలిగించును. ఎముకలలో మూలుగుకు బలాన్ని చేకూర్చే గుణం కలదు. 


                  కాకరకాయ గురించి ప్రసిద్ధ ఆయుర్వేద గ్రంధం "సర్వఔషధి గుణకల్పం " ఈవిధంగా వివరిస్తుంది. " కాకర కాయ కొంచం కాకచేయును .సర్వరోగాలను పోగొట్టును . నేత్రాలకు మేలు చేయును . లఘువుగా ఉండును. అగ్నిదీప్తిని ఇచ్చును " అని వివరణాత్మకంగా ఇచ్చెను . మరొక ప్రసిద్ద గ్రంథం " ధన్వంతరి నిఘంటువు " నందు కూడా కాకరకాయ విశేషగుణ ధర్మాల గురించి వివరణలు ఉన్నాయి . దానిలో కాకరకాయ శీతవీర్యం , తిక్తరసం కలిగి ఉండును. గట్టిపడిన మలాన్ని బేధించును. లఘువుగా ఉండి వాతాన్ని కలుగచేయకుండా ఉంటుంది. పెద్దకాకర కొంచం వేడిచేయును . రుచిని పుట్టించి సర్వరోగాలను పోగొడుతుంది . నేత్రాలకు మేలుచేయును . అగ్నిదీపనకరమై ఉండును. అని కాకర యొక్క విశేష గుణాల గురించి వివరించెను .  


               కుక్క , నక్క మొదలగు జంతువులు కరిచినప్పుడు పైకి కట్టడానికి , లోపలికి సేవించడానికి కాకర ఆకు , కాయ , పండు మంచి ఉపయోగకరములై ఉండును . కాకరకాయలు సాలెపురుగు విషాన్ని కూడా విరిచేస్తాయి. కాకర చేదుగా ఉండటం వలన రక్తశుద్ధి చేయును . కాకర కాయల కూర వీర్యస్తంభనమైనది. 


        చర్మవ్యాధులు ఉన్నవారు కాకరకాయను తరుచుగా వాడటం వలన రక్తశుద్ధిని కలుగచేయును . పొడుగు కాకరకాయలు అగ్నిదీప్తిని కలిగించును. లేత కాకరకాయల కూర త్రిదోషాలను హరించును . ముదురు కాయల కూర విరేచనకారి. పొట్టి కాకరకాయలు కూడా ఇంచుమించు ఇదే గుణాన్ని కలిగి ఉండును. కాని ఇవి మిక్కిలి చేదుగా ఉండును. ఆకలిని పుట్టిస్తాయి. 


                కాకరకాయలు ముక్కలుగా కోసి ఎండబెట్టి వరుగు చేసి నిలువచేసుకొంటారు . ఈ వరుగు నేతితో వేయించుకొని తింటే చిరుచేదుగా ఉండి త్రిదోషాలను పోగోట్టును కొన్ని ప్రాంతాలలో కాయలనే కాకుండా పండిన కాకరకాయలు ను కూడా కత్తిరించి వరుగు చేసి నిలువచేస్తారు . ఈ వరుగు కఫవాతాన్ని తగ్గించి పిత్తాన్ని పెంచును. జఠరాగ్ని పెంపొందింపచేయును . కాసను తగ్గించును. రుచిని పుట్టించును. 


             కాకరకాయలను శరీరం నందు వేడి కలిగినవారు వాడకుండా ఉంటే మంచిది . శరీర బలానికి మందు తీసుకునేవారు పెద్ద కాకరకాయతో చేసిన వంటకాలు వాడకూడదు. అలా వాడటం వలన బలం పెంచే మందు శరీరానికి పట్టదు. 


    కాకరకాయకు విరుగుడు వస్తువుల్లో ప్రధానం అయినది పులుసు . అందుకే కాకరపులుసు , పులుసుపచ్చడి దోషరహితం అయి ఉంటుంది. కాకరకాయ పులుసుతో పాటు నెయ్యి , ఆవాలు , దోసకాయ కూడా విరుగుడు వస్తువులు . 


  ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


          కాళహస్తి వేంకటేశ్వరరావు  


       అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

భార్య గొప్పది

  🙏🙏🙏🕉️🕉️🕉️🚩🚩🚩


మన సాహిత్యంలో తల్లి గొప్పది . దైవంతో సమానం అని చెబుతారు. కాని భార్య గొప్పది అని ఎక్కడన్నా (కార్యేషు దాసీ కాకుండా) చెప్పారా?


జవాబు

మన సాహిత్యంలో అమ్మకు ఇచ్చే స్థానం అద్వితీయం, అందులో సందేహం లేదు. అయితే, భార్యను కేవలం బాధ్యతలకు పరిమితం చేయకుండా, ఆమెను పురుషుని జీవితంలో సగం (అర్ధాంగి) గానూ, అత్యున్నత శక్తిగానూ వర్ణించిన సందర్భాలు చాలా ఉన్నాయి.


పంచమవేదమయిన మహాభారతంలో శాంతి పర్వంలో

భార్య ప్రాముఖ్యత గురించి మహాభారతంలో ఒక అద్భుతమైన శ్లోకం ఉంది:

"నాస్తి భార్యాసమో బంధుః, నాస్తి భార్యాసమా గతిః

నాస్తి భార్యా సమో లోకే సహాయో ధర్మసంగ్రహే( 144 అధ్యా. 16 వశ్లో)

భార్యతో సమానమైన బంధువు లేడు, భార్యతో సమానమైన దిక్కు (ఆధారం) మరొకటి లేదు. కష్టాల్లో ఉన్నప్పుడు మనిషికి భార్య ఇచ్చే ధైర్యం మరే ఇతర బంధువు ఇవ్వలేరు. లోకంలో ధర్మ సంగ్రహంలో భార్యవంటి సహాయకుడు లేడు అని దీని సారాంశం.


గృహిణియే గృహం

"న గృహం గృహమిత్యాహుః గృహిణీ గృహముచ్యతే" – ( 144 అధ్యా. 06 వశ్లో)

అంటే ఇటుకలు, రాళ్లతో కట్టినది ఇల్లు కాదు, గృహిణి (భార్య) ఉంటేనే అది ఇల్లు అవుతుంది. ఆమె లేని ఇల్లు అడవితో సమానం అని పంచమవేదం స్పష్టం చేస్తోంది.

మన సంస్కృతిలో తల్లి "జన్మనిస్తే", భార్య ఆ జన్మకు ఒక "అర్థాన్ని, తోడును" ఇస్తుంది. అందుకే ఆమెను 'సహధర్మచారిణి' (ధర్మంలో కలిసి నడిచేది) అని గౌరవించారు.

కింస్విన్మిత్రం గృహే పతిః అని యషుడడిగితే భార్యా మిత్రం గృహే సతః ( గృహస్థుకు భార్య మిత్రుడు) అని భార్తంలొ ధర్మరాజు జవాబిస్తాడు. ( వన పర్వం 313 అధ్యాయం 64 వశ్లోకం)


భార్యాభర్తల అనుబంధం గురించి చెప్పాల్సి వస్తే భవభూతి వ్రాసిన 'ఉత్తర రామచరితం' లోని ఈ శ్లోకం ఒక మకుటం వంటిది.

భార్యాభర్తల మధ్య ఉండాల్సిన ఆత్మీయతకు, ఏకత్వానికి (Oneness) ఈ శ్లోకం ఒక నిలువుటద్దం. ఆ పూర్తి శ్లోకం ఇక్కడ ఉంది:


అద్వైతం సుఖదుఃఖయోరనుగుణం సర్వాస్వవస్థాసు యద్

విశ్రామో హృదయస్య యత్ర జరసా యస్మిన్నహార్యో రసః।

కాలేనావరణాత్యయాత్ పరిణతే యత్స్నేహసారే స్థితం

భద్రం తస్య సుమానుషస్య కథమప్యేకం హి తత్ ప్రాప్యతే

దీని విశేషార్థం:

ఈ శ్లోకంలో భార్యను కేవలం ఒక వ్యక్తిగా కాకుండా, భర్తతో కలిసిన 'అద్వైత' స్థితిగా వర్ణించారు:

అద్వైతం సుఖదుఃఖయోః: సుఖంలోనూ, దుఃఖంలోనూ ఇద్దరూ వేరు కాకుండా ఒక్కటిగా (అద్వైతంగా) ఉండటం. అంటే సుఖం వస్తే ఇద్దరూ సంతోషించడం, కష్టం వస్తే ఇద్దరూ పంచుకోవడం.

సర్వాస్వవస్థాసు: అన్ని రకాల పరిస్థితులలోనూ (యవ్వనం, ముసలితనం, ఐశ్వర్యం, పేదరికం) ఒకేలా తోడుండటం.

విశ్రామో హృదయస్య: అలసిపోయిన హృదయానికి విశ్రాంతినిచ్చే ఏకైక స్థానం భార్య.

జరసా యస్మిన్నహార్యో రసః: వయసు పైబడినా (ముసలితనం వచ్చినా) ఆ అనురాగం, ఆ ప్రేమానుబంధం ఏమాత్రం తగ్గదు. సాధారణంగా భౌతికమైన అందం తగ్గుతుంది కానీ, భార్యాభర్తల మధ్య ఉండే 'స్నేహసారం' కాలంతో పాటు మరింత పరిణితి చెందుతుంది.

ముఖ్యాంశం:

ఒక ఉత్తమమైన మానవ జన్మలో ఇలాంటి పరమ పవిత్రమైన ప్రేమ దొరకడం చాలా అరుదు అని భవభూతి అంటారు. ఇక్కడ భార్య కేవలం సేవకురాలు కాదు, ఆమె హృదయానికి హాయినిచ్చే విశ్రాంతి ధామం.

రామాయణం/ఉత్తర రామచరితం వంటి కావ్యాల్లో భార్యను "గృహస్థాశ్రమానికి మూలస్తంభం" గా చూడటం వల్లనే ఆమెకు అంతటి విశిష్టత లభించింది.

*శ్రీ హరి స్తుతి 69*

*శ్రీ హరి స్తుతి 69*


*జవసత్వంబులు తగ్గెను* 

*అవయవములు శిథిల మయ్యె నతుకులు నిండెన్*

*చెవులకు వినికిడి లోపము*

*భువియందున నిలువలేను పురుషోత్తము*శ్రీ హరి స్తుతి 68*


*కం.ఆయుష్షు హద్దు దాటెను*

*చేయూతల నిచ్చువారు చెంతన లేరే*

*పోయిన కాలము రాదిక*

*వేయి తలపులిడకు నాకు వెంకట*శ్రీ హరి స్తుతి 67*


*కం.ప్రాయంబు మీరిపోయెను* 

*సాయంబును చేయునట్టి శక్తియు లేదే*

*న్యాయంబు తప్పిపోయెను*

*గాయంబులు మదిని చేరె కంజదళాక్షా!*రమణా*డా!*

మాఘ పురాణం - 4వ*

  ``

🕉️🌹🌷🪔🛕🪔🌷🌹🕉️


*🌷గురువారం 22 జనవరి 2026🌷*

_*మాఘ పురాణం - 4వ* 

      _*అధ్యాయము*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


      *22వ తేదీ గురువారం*

         *వేకువఝామున*

       *చదువు కొనుటకు*                    


మాఘ పురాణం నాల్గవ అధ్యాయం లో సుమిత్రుని కథ.  

ఒక రాజు, అతని భార్య సుమిత్ర, వారి పిల్లల గురించి చెబుతుంది. రాజు చాలా ధర్మవంతుడు, సుమిత్ర చాలా పతివ్రత. ఒకరోజు రాజు యుద్ధానికి వెళ్లి రాక్షసులతో పోరాడుతూ మరణిస్తాడు. రాణి సుమిత్ర తన పిల్లలతో కలిసి రాజ్యాన్ని పాలిస్తుంది. రాక్షసులు రాజ్యాన్ని ఆక్రమించు కోవడానికి ప్రయత్నించినప్పుడు, రాణి సుమిత్ర తన పిల్లలతో పాటు అడవికి పారిపోతుంది. అడవిలో, వారు ఒక ముని ఆశ్రమాన్ని కనుగొని, అక్కడ ఆశ్రయం పొందుతారు. ముని వారికి సహాయం చేసి, రాక్షసుల నుండి రాజ్యాన్ని తిరిగి పొందడానికి వారికి శిక్షణ ఇస్తాడు. చివరికి, రాణి సుమిత్ర పిల్లలు రాక్షసులను ఓడించి, రాజ్యాన్ని తిరిగి పొందుతారు. ఈ కథ ధర్మం ఎల్లప్పుడూ అధర్మంపై గెలుస్తుందని, ధైర్యం, పట్టుదలతో ఎలాంటి కష్టాలనైనా అధిగమించవచ్చని నేర్పుతుంది. 


