25, మార్చి 2026, బుధవారం

మహాభారతము

  🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*

``

               *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

సరళ వ్యావహారిక భాషలో!

                       1️⃣7️⃣5️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


        *సంపూర్ణ మహాభారతము*            

                    *175 వ రోజు*                   

*విరాట పర్వము ద్వితీయాశ్వాసము*


*నర్తనశాల*```


ఇద్దరూ నర్తనశాలను చేరుకున్నారు. నర్తనశాలలో ఒక పక్కగా ఉత్తర పడుకునే పాన్పు మీద భీముడు పడుకున్నాడు. ద్రౌపది ఆ పక్కనే కనపడకుండా దాక్కున్నది. ఇంతలో కీచకుడు మధ్యం సేవించి మత్తుగా అక్కడకు వచ్చాడు. మాలిని అప్పటికే అక్కడికి వచ్చి ఉంటుందని అనుకున్నాడు. మంచంలో పడుకున్న భీముని చూసి పిచ్చివాడై తన చేతిని ఆ శయ్య పై వేసాడు. భీమునికి పట్టరాని కోపం వచ్చింది. కీచకుడు భీమునిపై చేయి వేసి “మాలినీ! నీ కోసం ఎన్నో కానుకలు తెచ్చాను. ఇంత వరకు నా కోసం వచ్చే స్త్రీలు నాకు కానుకలు సమర్పించే వారు. నన్ను చూసిన స్త్రీలు మరొకరిని కన్నెత్తి చూడరు. నా కోసమే తపిస్తారు. అలాంటిది నేను నీకోసం తపిస్తున్నాను” అన్నాడు కీచకుడు. 


భీముడు కూడా స్త్రీ సహజమైన గొంతుతో “మిమ్మల్ని మీరు పొగుడు కుంటున్నారు కాని అసలు నా వంటి స్త్రీ మీకు దొరుకునా. నా శరీరానికి నీశరీరం తగిలినప్పుడు కలిగే అనుభూతి తెలుసుకుంటావులే. నన్ను తాకిన నీకు మరొకరిని తాకే పని ఉండదులే. నన్ను తాకిన ఫలితం అనుభవిస్తావులే” అని తటాలున పైకి లేచాడు. కీచకుని తల పట్టుకుని వంచాడు. కీచకుడు మాలిని భర్త గంధర్వుడు వచ్చాడు అనుకున్నాడు. భీముని పట్టు విడిపించుకుని కింద పడవేసి మోకాళ్ళతో అదిమాడు.

```

*కీచక భీములపోరాటం*```


ఇరువురి మధ్య భయంకర యుద్ధం సాగింది. ఒకరిని మించి ఒకరు పోరాడుతున్నారు. ఇరువురిలో కొంత భయం ఉంది పరువు పోతుందని కీచకుడు, అజ్ఞాతవాస భంగం ఔతుందేమోనని భీముడు మౌనంగా యుద్ధం చేస్తున్నారు. 


క్రమంగా కీచకుని బలంతగ్గి పోయింది భీన్మసేనుని బలం ద్విగుణీకృతం అయింది. ఆ విషయం గ్రహించిన భీముడు కీచకుని ఉదరభాగంలో భయంకరంగా పొడిచాడు. ఆ దెబ్బకు కీచకుడు విలవిలా తన్నుకున్నాడు. కీచకుని దారుణంగా చంపాలనుకున్న భీముడు కీచకుని తలని, కాళ్ళను, చేతులను మొండెంలోకి జొనిపి నేల మీద వేసి పొర్లించి నలిపి మాంసం ముద్దగా చేసాడు. కీచకుడు మరణించాడు. భీముడు ద్రౌపదిని పిలిచి కీచకుని శవాన్ని చూపించాడు. ద్రౌపది ఆనందంగా చూసింది. ఆమె మనసులో “కీచకా! ఇందుకా ఈ సుఖం పొందటానికా ఇంతగా ఆరాట పడ్డావు” అనుకున్నది. 


భీముడు “ద్రౌపదీ! నీ మాట నెరవేర్చాను ఆనందమేగా. నిన్ను ఎవరైనా దుర్బుద్ధితో చూస్తే వారికి 

నా భుజబలంతో ఇలాంటి మరణాన్ని ప్రసాదిస్తానని తెలుసుకున్నావా. నీ మనసు శాంతించింది కదా” అన్నాడు. 


ద్రౌపది ఆనందంతో “నిన్న కొలువులో కీచకుడు నన్ను అవమానించినప్పుడు నీవు చూపిన నిగ్రహం మెచ్చతగినది. ఈ నాడు ఇలా మరొకరి సాయం లేక కీచకుని వధించిన నీ శౌర్యం కొనియాడ నా తరమా భీమసేనా” అన్నది. 


ద్రౌపది మాటలకు భీముడు పొంగి పోయాడు. అతనిలో వివేకం మేలుకొంది. ద్రౌపదీ “ఇక నేను ఇక్కడ ఉండటం మంచిది కాదు వెళుతున్నాను" అని చెప్పి వడివడిగా వంటశాలవైపు వెళ్ళాడు.

```

  ``

*విరాట పర్వము..* *ద్వితీయాశ్వాసము సమాప్తం*


              *సశేషం*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

             🌷🙏🌷```


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

మహావిష్ణు పురాణం*

 🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*


       *శ్రీ మహావిష్ణు పురాణం*

         *36 - 37వ భాగం*


*ధ్రువ చరిత్ర*```


ప్రస్తుత బ్రహ్మ జీవితకాలంలో భూమండలాన్ని పద్నాలుగు మంది మనువుల పరిపాలిస్తారు. వారిలో స్వాయంభువ మనువు మొదటి వాడు. స్వాయంభువ మనువుకి శతరూపకు ప్రియవ్రతుడు, ఉత్తాన పాదుడు అనే ఇద్దరు కుమారులు జన్మించారు. ఉత్తానపాదునికి ఇద్దరు భార్యలు. పెద్దభార్య సురుచికి ఉత్తముడు, రెండవ భార్య సునీతికి ధ్రువుడు పుత్రులుగా జన్మించారు.


ఉత్తానపాదుడు పెద్దభార్య సురుచికిపై ఎక్కువ ప్రేమ చూపిస్తూ చిన్న భార్య సునీతిని దూరంగా ఉంచేవాడు. పెద్దభార్య కుమారుడు ఉత్తముడికి అధిక ప్రాధాన్యత ఇచ్చేవాడు. చిన్నభార్య సునీతి గమనించి తన కుమారుడు ధ్రువునికి నారాయణుని పై భక్తి అలవాటు చేసింది. అయినా ధ్రువునికి మనస్సులో తండ్రి ప్రేమాభిమానాలు పొందాలని, తండ్రి ఒడిలో కూర్చుని ఆడుకోవాలి అని ఉండేది.


ఒకరోజు సింహాసనంపై ఉత్తానపాదుడు తన పెద్ద కుమారుడు ఉత్తముని ఊరువు(తొడ)పై కూర్చుండబెట్టుకుని ప్రేమతో లాలిస్తూ ఆడించసాగాడు. అది చూసిన ధ్రువుడు తనూ తండ్రి ఒడిలో కూర్చుని ఆడుకోవాలి అని పరిగెత్తుకుంటూ దగ్గరకు వెళ్లాడు. పెద్దరాణి సురుచి చూసి పట్టుకుని ఆపి “ధ్రువా! ఉత్తముడు పట్టపురాణి అయిన నా కుమారుడు కనుక సామ్రాజ్యానికి వారసుడు. చక్రవర్తి అంకపీఠంపై(తొడపై) కూర్చునేందుకు అర్హత ఉంది. నీవు నా సవతి కుమారుడివి. కనుక రాజ్యార్హత, తండ్రి ఒడిలో కూర్చుని ప్రేమాభిమానాలు పొందే అర్హత, అధికారం నీకు లేదు" అని కసిరి వెళ్లిపొమ్మంది. 


తండ్రి ఉత్తానపాదుడు మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. 


బాలుడైన ధ్రువుడు దుఖంతో తల్లి వద్దకు వెళ్లి జరిగింది చెప్పి ఏడవసాగాడు. తల్లి సునీతి ధ్రువుని కన్నీరు తుడిచి "లోకంలో అందరికి నారాయణుడు వారి పూర్వజన్మ కర్మ ఫలాల బట్టి సుఖాలు, అదృష్టాలు, అర్హతలు ప్రసాదిస్తాడు. మీ పెద్దమ్మ కుమారుడు ఉత్తముడు పూర్వజన్మ పుణ్య ఫలం వలన పట్టపురాణికి పుట్టి తండ్రి ప్రేమాభిమానాలు, రాజార్హత సంపాదించాడు. నీవు నావంటి దురదృష్టరాలికి పుట్టావు. ఇంతే ప్రాప్తం అని సర్దుకుపోవాలి" అంటూ ఓదార్చింది.


తల్లి మాటల వలన ధ్రువునికి నారాయణుడి అనుగ్రహం సంపాదిస్తే తన తలరాత మారి తండ్రి ప్రేమాభిమానాలు లభిస్తాయి అని అర్థమైంది. 


వెంటనే లేచి తల్లికి నమస్కరించి “అమ్మా! నేను తపస్సు చేసి నారాయణుని అనుగ్రహం పొంది తండ్రి ప్రేమాభిమానాలు సంపాదించుకుంటాను. ఆశీర్వదించి అనుమతి ఇవ్వండి" అని కోరాడు. 


కుమారుని మాటల్లో గల ధృఢ సంకల్పం గ్రహించి సునీతి ఆశీర్వదించి అనుమతిచ్చింది.


ధ్రువుడు అడవికి తపస్సుకి బయలుదేరి వెళ్లాడు. 


పూర్వజన్మ పుణ్య ఫలం వలన ధ్రువునికి మార్గ మధ్యలో నారదుడు, సప్తర్షుల దర్శన భాగ్యం కలిగింది. వారు బాలుడైన ధ్రువుని వివరాలు తెలుసుకుని అతని ధృడ సంకల్పం విని సంతోషం చెందారు. నారాయణుని అష్టాక్షరి మహామంత్రం ‘ఓం నమో నారాయణాయ’ ను నారదుడు విధి పూర్వకంగా ఉపదేశం చేశాడు. 


“నాయనా! ధ్రువా! భక్తి శ్రద్థలతో ఈ నారాయణ మంత్ర జపం చేస్తూ తపస్సు చేయుము. నారాయణుడి అనుగ్రహం తప్పక లభిస్తుంది" అని ఆశీర్వదించి వెళ్ళారు.  


ధ్రువుడు అడవిలో సరోవరం సమీపంలో మంచి ప్రదేశం చూసుకుని శుచియై తపస్సుకి కూర్చున్నాడు. నారాయణుని చిత్తములో నిలుపుకుని ధ్యానమగ్నుడై తపస్సు చేయసాగాడు.


కాలము, ఆకలిదప్పులను మరచిపోయాడు. ధ్రువుని తపస్సు యొక్క తేజస్సు క్రమ క్రమంగా పెరిగి ముల్లోకాలకు వ్యాపించి దహించసాగింది. దేవలోకము కంపించింది. దేవేంద్రుడు ధ్రువుని తపస్సు ఆపదలు కలిగిస్తుంది అని తలచి దిక్పాలకులను పిలిచి తపస్సు భంగం చేయమని ఆదేశించాడు. 


వరుణుడు కుంభవృష్టి కురిపించాడు.. వాయుదేవుడు సుడిగాలి ప్రభంజనాలు సృష్టించాడు. అగ్నిదేవుడు దావానలం సృష్టించి అడవిని దహనం చేశాడు. 


యముడు భయపెట్టాలని భూత ప్రేతాలు, భయంకర సర్పాలు ప్రయోగించాడు. 


ధృవుని చుట్టూ తపోతేజస్సు వలన ఏర్పడ్డ శక్తి వలయం వేటినీ దగ్గరికి రాకుండా, ధ్రువుని తపస్సుకి భంగం చేయకుండా చూసింది.  


ఆగ్రహం చెందిన ఇంద్రుడు వజ్రాయుధం ప్రయోగించాడు. అది కూడా ధ్రువుని చుట్టు ఏర్పడిన తేజోవలయం దాటలేక వెనక్కు తిరిగి వచ్చింది. భయపడిన ఇంద్రుడు వైకుంఠం పరిగెత్తుకుంటూ వెళ్లి నారాయణుని దర్శనం పొంది నమస్కరించి


"నారాయణా! ధ్రువుడి తపస్సు వలన కలిగే అగ్ని ముల్లోకాలను దహిస్తోంది. తపస్సు భంగం చేయాలన్న దిక్పాలకుల ప్రయత్నాలు విఫలం అయ్యాయి. నా వజ్రాయుధం కూడా ఏమి చేయలేక వెనక్కు వచ్చింది. నీవు ధ్రువుని అనుగ్రహించి తపస్సు ఆపకపోతే ముల్లోకాలు ఆ పసివాడి తపశక్తికి కాలి బూడిదై పోతాయి. మమ్మల్ని, లోకాలను రక్షింపుము" అని ప్రార్ధించాడు.


ఇంద్రునికి అభయమిచ్చి పంపి నారాయణుడు ధ్రువుని తపస్సుకి మెచ్చి అతని ఎదుట ప్రత్యక్షమై "కుమారా! ధ్రువా! నీ భక్తికి ప్రసన్నత చెంది వచ్చాను. కన్నులు తెరువుము" అని అప్యాయంగా పిలిచాడు. ధ్రువునికి దివ్యదృష్టి లభించి కన్నులు తెరచి చతుర్భుజుడు, ముగ్ద మనోహరుడు అయిన నారాయణుని చూసి పరవశించి పోయాడు. కన్నుల నుండి ఆనందబాష్పాలు జలజలా జారుతున్నాయి.


"తండ్రీ! నారాయణా! నన్ను అనుగ్రహించి దర్శన భాగ్యం కలిగించావు. నా తల్లి వర్ణించినట్టు నీ దివ్య సుందర రూపం ఉంది. ఓం నమో నారాయణాయ" అని పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు. శ్రీహరి ప్రేమతో ధ్రువుని లేపి దగ్గరకు తీసుకుని "ధ్రువా! కోరుకో నాయనా! కోరినవన్నీ అనుగ్రహిస్తాను" అని పలికాడు.


ఆనందబాష్పాలు ఆపుకుంటూ భక్తి తన్మయత్వంతో "నారాయణా! నా సవతి తల్లి సురుచి చేసిన అవమానం భరించలేక నీ అనుగ్రహంతో తండ్రి ప్రేమాభిమానాలు, రాజ్యాధిపత్యం పొందాలని తపస్సు ఆరంభించాను. నీ దివ్య దర్శనంతో నాలోని కోరికలన్ని నశించి పోయాయి. సదా నీ సన్నిధిలో ఉండే దర్శనం పొందే భాగ్యం కలిగించుము" అని కోరుకున్నాడు.


నారాయణుడు మందహాసంతో "ధ్రువ కుమారా! భూమిపై జన్మించినవారు పూర్వజన్మల కర్మఫలం పూర్తిగా అనుభవించిన తరువాతే మోక్షము పొందగలరు. భూమి మీద సకల సంపదలు, సుఖములు, రాజ్యాధికారం అనుభవించుము. పిదప గ్రహనక్షత్ర మండలంలో అత్యున్నతమైన ధృవమండలంలో ధ్రువ నక్షత్రమై నీ తల్లితో కలసి ఉంటావు. ధ్రువ నక్షత్రంగా విశ్వానికి మార్గదర్శనం చేస్తూ కీర్తి ప్రతిష్టలు పొందుతావు. కల్పాంతంలో మోక్షం లభించి నా సన్నిధి చేరుతావు" అని ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు.


ధ్రువుడు యుక్తవయసు రాగానే శంభువు అనే కన్యను వివాహమాడి శ్లిష్ట, భవ్యుడు అనే ఇద్దరు కుమారులను పొందాడు. ధ్రువ వంశం వీరి ద్వారా వృద్ధి చెందింది. అంగుడు, సమనుడు, అంగిరసుడు, శిబి చక్రవర్తి మొదలైన వారు ఈ వంశములో జన్మించారు..


*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

26మార్చి2026🌹* *దృగ్గణిత పంచాంగం*

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

   *🌷గురువారం🌷*

*🌹26మార్చి2026🌹*  

 *దృగ్గణిత పంచాంగం*                                        

   

           *స్వస్తి శ్రీ పరాభవ* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - వసంత ఋతౌః*

*చైత్రమాసం - శుక్ల పక్షం* 


*తిథి : అష్టమి* ఉ 11.48 వరకు ఉపరి *నవమి*  

*వారం    : గురువారం* (బృహస్పతివాసరే)

*నక్షత్రం  : ఆరుద్ర* సా 04.19 వరకు ఉపరి *పునర్వసు*

*యోగం : శోభన* రా 12.32 వరకు ఉపరి *అతిగండ*

*కరణం  : బవ* ఉ 11.48 *బాలువ* రా 10.55 ఉపరి *కౌలువ*

*సాధారణ శుభ సమయాలు:* 

*ఉ 09.00-10.00 & 11.00-12.00 సా 04.00-06.00*               

అమృత కాలం  : *ఉ 06.50 - 08.21*

అభిజిత్ కాలం  : *ప 11.49 - 12.38*

*వర్జ్యం    : రా 03.51 - 05.24 తె*

*దుర్ముహూర్తం  : ఉ 10.11 - 11.00 మ 03.04 - 03.53*

*రాహు కాలం   :మ 01.45-03.16*

గుళికకాళం      : *ఉ 09.10 - 10.42*

యమగండం    : *ఉ 06.07 - 07.39*

సూర్యరాశి : *మీనం*                     

చంద్రరాశి : *మిధునం*

సూర్యోదయం :*ఉ 06.16*  

సూర్యాస్తమయం :*సా 06.28*

*ప్రయాణశూల   : దక్షిణ దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం      :*ఉ 06.07- 08.34*

సంగవ కాలం      :*08.34 - 11.00*

మధ్యాహ్న కాలం    :*11.00 - 01.26*

అపరాహ్న కాలం :*మ 01.26-03.53*

*ఆబ్ధికం తిధి    : చైత్ర శుద్ధ నవమి*

సాయంకాలం    :*సా03.53- 06.19*

ప్రదోష కాలం      :*సా 06.19- 08.41*

రాత్రి కాలం        :*రా 08.41 - 11.49*

నిశీధి కాలం        :*రా 11.49- 12.36*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.32 - 05.19*

¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤

         *🌷ప్రతినిత్యం*🌷

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*!!.ఓం శ్రీ గురు దత్తాయ నమః.!!*


*శత్రునాశకరం స్తోత్రం* 

*జ్ఞానవిజ్ఞానదాయకమ్*

*సర్వపాపం శమం యాతి* 

*దత్తాత్రేయ నమోఽస్తుతే*

           

*ఓం శ్రీ దత్తాత్రేయ నమః*


🌷🪷🌹🛕🌹🌷🪷🌷

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

*శ్రీ మహావిష్ణు పురాణం*

 🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*బుధవారం 25 మార్చి 2026*


       *శ్రీ మహావిష్ణు పురాణం*

         *36 - 37వ భాగం*


*ధ్రువ చరిత్ర*```


ప్రస్తుత బ్రహ్మ జీవితకాలంలో భూమండలాన్ని పద్నాలుగు మంది మనువుల పరిపాలిస్తారు. వారిలో స్వాయంభువ మనువు మొదటి వాడు. స్వాయంభువ మనువుకి శతరూపకు ప్రియవ్రతుడు, ఉత్తాన పాదుడు అనే ఇద్దరు కుమారులు జన్మించారు. ఉత్తానపాదునికి ఇద్దరు భార్యలు. పెద్దభార్య సురుచికి ఉత్తముడు, రెండవ భార్య సునీతికి ధ్రువుడు పుత్రులుగా జన్మించారు.


ఉత్తానపాదుడు పెద్దభార్య సురుచికిపై ఎక్కువ ప్రేమ చూపిస్తూ చిన్న భార్య సునీతిని దూరంగా ఉంచేవాడు. పెద్దభార్య కుమారుడు ఉత్తముడికి అధిక ప్రాధాన్యత ఇచ్చేవాడు. చిన్నభార్య సునీతి గమనించి తన కుమారుడు ధ్రువునికి నారాయణుని పై భక్తి అలవాటు చేసింది. అయినా ధ్రువునికి మనస్సులో తండ్రి ప్రేమాభిమానాలు పొందాలని, తండ్రి ఒడిలో కూర్చుని ఆడుకోవాలి అని ఉండేది.