           *సుమిత్రుని కథ*```


పార్వతీదేవియు శివుని మాటలను విని “స్వామీ మరి గురు కన్యా సంగమము చేసిన ఆ సుమిత్రుడు, సుదేవుని శిష్యుడు అతడేమయ్యెనో వాని వృత్తాంతము నెరుగగోరుచున్నాను, దయయుంచి దానిని వివరింపుడ”ని కోరగా శివుడిట్లు పలికెను. 


పార్వతీ సరియైన ప్రశ్ననడిగితివి వినుము. సుదేవుని శిష్యుడును తాను చేసిన గురుపుత్రికా సంగమమునకు పశ్చాత్తాపపడెను, చనిపోదునని గురుపుత్రిక బెదిరించుటచే భయపడి ఆమెతో వ్యభిచరింతినని అతడు బాధపడుచుండెను. తుదకు తనలోని బాధను భరింపలేక గురువు వద్దకు వచ్చి నమస్కరించి యిట్లుపలికెను. “గురువర్యా! పూర్వము నేను మీ వద్ద చదువుచున్నప్పుడొకనాడు సమిధలు మున్నగువాటికై అడవికి మీ ఆజ్ఞచే పోతిని. మీ కుమార్తెయు బంతితో నాడుకొనుచు నాతో మీరు చూచుచుండగానే అడవికి వచ్చినది. అచట నిర్జనమైన ఏకాంత మనోహర ప్రదేశమున నన్ను తనకోరిక తీర్చవలసినదిగ బలవంతపెట్టినది. నేనందుకు అంగీకరింపలేదు.

అప్పుడామె ‘ఓయీ ! నీవు నామాటవిని నన్నుకూడనిచో నేనిచటనే నా ప్రాణములను విడిచెదను’ అనగా బలవంతముగ ఆత్మహత్య చేసికొందును. నేను లేకుండ నీవింటికి పోయినచో నాతండ్రి నా కుమార్తె యెక్కడయని అడిగిన నీవేమని చెప్పగలవు. నీ గురువైన నా తండ్రి నాయందలి ప్రేమచే నిన్ను తప్పక శపించును. మూర్ఖుడా! యిప్పటికైనను నన్ను పొంది సుఖించుము. నన్ను వేగముగ కౌగలించుకొనుము రమ్ము. నా కోరికను దీర్చుమ’ని యనేక విధములుగ నిర్భందించినది. నేనును మీ శాపమునకు భయపడి ఆ అరణ్యమున నీ పుత్రికతో రమించి ఆమె కోరికని తీర్చితిని. తరువాత నీ విషయమును మీకు చెప్పుటకు భయపడితిని. మీ కుమార్తె చేసిన ద్రోహమువలన నేను పాపమును పొందితిని. దయయుంచి క్షమించి నీ పాపమునకు ప్రాయశ్చిత్తమును బోధింపుడ”ని ప్రార్థించెను.


సుమిత్రుని మాటలను విని సుదేవుడు కొంతసేపు విచారించి యిట్లు పలికెను. “ఓయీ! నీవు యితరుల ఒత్తిడికి లోనై చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తము నడుగుచున్నావు. వినుము అన్ని నదులలో మిక్కిలి ఉత్తమ నదియైన గంగాతీరమునకు పోయి పన్నెండు సంవత్సరముల పాటు తపము ఆచరింపుము. అదియే నీకు తగిన ప్రాయశ్చిత్తమ”ని పలికెను. 


శిష్యుడైన సుమిత్రుడును గురువు చెప్పిన ఉపదేశమును పాటించి గంగా నది తీరమునకు ప్రయాణమయ్యెను. అతడు తన ప్రయాణములో ఒక చోట ఒక దివ్యమైన ఆశ్రమమును జూచెను. ప్రయాణము చేయవలసిన యతడు అచట విశ్రమించదలచెను. అచటి వారందరును శిష్యులు, మిత్రులు, కుటుంబ సభ్యులు మున్నగువారితో మాఘస్నానము చేసి శ్రీహరిని ఆ సరస్సు తీరమున పూజించి మాఘపురాణమును వినుచుండిరి.

సుమిత్రుడును వారికి నమస్కరించి ‘మీరు చేయు వ్రతమెట్టిది దయయుంచి వివరింపుడ’ని ప్రార్థించెను. 


“ఈ వ్రతమునకు ఫలమేమి? దీనిని చేసినచో నేలోకము కల్గును. మీరు పూజించునది యేదైవమును దయయుంచి చెప్పుడని యడిగెను. 


వారు సుమిత్రుడడిగిన ప్రార్థన విని తమలోనొకడైన సత్యవ్రతుడను వానిని విషయము వివరింపుమని నియమించిరి. 


సత్యవ్రతుడు సుమిత్రునితో ఇట్లు పలికెను, “ఓయీ శ్రద్దగా వినుము. సూర్యుడు మకర రాశిలో నుండగ మాఘమాసమున ప్రాతఃకాలమున నది, సరస్సు మున్నగువాని యందు స్నానముచేసినవాడు శ్రీహరికి యిష్టుడగును.

ఇట్లు మాఘమున ప్రాతఃకాల స్నానము చేసి తీరమున శ్రీహరిని అర్చించి శ్రీహరి మహిమను వివరించు పురాణమును వినుచు మాఘమాసం అంతట గడుపుట పుణ్యప్రదమైన వ్రతము. మాఘ స్నానము మానినవాడు సత్యశౌచములను విడిచినవాడు, పరులను నిందించువాడు, బ్రహ్మహత్య చేసిన వానితో సమానులు, అబద్దపు సాక్ష్యమును చెప్పినవాడు, దురాచారుడు స్త్రీ సాంగత్యలోలుడు మాఘమాస స్నానము మానినవాడు, బ్రహ్మహత్య చేసిన వానితో సమానులేయగుదురు. తోటలను కూల్చినవాడు, కన్యలను, అశ్వములను అమ్మినవాడు, చెరువు గట్టును తెగ కొట్టినవాడు, పరస్త్రీ సాంగత్యము కలవాడు, దేవద్రవ్యము నపహరించువాడు, తానిచ్చిన దానినే దొంగలించువాడు, మద్యపానలోలుడు, ఆడినమాటను తప్పినవాడు, పెద్దలను, దేవతలను, బ్రాహ్మణులను ద్వేషించువాడు, దేవునికి నివేదన చేయని అన్నమును తినువాడు, పితృ శేషాన్న భోజనుడు, సోదరుని భార్యతో రమించువాడు, అసత్య భాషణుడు, భుజించుచు అపవిత్రుల మాటలను వినువాడు, పురాణ శ్రవణమును, వివాహాది శుభకార్యములను పాడుచేయువాడు, తల్లిదండ్రులను దేషించు వాడు, వీరందరును పాపాత్ములే సుమా. మేము చేయుచున్న ఈ మాఘమాస వ్రతమును పాటించినచో ఈ పాపుల బుద్ధులు మారి పరిశుద్ధులై పుణ్యములనందుదురు.

మాఘస్నానము చేసి తీరమున తులసీ దళములతో మాధవునర్చించిన వాని పుణ్యం అమితమైనది సుమా. వ్రతాంతమున చేయు అన్నదానము శుభ ఫలప్రదము. ఈ వ్రత మాచరించిన వానికి పునర్జన్మ యుండదు.”  అని సత్యవ్రతుడు మాఘస్నాన వ్రత ఫలమును పెక్కువిధములుగ వివరించెను. 


సుమిత్రుడును వారికి తాను చేసిన పాపమును, గురువు చెప్పిన ప్రాయశ్చిత్తమును వివరించెను. 


అప్పుడు వారు మాఘస్నానమును మూడు దినములు చేసిన సర్వ పాపములు నశించును. కావున యీ మాసమున యింకను మూడు దినములు మిగిలియున్నది. ఈ మూడు దినములును మాఘ స్నానమాచరించి ప్రాయశ్చిత్తముగ గంగా తీరమున తపము చేయుమని సుమిత్రునకు హితము పలికిరి.


సుమిత్రుడును వారి మాటప్రకారము మాఘమాసము చివరలో మిగిలిన మూడు దినములును మాఘ స్నానమును చేసి గంగా తీరమునకు పోయి ప్రాయశ్చిత్త తపమును ఆరంభించెను. 


నిశ్చలమైన అతని తపము తీవ్రమై వర్ణింపరాని తీరులోనుండెను. ఈ విధముగా పన్నెండు సంవత్సరములు గడచినవి. అయినను మానక అతడిట్లు తపమాచరించుచు చక్రపాణియగు, శ్రీ హరి కృపా విశేషమునందు అనుగృహీతుడై మాఘస్నాన ప్రభావముచే గంగాతీర తపశ్చర్యచే కేవల ప్రాయశ్చితమునేగాక, మోక్షమును కూడా పొందెను. 

పార్వతీ నీవడిగిన సుదేవ శిష్యుడగు సుమిత్రుని వృత్తంతమును పూర్తిగ చెప్పితిని. సుమిత్రుని పాప వినాశమును, పుణ్య ప్రాప్తిని వివరించు యీ కథను మాఘస్నానము చేసినవాడు శ్రీహరి పూజానంతరము ఒకసారి చదివినను వైకుంఠమును చేరును. వాని పితృ దేవతలును తమ పాపములను పోగొట్టుకొని వైకుంఠమునందుదురు. చందోవిహీనమైన మంత్రము, ఓంకారము లేని తపస్సు, మాఘస్నాన పూజాదులు లేని ధర్మాచరణ వ్యర్థములు సుమా” అని శివుడు పార్వతికి వివరించెను.```


               *సశేషం*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

             🌷🙏🌷```


*మాఘపురాణం నాల్గవ* *అధ్యాయము సంపూర్ణము*


         *🌷సేకరణ🌷*

*న్యాయపతి నరసింహారావు*

గురువారం, జనవరి 22, 2026*

 卐ఓం శ్రీ గురుభ్యోనమః卐

*గురువారం, జనవరి 22, 2026*

*శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*      

*ఉత్తరాయనం - శిశిర ఋతువు*

     *మాఘ మాసం - శుక్ల పక్షం*   

తిథి : *చవితి* రా1.36 వరకు

వారం : *గురువారం* (బృహస్పతివాసరే)

నక్షత్రం : *శతభిషం* మ2.16 వరకు

యోగం : *వరీయాన్* సా5.47 వరకు

కరణం : *వణిజ* మ1.57 వరకు

         తదుపరి *భద్ర* రా1.36 వరకు

వర్జ్యం : *రా8.36 - 10.10*

దుర్ముహూర్తము : *ఉ10.20 - 11.04*

                  మరల *మ2.47 - 3.31*

అమృతకాలం : *ఉ7.01 - 8.38*

                  మరల *తె6.05 నుండి*

రాహుకాలం : *మ1.30 - 3.00*

యమగండ/కేతుకాలం : *ఉ6.00 - 7.30*

సూర్యరాశి: *మకరం* || చంద్రరాశి: *కుంభం*

సూర్యోదయం : 6.38 || సూర్యాస్తమయం: 

5.45     

సర్వేజనా సుఖినోభవంతు - శుభమస్తు🙏

----------------------------------------

*_గోమాతను పూజించండి_*

*_గోమాతను సంరక్షించండి_*

భగవద్గీత

  -------------------- భగవద్గీత. -------------------

ద్వితీయోధ్యాయ: సాంఖ్య యోగము.


యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ ।

సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే ।। 48 ।।


ప్రతిపదార్థ:


యోగ-స్థః — యోగములో స్థిరముగా ఉండి; కురు — చేయుము; కర్మాణి — కర్మలు (విధులు) సంగం — మమకారం (ఆసక్తి); త్యక్త్వా — విడిచిపెట్టి (త్యజించి); ధనంజయ — అర్జునా; సిద్ధి-అసిద్ధ్యోః — గెలుపు-ఓటమిలలో; సమః — సమముగా ఉండి; భూత్వా — కలిగి ఉండి; సమత్వం — సమదృష్టి; యోగః — యోగము; ఉచ్యతే — చెప్పబడును.


 తాత్పర్యము :


  జయాపజయముల పట్ల మమకారాసక్తి విడిచిపెట్టి, ఓ అర్జునా, నీ కర్తవ్య నిర్వహణలో స్థిరముగా ఉండుము. ఇటువంటి సమత్వ బుద్ధియే యోగము అని చెప్పబడును.



 వివరణ:


అన్ని పరిస్థితులనీ ప్రశాంత చిత్తంతో సమానంగా స్వీకరించటం అనేది ఎంత మెచ్చదగినదంటే శ్రీ కృష్ణుడు దానిని 'యోగం' అంటాడు అంటే పరమాత్మతో ఐక్యత. ఈ సమత్వ బుద్ధి అనేది పూర్వ శ్లోకం యొక్క విజ్ఞానాన్ని అమలుపరచటం ద్వారా వస్తుంది. మన కృషి మాత్రమే మన చేతుల్లో ఉంది ఫలితము కాదు అని అర్థం చేసుకున్నప్పుడు మన కర్తవ్య నిర్వహణ మీద మాత్రమే మన పూర్తి శ్రద్ధ ఉంటుంది. ఫలితములు భగవంతుని ప్రీతి కొరకే, కాబట్టి అవి ఆయనకే సమర్పిస్తాము. ఒకవేళ ఫలితములు మనం అనుకున్నట్టు రాకపోతే, వాటిని భగవత్ సంకల్పముగా ప్రశాంతముగా స్వీకరిస్తాము. ఈ విధంగా, కీర్తి మరియు అపకీర్తి, జయము మరియు అపజయము, సుఖము మరియు దుఃఖము, వీటన్నిటినీ మనము భగవంతుని సంకల్పంగా పరిగణించి స్వీకరిస్తాము. ఈ రెంటినీ సమానంగా స్వీకరించటం నేర్చుకున్నప్పుడు, మనము శ్రీ కృష్ణుడు చెప్పిన సమత్వ బుద్ధిని పెంపొందించుకుంటాము.


జీవితంలోని ఒడుదుడుకులకు ఈ శ్లోకం ఒక చక్కని ఆచరణాత్మక పరిష్కారం చూపుతుంది. నావలో మనం సముద్రంలో ప్రయాణం చేస్తుంటే సముద్ర అలలు ఆ నావను అటూ ఇటూ ఊపటం సహజం. ప్రతిసారి అల తాకినప్పుడల్లా మనం కలత చెందితే మన యాతనకు అంతు ఉండదు. ఒకవేళ అలలు పైకిరావద్దు అనుకుంటే అది సముద్రం యొక్క సహజ స్వభావానికి విరుద్ధంగా ఉండమని కోరినట్లే. అలలు అనేవి సముద్రం నుండి విడదీయలేనివి.


అదే విధంగా, సంసార సాగరంలో ప్రయాణించేటప్పుడు, మన నియంత్రణలో లేని, ఎన్నో అలలను అది మన మీదకు తేవచ్చు. మనము ప్రతికూల పరిస్థితులని నివారించటానికి నిరంతరం పోరాడుతూ ఉంటే, మనం అసంతృప్తి/దుఃఖాన్ని తొలగించుకోలేము. కానీ, మన శక్తిమేర ప్రయత్నం ఆపకుండా, దారిలో వచ్చే ప్రతి దాన్నీ స్వీకరించటం నేర్చుకుంటే, మనం ఈశ్వర సంకల్పానికి శరణాగతి చేసినట్లే, అదే నిజమైన యోగము.

*మూక పంచశతి*

  🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸


*శ్రీ మూకశంకర విరచిత*

*మూక పంచశతి*

*ఆర్యా శతకం - 1*


*శ్లోకము - 10*


*తుంగాభిరామకుచభరశృంగారిత మాశ్రయామి కాంచిగతమ్।* 

*గంగాధరపరతంత్రం శృంగారాద్వైతతంత్రసిద్ధాంతమ్॥*


*భావము :*


*మహోన్నతములు, శృంగారభరితములు అయిన మాతృస్థానములు కలిగినదియు, శృంగార విద్య, తంత్ర శాస్త్రములలో ప్రవీణురాలు, గంగను ధరించినవానికి వశవర్తి అయిన జగన్మాతను స్మరిస్తున్నాను.*


🙏🙏🙏*శ్రీమాత్రే నమః* 🙏🙏🙏

పంచాంగం 22.01.2026 Thursday,

  ఈ రోజు పంచాంగం 22.01.2026 Thursday,


స్వస్తి శ్రీ చాన్ద్రమాన విశ్వావసు నామసంవత్సర: ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘ మాస శుక్ల పక్ష చతుర్థి తిథి బృహస్పతి వాసర శతభిషం నక్షత్రం వరియాన్ యోగః వణిజ తదుపరి భద్ర కరణం.


రాహుకాలం : మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.

 

యమగండం: ఉదయం 06:00 నుండి 07:30 వరకు. 


  


శ్రాద్ధ తిథి: చతుర్థి


 

నమస్కారః , శుభోదయం

- శ్రీ లింగ మహాపురాణం

  అష్టాదశ పురాణాలు - శ్రీ లింగ మహాపురాణం - శివ సంబంధ పవిత్రాగ్ని హోమము - నూట డెబ్భై తొమ్మిదవ భాగం

_________________________________________________________

స్రుక్, స్రువ సంస్కారాలు, నిరీక్షణ ప్రోక్షణ తాడన అభ్యుక్షణాది కార్యములు ఇంతకు ముందు చెప్పినట్టే మరల ఆచరించాలి స్రుక్, స్రువములను చేతుల్లోకి తీసుకోవాలి. ప్రథమ బీజ మంత్రముతో సంస్థాపన, తాడన కృత్యములు చేయాలి. స్రువము యొక్క కుశల మొదళ్లు, మధ్య, చివరల నుంచి మూడు సార్లు తాడనం చేయాలి.


'ఓం శక్తయే నమః' ఓం శంభవే నమః" మంత్రాలు పఠిస్తూ శివుని యొక్క కుడిచేతి వైపు స్రువమును కుశలపై ఉంచాలి. చతుర్థ బీజ మంత్రము పఠిస్తూ భక్తుడు స్రువము యొక్క దారాన్ని తన చేతికి కట్టుకుని దానికి పూజ చేయాలి. ధేనుముద్ర చూపాలి. చతుర్థ బీజమంత్రముతో మూసి షట్ బీజ రక్షకృత్యము ఆచరించాలి.


షట్ బీజమంత్రముతో ఈశాన్యం లోగల పాత్రలో గల నేతిని వేడి చేసి వేదిక పైన ఉంచాలి. పొడవైన దర్భను గుండ్రని ఉంగరము లాగా చుట్టి కుండలిని తయారు చేయాలి. కుండలిని చివరి భాగాన్ని ఎడమచేతి బొటనవ్రేలితో, చివర మధ్య భాగాన్ని అనామిక వ్రేలితో పట్టుకుని, స్వాహాతో అంతమయ్యే చతుర్థ బీజమంత్రముతో అగ్నిలో వేసి ఉత్పవన కృత్యము చేయాలి.


మరల ఆరు కుశలను తీసుకుని స్వాహాంత ప్రథమ బీజమంత్రముతో ఆత్మ సంపన్న కృత్యము చేయాలి. రెండు కుశల పవిత్ర బంధన కృత్యము ప్రథమ బీజమంత్రముతో చేయాలి. రెండు కుశల పై భాగాన్ని ఒకదానితో ఒకటి కట్టి కుండలిని ఘృతములో (నేతిలో) ఉంచి పవిత్రీకరణము చేయాలి. రెండు కుశలను తీసుకుని వాటి చివరలను కాల్చి వేదిక నాలుగు దిశలలో మూడు సార్లు తిప్పాలి. వాటిపై నీటిని చిలకరించి నేతిలో ముంచి అగ్నిలో వేయాలి. దీనిని నీరాజన కృత్యము అంటారు.


కుశలను అర్ఘ్య జలముతో శుభ్రపరచి తీసుకుని అగ్నిలో వేసి ఉద్ద్యోతన కృత్యము చేయాలి. రెండు కుశల చివరలను కొద్దిగా నేతితో తడిపి కలిపి, ముఖము యొక్క రెండు భాగములను శుక్ల (తెల్లని), కృష్ణ (నల్లని) రూపాలుగా స్మరించి సమర్పించాలి. ఘృతమును (నేతిని) మూడు భాగాలుగా విభజించి, మొదటి భాగాన్ని స్రువముతో తీసుకుని 'ఆగ్నేయ స్వాహా' అంటూ అగ్నిలో వేయాలి. రెండవ భాగాన్ని 'సోమాయ స్వాహా' అంటూ అగ్నిలో వేయాలి. మూడవ భాగాన్ని 'ఓం అగ్ని సోమాభ్యాం స్వాహా! అగ్నయే స్వాహా! శ్విష్టకృతే స్వాహా!' అంటూ అగ్నిలో ఆహుతి చేయాలి.


తిరిగి కుశల అగ్రభాగము నేతితో తీసుకుని సంహితామంత్రము చేత అభిమంత్రించాలి. కవచ, ధేను ముద్రలు చేసి, అస్త్ర మంత్రము చేత రక్షణ చేసి పవిత్ర ఆజ్యము పైన ఉంచి ఆజ్యసంస్కారం చేయాలి. తరువాత ముఖోద్ఘాటనము లేదా వక్త్రోద్ఘాటన సంస్కారం చేయాలి.


స్రువము చివరి భాగము నుంచి ఆజ్యమును శక్తి బీజమంత్రము చేత నాలుగు వైపుల త్రిప్పుతూ చక్రాభిధారణం చేస్తూ 'ఈశాన మూర్తయే స్వాహా' 'పురుష వక్త్రాయ స్వాహా' అఘోర హృదయాయ స్వాహా' ' వామదేవాయ గుహ్యాయ స్వాహా' 'సద్యోజాతాయ స్వాహా " అనే స్వాహా మంత్రాలతో ఆజ్య ఆహుతులు సమర్పించాలి వ దీనిని సంధాన కృత్యము అంటారు.


తరువాత "ఈశానమూర్తయే తత్పరుషాయ వక్త్రాయ, అఘోర హృదయాయ వామదేవాయ సద్యోజాతాయ స్వాహా" అనే వక్త్ర్యైకరణ కృత్యము చేయాలి. భక్తుడు ఈవిధంగా శివాగ్నిని ఉత్పన్నం చేసి అన్ని కార్యాలు ఎల్లప్పుడు చేయవచ్చును. లేదా ఒక జిహ్వాగ్నితో అన్ని శాంతి పుష్టికాది కార్యాలు చేయాలి.


సనత్కుమారా! గర్భాదానాదుల సంస్కారాలలో ఒక్కొక్కదానికి పది ఆహుతులు అగ్నికి సమర్పించాలి. యోని బీజమంత్రముతో శివాగ్నిలో ఐదు విధాల పరమ దివ్య ఆశాధారణలు చేయాలి. పూజా విధివిధానాలతో దేవతల ఆహ్వానము, ఉద్వాసన చేయాలి. మూలమంత్రము జపించి దేవదేవునికి నమస్కరించాలి. ప్రణవముతో మూడు సార్లు ప్రాణాయామం చేయాలి. జలమును చిలకరించి, నేతిని వేసి సమిధలను అగ్నిలో హవనం చేయాలి.


పాత్రలలో ఆజ్యము తీసుకుని రెండు భాగములను ఒకేసారి ఆరు ముఖాల నుంచి అగ్నిలో వేయాలి. రెండు సార్లు నైరుతి నుంచి, ఉత్తరం నుంచి వేయాలి. శివుని రెండు నేత్రాలు కుడి ఎడమ వైపు ఉంటాయి కనుక నేతి యొక్క రెండు భాగాలు పశ్చిమదిశగా కూర్చుని శివాగ్నిలో మూలమంత్రము జపిస్తూ పది ఆహుతులను సమర్పించాలి తరువాత చరువు, సమిధలు ఆహుతి ఇవ్వాలి.