ఒకరోజు సింహాసనంపై ఉత్తానపాదుడు తన పెద్ద కుమారుడు ఉత్తముని ఊరువు(తొడ)పై కూర్చుండబెట్టుకుని ప్రేమతో లాలిస్తూ ఆడించసాగాడు. అది చూసిన ధ్రువుడు తనూ తండ్రి ఒడిలో కూర్చుని ఆడుకోవాలి అని పరిగెత్తుకుంటూ దగ్గరకు వెళ్లాడు. పెద్దరాణి సురుచి చూసి పట్టుకుని ఆపి “ధ్రువా! ఉత్తముడు పట్టపురాణి అయిన నా కుమారుడు కనుక సామ్రాజ్యానికి వారసుడు. చక్రవర్తి అంకపీఠంపై(తొడపై) కూర్చునేందుకు అర్హత ఉంది. నీవు నా సవతి కుమారుడివి. కనుక రాజ్యార్హత, తండ్రి ఒడిలో కూర్చుని ప్రేమాభిమానాలు పొందే అర్హత, అధికారం నీకు లేదు" అని కసిరి వెళ్లిపొమ్మంది. 


తండ్రి ఉత్తానపాదుడు మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. 


బాలుడైన ధ్రువుడు దుఖంతో తల్లి వద్దకు వెళ్లి జరిగింది చెప్పి ఏడవసాగాడు. తల్లి సునీతి ధ్రువుని కన్నీరు తుడిచి "లోకంలో అందరికి నారాయణుడు వారి పూర్వజన్మ కర్మ ఫలాల బట్టి సుఖాలు, అదృష్టాలు, అర్హతలు ప్రసాదిస్తాడు. మీ పెద్దమ్మ కుమారుడు ఉత్తముడు పూర్వజన్మ పుణ్య ఫలం వలన పట్టపురాణికి పుట్టి తండ్రి ప్రేమాభిమానాలు, రాజార్హత సంపాదించాడు. నీవు నావంటి దురదృష్టరాలికి పుట్టావు. ఇంతే ప్రాప్తం అని సర్దుకుపోవాలి" అంటూ ఓదార్చింది.


తల్లి మాటల వలన ధ్రువునికి నారాయణుడి అనుగ్రహం సంపాదిస్తే తన తలరాత మారి తండ్రి ప్రేమాభిమానాలు లభిస్తాయి అని అర్థమైంది. 


వెంటనే లేచి తల్లికి నమస్కరించి “అమ్మా! నేను తపస్సు చేసి నారాయణుని అనుగ్రహం పొంది తండ్రి ప్రేమాభిమానాలు సంపాదించుకుంటాను. ఆశీర్వదించి అనుమతి ఇవ్వండి" అని కోరాడు. 


కుమారుని మాటల్లో గల ధృఢ సంకల్పం గ్రహించి సునీతి ఆశీర్వదించి అనుమతిచ్చింది.


ధ్రువుడు అడవికి తపస్సుకి బయలుదేరి వెళ్లాడు. 


పూర్వజన్మ పుణ్య ఫలం వలన ధ్రువునికి మార్గ మధ్యలో నారదుడు, సప్తర్షుల దర్శన భాగ్యం కలిగింది. వారు బాలుడైన ధ్రువుని వివరాలు తెలుసుకుని అతని ధృడ సంకల్పం విని సంతోషం చెందారు. నారాయణుని అష్టాక్షరి మహామంత్రం ‘ఓం నమో నారాయణాయ’ ను నారదుడు విధి పూర్వకంగా ఉపదేశం చేశాడు. 


“నాయనా! ధ్రువా! భక్తి శ్రద్థలతో ఈ నారాయణ మంత్ర జపం చేస్తూ తపస్సు చేయుము. నారాయణుడి అనుగ్రహం తప్పక లభిస్తుంది" అని ఆశీర్వదించి వెళ్ళారు.  


ధ్రువుడు అడవిలో సరోవరం సమీపంలో మంచి ప్రదేశం చూసుకుని శుచియై తపస్సుకి కూర్చున్నాడు. నారాయణుని చిత్తములో నిలుపుకుని ధ్యానమగ్నుడై తపస్సు చేయసాగాడు.


కాలము, ఆకలిదప్పులను మరచిపోయాడు. ధ్రువుని తపస్సు యొక్క తేజస్సు క్రమ క్రమంగా పెరిగి ముల్లోకాలకు వ్యాపించి దహించసాగింది. దేవలోకము కంపించింది. దేవేంద్రుడు ధ్రువుని తపస్సు ఆపదలు కలిగిస్తుంది అని తలచి దిక్పాలకులను పిలిచి తపస్సు భంగం చేయమని ఆదేశించాడు. 


వరుణుడు కుంభవృష్టి కురిపించాడు.. వాయుదేవుడు సుడిగాలి ప్రభంజనాలు సృష్టించాడు. అగ్నిదేవుడు దావానలం సృష్టించి అడవిని దహనం చేశాడు. 


యముడు భయపెట్టాలని భూత ప్రేతాలు, భయంకర సర్పాలు ప్రయోగించాడు. 


ధృవుని చుట్టూ తపోతేజస్సు వలన ఏర్పడ్డ శక్తి వలయం వేటినీ దగ్గరికి రాకుండా, ధ్రువుని తపస్సుకి భంగం చేయకుండా చూసింది.  


ఆగ్రహం చెందిన ఇంద్రుడు వజ్రాయుధం ప్రయోగించాడు. అది కూడా ధ్రువుని చుట్టు ఏర్పడిన తేజోవలయం దాటలేక వెనక్కు తిరిగి వచ్చింది. భయపడిన ఇంద్రుడు వైకుంఠం పరిగెత్తుకుంటూ వెళ్లి నారాయణుని దర్శనం పొంది నమస్కరించి


"నారాయణా! ధ్రువుడి తపస్సు వలన కలిగే అగ్ని ముల్లోకాలను దహిస్తోంది. తపస్సు భంగం చేయాలన్న దిక్పాలకుల ప్రయత్నాలు విఫలం అయ్యాయి. నా వజ్రాయుధం కూడా ఏమి చేయలేక వెనక్కు వచ్చింది. నీవు ధ్రువుని అనుగ్రహించి తపస్సు ఆపకపోతే ముల్లోకాలు ఆ పసివాడి తపశక్తికి కాలి బూడిదై పోతాయి. మమ్మల్ని, లోకాలను రక్షింపుము" అని ప్రార్ధించాడు.


ఇంద్రునికి అభయమిచ్చి పంపి నారాయణుడు ధ్రువుని తపస్సుకి మెచ్చి అతని ఎదుట ప్రత్యక్షమై "కుమారా! ధ్రువా! నీ భక్తికి ప్రసన్నత చెంది వచ్చాను. కన్నులు తెరువుము" అని అప్యాయంగా పిలిచాడు. ధ్రువునికి దివ్యదృష్టి లభించి కన్నులు తెరచి చతుర్భుజుడు, ముగ్ద మనోహరుడు అయిన నారాయణుని చూసి పరవశించి పోయాడు. కన్నుల నుండి ఆనందబాష్పాలు జలజలా జారుతున్నాయి.


"తండ్రీ! నారాయణా! నన్ను అనుగ్రహించి దర్శన భాగ్యం కలిగించావు. నా తల్లి వర్ణించినట్టు నీ దివ్య సుందర రూపం ఉంది. ఓం నమో నారాయణాయ" అని పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు. శ్రీహరి ప్రేమతో ధ్రువుని లేపి దగ్గరకు తీసుకుని "ధ్రువా! కోరుకో నాయనా! కోరినవన్నీ అనుగ్రహిస్తాను" అని పలికాడు.


ఆనందబాష్పాలు ఆపుకుంటూ భక్తి తన్మయత్వంతో "నారాయణా! నా సవతి తల్లి సురుచి చేసిన అవమానం భరించలేక నీ అనుగ్రహంతో తండ్రి ప్రేమాభిమానాలు, రాజ్యాధిపత్యం పొందాలని తపస్సు ఆరంభించాను. నీ దివ్య దర్శనంతో నాలోని కోరికలన్ని నశించి పోయాయి. సదా నీ సన్నిధిలో ఉండే దర్శనం పొందే భాగ్యం కలిగించుము" అని కోరుకున్నాడు.


నారాయణుడు మందహాసంతో "ధ్రువ కుమారా! భూమిపై జన్మించినవారు పూర్వజన్మల కర్మఫలం పూర్తిగా అనుభవించిన తరువాతే మోక్షము పొందగలరు. భూమి మీద సకల సంపదలు, సుఖములు, రాజ్యాధికారం అనుభవించుము. పిదప గ్రహనక్షత్ర మండలంలో అత్యున్నతమైన ధృవమండలంలో ధ్రువ నక్షత్రమై నీ తల్లితో కలసి ఉంటావు. ధ్రువ నక్షత్రంగా విశ్వానికి మార్గదర్శనం చేస్తూ కీర్తి ప్రతిష్టలు పొందుతావు. కల్పాంతంలో మోక్షం లభించి నా సన్నిధి చేరుతావు" అని ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు.


ధ్రువుడు యుక్తవయసు రాగానే శంభువు అనే కన్యను వివాహమాడి శ్లిష్ట, భవ్యుడు అనే ఇద్దరు కుమారులను పొందాడు. ధ్రువ వంశం వీరి ద్వారా వృద్ధి చెందింది. అంగుడు, సమనుడు, అంగిరసుడు, శిబి చక్రవర్తి మొదలైన వారు ఈ వంశములో జన్మించారు..


*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

భగవద్గీత

  -------------------- భగవద్గీత. -------------------

తృతీయోధ్యాయ: కర్మ యోగము.



ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః ।

అహంకారవిమూఢాత్మా కర్తాఽహమితి మన్యతే ।। 27 ।।



ప్రతిపదార్థ:



ప్రకృతేః — భౌతిక ప్రకృతి యొక్క; క్రియమాణాని — చేయబడును; గుణైః — మూడు గుణములచే; కర్మాణి — పనులు; సర్వశః — అన్ని రకాల; అహంకార-విమూఢ-అత్మా — అహంకారంతో భ్రమకు లోనై, తాము ఈ శరీరమే అనుకునే జీవులు; కర్తా — చేసేవాడిని; అహం — నేను; ఇతి — ఈ విధంగా; మన్యతే — భావించును.


 తాత్పర్యము : 


 

అన్ని కార్యములు కూడా ప్రకృతి త్రిగుణముల చేతనే చేయబడును. కానీ, అజ్ఞానంలో, జీవాత్మ, తాను ఈ శరీరమే అన్న భ్రమతో, తానే కర్తను (చేసేవాడిని) అని అనుకుంటుంది.

  

 వివరణ:


ప్రపంచంలో సహజసిద్ధంగా జరిగే పరిణామాలు మనం నిర్దేశించినవి కావని, అవి ప్రకృతిచే చేయబడినవి అని మనం గమనించవచ్చు. మన శరీరక్రియలను, మనం రెండు రకాలుగా విభజించవచ్చు 1) సహజంగానే జరిగే జీవ క్రియలు, అంటే, జీర్ణక్రియ, రక్త ప్రసరణ, హృదయస్పందన వంటివి, మనం కావాలని చేయము కానీ అవి సహజంగానే జరిగిపోతాయి. 2) మనమే ప్రయత్నపూర్వకంగా చేసే క్రియలు - మాట్లాడటం, వినటం, నడవటం, నిద్రించటం, పని చేయటం వంటివి.


ఈ రెండు రకాల పనులూ కూడా మనస్సు-శరీరం-ఇంద్రియముల వ్యవస్థ ద్వారా చేయబడుతాయి. ఈ వ్యవస్థ యొక్క అన్ని భాగాలు కూడా, సత్త్వ-రజో-తమస్సులచే కూడి ఉన్న త్రి-గుణాత్మకమైన ప్రకృతి లేదా భౌతిక శక్తితోనే తయారు చేయబడ్డాయి. ఎలాగైతే అలలు సముద్రం కన్నా వేరు కాదో, అవి సముద్రంలో భాగమో, అదే విధంగా ప్రకృతి నుండి తయారయిన ఈ శరీరం, ప్రకృతిలో భాగమే. కావున, ప్రకృతి శక్తియే అన్ని పనులకు కర్త.


మరి ఎందుకు జీవాత్మ తనే అన్ని పనులు చేసేది అనుకుంటుంది? ఎందుకంటే, ప్రబలమైన అహంకార పట్టులో, ఆత్మ తనను తాను ఈ శరీరమే అనుకుంటుంది. అందుకే, కర్తృత్వ భావన మాయలో ఉండిపోతుంది. ఉదాహరణకి రైల్వే ప్లాట్ఫారం పైన రెండు రైళ్ళు పక్కపక్కనే ఉన్నాయనుకుందాం, ఒక రైల్లోని ప్రయాణికుడు తదేకంగా పక్క రైలుని చూస్తున్నాడనుకుందాం. ఆ రెండో రైలు కదిలితే, మొదటి రైలు కదిలినట్టుఉంటుంది. అదే విధంగా కదలని జీవాత్మ కదిలే ప్రకృతియే తను అనుకుంటుంది. అందుకే, చేసే క్రియలకు తానే కర్త అనుకుంటుంది. ఆత్మ ఈ అహంకారాన్ని వదిలి, భగవత్ సంకల్పానికి శరణాగతి చేసిన మరుక్షణం, తాను కర్తను కాను అని తెలుసుకుంటుంది.


కానీ, జీవాత్మ నిజంగా కర్త కానప్పుడు, శరీరం చేసే చర్యలకు, అది కర్మ సిద్ధాంత చట్రం లో ఎందుకు చిక్కుకుంటుంది? అని ఎవరైనా అడగవచ్చు. దీనికి కారణ మేమిటంటే, జీవాత్మ తనే స్వయంగా కర్మలను చేయకపోయినా, అది ఇంద్రియమనోబుద్ధులు చేసే క్రియలను మార్గదర్శకం చేస్తుంది. ఉదాహరణకి, ఒక రథ సారథి, రథాన్ని తనే గుంజడు, కానీ గుర్రాలకు దిశానిర్దేశం చేస్తాడు. ఇప్పుడు, ఒకవేళ ప్రమాదం జరిగితే, గుర్రాలను తప్పు బట్టలేము, సారథియే బాధ్యుడు. అదే విధంగా, మనస్సు-శరీరం వ్యవస్థ చేసే పనులకు జీవాత్మయే బాధ్యత వహించవలసి ఉంటుంది ఎందుకంటే ఇంద్రియములు-మనస్సు-బుద్ధి, ఆత్మ ద్వారా వచ్చే-------------------- భగవద్గీత. -------------------

తృతీయోధ్యాయ: కర్మ యోగము.



ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః ।

అహంకారవిమూఢాత్మా కర్తాఽహమితి మన్యతే ।। 27 ।।



ప్రతిపదార్థ:



ప్రకృతేః — భౌతిక ప్రకృతి యొక్క; క్రియమాణాని — చేయబడును; గుణైః — మూడు గుణములచే; కర్మాణి — పనులు; సర్వశః — అన్ని రకాల; అహంకార-విమూఢ-అత్మా — అహంకారంతో భ్రమకు లోనై, తాము ఈ శరీరమే అనుకునే జీవులు; కర్తా — చేసేవాడిని; అహం — నేను; ఇతి — ఈ విధంగా; మన్యతే — భావించును.


 తాత్పర్యము : 


 

అన్ని కార్యములు కూడా ప్రకృతి త్రిగుణముల చేతనే చేయబడును. కానీ, అజ్ఞానంలో, జీవాత్మ, తాను ఈ శరీరమే అన్న భ్రమతో, తానే కర్తను (చేసేవాడిని) అని అనుకుంటుంది.

  

 వివరణ:


ప్రపంచంలో సహజసిద్ధంగా జరిగే పరిణామాలు మనం నిర్దేశించినవి కావని, అవి ప్రకృతిచే చేయబడినవి అని మనం గమనించవచ్చు. మన శరీరక్రియలను, మనం రెండు రకాలుగా విభజించవచ్చు 1) సహజంగానే జరిగే జీవ క్రియలు, అంటే, జీర్ణక్రియ, రక్త ప్రసరణ, హృదయస్పందన వంటివి, మనం కావాలని చేయము కానీ అవి సహజంగానే జరిగిపోతాయి. 2) మనమే ప్రయత్నపూర్వకంగా చేసే క్రియలు - మాట్లాడటం, వినటం, నడవటం, నిద్రించటం, పని చేయటం వంటివి.


ఈ రెండు రకాల పనులూ కూడా మనస్సు-శరీరం-ఇంద్రియముల వ్యవస్థ ద్వారా చేయబడుతాయి. ఈ వ్యవస్థ యొక్క అన్ని భాగాలు కూడా, సత్త్వ-రజో-తమస్సులచే కూడి ఉన్న త్రి-గుణాత్మకమైన ప్రకృతి లేదా భౌతిక శక్తితోనే తయారు చేయబడ్డాయి. ఎలాగైతే అలలు సముద్రం కన్నా వేరు కాదో, అవి సముద్రంలో భాగమో, అదే విధంగా ప్రకృతి నుండి తయారయిన ఈ శరీరం, ప్రకృతిలో భాగమే. కావున, ప్రకృతి శక్తియే అన్ని పనులకు కర్త.


మరి ఎందుకు జీవాత్మ తనే అన్ని పనులు చేసేది అనుకుంటుంది? ఎందుకంటే, ప్రబలమైన అహంకార పట్టులో, ఆత్మ తనను తాను ఈ శరీరమే అనుకుంటుంది. అందుకే, కర్తృత్వ భావన మాయలో ఉండిపోతుంది. ఉదాహరణకి రైల్వే ప్లాట్ఫారం పైన రెండు రైళ్ళు పక్కపక్కనే ఉన్నాయనుకుందాం, ఒక రైల్లోని ప్రయాణికుడు తదేకంగా పక్క రైలుని చూస్తున్నాడనుకుందాం. ఆ రెండో రైలు కదిలితే, మొదటి రైలు కదిలినట్టుఉంటుంది. అదే విధంగా కదలని జీవాత్మ కదిలే ప్రకృతియే తను అనుకుంటుంది. అందుకే, చేసే క్రియలకు తానే కర్త అనుకుంటుంది. ఆత్మ ఈ అహంకారాన్ని వదిలి, భగవత్ సంకల్పానికి శరణాగతి చేసిన మరుక్షణం, తాను కర్తను కాను అని తెలుసుకుంటుంది.


కానీ, జీవాత్మ నిజంగా కర్త కానప్పుడు, శరీరం చేసే చర్యలకు, అది కర్మ సిద్ధాంత చట్రం లో ఎందుకు చిక్కుకుంటుంది? అని ఎవరైనా అడగవచ్చు. దీనికి కారణ మేమిటంటే, జీవాత్మ తనే స్వయంగా కర్మలను చేయకపోయినా, అది ఇంద్రియమనోబుద్ధులు చేసే క్రియలను మార్గదర్శకం చేస్తుంది. ఉదాహరణకి, ఒక రథ సారథి, రథాన్ని తనే గుంజడు, కానీ గుర్రాలకు దిశానిర్దేశం చేస్తాడు. ఇప్పుడు, ఒకవేళ ప్రమాదం జరిగితే, గుర్రాలను తప్పు బట్టలేము, సారథియే బాధ్యుడు. అదే విధంగా, మనస్సు-శరీరం వ్యవస్థ చేసే పనులకు జీవాత్మయే బాధ్యత వహించవలసి ఉంటుంది ఎందుకంటే ఇంద్రియములు-మనస్సు-బుద్ధి, ఆత్మ ద్వారా వచ్చే ప్రేరణతో పని చేస్తాయి. ప్రేరణతో పని చేస్తాయి.

రామాయణం - 15 )

 శ్రీరామ  (22)


               ( వాల్మీకి రామాయణం  - 15 )


🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 సర్వే జనాః సుఖినో భవన్తు 🙏


  (25-3-'26  ' మధ్యాహ్నం '  పోష్టు తరువాయి భాగము)


జనకుని మాటలు విని, వశిష్ఠ మహర్షి, విశ్వామిత్ర మహర్షి, అతనితో ఇలా అన్నారు.


" ఇక్ష్వాకు వంశము, మీ విదేహ వంశము,చాలా గొప్పవి.

మీ వంశములు వియ్యమందటము, అందరికి క్షేమం కలిగిస్తుంది.

నీ తమ్ముని కుమార్తెలయిన మాండవీ, శ్రుతకీర్తులను, దశరథ పుత్రులైన, భరత, శత్రుఘ్నులకు భార్యలుగా మేము వరించుచున్నాము.

ఈ వివాహ సంబంధము వల్ల మీ ఇరువురి వంశములు దృఢమైన బంధముకలవి అగుగాక" అన్నారు.