భక్తుడు మూలమంత్రముతో పూర్ణాహుతి ఇవ్వాలి. శివునికి నలుదిశల ఉన్న దేవతలకు ఈశానాది క్రమములో శక్తిబీజ మంత్రము పఠిస్తూ ఒక్కొక్కరకి ఐదు ఆహుతులు సమర్పించాలి. చివరన అఘోర మంత్రము చేత ప్రాయశ్చిత్తం చేయాలి.


సనత్కుమారా! మూడు పద్దతులలో జరిగే అగ్ని కార్యమును వివరించాను. అవకాశము లభిస్తే ప్రతి దినము భక్తుడు చేయవచ్చును. అటువంటి భక్తుడు అగ్ని దీపక శక్తిని పొంది మోక్షము పొందగలడు. ముక్తి కోరుకునే వారు అహింసక హోమము చేయాలి. హృదయంలో అగ్నిదేవుని స్థిరపరచుకుని ధ్యానయజ్ఞ హోమము చేయవచ్చును. అందరిలో ఆత్మగా భాసిల్లే శివుని అనుభవం లోనికి తెచ్చుకుని భక్తితో ప్రాణాయామముతో మానసిక హోమము చేయవచ్చును.


తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం.


మీ అమూల్యమైన స్పందన కోరుతూ.


మీ

శ్రీకాంత్ గంజికుంట కరణం

22-01-2026 గురువారం రాశి ఫలితాలు

 శ్రీ గురుభ్యోనమః 🙏

22-01-2026 గురువారం రాశి ఫలితాలు


మేషం


చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త పనులు చేపట్టి విజయం సాధిస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. నూతన వస్తులాభాలు పొందుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్థులకు  నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. 

---------------------------------------


వృషభం


విలువైన  వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. వృత్తి, వ్యాపారాలలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. 

---------------------------------------


మిధునం


ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. నూతన  రుణయత్నాలు చేస్తారు. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. వృత్తిఅధికమౌతాయి. వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

---------------------------------------


కర్కాటకం


ఇంటాబయట మానసిక ఒత్తిడులు ఉంటాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. నూతన రుణయత్నాలు ఫలించవు. చేపట్టిన పనుల్లో తొందరపాటు మంచిది కాదు. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

---------------------------------------


సింహం


అనుకున్న పనులు అనుకున్న  విధంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. మొండి బాకీలు వసూలు చేసుకోగలుగుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులు అధికారుల అండదండలతో ముందుకు సాగుతారు.

---------------------------------------


కన్య


 ఆరోగ్య విషయంలో అశ్రద్ధ  చేయడం మంచిది కాదు. కొన్ని వ్యవహారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక వ్యవహారాలు కొంత  నిరాశ పరుస్తాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి.  వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో స్థానచలన సూచనలు ఉన్నవి. 

---------------------------------------


తుల


సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన  పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల  కలయిక ఆనందం కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాలు ఆశజనకంగా సాగుతాయి. ఆర్థికంగా అవసరానికి ధన సహాయం లభిస్తుంది.

---------------------------------------


వృశ్చికం


ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వృత్తి వ్యాపారాల్లో శ్రమ  తప్ప  ఫలితం కనిపించదు. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాలలో అధికారుల నుండి  ఒత్తిడులు పెరుగుతుంది. బంధుమిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు.

---------------------------------------


ధనస్సు


చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. దూరపు బంధువుల నుండి  శుభకార్య  ఆహ్వానాలు అందుకుంటారు.  చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది.

---------------------------------------


మకరం


ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. 

---------------------------------------


కుంభం


ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. వ్యాపారపరంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయుట మంచిది. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు ఉంటాయి.  

---------------------------------------


మీనం


నిరుద్యోగులకు నిరాశ తప్పదు. చేపట్టిన పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. బంధువులతో ఊహించని  వివాదాలు కలుగుతాయి. కొన్ని వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలసిరావు. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

---------------------------------------

21, జనవరి 2026, బుధవారం

పంచాంగం


 


 


*శ్రీ కృష్ణదేవరాయల వైభవ గాథ..*

 *శ్రీ కృష్ణదేవరాయల వైభవ గాథ..* 


​ఆంధ్ర భోజ! శ్రీకృష్ణదేవరాయా!

నీ పరిపాలన ఓ చరిత్ర, నీ వంశం రాజసానికి చిహ్నం,

విదేశీయులు సైతం కొనియాడిన అసమాన వంశం.

హంపి నగరపు సౌరభానికి నీవే నిత్య నిదర్శనం.


​కవిత్వ కథన రంగ విన్యాస చరితా!

అష్టదిగ్గజాల సరసన వెలిగే రాజమార్తాండా!

'ఆముక్తమాల్యద'తో విరిసిన సాహిత్య పారిజాతమా!

నీవు తెలుగు తల్లి ముద్దుల రాజకుమారుడవు.


​రణరంగ విన్యాస శత్రు భయంకరా!

గజపతులకు నీవు గజసింహ స్వప్నానివి.

చేతిలో కత్తి పడితే విజయం నీ చెంతనే..

రణరంగంలోనూ కవిత్వాన్ని పండించిన సాహితీ శిఖరమా!


​లాలిత్య సౌందర్య సంపద వృక్షమా!

సంస్కృతాంధ్ర భాషలలో ఆరితేరిన ప్రవీణా!

అష్టాదశ వర్ణనలలో మేటి అనుభవజ్ఞుడా!

కవన రంగంలో నీవు సాహితీ సార్వభౌముడివి.


​'మూరురాయరగండ' బిరుదాంకితుడా!

సకల ఆంధ్ర రాజ్య పరిపాలన విజేతవు నీవు.

నీ చరితం సువర్ణ హిమ శిఖరం..

దేశ చరిత్రలో నీది సుమధుర, సుస్థిర స్థానం.


​మత సామరస్య పర్యవేక్షక సార్వభౌమా!

హిందూ-ముస్లిం ఐక్యతను చాటిన బోధకుడా!

హైందవ ధర్మ రాజ్య పరిరక్షకా..

ఆంధ్ర వైభవ పరంపరలో నీ నామం చిరస్థాయి.


​శిల్ప సౌందర్య కళాపోషకా!

సకల కళా సమ్మేళనానికి నీవే రూపానివి.

విజయ నగర వైభవ సంస్కృతికి నీవే నిదర్శనం.

భావి తరాలకు నీ పరిపాలనే ఆదర్శం.


​గొప్ప ఆలయాలను నిర్మించిన నిర్మాతవు,

శైవ, వైష్ణవ క్షేత్రాలను పునరుద్ధరించిన పుణ్యమూర్తివి.

కలియుగ దైవానికి మణి మాణిక్యాలర్పించిన భక్తుడివి,

సిరులను కురిపించే సువర్ణ హస్తం నీది.


​అద్భుత చెరువులెన్నో తవ్వించావు,

రైతుల ఇంట సిరులను సాక్షాత్కరించావు.

భూమిపుత్రుడిని ఆదరించి..

ధాన్యలక్ష్మిని సగర్వంగా నిలిపిన అన్నదాతవు.


​నలుదిక్కులా వ్యాపార వృద్ధిని పెంచావు,

రత్నరాసులు వీధుల్లో రాశులుగా పోయించావు.

అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిని గడించి,

నేటి ఆర్థిక వ్యవస్థకు నీ పరిపాలనే అసలైన దర్పణం!


కొప్పుల ప్రసాద్ 

నంద్యాల 

9885066235

సత్యమేవ జయతే

  *సత్యమేవ జయతే అమృత వాక్యమే..* 


పాత పుస్తకంలోని ఆ పేజీ జ్ఞాపకమొస్తుంది

విశాల మనసును నీటి చుక్కలా తడుపుతుంది

నా కళ్ళ ముందర శాంతి పక్షిలా ఎగురుతూ

తాకితే మునివేళ్లకు తీయని అనుభూతినిస్తుంది..


ఒక మెరుపులా ఆ వాక్యం ఆకర్షించి

మేధస్సులో రసాయనంలా ఉప్పొంగి

గడిచిన కాలాన్ని యంత్రంలా వెనక్కి తిప్పి

కాలానికి తోడుగా సజీవంగా నడుస్తుంది..


ఎన్ని చరిత్రలు చూసిందో తన కళ్ళముందు

ఎన్ని కలలు తిరగరాశాయో ఆ సత్యాన్ని

ఎన్ని సిరా చుక్కలు కాగితాలపై వర్షించాయో

ఇప్పటికీ నిత్య నూతనంగా కనిపిస్తూనే ఉంది..


ఎంత సారాన్ని వడబోసి పుట్టిందో

ఉద్గ్రంథాలను తిరగేస్తే కనిపించిందో

అశాంతి మనసుల్లో ఆయువును పోసిందో

త్రాసులో సత్యం వైపే గర్వంగా నిలబడింది..


సంగ్రామంలో చేతికర్రలా ఆయుధమై నిలిచి

శత్రువులో సైతం భీతిని పుట్టించి

ప్రపంచ దేశాల్లో పరమ పవిత్రంగా వెలుగుతూ

ఒక మంత్రంలా విశ్వమంతా ఘోషిస్తుంది..


సత్యమేవ జయతే అమృత వాక్యమై

జగతికి అందిన సందేశాత్మక రూపమై

యుగాలు మారినా తరగని సంప్రదాయమై

జగతిపై నిలిచి ధర్మచక్రంలో దర్శనమిస్తుంది..!


కొప్పు*సత్యమేవ జయతే అమృత వాక్యమే..* 


పాత పుస్తకంలోని ఆ పేజీ జ్ఞాపకమొస్తుంది

విశాల మనసును నీటి చుక్కలా తడుపుతుంది

నా కళ్ళ ముందర శాంతి పక్షిలా ఎగురుతూ

తాకితే మునివేళ్లకు తీయని అనుభూతినిస్తుంది..


ఒక మెరుపులా ఆ వాక్యం ఆకర్షించి

మేధస్సులో రసాయనంలా ఉప్పొంగి

గడిచిన కాలాన్ని యంత్రంలా వెనక్కి తిప్పి

కాలానికి తోడుగా సజీవంగా నడుస్తుంది..


ఎన్ని చరిత్రలు చూసిందో తన కళ్ళముందు

ఎన్ని కలలు తిరగరాశాయో ఆ సత్యాన్ని

ఎన్ని సిరా చుక్కలు కాగితాలపై వర్షించాయో

ఇప్పటికీ నిత్య నూతనంగా కనిపిస్తూనే ఉంది..


ఎంత సారాన్ని వడబోసి పుట్టిందో

ఉద్గ్రంథాలను తిరగేస్తే కనిపించిందో

అశాంతి మనసుల్లో ఆయువును పోసిందో

త్రాసులో సత్యం వైపే గర్వంగా నిలబడింది..


సంగ్రామంలో చేతికర్రలా ఆయుధమై నిలిచి

శత్రువులో సైతం భీతిని పుట్టించి

ప్రపంచ దేశాల్లో పరమ పవిత్రంగా వెలుగుతూ

ఒక మంత్రంలా విశ్వమంతా ఘోషిస్తుంది..


సత్యమేవ జయతే అమృత వాక్యమై

జగతికి అందిన సందేశాత్మక రూపమై

యుగాలు మారినా తరగని సంప్రదాయమై

జగతిపై నిలిచి ధర్మచక్రంలో దర్శనమిస్తుంది..!


కొప్పుల ప్రసాద్ 

నంద్యాల 

9885066235ల ప్రసాద్ 

నంద్యాల 

9885066235

*నా ఉన్నతికి హుందా నా భాష…!*

 *నా ఉన్నతికి హుందా నా భాష…!* 


నన్నయ్య నారు పోయగా,

తిక్కన్న తీపు తొడగగా,

ఎర్రన్న వర్ణమై విరసిల్లగా,

నా తెలుగు సస్యశ్యామలమాయె...