జనకుడు, కుశధ్వజుడు, మహర్షులు చెప్పినదానికి చాలా సంతోషంతో అంగీకరించారు.


శ్లో//ఏవం భవతు భద్రం వః కుశధ్వజ సుతే ఇమే/

పత్నీ భజేతాం సహితౌ శతృఘ్న భరతావుభౌ/

ఏకాహ్నా రాజపుత్రీణాం చతసౄణాంమహామునే/

పాణీన్ గృహ్ణన్తు చత్వారో రాజపుత్రా మహాబలాః//


(అట్లే అగుగాక.మీకు భద్రమగు గాక.ఈ కుశధ్వజుని కుమార్తెలగు "మాండవీ" "శృతకీర్తులు"  ఎప్పుడూ సన్నిహితంగా మెలిగే ఈ భరత శతృఘ్నులకు(వరుసగా) భార్యలై వారిని సేవించెదరు గాక.

ఓ మహామునీ! మహాబలశాలులగు ఈ రాజపుత్రులు నలుగురు ఒకే దినమున నలుగురు రాజపుత్రికలను వివాహమాడుదురు గాక).


దశరథ మహారాజు అప్పుడు జనకుని వద్ద సెలవు తీసుకుని,వసిష్ఠ,విశ్వామిత్రులతొ

తన విడిదికి వెళ్లి, యథా శాస్త్రముగా చేయవలసిన కార్యములు నిర్వర్తించాడు.


మరుసటి రోజు ప్రాతః:కాలంలో, స్నాతకము, గోదానము మొదలైన విహిత కృత్యములను నిర్వహించాడు.


ఆ రోజు,భరతుని మేనమామ, కేకయమహారాజు కుమారుడు, అయిన యుధాజిత్తు అక్కడకు వచ్చాడు.


మేనల్లుడైన భరతుని చూచుటకు తాను అయోధ్యాపట్టణానికి వెళ్లాననీ, అక్కడ రాముని వివాహవిషయం తెలిసి ఇక్కడకు వచ్చాననీ, చెప్పాడు.

అతని రాకకు అందరూ చాలా సంతోషించారు.

శ్లో// అథ రాజా దశరథః ప్రియాతిథి ముపస్థితమ్ /

దృష్ట్వా పరమ సత్కారైః పూజార్హం సమపూజయత్//

(పిమ్మట దశరథుడు వచ్చిన ఆ ప్రియాతిథిని చూచి పూజార్హుడైన అతనిని అనేక సత్కారములు చేసి గౌరవించాడు)



అందరూ మరుసటిరోజు జరగబోయే వివాహ విషయాలు ముచ్చటించుకుంటూ ఆ రాత్రి సుఖంగా గడిపారు. 

                                  


                    శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష.

                      ఓం శాన్తి శ్శాన్తి శ్శాన్తిః.


( సశేషం )

శుభమస్తు,

తూములూరి మధుసూదనరావు,

25-3-'26


(రేపు స్మార్తులకు శ్రీరామనవమి.

ఆ సందర్భంగా శుభప్రదమైన సీతారామ కళ్యాణం చెప్పుకుందాము)

వాల్మీకి రామాయణం - 14)

 శ్రీరామ (21)


               ( వాల్మీకి రామాయణం - 14)


🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 సర్వే జనాః సుఖినో భవన్తు 🙏


  (25-3-'26 ' ఉదయం ' పోష్టు తరువాయి భాగము)


జనకమహారాజు ఆహ్వానాన్ని పురస్కరించుకుని దశరథ మహారాజు , విశ్వామిత్రాది ఋషులతోను, బంధువులతోను జనకుని సభకు వచ్చాడు.

ధర్మాత్ముడు, మా కులగురువు, అయిన వసిష్ఠమహర్షి నా పక్షమున మా వంశక్రమమును చెప్పగలడని జనకునకు తెలియజేశాడు.

వసిష్ఠమహర్షి జనకునితో ఇలా అన్నాడు.

శ్లో// అవ్యక్తప్రభవో బ్రహ్మా శాశ్వతో నిత్య అవ్యయః /

తస్మాన్మరీచిః సంజజ్ఞే మరీచేః కాశ్యపః సుతః //

(అవ్యక్తమునుండి జన్మించిన వాడు, శాశ్వతంగా ఉండేవాడు, నిత్యుడు, వినాశము లేనివాడు, అయిన బ్రహ్మదేవుని నుండి మరీచియు, మరీచినుండి కాశ్యపుడును జన్మించిరి).

కాశ్యపుని కుమారుడు సూర్యుడు.

సూర్యుని కుమారుడు మనువు.

మనువునకు ఇక్ష్వాకువుజన్మించాడు.

ఆయనే అయోధ్యకు మొదటి రాజు.

ఇక్ష్వాకుని పుత్రుడు "కుక్షి".

అతని కుమారుడు "వికుక్షి".

వికుక్షి కుమారుడు "బాణుడు"

"అనరణ్యుడు" బాణుడి కుమారుడు.

అనరణ్యుని పుత్రుడు "పృథు చక్రవర్తి".

పృథువు కుమారుడు "త్రిశంకువు".

అతనికి "దుంధుమారుడు", (అతనికే "యువనాశ్వుడు"అనే పేరు కూడా ఉంది)

యువనాశ్వుని కుమారుడు "మాంధాత".

మాంధాత కుమారుడు. "సుసంధి".

సుసంధికి "ధ్రువసంధి" , "ప్రసేనజిత్" అనే ఇద్దరు కుమారులు.

ధ్రువసంధి కుమారుడు "భరతుడు".

భరతుని కుమారుడు "అసితుడు".

శత్రువులచేత ఓడింపబడి అడవులకు వెళ్లిన అసితుడు "చ్యవన మహర్షి" అనుగ్రహం వల్ల "సగరుడు"అనే పుత్రుని పొందెను.

సగరుని పుత్రుడు "అసమంజుడు".

అసమంజుని కుమారుడు "అంశుమంతుడు"

అంశుమంతుని కుమారుడు "దిలీపుడు".

దిలీపుని కుమారుడు "భగీరథుడు".

భగీరథుని కుమారుడు "కకుత్థ్సుడు".

కకుత్థ్సుని కుమారుడు "రఘుమహారాజు".

రఘువు కుమారుడు " పురుషాదకుడు " కల్మాషపాదుడు,అనే నామములతో పిలువబడే "ప్రవృద్ధుడు" 

అతని కుమారుడు"శంఖణుడు".

శంఖణుని కుమారుడు. "సుదర్శనుడు".

అతని కుమారుడు"అగ్నిపర్ణుడు".

అగ్నిపర్ణుడి కుమారుడు "శీఘ్రగుడు".

అతని కుమారుడు. "మరువు".

మరువు కుమారుడు "ప్రశుశుక్రుడు".

అతని కుమారుడు "అంబరీషుడు".

అంబరీషుని కుమారుడు "నహుష చక్రవర్తి".

నహుషుని కుమారుడు "యయాతి".

అతని కుమారుడు "నాభాగుడు"

నాభాగుని కుమారుడు "అజ మహారాజు".

అజ మహారాజు పుత్రుడు "దశరథ మహారాజు"

దశరథ మహారాజు కుమారులు రామ,లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు.

పరిశుద్ధమైన వంశచరిత్ర కలిగిన వారు, వీరులు,‌

పరమ ధార్మికులు, సత్యవాదులు అయిన ఇక్ష్వాకు వంశంలో పుట్టిన ఈ రామ, లక్ష్మణుల కొరకు నీ కుమార్తెలైన "సీత" "ఊర్మిళ" లను వరించు చున్నాను.

రామ లక్ష్మణులకు, నీ కుమార్తెలయిన సీత, ఊర్మిళ లను ఇచ్చి వివాహము చేయుము, అని వశిష్ఠ మహర్షి చెప్పి, ముగించాడు.

                         

అప్పుడు వసిష్ఠమహర్షికి చేతులు జోడించి జనక మహారాజు ఇలా అన్నాడు.

సత్కుల ప్రసూతులైన వారు,కన్యాదాన సమయంలో తమ కులమును గూర్చి పూర్తిగా చెప్పవలెను.

మా వంశమునకు మూల పురుషుడు "నిమి" చక్రవర్తి.

ఆ నిమి చక్రవర్తి కుమారుడు"మిథి".

ఆయనే ఈ మిథిలానగరాన్ని నిర్మించిన మొదటి జనకుడు.

మిథి కుమారుడు ఉదావసువు.

ఉదావసువు కుమారుడు నందివర్థనుడు.

అతని కుమారుడు సుకేతువు.

సుకేతువునకు,ఈ శివ ధనుస్సును పొందిన వాడు,ప్రఖ్యాతుడు అయిన"దేవరాతుడు"జన్మించాడు.

దేవరాతుని కుమారుడు బృహద్రథుడు.

అతని కుమారుని పేరు"మహావీరుడు".

ఆయన పుత్రుడు సుధృతి.

సుధృతి కుమారుడు దృష్టకేతువు.

ఆయన కుమారుడు హర్యశ్వుడు.

హర్యశ్వునకు మరుడు అను పుత్రుడు జనించెను.

మరుని పుత్రుడు ప్రతింధకుడు.

ప్రతింధకుని కుమారుడు కీర్తిరథ మహారాజు.

కీర్తిరథునకు దేవమీఢుడు జన్మించాడు.

దేవమీఢుని పుత్రుడు విబుధుడు.

విబుధుని కుమారుడు మహీధ్రకుడు.

అతని కుమారుడు కీర్తిరాతుడు.

కీర్తిరాతునకు మహారోముడు జన్మించాడు.

మహారోముని కుమారుడు స్వర్ణరోముడు.

స్వర్ణరోముని కుమారుడు హ్రస్వరోముడు.

ధర్మాత్ముడైన హ్రస్వరోమునకు నేను జ్యేష్ఠ కుమారుడను.

నా తమ్ముడైన కుశధ్వజుడు రెండవ కుమారుడు.

జ్యేష్ఠుడనైన నన్ను రాజ్యాభిషిక్తుని చేసి,కుశధ్వజుని నా పోషణలో ఉంచి, హ్రస్వరోమ మహారాజు తపస్సు ఆచరించేందుకు అరణ్యములకు వెళ్లాడు.

నేను కుశధ్వజుని సాంకాస్య పురమునకు రాజును చేసాను.

ఇదీ మా వంశ వృత్తాంతము.

ఓ మహర్షీ! మీకు మంగళ మగుగాక.

మీరు చెప్పినట్లు నా జ్యేష్ఠ కుమార్తె సీతను రామునకు, రెండవ కుమార్తె ఊర్మిళను లక్ష్మణునకు ఇచ్చి వివాహం చేస్తాను.


శ్లో//వీర్య శుల్కాం మమ సుతాం సీతాం సురసుతోపమామ్/

ద్వితీయా మూర్మిళాం చైవ త్రిర్దదామి నసంశయః//

(వీర్య శుల్కయు,దేవకన్యతో సమానురాలును అగు నా పుత్రిక యైన సీతను రామునకు, రెండవ కుమార్తె అయిన ఊర్మిళను లక్ష్మణునకు ఇచ్చి వివాహము చేసెదనని ముమ్మారు నొక్కి వక్కాణించుచున్నాను.

ఈ విషయమున సందేహము లేదు).

ఇక్కడ "త్రిః దదామి" అను పదమునకు మనో,వాక్కాయములను మూడు కరణముల చేత అనగా త్రికరణశుద్ధిగా ఇచ్చుచున్నాను అని అర్థం చేసుకోవాలని వ్యాఖ్యాతలు చెప్పారు.


జనకుడు దశరథ మహారాజుతో ఇలా అన్నాడు.

ఓ మహారాజా ! ఈరోజు మఖా నక్షత్రము. 

ఎల్లుండి సంతానప్రదుడైన " భగుడు" అధిదేవతగాగల ఉత్తర ఫల్గునీ నక్షత్ర మందు వివాహముజరిపింపుము.

ఈ లోపు గోదానము, మొదలైన శాంతి కార్యములు చేయింపుము"


(సశేషం)

శుభమస్తు,

తూములూరి మధుసూదనరావు,

25-3-'26.

వేదాలకు భాష్యాలు

 వేదాలకు భాష్యాలు మాత్రమే ఎందుకు రచించారు భాష్యకారులు? టీక, అనువాదములు వంటి ప్రక్రియలు వేదములకు ఎందుకు లేవు ?

వేదములకూ, బ్రహ్మసూత్రాలకు తదితర మంత్రాత్మకమైన వాఞ్మయానికి భరతవర్షంలో భాష్యాలు చెప్పబడినాయి. శుష్కమైన తాత్పర్యాలు లేవు.


అసలు భాష్యం అంటే ఏమిటి?


సూత్రార్థా వర్ణితం యత్ర పదై సూత్రాంత సారిభిః |


స్వపదాని చ వర్ణాంతే భాష్యం భాష్యవిదో విదుః ||


ఎక్కడైతే మంత్రములో గల శబ్దాలు స్పష్టంగా వివరింపబడి, ఆ వివరణకు ఉపయోగించిన శబ్దజాలానికి అర్థమూ వివరింపబడునో దానిని భాష్యమని భాష్యవిదులు పేర్కొంటారు.


అనగా భాష్యం - మంత్రములకు చెప్పబడుతుంది.


మంత్రములో గల ప్రతి శబ్దానికి వివరణ ఉంటుంది. దీనిని వృత్తి అంటారు.


వృత్తిని స్పష్టీకరించడమూ ఉంటుంది. దీనిని వార్తికము అంటారు. వార్తికం అంటే వృత్తిని విపులంగా చర్చించేది. (వృత్తిం వేదయతి ఇతి వార్తికం)


అంటే భాష్యం అన్నది ఒక సర్వతోముఖమైన, సమగ్రమైన ప్రక్రియ.


"మంత్రబ్రాహ్మణయోర్వేద నామధేయమ్" అని ఆపస్తంబుని సూత్రీకరణ. వేదములు అంటే మంత్రములు, ఆ మంత్రములతో కూడిన యజనక్రియలు.


వేదాంగములు ఆరు. శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పమ్. భాష్యకారుడికి ఈ ఆరు వేదాంగములలో పావీణ్యంతో బాటు, మంత్రము యొక్క అర్థం అనుభవజ్ఞానం ఉండవలె. "సమ్యగనుభవసాధనం ప్రమాణమ్";" అనధిగతార్థగంతృప్రమాణమ్".


చిన్న వివరణ. ఉదాహరణకు "ఆకలి" అన్న శబ్దం ఉందనుకోండి. ఆ శబ్దానికి అర్థం ఆ వచనం లో లేదు. ఆకలి శబ్దానికి కేవలం "ఒక సంవేదన" అన్న శుష్కార్థంలో ఇముడదు.ఆకలి కి నిజమైన అర్థం తెలియాలంటే శబ్దజ్ఞానంతో బాటు, ఆ ఆకలి యొక్క అనుభవజ్ఞానం, అన్నం విలువ, దాని పవిత్రత, ఆహారం పెట్టినవాని దయ, ఆ అన్నాన్ని పండించిన వాడి కృషి, వీటి సమగ్రస్వరూపం తెలియాలి.


భౌతికజీవితంలోని అర్థాలకే సమగ్రత్వం ఈ విధంగా ఉన్నప్పుడు - మంత్రస్వరూపంగా వేలాది ఏళ్ళు సాంప్రదాయంలో, సంస్కృతిలో, ప్రతి క్రతువులో, కర్మలో, వ్రతంలో, అనుష్ఠానంలో మమేకమైన వేద మంత్రాలకు భాష్యార్థం ఎంతో శ్రమపడితే తక్క మహనీయులకు కూడా తెలియదు.


వేదాలకు భాష్యం రచించడానికి సాయణాచార్యుడు (మాధ విద్యారణ్యుల వారి తమ్ముడు) 24 ఏళ్ళు శ్రమపడవలసి వచ్చిందని చెప్పుకున్నాడు.


ఋగ్వేదంలో మంత్రాలకు నిరుక్తంలో భాష్యం ఉంది. నిరుక్తకారుడు యాస్కాచార్యుడు. (మనకు 9 నిరుక్తాలు ఉండేవట. ఇప్పుడు దొరికేది యాస్కాచార్యుని నిరుక్తం ఒకటే). సాయణాచార్యుడు చతుర్వేదాలకు భాష్యం రచించినాడు. ఆసక్తి పెంచుకొని ఎవరైనా చదవగలిగితే ఎంతో మంగళకరమైన, మనోజ్ఞమైన భావనలు అందు కనిపిస్తాయి.


వేదభాష్యానికి ఒక్క ఉదాహరణ. ఈ మంత్రాన్ని హిందువులయొక్క ప్రతిక్రతువులోనూ, వ్రతంలోనూ, పెళ్ళికి ముందు వధువు చేసే గౌరీపూజలోనూ పఠిస్తారు. వేల ఏళ్ళుగా భారతసంస్కృతిలో మమేకమైన అందమైన ఋగ్వేదమంత్రం ఇది.


గౌరీ (నిర్)మిమాయ సలిలాని తక్షత్యేకపదీ ద్విపదీ సా చతుష్పదీ |


అష్టాపదీ నవపదీ బభూవుషీ సహస్రాక్షరా పరమే వ్యోమన్ ||


ఈ ఋక్కుకు సాయణాచార్యుని భాష్యం ఇలా ఉంది.


వాగ్దేవి మొట్టమొదట పరమవ్యోమంలో పరబ్రహ్మలో అంతర్గతంగా వున్న గౌరిగా ఏకపది. అదే ప్రణవరూపం.


పిదప సలిల సదృశములైన వర్ణపదవాక్యములను ఆమె సృష్టించింది. వ్యాహృతి (మంత్ర) రూపంలో సావిత్రిగ ద్విపది.


తర్వాత వేదచతుష్టయ రూపంలో చతుష్పది అయినది.


అటుపై, వేదాంగములు, స్మృతి పురాణ ధర్మశాస్త్రములలో అష్టాపది;


మీమాంసా, న్యాయ సాంఖ్య, యోగ, పాంచరాత్ర, పశుపత, ఆయుర్వేద ధనుర్వేద, గాంధర్వ వేదవిద్యా రూపిణియై నవపది. తదనంతరము అనంతవాక్యరూపమున వాగ్దేవి ప్రపంచమంతా ప్రతిభాసిస్తున్నది.


అయితే యాస్కాచార్యుడు గౌరిని - మేఘాల మధ్య విద్యుత్తు అని పేర్కొన్నాడు. ఆయన భాష్యం ఈ క్రింది బొమ్మల్లో చదుకోవచ్చు.మంత్రార్థము (వృత్తి), భాష్యార్థము (వార్తికము) ఇక్కడ చూడవచ్చు.




సాంప్రదాయికంగా భరతవర్షంలో వేదాలకు భాష్యాలు ఉన్నాయని, అవి ఎంతో మనోహరమైన కృతులని చెప్పుకున్నాం.


ఆధునిక కాలంలో - వేదాలను పనిగట్టుకుని నాశనం చేసిన వారు ఆంగ్లేయులు. మనకు సంస్కృతం ఓ మోస్తరుగా కావ్యాలు చదువుకునేంత మోతాదున నేర్చుకోవడానికే జీవితకాలం పడుతుంది. వేదభాష్యాలకు సాయణాచార్యుడంతటి పండితుడికి 24 ఏళ్ళు పడితే ఆంగ్ల అనువాదకులకు యుక్తవయసుకే వేదాలు అర్థం చేసుకునేంత జ్ఞానం వచ్చిందట! అదీ ఒక్క ముక్క సాంప్రదాయం తెలియకుండానే! నిజానికి వీరికి సంస్కృతభాషలో రామ శబ్దం కూడా తెలియదు. అయితే వీరు పేద బ్రాహ్మలతో అర్థాలు చెప్పించుకుని, పెడర్థాలు తీసి "అనువాదాలు" రచించడానికి అనతికాలమే పట్టింది. వీరు చేసింది అనువాదం. అదీ కూడా అక్కడక్కడా పరమహీనమైన పద్ధతిలో ఉంది. ఈ అనువాదకుల్లో రాల్ఫ్ గ్రిఫిత్, మేక్స్ ముల్లర్ లు ముఖ్యులు.