పాల్కురికి అచ్చతెలుగు తోడవగా,

శివతత్వం చిందులేయగా,

తెలుగు పదం పాదాలు కలిపి,

కావ్యమై పరవళ్లు తొక్కింది..


శ్రీనాథుని సీసంలో రోషంగా,

పలనాటి పౌరుషంగా,

చాటువై పద్యాల్లో మేటిగా,

గంభీరంగా జలజల ప్రవహించింది…


పోతన సేద్యంలో నాగలిగా,

తెలుగు నేలపై భక్తిని పండించి,

భాగవతపు వెన్నను అందించి,

తెలుగు రీతుల మాధుర్యమే పంచింది..


అష్టదిగ్గజాలు పల్లకి కాగా,

ప్రబంధమే గండపెండెరంగా,

కృష్ణరాయల చేతుల్లో,

వినువీధుల్లో అంబారీపై అందాలనెక్కింది..


బద్దెన సుద్దులు చెప్పగా,

వేమన్న బుద్ధులు విప్పగా,

శతకమై అమరత్వాన్ని పొంది,

పిల్లల నోట తియ్యటి మాటగా నిలిచింది…


నేడు సరళత్వము పొందగా,

ఆధునికమై అందాలనెక్కగా,

విశ్వవీధిలో వింజామరలు,

వీస్తూ ప్రపంచమంతా పరవళ్లు తొక్కుతోంది…


కందుకూరి సంస్కరణ చేయగా

 గురజాడ ముత్యాల హారాలు కూర్చగా

 గిడుగు గోడై నిలవగా 

నవ్యమై నవ శకాన్ని ప్రారంభించింది..


జ్ఞానపీఠాలు కిరీటంలా ధరించగా

అన్ని ప్రక్రియలలో ఆరితేరగా

పద్యమై గేయమై పాటలై పారగా

నేలంతా తెలుగు పలుకులతో వికసించింది..


ఇదే నా భాష ఇదే నా శ్వాస,

నా జాతికి చిహ్నంగా,

నా ఉన్నతికి హుందాగా,

నన్ను నడిపిస్తుంది నిత్యం ఇది సత్యం..


కొప్పుల ప్రసాద్ 

నంద్యాల 

9885066235

Dr. Mir Jafer Ali Hashmi

 Dr. Mir Jafer Ali Hashmi 

                  B U M S (Osm)

        Consultant in :

Allergic Asthma.

Arthritis.

Epilepsy ( Fits ).

Kidney Stones.

Herbal Medicine 

Safe and Cure 💯.

Mob:+91 8790467286.

                 9392050866.

మాఘ పురాణం - 3 వ* _*అధ్యాయము*_

 🕉️🌹🌷🪔🛕🪔🌷🌹🕉️


*🌷బుధవారం 21 జనవరి 2026🌷*

_*మాఘ పురాణం - 3 వ* 

      _*అధ్యాయము*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


     *21వ తేదీ బుధవారం*

         *వేకువఝామున*

       *చదువు కొనుటకు*

```

గురుపుత్రి కథ,

ఒక ఋషి కూతురి గురించి చెబుతుంది. ఆమె తండ్రి అడవిలో తపస్సు చేసుకుంటున్నప్పుడు తల్లి చనిపోవడంతో, గురువు వద్ద చదువుకునేందుకు పంపబడుతుంది. గురువు ఆమెను తన కూతురిలా చూసుకుంటాడు, ఆమె తెలివితేటలతో అన్ని విద్యలు నేర్చుకుని రాజును వివాహం చేసుకుని రాణి అవుతుంది. మంచితనంతో ప్రజలను ప్రేమించి పాలించే రాణిగా, కుమారుడు పుట్టి రాజు మరణించాక కుమారుడితో కలిసి రాజ్యాన్ని పాలిస్తుంది. చివరికి కుమారుడు రాజు అయి సంతోషంగా పరిపాలించగా, 

ఈ కథ మంచితనం ఎల్లప్పుడూ మంచి ఫలితాలనిస్తుందని, మంచి వ్యక్తులుగా మారేందుకు ప్రేరేపిస్తుంది.

```

         *గురు పుత్రికా కథ*```


మంగళదాయినీ! సర్వమంగళా! మాఘ మాసం స్నాన ప్రభావముచే పూర్వమొక బ్రాహ్మణ పుత్రిక పాప విముక్తయై తన భర్తతో హరి సాన్నిధ్యము నందినది. అని శివుడు పార్వతీ దేవితో పలికెను. అప్పుడు పార్వతీదేవి ‘స్వామీ! ఆ బ్రాహ్మణ పుత్రిక యెవరు. ఆమె చేసిన పాపమేమి! మాఘస్నానమున పాప విముక్తి నందిన విధానమేమి? వివరముగ చెప్పగోరుచున్నా’ననగా శివుడిట్లు పలికెను. 


‘దేవీ వినుము, పూర్వము సౌరాష్ట్ర దేశమున బృందారకమనే గ్రామంలో సుదేవుడనే బ్రాహ్మణుడుండేవాడు. అతడు సదాచారవంతుడు, వేదశాస్త్ర పండితుడు. అతనికి శిష్యులు చాలా మంది వుండేవారు. వారు, గురు సేవచేస్తూ విద్యాభ్యాసం చేస్తూవుండే వాళ్లు. ఆ సుదేవునికి సర్వాంగ సుందరి అయిన కుమార్తె వుండేది. పొడవైన కేశములతో, చక్కని ముఖంతో, చక్కని కనుముక్కు తీరులో ఆమె మిక్కిలి మనోహరంగా వుండేది. ఇట్టి కుమార్తెను ఎవరికిచ్చి వివాహం చేయగలనని అతడు విచారిస్తూవుండేవాడు.


ఒకనాడు సుమిత్రుడనే శిష్యుడు సమిధలు, ధర్భలు మొదలైన వాటికోసం గురువు పంపగా అడవికి వెళ్ళాడు. బంతితో ఆడుకుంటున్న గురు పుత్రిక కూడా సుమిత్రుని వెంబడించి వెళ్లింది. సుమిత్రుడును చాలా దూరము పోయి ఆ అరణ్యములో ఒక జలాశయాన్ని చూచాడు. ఆ చెరువు గట్టున యెత్తైన చెట్లున్నాయి. నీరు నిర్మల మనోహరంగా వుంది, పద్మాలు,వానిపై వ్రాలే తుమ్మెదల రొద, అనేక వర్ణములలోనున్న కలువలు, జల సంచారము చేయు జలప్రాణుల విహారము, మొదలైన వానిచే ఆ సరస్సు మనోహరముగనుండెను. కోకిలలు గుంపులు కట్టి మధుర ధ్వనులు చేయుచుండెను. చిలుకలు గోరువంకలు నేర్చిన మాటలను పలుకుచున్నవి. ఎత్తైన చెట్లతో కప్పబడిన ఆ ప్రదేశము ఒక ఏకాంత మందిరములా వుంది.


గురుపుత్రిక ఆ చెరువులోని నీరు త్రాగి అచట వృక్షములకున్న పండ్లను తిని ఒక చోట కూర్చుండెను. సుమిత్రునిపై మనసుపడింది. ‘ఓయీ! మనుష్య సంచారము లేని, యేకాంత ప్రాయమైన యీ ప్రదేశంలో నాకు నీతో కలిసి సుఖ పడాలని వున్నది. ఈ వనము నీకును నాకును నచ్చినది మన మిద్ధరమును పడుచువారము, మన కలయిక సుఖ ప్రదమగును ఆలసించక నావద్దకు రమ్ము, నా శరీరము దూదికంటే మెత్తగానున్నది, నీకు మరింత సుఖమిచ్చును, రమ్ము నన్ను మోహములో తనివి దీర కౌగిలించుకొనుము, రమ్ము రమ్మ’ని పిలిచెను. 


సుమిత్రుడు ‘మంచిదానా! నీవిట్లనకుము, నీ మాట దురాచార పూరితము. నీవు వివాహము కాని బాలవు. నాకు గురు పుత్రికవు మనము సోదరీ సోదరులము, నీవు మన్మధ పరవశురాలవై ఇలా అనుచితముగా పలుకుచున్నావు. నేను నీతో రమింపజాలను. నేనీ మాటను సూర్య చంద్రుల సాక్షిగా చెప్పుచున్నాను. ఇట్టి పాపము చేసిన మనమిద్దరము చిరకాలము నరక వాసము చేయవలసి యుండును. కావున యింటికి పోదమురమ్ము, గురువుగారు మనకై ఎదురు చూచుచుందురు. ఆలస్యమైనచో నిన్ను దండింపవచ్చును. సమిధలు, దర్భలు మున్నగు వానిని గొనిపోదము రమ్ము’ అని పలికెను.


గురుపుత్రిక ఆ మాటలను విని ‘ఓయీ! కన్యారత్నము, సువర్ణము. విద్యా దేవత, అమృతము స్వయముగ చెంతకు చేరినపుడు వలదన్నవాడు మూర్ఖుడు. ఒకరినొకరము కౌగిలించుకొనక సుఖమునందక నేనింటికిరాను. నేనిచటనే నాప్రాణములను విడిచెదను. నీవు ఇంటికి తిరిగి వెళ్లి నేను రానిచో మా తండ్రి నిన్ను శపించును. నేను నీతో సుఖింపని యీ శరీరమునొల్లను. ఇచటనే యీ శరీరమును విడిచెదను. నీవింటికిపోయి దీని ఫలితము అనుభవింపుము’ అని నిష్టురముగ మన్మధావేశముతో మాటలాడెను. 


సుమిత్రుడును యేమి చేయవలెనో తెలియని స్థితిలోనుండెను. చివరకాతడు గురుపుత్రిక కోరికను దీర్చుటకంగీకరించెను. వారిద్దరును పద్మములతో పుష్పములతో ఎగురుటాకులతో మన్మధశయ్యను తీర్చుకొని మనోహరమైన ఆ వాతావరణములో యధేచ్చా సుఖములననుభవించిరి. వారిద్దరును తృప్తిపడిన తరువాత సమిధలు మున్నగువానిని దీసికొని గ్రామమునకు బయలుదేరిరి. గురువు శిష్యుడు తెచ్చిన సమిధలు మున్నగు వానిని చూచి యానందపడెను. పుత్రికను చూచి నీవు చాల అలసినట్లున్నావు, మధురాహారమును తిని విశ్రాంతినందుమని లోనికి పంపెను. ఆమెయు అట్లేయని లోనికెగెను. తండ్రియామెను కాశ్మీర దేశవాసి యగు బ్రాహ్మణనుకిచ్చి వివాహము చేసెను. 


కొంత కాలమునకు ఆమె భర్త మరణించెను. భర్తను కోల్పోయి నేలపై బడి దుఃఖించుచున్న కుమార్తెను చూడలేక సుదేవుడును మిగుల దుఃఖించెను. ‘అయ్యో! సుఖములనంద వలసిన వయసులోనే బాధాకరమైన వైధవ్యము కలిగినదేమి? ఈమెకిట్టి బాధను కల్పించిన ఆ బ్రహ్మయెంత మూర్ఖుడో కదా’ అని పలువిధములుగా దుఃఖించుచుండెను. 


ఇట్లు సుదేవుడు వాని భార్య దుఃఖించుచుండగా దృడవ్రతుడను యోగి ఆ ప్రాంతమున దిరుగుచు సుదేవుని రోదన ధ్వనిని విని వాని వద్దకు వచ్చి ‘జ్ఞానస్వరూపా! నీ దుఃఖమేమియో చెప్పుము. నీ దుఃఖమును పోగొట్టెద’నని ధైర్యము చెప్పెను. 


సుదేవుడు తన దుఃఖ కారణమును చెప్పి మరల దుఃఖించెను. 


యోగి సుదేవుని, భార్యపుత్రికలను చూచి క్షణకాలము ధ్యాన యోగము నందియిట్లు పలికెను...


‘ఓయీ! వినుము నీ కుమార్తె పూర్వజన్మలో క్షత్రియ కులమున జన్మించినది. వ్యభిచారిణియై చెడు ప్రవర్తన కలిగియుండెను. సౌందర్యవతి యౌవనవతి యగు ఆమె తన జారుల మాటలను విని తన భర్తను వధించెను. భర్తను వధించి భయపడి శోకించి ఆత్మహత్య చేసికొనెను. ఈమె పతి హత్యను, ఆత్మహత్యను చేసినది. ఆ రోషము వలన ఈమెకీ జన్మమున యిట్టి వైధవ్యము కలిగినది. ఇట్టి యీమె పవిత్రమైన నీ వంశముననెట్లు జన్మించినదాయని నీకు సందేహము రావచ్చును. దానికిని కారణము కలదు వినుము.. 