పైన "గౌరీమిమాయ ..." కు అర్థం చూచాం. అసలా అర్థం తెలియకున్నా గౌరి అంటే భారతదేశంలో అమ్మవారు అని అందరికీ తెలుసు 

ఆంగ్ల యులు దానిని

వేరే విధంగా అనువాదం చేయటం జరిగింది

*శ్రీ మహావిష్ణు పురాణం*

 🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*మంగళవారం 24 మార్చి 2026*


       *శ్రీ మహావిష్ణు పురాణం*

`` *35వ భాగం*``


*బ్రహ్మ వంశ క్రమము*```


శౌనకాది మునుల కోరిక పై సూత మహర్షి బ్రహ్మ నుంచి సృష్టి ఆరంభమైన విధానం, బ్రహ్మవంశ వృద్ధి వివరించి చెప్పసాగాడు:


“మునులారా! శ్రీమన్నారాయణుని నాభి కమలం నుండి బ్రహ్మ జన్మించిన సంగతి మీకు తెలుసు. బ్రహ్మ నుండి మానస పుత్రులుగా ఇరవై ముగ్గురు ప్రజాపతులు, మహర్షులు, మనువులు ఉద్భవించి సృష్టిని విస్తరింపచేశారు. వంశాభివృద్ది ఎలా జరిగిందో వినండి..


ప్రచేతసులకు దక్ష ప్రజాపతి తిరిగి జన్మించాడు. ఆయనకు అసిక్ని అనే భార్య వలన ఐదువేల హర్యశ్వులు, వేయి మంది శబలాశ్వులు జన్మించారు. నారదుడు వీరిని వైరాగ్య మార్గానికి మళ్ళించాడు. తరువాత అరవై మంది కుమార్తెలు కలిగారు. వీరిలో అదితి, దితి, దనువు, అరిష్ట, సురస, ఖస, సురభి, వినత, తామ్ర, ధవశ, ఇర, కద్రువ, ముని అనే పదమూడు మంది కశ్యప ప్రజాపతికి భార్యలు అయ్యారు.


అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ధ్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, ఉత్తర ఫల్గుణి, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ, మఖ, పుబ్బ, శతభిష, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, శ్రవణం, ధనిష్ఠ, రేవతి అనే దక్ష కుమార్తెలు చంద్రునికి భార్యలు అయినారు.


దక్ష ప్రజాపతికి ఉత్తానపాదుని చెల్లెలు ప్రసూతి మరో భార్య. ఈమెకు ఇరవై నాలుగు మంది కుమార్తెలు జన్మించారు. 

వీరిలో శ్రద్ధ, లక్ష్మి, ధృతి, తుష్టి, మేధ, పుష్టి, క్రియ, బుద్ది, లజ్జ, వపువు, శాంతి, సిద్ది, కీర్తి అనే పదమూడు మందిని ధర్ముడు వివాహం చేసుకున్నాడు.


దక్ష పుత్రికలలో ఖ్యాతిని భృగువు, సతీదేవిని శివుడు, సంభూతిని మరీచి, స్మృతిని అంగీరసుడు, ప్రీతిని పులస్త్యుడు, క్షమను పులహుడు, సంతితిని క్రతువు, అనసూయను అత్రి, ఊర్జను వసిష్టుడు, స్వాహను అగ్ని, స్వధను మనువు వివాహం చేసుకున్నారు.


కశ్యప ప్రజాపతికి దక్షుని పుత్రికలు పదమూడు మందితో కలిపి మొత్తం ఇరవైఒక్క మంది భార్యలు ఉన్నారు. దేవ రాక్షస దానవ మానవ పశుపక్ష్యాది జాతులన్ని వీరి నుంచే జన్మించాయి.


అదితికి ద్వాదశాదిత్యులు, ఇంద్రాది దేవతలు జన్మించారు. దితికి హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, సింహిక జన్మించారు. దనువుకు శబరుడు, ఏకచక్రుడు, మహాబాహువు, తారకుడు, మహాబలుడు, స్వర్భానువు, వృషపర్వుడు, పులోముడు, విప్రచిత్తి మొదలైన దానవులు జన్మించారు.


సురభికి అజుడు, ఏకపాదుడు, ఏకాదశ రుద్రులు జన్మించారు. వినతకు అనూరుడు, గరుత్మంతుడు మొదలైన వారు జన్మించారు. కద్రువకు శేషుడు, వాసుకి, తక్షకుడు, కర్కోటకుడు, ఆర్యకుడు, కాళీయుడు, మొదలైన నాగులు జన్మించారు. పశుపక్ష్యాది జాతులన్ని కశ్యపుని భార్యల సంతానంగా జన్మించి వృద్ది చెందాయి.


వసిష్టుడు తొలిజన్మలో అరుంధతిని చేసుకుని చిత్రసేనుడు, పురోచిషుడు, విరచుడు మిత్రుడు, ఉల్బణుడు, వసుభృద్యానుడు, ద్యుమంతులను పుత్రులుగా పొందాడు. రెండవ జన్మలో అక్షమాలను పెళ్లాడి నిమి చక్రవర్తి శాపం వలన మరణించాడు. మిత్రావరుణుల కుమారుడిగా మూడవ జన్మ ఎత్తిన ఊర్జను పెండ్లాడాడు. వీరికి రజస్సు, గోత్రుడు, ఊర్థ్వబాహువు, సవనుడు, అనఘుడు, సుతపసుడు, శుక్రుడు జన్మించారు.


భృగువుకి ఖ్యాతి యందు ధాత, విధాత, కవి, లక్ష్మి జన్మించారు. దాతకు ప్రాణుడు, ప్రాణునికి ద్యుతిమంతుడు, అతనికి రాజవంతుడు జన్మించారు. విధాతకు నియతి వలన మృకండుడు, మృకుండునికి మార్కండేయుడు జన్మించారు. వరణునికి కుమారునిగా జన్మించిన రెండవ జన్మలో భృగువుకి భూతుడు, చ్యవనుడు, వజ్రశీర్షుడు శుచి, శుక్రుడు, సవనుడు జన్మించారు.


మరీచికి కళయందు కశ్యపుడు, పూర్ణిముడు, ఊర్ణ యందు ఆరుగురు కుమారులు జన్మించారు. ఈ ఆరుగురు తరువాత జన్మలలో కాలనేమి పుత్రులు గాను, దేవకి వసుదేవులకు కృష్ణుడి కన్నా ముందు ఆరుగురి పుత్రులుగా జన్మించి కంసుడిగా పుట్టిన తండ్రి కాలనేమి చేతిలో చంపబడ్డారు.


వినతకు అనూరుడు, గరుడుడు కాకుండా అరిష్టనేమి, తార్ఖ్యుడు, అరుణి, శ్రీవారుణి జన్మించారు. సగరుడు అరిష్టనేమి కుమార్తె సుమతిని వివాహం చేసుకుని సూర్య వంశ మూలకర్త అయ్యాడు. హేతి తపస్సపన్నుండైనా శాపగ్రస్తుడు అవ్వటం వలన రాక్షస జాతికి జన్మనిచ్చాడు.


వివస్వంతుడు విశ్వకర్మ కుమార్తె సంజ్ఞను వివాహం చేసుకున్నాడు. వీరికి అశ్వనీ దేవతలు, నాసత్యుడు, దస్రుడు జన్మించారు. పృథువుకు అంతర్ధానుడు, అంతర్ధానుడికి హవిర్భానుడు, హవిర్భానుడికి ప్రాచీనబర్హి, శుక్రుడు, గయుడు, కృష్ణుడు, వ్రజుడు, అజినుడు జన్మించారు. ప్రాచీనబర్హికి ప్రచేతసులు జన్మించారు.


అంగీరసునికి స్మృతి యందు అనుమతి, కుహువు, సినీవాలి, ఖ్యాతి యందు ఉతథ్యుడు, బృహస్పతి, సంవృత్తుడు జన్మించారు. బృహస్పతి వంశంలో పావకుడు, పరమానుడు, శుచి జన్మించారు.


పులస్త్యుడికి హవిర్భువు, ప్రీతి, మానిని భార్యలు. మానినికి విశ్రవసుడు జన్మించాడు. విశ్రనసువుకి కైకసి వలన రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, శూర్పణఖ పుట్టారు. విశ్రవసునికి మరోభార్య దేవవర్ణి వలన కుబేరుడు జన్మించాడు.


పులహునికి క్షమయందు కర్దముడు, ఉర్వరీయుడు, సహిష్ణువు జన్మించారు. క్రతువుకి అరవైవేల వాలఖిల్యులు జన్మించారు. కర్దమునికి ఆకూతి యందు కపిలుడు జన్మించాడు. అత్రి అనసూయలకు దత్తాత్రేయుడు, చంద్రుడు, దుర్వాసుడు జన్మించారు.


చంద్రవంశంలో వరుసగా బుధుడు, పురూరవుడు, ఆయువు, నహుషుడు, యయాతి మొదలైన వారు జన్మించారు. యయాతికి దేవయాని, శర్మిష్ట వలన యదువు మొదలైన ఐదుగురు పుత్రులు జన్మించారు.


భూమండలం పైన సూర్య చంద్రులు వంశ మూలకర్తలగా అనేక వంశాలు అభివృద్ధి చెంది విస్తరించాయి.


*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

మందు ఎప్పుడు వేసుకోవాలి.

 ఏ మందు ఎప్పుడు వేసుకోవాలి.


✍🏻డా. ప్రతిభా లక్ష్మి 


చాలా మంది, వైద్యుల సలహా పాటించకుండా (లేక సరిగ్గా అర్ధం కాక), tablets ని ఎప్పుడు పడితే అప్పుడు వేసుకుంటూ ఉంటారు. దానితో ఆ టాబ్లెట్ పూర్తి ప్రభావం ఉండకపోవడం, లేక కొన్ని దుష్ప్రభావాలు కలగడం జరగవచ్చు.


ఒక మాత్ర రోజుకు రెండు సార్లు వేసుకోవాలి అంటే, దాని ప్రభావం దాదాపు 12 గంటలు ఉంటుంది అని. అలాగే రోజు ఒకటి అంటే ఇరవై నాలుగు గంటలు, మూడు సార్లు అంటే ఎనిమిది గంటలు వరకు పని చేస్తుంది.  అందుకే సరయిన సమయానికి వేసుకోకపోతే ఆ మందుల పూర్తి ప్రభావం ఉండదు. 


- కడుపులో మంట, Acidity కోసం వేసుకునే మాత్రలు పొద్దున ఖాళీ కడుపుతో వేసుకోవాలి.


- Thyroid మాత్రలు, ఉదయాన్నే వేసుకొని, తరవాత గంట వరకు ఏమీ తినకూడదు.


- Antibiotics, hormone tablets వంటివి ప్రతి పూటా ఒకే సమయానికి వేసుకోవాలి.