ఈమె తన పూర్వజన్మలో మాఘమాసమున సరస్వతీ నదీ తీరమున గౌరీ వ్రతము నాచరించువారితో కలసి వారు యిసుకతో చేసిన గౌరీదేవిని పూజించుచుండగా నీ వ్రతమును చూచినది. ఆ పుణ్య బలమున ఈమె పవిత్రమైన వంశమున జన్మించినది. ఈ జన్మయందును స్వేరిణియై నీ శిష్యులతో అధర్మముగ రమించెను. ఈ దోషమువలన నీమె తమ కర్మఫలముల యిట్లననుభవించుచున్నది చేసిన కర్మము ననుభవింవింపక తప్పదు కదా!’



సుదేవుడు యోగిమాటలను విని చెవులు మూసుకొని తన కుమార్తె పూర్వజన్మలో పతిహత్య, ఆత్మహత్యలకు పాల్పడుబడెను. ఈ జన్మలో కన్యయై సోదరతుల్యుడైన తన శిష్యునితో రమించుటనువిని మరింత దుఃఖించెను. యోగికి నమస్కరించి ‘తండ్రీ! నా కుమార్తె చేసిన పాపము యేమి చేసిన పోవును? ఆమె భర్త జీవించుట యెట్లు జరుగును? దయయుంచి చెప్పు’డని పరిపరి విధముల ప్రార్థించెను.


అప్పుడా యోగి ‘ఓయీ విద్వాంసుడా! నీ కుమార్తె చేసిన పాపములు పోవుటకు, ఆమె మాంగళ్యము నిలుచునట్లును చేయుటకొక ఉపాయము కలదు. శ్రద్ధగా వినుము: మాఘమాసమున ప్రాతఃస్నానము చేసి నదీ తీరమున గాని సరస్సు తీరమున యిసుకతో గౌరీదేవిని జేసి షోడశోపచారములతో పూజింప వలయును. సువాసినులకు దక్షిణతో నా గౌరీదేవిని (Gouri Devi) సమర్పించవలయును. ఈ విధముగ ఈమెచే ప్రతిదినము చేయింపుము. ఈమె భర్త తిరిగి జీవించును. ఈమె పాపములను నశించును.


మాఘ శుద్ద తదియ నాడు రెండు క్రొత్త చాటలను తెచ్చి వానిలో చీర, రవికలగుడ్డ, ఫల పుష్పాదులు, పసుపు కుంకుమ మున్నగు సువాసిని అలంకారముల నుంచి, దక్షిణ తాంబూలములతో వాయనము నుంచి సువాసినీ పూజచేసి ముత్తైదువల కిచ్చి ఏడుమార్లు ప్రదక్షిణ నమస్కారముల నాచరింపజేయుము. ఆ సువాసినికి షడ్రసోపేత భోజనము పెట్టి గౌరవింప వలయును. మాఘమాసమున ప్రాతఃకాల స్నానముల చేతను పైన చెప్పిన వ్రతాచరణము చేతను ఈమెకు పాపక్షయము కలుగును. భర్త పునర్జీవితుడై ఈమె మాంగళ్యము నిలుచును. మాఘస్నానము చేసిన విధవరాలు విష్ణు లోకమును చేరును. మాఘస్నానము చేసి గౌరివ్రతమాచైంచిన సువాసిని తన మాంగళ్యమును నిలుపుకొని చిరకాలము సుఖించును. పిచ్చివారు, మూర్ఖులు మాఘస్నానము చేసినచో వారెట్టి వారైనను వారియునుహ్రహమునొంది చిరకాలము సుఖించి పుణ్యలోకముల నందుదురు. అని యోగి వివరించి తన దారినబోయెను.



సుదేవుడు యోగి మాటలను నమ్మి తన కుమార్తెచే మాఘ స్నానమును, గౌరీ పూజా విశిష్టమైన కాత్యాయనీ వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయించెను. కాత్యాయనీ వ్రత మహిమ చేత సుదేవుని కుమార్తె పాపములు పోయి ఆమె భర్త పునర్జీవితుడయ్యెను. ఆమెయు చిరకాలము తన భర్తతో సుఖించి తన తల్లిదండ్రులతోను, భర్తతోను కలిసి దేహాంతమున వైకుంఠమును చేరెను. కావున మాఘమున ప్రాతఃకాల స్నానము నదిలోగాని, సరస్సునగాని, కాలువలోగాని చేసి తీరమున శ్రీహరి నర్చించినవారు, సుదేవుని పుత్రిక వంటివారైనను యిహమున సర్వసుఖములనంది పరమున వైకుంఠవాసులగుదురు సుమాయని శివుడు పార్వతీదేవికి మాఘస్నాన మహిమను వివరించెను.```


*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

               🌷🙏🌷```


*మాఘపురాణం మూడవ* *అధ్యాయము సంపూర్ణము*


         *🌷సేకరణ🌷*

*న్యాయపతి నరసింహారావు*

20, జనవరి 2026, మంగళవారం

పంచాంగం

 


మహాభారతము

  🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*మంగళవారం 20 జనవరి 2026*

           *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

  సరళ వ్యావహారిక భాషలో!

           1️⃣1️⃣0️⃣``

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


  *సంపూర్ణ మహాభారతము*


               *110 వ రోజు*                

*వన పర్వము చతుర్థాశ్వాసము*


          *వామదేవుడు*```


ఒకరోజు శలుడు వేటకు వెళ్ళాడు.

ఒక మృగం అతని బాణం దెబ్బ తిని పారిపోయింది. రాజు సారధితో ఆ మృగాన్ని వెంటాడమని చెప్పాడు. 


సారధి ‘రాజా ఆ మృగం చాలా వేగంగా పరుగెత్తింది. మనం ఎంత వేగంతో రథం నడిపినా దానిని చేరలేము. మన గుర్రాలు వామ్య జాతికి చెందినవి అయితేనే ఆ మృగాన్ని పట్టగలము. అలాంటి గుర్రాలు వామదేవుడు అనే మహర్షి దగ్గర ఉన్నాయి’ అని అన్నాడు. 


వెంటనే ఆ రాజు వామదేవుని వద్దకు వెళ్ళి ‘మునీంద్రా! నేను ఒక మృగాన్ని కొట్టాను. అది దెబ్బతిని పారి పోయింది. ఆ మృగాన్ని పట్టుకోడానికి నీ అశ్వములను ఇవ్వు’ అని అడిగాడు. 


వామదేవుడు ‘రాజా! ఆ గుర్రాలను తీసుకు వెళ్ళి నీపని కాగానే నాకు తిరిగి ఇవ్వు’ అన్నాడు. 


అలాగే అని చెప్పి శలుడు ఆ అశ్వములను తీసుకు వెళ్ళి మృగాన్ని పట్టుకుని రాజధానికి వెళ్ళాడు. ఇంత వేగం కలిగిన గుర్రాలు రాజుల వద్ద ఉండాలి కాని ఆ మునికి వీటితో పని ఏమి? అనుకుని వాటిని తన వద్దనే ఉంచుకున్నాడు. ఎన్ని రోజులకూ రాజు తన గుర్రాలను తిరిగి ఇవ్వక పోవడంతో వామదేవుడు తన శిష్యుడు ఆత్రేయుడిని ఆ గుర్రాలను తీసుకు రమ్మని రాజు వద్దకు పంపాడు. 


ఆత్రేయుడు రాజు వద్దకు వెళ్ళి ‘రాజా! మీరు నా గురువుగారైన వామదేవుని దగ్గర ఉన్న అశ్వములను తీసుకుని తిరిగి ఇవ్వలేదు. వాటిని స్నేహపూర్వకంగా ఇస్తే నేను వాటిని తీసుకు వెళతాను’ అన్నాడు. 


అందుకు శలుడు కోపించి ‘ఆయన పంపడం నీవు రావడం చాలా బాగుందిలే వెళ్ళు’ అన్నాడు. 


ఆత్రేయుడు ఆ విషయం తన గురువుకు చెప్పాడు.```


      *శలుడి గర్వభంగము*```


వామదేవుడు ఆగ్రహించి రాజు వద్దకు వచ్చాడు. ‘రాజా! నీకు ఇది తగదు. నీవు అప్పుగా తీసుకున్న గుర్రాలను తిరిగి ఇవ్వు. నీ పని అయింది కదా. అప్పుగా తీసుకున్న సొమ్ము తిరిగి ఇవ్వక లోభంతో అలాగే ఉంచుకోవడం పాపం కదా. అలాంటి పాపం చేసిన వాళ్ళు నరకానికి పోతారు.’ అన్నాడు. 


శలుడు ‘అయ్యా! విప్రులకు గుర్రాలు ఎందుకు? కావాలంటే రెండు ఎద్దులను ఇస్తాను తీసుకుపో. అవి నచ్చక పోతే కంచరగాడిదలను ఇస్తాను కానీ గుర్రాలను మాత్రం ఇవ్వను. ఊరికే ఆశలు పెట్టుకోవద్దు’ అన్నాడు. 


వామదేవుడు ‘రాజా ఇది అధర్మం. విప్రుల సొమ్ము తీకుని ఇవ్వననడం, పాపం కాదా?’ అన్నాడు. 


శలుడికి కోపం వచ్చింది. ‘ఈ బ్రాహ్మణుని పట్టి బంధించి శూలాలతో పొడిచి చంపండి’ అని భటులకు ఆజ్ఞాపించాడు. 


వామ దేవుడికి కోపం వచ్చింది. అతని ముఖం నుండి ఎందరో రాక్షసులు పుట్టుకు వచ్చి రాజును భటులను చంపారు. శలుడు చనిపోయిన తరువాత నలుడు రాజయ్యాడు. వామదేవుడు నలుని దగ్గరకు వచ్చి 

‘రాజా మీరు ధర్మ పరులు. నా గుర్రాలను నాకు ఇప్పించండి’ అని అడిగాడు. 


నలునికి కూడా కోపం వచ్చింది ‘ఈ బ్రాహ్మణుడిని చంపటానికి విషం పూసిన బాణం తెప్పించండి’ అని భటులను ఆజ్ఞాపించాడు. 


అందుకు వామదేవుడు నవ్వి ‘రాజా! అంతఃపురంలో ఉన్న నీ కుమారుని అది చంపగలదు జాగ్రత్త’ అని హెచ్చరించాడు. 


అంతలో అంతఃపురం నుండి హాహాకారము చేస్తూ చనిపోయిన రాజకుమారుని తీసుకు వచ్చారు. 


అది చూసి నలుడు కోపంతో ఒళ్ళు మరచి ‘అహంకారంతో మాట్లాడుతున్న ఈ బ్రాహ్మణుని నేనే సంహరిస్తాను’ అని విల్లు ఎక్కు పెట్టాడు. కాని అతని రెండు చేతులు,విల్లు,బాణం స్తంభించి పోయాయి. 


రాజుకు గర్వం దిగి పోయింది. ప్రజలను చూసి ‘నా గర్వం అణిగి పోయింది బ్రాహ్మణశక్తి ముందు నా శక్తి పనికిరాదని తెలుసుకున్నాను వామదేవుడికి నమస్కరిస్తున్నాను’ అన్నాడు. 


వామదేవుడు ప్రసన్నమై రాజకుమారుని బ్రతికించి నలుని యధాస్థితికి తీసుకు వచ్చాడు. 


నలుడు గుర్రాలను వామదేవుడికి తిరిగి ఇచ్చాడు. ధర్మరాజా బ్రాహ్మణుల మహిమ అలాంటిది” అని మార్కండేయుడు చెప్పాడు.```


             *(సశేషం)*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

              🌷🙏🌷```


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

19, జనవరి 2026, సోమవారం

20జనవరి2026🌹* *దృగ్గణిత పంచాంగం

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*      

   🍁 *మంగళవారం*🍁

 🌹*20జనవరి2026🌹*      

   *దృగ్గణిత పంచాంగం*                 

   

           *స్వస్తి శ్రీ విశ్వావసు* 

           *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - శిశిర ఋతౌః*

*మాఘమాసం - శుక్లపక్షం*


*తిథి  : విదియ* ‌రా 02.42 వరకు ఉపరి *తదియ*

*వారం    : మంగళవారం* (భౌమవాసరే)

*నక్షత్రం  : శ్రవణం* మ 01.06 వరకు ఉపరి *ధనిష్ఠ*

*యోగం : సిద్ధి* రా 08.01 వరకు ఉపరి *వ్యతీపాత*

*కరణం  : బాలువ* మ 02.31 *కౌలువ* రా 02.42 ఉపరి *తైతుల*


*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 10.00 - 11.00 మ 12.00 - 01.00*

అమృత కాలం  : *రా 03.12 - 04.51*

అభిజిత్ కాలం  : *ప 11.56 - 12.41*

*వర్జ్యం    : సా 05.15 - 06.54*

*దుర్ముహూర్తం  : ఉ 08.55 - 09.40 రా 11.02 - 11.53*

*రాహు కాలం   : మ 03.08 - 04.33*

గుళికకాళం      : *ప 12.18 - 01.43*

యమగండం    : *ఉ 09.29 - 10.54*

సూర్యరాశి : *మకరం*                  

చంద్రరాశి : *మకరం/కుంభం*

సూర్యోదయం :*ఉ 06.50*

సూర్యాస్తమయం :*సా 06.05*

*ప్రయాణశూల   : ఉత్తర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 06.40 - 08.55*

సంగవ కాలం         :     *08.55 - 11.11*

మధ్యాహ్న కాలం    :    *11.11 - 01.26*

అపరాహ్న కాలం    : *మ 01.26 - 03.42*


*ఆబ్ధికం తిధి         : మాఘ శుద్ధ విదియ*

సాయంకాలం        :  *సా 03.42 - 05.57*

ప్రదోష కాలం         :  *సా 05.57 - 08.30*

రాత్రి కాలం           :   *రా 08.30 - 11.53*

నిశీధి కాలం          :*రా 11.53 - 12.44*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.58 - 05.49*

<><><><><><><><><><><><><><>

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🍁శ్రీ ఆంజనేయ స్తోత్రం🍁*


*హనుమాన్ శ్రీప్రదో* 

*వాయుపుత్త్రో రుద్రో నఘో జరః*

*అమృత్యుర్వీర వీరశ్చ* 

*గ్రామవాసో జనాశ్రయః !!*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

మాఘ పురాణం - 2 వ*

  🕉️🌹🌷🪔🛕🪔🌷🌹🕉️


*🌷మంగళవారం 20 జనవరి 2026🌷*

_*మాఘ పురాణం - 2 వ* 

      _*అధ్యాయము*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

``

  *20వ తేదీ మంగళవారం* 

        *వేకువఝామున* 

       *చదువుకొనుటకు*

``                                 

*దిలీప మహారాజు వేటకు బయలుదేరుట*

```

దిలీపుడను మహారాజు అనేక యజ్ఞయాగాది క్రతువులొనర్చిన గొప్ప పుణ్యాత్ముడు. అతడు తన రాజ్యమందలి ప్రజలను తండ్రివలె అన్ని విధములా కాపాడుచుండెను. ఒకనాడా భూపాలునకు వేట నిమిత్తం అడవికి పోవలెననెడి కోరిక కలిగెను. మనసున కలిగిన కోరికను ఎట్టి వారలకైననూ నెరవేర్చుకొనుట సహజమే కదా! ఆ విధంగానే దిలీప మహారాజు వేటకు పోవ నిశ్చయించి వేటకు కావలసిన సమస్త వస్తువులను సిద్ధం చేసి వేట దుస్తులు ధరించి సైన్యసమేతుడై వెడలెను.


దిలీపుడు వేటకు వెళ్ళిన అడవి కౄరమృగములతో నిండియున్నది. ఆ క్రూర జంతువులు సమీపమందున్న గ్రామములపై పడి పశువులను, మనుష్యులను చంపి నానా భీభత్సములు చేయుచున్నవి.


దిలీపుడు అడవిలో మాటువేసి మృగములను చంపుచుండెను. తన పరివారము కూడా మృగములను మట్టు పెట్టుచుండిరి. ఇలా కొన్ని రోజుల వరకూ అడవియందు వుండి అనేక క్రూర జంతువులను జంపిరి. ఒకనాడొక మృగం పై బాణం వేసెను. ఆ బాణాన్ని తప్పించుకొని ఆ మృగం పారిపోయెను. దిలీపుడు పట్టు విడువక దాని వెంట పరుగెత్తెను. ముందు మృగం, వెనుక దిలీపుడు, ఆతని వెనుక పరివారము పరుగిడుచుండగా ఆ మృగం ఒక కీకారణ్యమున ప్రవేశించెను. అప్పటికి దిలీపుడు అలసిపోయినందున దాహంచే నాలుక ఎందిపోతున్నది. నీటికొరకు పరివారమంతా వెదుకుచుండిరి. అదృష్టం కొలదీ ఆ సమీపంలో ఒక సరస్సు కనిపించినది. దానిని చూచి సంతోషపడి దిలీపుడు సరస్సును సమీపించెను. ఆ సరస్సు అంతులేని తామరపువ్వులతో నిండి అతి మనోహరముగా నుండెను. దిలీపుడూ అతని పరివారమూ, తృప్తిదీర నీరు త్రాగిరి. గట్టుపైన ఉన్న వట వృక్షం క్రింద అలసట తీర్చుకొనుచుండగా దిలీపుడు వేటలో చెల్లాచెదురుగా తరిమివేసిన పులులు, సింహాలు, అడవి పందులు మొదలగు జంతువులు కూడా ఆ సరస్సు వద్దకే వచ్చి చేరినవి. దిలీపుడు, అతని పరివారము వాటిని చూచి గురిపెట్టి, బాణములను వేసి చంపిరి. దిలీపుడు సంతోషించి వాటి చర్మాలను ఒలిపించి తన నగరమునకు బయలుదేరి వెళ్ళిపోవుచుండెను.


అటుల ఇంటిముఖం పెట్టి వెళ్ళుచున్న సమయమున మార్గమందు ఒక సద్బ్రాహ్మణుడు ఎదురయ్యెను. ఆ బ్రాహ్మణుడు బ్రహ్మ తేజస్సు గలిగి ప్రకాశించుచుండెను. ఆ విప్రుని చూడగానే దిలీపుడు ఆగి నమస్కరించి చేతులు జోడించి నిలబడియుండెను. ఆ బ్రాహ్మణుడును క్షణమాగి, ఆ రాజును గాంచి “ఈతని ముఖవర్చస్సు చూడగా గుణవంతునివలె నున్నాడు. ఈతని కేదయినా ఉపకారము చేయుట మంచిది” అని మనసులో తలచి – మహారాజా! శుభకరమైన ఈ మాఘమాసంలో సరస్సు దగ్గరలో ఉన్ననూ అందులో స్నానం చేయకుండా ఇంటికి పోవుచున్నావేమి? మాఘమాస మహాత్మ్యం నీకు తెలియదా!” అని ప్రశ్నించెను.


ఆ బ్రాహ్మణుని మాటలకు దిలీపుడు ఆశ్చర్యపడి ఆ వృద్ధ బ్రాహ్మణుని జూచి – “విప్రోత్తమా! అటుల ప్రశ్నించారేమిటి?” అని ఆశ్చర్యంతో పలికెను.


“పరమ పావనమైన మాఘమాసం కదా!” అని జ్ఞాపకం చేయుచుంటినని బ్రాహ్మణుడు పలికెను.


“చిత్తము స్వామీ! నాకు గుర్తులేదు. రాజప్రసాదమున నున్న పురోహితులు చెప్పియుందురు. నేను మృగయావినోదినై వచ్చి అడవిలో కొద్ది దినములుండుట వలన నాకా విషయం జ్ఞప్తి లేదు. కావున మాఘమాస మహాత్మ్యము నెరింగింప వలసినదిగా ప్రార్థించుచున్నా”నని దిలీపుడు వేడుకొనెను.


ఆ బ్రాహ్మణుడు దిలీపుని దీవించి “రాజా! సూర్యవంశపు గురువైన వశిష్ఠులవారు అప్పుడప్పుడు మీకడకు వచ్చుచుండును గదా! ఆతని వలన మాఘమాస మహాత్మ్యమును గురించి తెలుసుకొనుము. ఆ మహామునికి తెలియనిది ఏదియు లేదు. గాన అటుల చేయుము” అని చెప్పి బ్రాహ్మణుడు తన దారిని తాను పోయెను.```


*దిలీపుడు వశిష్ఠుని కడకుబోవుట*``` 


దిలీపుడు తన పరివారంతో నగరము జేరెను. పదేపదే బ్రాహ్మణుని మాటలు జ్ఞప్తికి తెచ్చుకొని ఎటులనో ఆ రాత్రి గడిపెను. మరునాడు ప్రాతఃకాలమున లేచి కాలకృత్యములు తీర్చుకొని మంచి ఉడుపులు, సకలాభరణములు ధరించి, మంత్రి, సామంతాదులతో వశిష్ఠుల వారి దర్శనమునకై వారి ఆశ్రమమునకు వెళ్ళెను.


ఆ సమయములో వశిష్ఠుల వారు తపమాచరించుకొనుచున్నారు. శిష్యులు వేదపఠనం గావించుచున్నారు. దిలీపుడు ఆ దృశ్యమును జూచి వారికి తపోభంగము కలుగనీయరాదనీ కొంతతడవు వేచియుండెను. దిలీప మహారాజుకు వశిష్ఠుల వారు గురుతుల్యులు. అందుచే గురుభక్తి మిక్కుటముగా నుండెను. మరికొంతసేపటికి వశిష్ఠుడు తపస్సునుండి లేచి రాజును కుశల ప్రశ్నలడిగి ఉచితాసనముపై కూర్చుండబెట్టి వచ్చిన రాజును కారణమేమని యడిగెను.


దిలీపుడు వశిష్ఠునితో “ఋషిసత్తమా! తమవలన నేను అనేక రాజధర్మములు పురాణేతిహాసములు విని సంతుష్టుడనైతిని. కానీ మాఘమాస మహాత్మ్యముగాని,దాని ధర్మములు గాని తెలియనందున ఆ విషయములు తమనుండి తెలుసుకొన గోరి తమ వద్దకు వచ్చితిని. గాన పరమ పావనమూ మంగళప్రదమూ అయిన మాఘమాస మహాత్మ్యమును వివరించవలసినదిగా కోరుచున్నాను” అనెను.


అవును మహారాజా నీవు కోరిన కోరిక సమంజసమైనదే. మాఘమాసము యొక్క మహాత్మ్యము ప్రతి ఒక్కరూ తెలుసుకొని తరించవలసిన యావశ్యకత ఎంతయినా గలదు. మాఘమాసముయొక్క మహాత్మ్యమును వర్ణింప నాకుకూడా శక్యముగాదు. ఇతర దినములలో చేయు క్రతువులు గాని, యాగములు గాని, ఇవ్వనంత ఫలము కేవలము మాఘమాసములో చేయునదీస్నానమువలన గొప్ప ఫలము కలుగును. అటువంటి ఫలము నిచ్చు మాఘమాసము అన్నివిధముల శుభప్రదమైనది. గాన యీ మాఘమాసమునందు చేయు నదీ స్నానమువలన మనుజుడు పుణ్యాత్ముడు అగుచున్నాడు. అంతియేగాదు. మాఘము అన్నివిధాలా పుణ్యప్రదమైనది.


అంతేకాక పుణ్యకార్యము వలన స్వర్గలోక ప్రాప్తి తాత్కాలికంగా కలుగును గాని మాఘ మాసములో సంపాదించిన ఫలము వలన శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగును. ఇంతకన్న మహత్తుగలది మరొకటి లేదు.```


 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

              🌷🙏🌷```


*మాఘపురాణం రెండవ* *అధ్యాయము సంపూర్ణము*


         *🌷సేకరణ🌷*

*న్యాయపతి నరసింహారావు*

శ్రీహరిస్తుతి 56*

  *శ్రీహరిస్తుతి 56* 


*గగనమ్మున విహరించగ*

*ఖగ వాహన విష్ణుమూర్తి గమనం బయ్యెన్*

*జగమంత తిరుగుచుండెను* 

*నగణితమగు శక్తి చూపి యసురుల జం*శ్రీ హరి స్తుతి 57*


*హరి నామము సంకీర్తన*

 *నిరతముగా చేయ మనసు నిర్మల మయ్యెన్*

*మరిపించును కష్టంబుల*

*స్థిరమగు సౌఖ్యంబుగల్గు దేవుని దయతో*


*పద్య కవితా శిల్పకళానిధి. మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు మిట్టాపల్లి*పెన్*

వేద ఆశీర్వచనం

  *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణము - శిశిర ఋతువు - మాఘ మాసం - శుక్ల పక్షం - ప్రతిపత్ - ఉత్తరాషాఢ -‌‌ ఇందువాసరే* (19.01.2026)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/5Lz5pks5vvM?si=CGD6V6l6VljO8Yqd


.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

శరీరం గురించి శివుడు

  మానవ శరీరం గురించి శివుడు పార్వతికి ఉపదేశించిన పరమ రహస్యాలు -

 

* స్వరం ఒకటి మూడు రూపములుగాను , అయిదు రూపములుగాను అగును. ఈ అయిదు మరలా ఒక్క రూపముగా అగును. మరలా అయిదు చొప్పున ఇరువైయిదు విధములుగా అగును.

 * శరీరం నందు స్వరం పుట్టును . స్వరము నందు నాడిపుట్టును. స్వర నాడుల స్వరూపం తెలియచేయుటకు శరీరం చెప్పబడుచున్నది.

 * శరీరం పిండం అనబడును. ఆ పిండం నందు శరీరం అణిగి ఉండును. శుక్ల శోణిత సమ్మితం అగు ఆ పిండం చైతన్యముతో కూడుకుని ఉండును.

 * ఆ శుక్ల శోణితములు నాలుగు దినముల వరకు ప్రతి దినము నందు సమ్మేళనం అగుచుండును. అయిదు దినములకు బుడగ వలే అగును. పది దినములకు నెత్తురు అగును. పదిహేను దినములకు మాంసం ముద్ద అగును.

 * ఇరువది దినములకు గట్టి మాంసం ముద్ద అగును. ఇరువైదు దినములకు సమాన రూపం అగును.

 * మొదటి నెల యందు పంచభూతములు కూడును. రెండొవ నెల యందు మేథస్సు కలుగును. మూడోవ నెల యందు ఎముకలు మజ్జ కలుగును. నాలుగోవ మాసము నందు అవయవములు జనించును.

 * అయిదోవ మాసము నందు రంధ్రములతో గూడిన చెవులు , ముక్కు, కన్నులు , నోరు మొదలగునవి జనించును. ఆరొవ మాసం నందు కంఠరంధ్రం , ఉదరం పుట్టును .

 * ఎడొవ మాసం నందు పుట్టిన శిశువు బ్రతుకును గాని అల్పాయువు లేదా అల్పబలము , క్షీణ థాతువు గల రోగి అగును.

 * ఎనిమిదోవ మాసము నందు పుట్టిన శిశువు ఏ విధముగానూ బ్రతకదు . తల్లి దేహము మరియు శిశువు దేహము నందు ప్రాణం తిరుగుచుండును . కావున తల్లి గాని శిశువు గాని బిడ్డ గాని మృతినొందును.

 * తొమ్మిదోవ మాసమున గర్భమునకు జ్ఞానము కలుగును. తొమ్మిదోవ మాసమున గాని పదోవ మాసమున గాని ప్రాణములతో పుట్టును .

 * స్త్రీలకు ఋతుదినము మొదలు 16 వ దినముల వరకు కళ హెచ్చి గర్భము నిలుచును. కావున సరి దినములలో స్త్రీతో గూడిన పురుష గర్బము , బేసిదినములలో గూడిన యెడల స్త్రీ గర్బము కలుగును.

 * పుత్ర సంతానం కోరువాడు సరి దినముల యందు ఋతు స్నానం చేసిన స్త్రీతో సంగమం జరుపవలెను. స్త్రీ యొక్క రేతస్సు అధికంగా ఉండి పురుషుని యొక్క వీర్యం తక్కువుగా ఉన్న ఆడ సంతానం కలుగును. పురుషుని వీర్యం ఎక్కువుగా ఉండి స్త్రీ రేతస్సు తక్కువుగా ఉన్న మగవాడు పుట్టును .

 * ఋతుస్నానం అయిన రాత్రి సంగమం వలన గర్బం నిలిచినచో పుట్టిన మగవాడు అల్పాయువు , దరిద్రుడు అగును. గర్బం అయిదోవ దినమున అయిన కూతురు మంచి పుత్రులు కలిగినదిగా ఉండును. ఆరొవ దినమున అయిన యెడల మధ్యమ గుణము కలవాడు అగును.

 * ఎడొవ దినమున అయిన యెడల పుత్రవతి యగు కూతురు , ఎనిమిదొవ దినమున మహదైశ్వర్య సంపన్నడగు కుమారుడు , తొమ్మిదోవ దినమున పతివ్రత అగు కూతురు , పదొవ దినమున మంచి కుమారుడు పుట్టును . ఈ విధముగా ఒక్కొ దినముకు ఒక్కొ ప్రాముఖ్యత సంతానం విషయంలో ఉండును.

 * ఎముకలు , మెదడు , వీర్యం ఇవి తండ్రి నుంచి సంక్రమించును. నెత్తురు , రోమములు , మాంసం తల్లి నుంచి సంక్రమించును.

 * రోమములు , చర్మము , ఎముకలు , మాంసము ఇవి పృథ్వి అంశములు , శుక్లము, పురీషము , మూత్రము , నిద్ర ఆలస్యము ఇవి ఉదక అంశములు .

 * ఆకలి , దప్పిక , దేహకాంతి ఇవి తేజస్సు యొక్క అంశములు , ముడుచుకొనుట , చాచుకొనుట , పారుట, కదులుట, వణుకుట, నిలుచొనుట ఇవి వాయు అంశములు. కోపం , సిగ్గు , భయం , మోహం ఇవి ఆకాశం యొక్క అంశములు .

 * నాలిక , చర్మము , చెవులు , ముక్కు , కన్నులు ఈ అయిదు జ్ఞానేంద్రియములు , ఉపస్థము , ఆసనం , వాక్కు , హస్తములు , పాదములు ఇవి కర్మేంద్రియాలు .

 * మూలాధారం నందు నాలుగు దళముల పద్మము , యోని నందు ఆరు దళముల పద్మము , నాభి యందు పది దళముల పద్మము , హృదయము నందు పండ్రెండు దళముల పద్మము ఉండును.

 * కంఠము నందు పదహారు దళముల పద్మము , కనుబొమ్మల నడుమ రెండు దళముల పద్మము , బ్రహ్మ రంధ్రము నందు వేయి దళముల పద్మము ఉండును.

 * ఈ ఏడు పద్మములును సప్తచక్రములు అనబడును. దేహమునందు ఉండు నాడులు అనేక రూపాలుగా విస్తారంగా ఉండును. ఇవి పెద్దలైన యోగ గురువులచేత ఆత్మజ్ఞాన నిమిత్తం తెలుసుకొనవలెను.

 * సప్త ద్వీపములు , ఇరువదియేడు నక్షత్రములు , నవగ్రహములు వీనిని శరీరం నందు తెలుసుకొనిన వాడే గురుడు అనబడును.

 * నాభికి దిగువును మీదను మొలకల వలే బయలుదేరి డెబ్భైరెండువేల నాడులు దేహ మధ్యంబు ఉండును.

 * అడ్డముగా , పొడుగుగా , క్రిందగా దేహం మొత్తం వ్యాపించి చక్రముల వలే సకలమై సిరలు తిరుగుచూ ప్రాణం ఆశ్రయించి యుండును.

 * నాభికి దిగువుగా కుండలిని స్థానం నందు సర్పాకృతిగా ఒక నాడియు మీదుగా పది నాడులు కిందగా పది నాడులు ఉండును.

 * సూక్షముఖములు అగు ఆ నాడుల నడుమ ఉత్తమమైన చక్రం ఒకటి ఉన్నది . అందు ఇడా , పింగళ , సుషుమ్న అను మూడు నాడులు కలవు.

 * ఆ నాడులలో సూక్ష్మ ముఖములు అగు ముఖ్యమైన నాడులు పది ఉన్నవి. వాటి పేర్లు వరసగా ఇడ, పింగళ , సుషమ్న , గాంధారి , హస్తి, జిహ్వ, పూషలము , భూషితము , కుహక , శంఖిని , శారద అనునవి కలవు. వాటిలో ఇడ , పింగళ నాడులు వాయువునెల్లప్పుడు వహించి ఉండును. 

 * సుషమ్న నాడి కాల మార్గముచే బ్రహ్మ రంధ్రము నందు ఉండును. పూషలము , భూషితము అను నాడులు నేత్రముల యందు ఉండును.

 * గాంధారి , హస్తిజిహ్వ ఈ రెండును చెవి ద్వారము నందు ఉండును. కుహక గుదస్థానం నందు , శంఖిని లింగ రంధ్రము నందు ఉండును. శారద నోటి యందు ఉండును.

 * మానవ శరీరం నందు ప్రాణము , అపానము , సమానము , ఉదానము , వ్యానము , నాగము , కూర్మము , కృకరము , దేవదత్తము , ధనుంజయము అనే పది రకాల వాయువులు ఉండును.

 * పైన చెప్పిన ఆ పది నాడులలో ముఖ్యమైన ప్రాణవాయువు నాభిగుహ యందు ఉండినదై ముఖం , నాసిక , హృదయము , నాభి ఈ నాలుగు స్థలముల యందు సంచరించుచుండును. నాభి యందు శబ్దము , నోటి యందు ఉచ్చరణం , ముక్కున ఉచ్చ్వాస నిశ్వాసములు , హృదయము నందు దగ్గు వీనిని పుట్టించును .

 * అపానవాయువు , పిరుదులు , పిక్కలు వీనికి మధ్యభాగమునను , గుదము , లింగము , నాభి , వృషణము , తొడలు , మోకాళ్లు స్థానముల యందును ఉండును. ఈ అపాన వాయవు మలమూత్రాదులను బయటకి పంపును .

 * వ్యాన వాయవు కన్నులు , చెవులు , కాలి మడములు , పిరుదు , ముక్కు , ఈ స్థానముల యందు ఉండును. ఈ వ్యాన వాయవు ప్రాణాపాన వాయువులను వెలుపలికి పోవునట్లు లోపలికి వచ్చునట్లు చేయును .

 * సమాన వాయవు శరీరం నందు నాభిస్థానం నందు ఉండి జఠరాగ్నితో గూడి డెబ్బైరెండువేల నాడీ రంధ్రముల యందు ఉండును. భుజించబడిన , తాగబడిన పదార్ధాల రసములను దేహమున వ్యాపింపచేసి దేహపుష్టిని కలుగచేయును .

 * ఉదానవాయువు కంఠం నందు ఉండి చేతులు , కాళ్లు మొదలైన అంగాల సంధుల యందు వ్యాపించి చాచుట, ముడుచుకొనుట మొదలగు కార్యములు నిర్వర్తించును.

 * ధనుంజయ వాయవు వలన ఘోషము , మాటలాడుట నాగము వలన , ఆవులింత దేవదత్తం వలనను , తుమ్ము కృకరము వలనను , కన్ను మూసి తెరచుట కూర్మం వలనను కలుగును. మనిషి మరణించిన తరువాత దేహం ఉబ్బిపోవుటకు కూడా ఈ ధనుంజయ వాయవు కారణం. 

         మరిన్ని మానవ శరీరానికి సంబంధించిన పరమ రహస్యాలగు యోగ కారక విషయాలు తరవాతి పోస్టులలో తెలియచేస్తాను.

 

  

  

 ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


గమనిక -

      

నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 

   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  

  

                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

     

. ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .

          

. కాళహస్తి వేంకటేశ్వరరావు  

       అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

                  9885030034