- Cholesterol కోసం వేసుకునే మాత్రలు రాత్రి పడుకునే ముందు వేసుకోవడం మంచిది, ఎందుకంటే ఆ సమయంలో రక్తంలో cholesterol levels ఎక్కువ అవుతాయి.


- Azithromycin, cifran వంటి antibiotics తినడానికి గంట ముందు కానీ, తిన్నాక రెండు గంటలకు కానీ వేసుకోవాలి. అప్పుడే పూర్తిగా absorb అవుతాయి.


- నొప్పి మాత్రలు ఖచ్చితంగా తిన్న తరవాతే వేసుకోవాలి. లేనిచో కడుపులో మంట కలిగే అవకాశం ఉంటుంది. అలాగే రక్తం పలచన అయ్యే మాత్రలు కూడా.


- ఐరన్ tablets ఖాళీ కడుపుతో వేసుకొని, తరవాత గంట సేపు ఏమీ తినకుండా ఉంటే వాటి absorption బాగా ఉంటుంది. వాటితో పాటు vitamin c తీసుకుంటే ఇంకా మంచిది. Iron మాత్రలు వేసుకున్నాక కనీసం గంట వరకు టీ, కాఫీ తాగకూడదు. మరియు acidity మాత్ర వేసుకోకూడదు. కానీ ఐరన్ పెరిగే tablet తో ఎవరికైనా vomiting sensation కలుగుతుంటే అవి తిన్నాక ఒక 2 hours కి, అదీ తట్టుకోలేకపోతే తిన్న వెంటనే వేసుకోవాలి.


- Urine ఎక్కువ వచ్చేలా చేసే మాత్రలు (గుండె జబ్బు, ఒంట్లో నీరు, లేక BP కోసం ఇచ్చేవి) ఉదయం వేసుకుంటే మంచిది.


- Calcium carbonate tablets ఆహారంతో పాటు వేసుకుంటే, gastric acid వల్ల వాటి absorption బాగా ఉంటుంది. వీటితో ఐరన్ మాత్రలు కలిపి తీసుకోకూడదు. 


- ఎముకల బలానికి ఇచ్చే మందులు ఖాళీ కడుపుతో వేసుకుంటే బాగా పని చేస్తాయి.


- BP మాత్రలు ప్రతి రోజూ ఒకే సమయానికి వేసుకోవడం అనేది అత్యంత ముఖ్యం. కొన్ని రకాల BP మాత్రలు సాయంత్రం వేసుకుంటే వాటి ప్రభావం మెరుగ్గా ఉంటుంది. 


- మధుమేహానికి వాడే మాత్రలలో కొన్ని ఖాళీ కడుపుతో, కొన్ని ఆహారంతో పాటు, కొన్ని తిన్నాక వేసుకునేవి ఉంటాయి. అలా వేసుకున్నప్పుడే వాటి ప్రభావం పూర్తిగా ఉంటుంది. (అందుకే combination tablets పూర్తి ప్రభావితం కాదు.)


- జలుబు, లేక allergy కోసం వేసుకునే మాత్రలు, లేదా నరాల నొప్పికి ఇచ్చే మాత్రల వల్ల కొంత వరకు నిద్ర మత్తు కలిగే అవకాశం ఉన్నందున, రాత్రి వేసుకుంటే మంచిది.


- విరేచనం సరిగ్గా అవ్వడానికి వేసుకునే syrup లేక tablet రాత్రి వేసుకోవాలి.


ఇలా చెబుతూ పోతే, ప్రతి మాత్రకు వేసుకోవలసిన time, food తో సంబంధం, వేరే tablets తో relation, frequency of administration, ఇలా చాలా విషయాలు ఉంటాయి. 


కాబట్టి., మాత్రలు వేసుకుంటున్నా ప్రభావం సరిగ్గా లేదు అనుకోని dose పెంచడం, లేక మందు మార్చడం చేయడానికి ముందు, ఆ మాత్రలు సరిగ్గా వేసుకుంటున్నామా అని చూసుకోవడం చాలా అవసరం.!


✍🏻డా. ప్రతిభా లక్ష్మి

స్త్రీల సౌందర్యానికి

  స్త్రీల సౌందర్యానికి చిట్కాలు -


నల్లటి మచ్చలు ,మంగు నివారణ -


• జాపత్రిని మంచినీటితో మెత్తగా నూరి రాత్రిపూట ముఖానికి లేపనం చేసుకొని ఉదయాన్నే గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపర్చుకొనుచున్న అతిత్వరలోనే ముఖము పైన కల మంగు ,నల్లమచ్చలు మాయం అగును .

• మిరియాలు గోరోజనముతో కలిపి నూరి పైకి లేపనం చేయుచున్న మొటిమలు తగ్గును . మచ్చలు పోవును .

• బాదం పప్పును నీటితో నూరి వడకట్టగా వచ్చిన పాలను ముఖంపై మర్దన చేయుచున్న క్రమంగా నల్లమచ్చలు , మంగు , మొటిమలు త్వరలోనే హరించును .

• ధనియాలు , వస , సుగంధపాల ఈ మూడింటిని సమభాగాలుగా తీసుకుని మెత్తటి చూర్ణముగా చేసి ఈ చూర్ణమును ఒంటికి నలుగు పిండిలా పట్టించుచున్న నల్లటి మచ్చలు , మొటిమలు తగ్గును .

• నిమ్మరసమును పాలతో కలిపి రాత్రిపూట ముఖానికి మర్దన చేసుకుని తెల్లవారిన తరువాత లేవగానే గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుగుకొనవలెను . సబ్బు వాడరాదు . ఇలా క్రమం తప్పకుండా చేయుచున్న మచ్చలు , మంగు పోయి ముఖం కాంతివంతం అగును .

• తులసి ఆకుల రసములో కొద్దిగా టంకణం ( Borax ) కలిపి పైకి లేపనం చేయుచున్న ముఖం పైన మచ్చలు , మంగు హరించును .

• మంజిష్ట చూర్ణమును ఆవుపాలతో కలిపి అరగదీసి అందులో కొంచం తేనె కలిపి ముఖమునకు లేపనం చేయుచున్న నల్లమచ్చలు , మంగు హరించును .మరిన్ని అనుభవపూర్వక ఆయుర్వేద ఔషధ చిట్కాల కొరకు మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంధాలు చదవగలరు . 


నిద్రలేమికి సులభ పరిష్కారాలు -

ప్రస్తుతపరిస్థితుల్లో చాలా మంది నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి ప్రధానకారణం మనయొక్క జీవితములో ఎదుర్కొనే ఒత్తిళ్లు కావచ్చు మిగిలిన సమస్యలు ఏవైనా కారణం కావచ్చు. నిద్ర మనిషి జీవితంలో అత్యంత ప్రధానం అయినది. నిద్ర తక్కువ అవ్వడం రోగాలు రావడానికి ప్రధాన కారణం . నిద్ర తక్కువైన మనిషికి త్వరగా వృద్ధాప్య ఛాయలు వచ్చును. కావున వీలయినంత వరకు శరీరానికి విశ్రాంతి ఇవ్వడం మంచిది . అలాంటి విశ్రాంతి కేవలం మంచి నిద్రతోనే లభిస్తుంది. మనలో చాలా మంది నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వారి కోసం ఇప్పుడు నేను చెప్పబోయే యోగాలు చాలా మంచిఫలితాన్ని ఇస్తాయి .

• నిద్రపట్టనప్పుడు ఒక స్పూన్ గసగసాలు వేడిచేసి ఒక గుడ్డలో వేసి మూటకట్టి వాసన చూస్తున్న త్వరలో మంచినిద్ర వచ్చును. మంచి గసగసాలనే వాడండి. మార్కెట్లో తొటకూర విత్తనాలను గసగసాలుగా అమ్ముతున్నారు.

• వెలక్కాయ చిప్పను బియ్యపు కడుగు నీటితో అరగదీసి ఆ గంధాన్ని కణతలకు , నుదురుకు వ్రాసి పడుకున్న నిద్రపట్టును .

• ఉదయం , సాయంత్రం సర్పగంధి వేళ్ళ చూర్ణం పావుస్పూన్ అరకప్పు నీళ్ళలో వేసి తాగుచున్నచో మంచిఫలితం కనిపించును. రక్తపోటు ఉన్నవారికి చాలా అద్భుతంగా పనిచేయును .

• రాత్రి సమయంలో మజ్జిగ లో రెండు నీరుల్లిపాయ ముక్కలను కలుపుకుని లోపలికి తీసుకొండి. మంచి నిద్ర వచ్చును.

• నిద్రపోవడానికి ముందు కప్పు వేడిపాలల్లో అరచెంచా మిరియాల కషాయం కలుపుకుని తాగుచున్న సుఖనిద్ర కలుగును.

• అశ్వగంధ చూర్ణము కూడా బాగా పనిచేయును . ఒక స్పూన్ అశ్వగంధ చూర్ణం ఒక చిన్న గ్లాసు పాలల్లో కలిపి నిద్రపొవడానికి ముందు ప్రతినిత్యం సేవించవలెను .పైన చెప్పిన యోగాలలో మీకు అత్యంత సులభమైన యోగాన్ని తీసుకుని పాటించవచ్చు. సర్పగంధ వేళ్ళ చూర్ణం మీకు ఆయుర్వేద పచారీ సామానులు అమ్మే దుకాణాలలో లభ్యం అగును. 



ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు .



24, మార్చి 2026, మంగళవారం

  శ్రీరామ  (19 - A)


               ( వాల్మీకి రామాయణం  - 12 - A )


🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 సర్వే జనాః సుఖినో భవన్తు 🙏


  (24-3-'26  ' మధ్యాహ్నం ' పోష్టు తరువాయి భాగము)


తల్లి అయిన అహల్య శాపవిమోచనమంది, తండ్రి అయిన గౌతమునితో చేరినందుకు శతానందుడు అపరిమితానందమును పొందాడు.

ఆయన విశ్వామిత్రుని అనేక విధాలుగా స్తుతించాడు.

రాముని ప్రశంసించాడు.

" ఇటువంటి గురువు దొరికిన, నీకంటే ధన్యుడు ఈ లోకములో ఎవ్వడూ లేడు"  అని రాముడితో అన్నాడు.

క్షత్రియుడై జన్మించి తన తపశ్శక్తితో, బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుని చరితము నంతయు శతానందుడు అప్పుడు రామ లక్ష్మణులకు సవిస్తరంగా చెప్పాడు.

ఆ కథ క్లుప్తంగా చెప్పుకుందాము.

కుశిక వంశానికి చెందిన "గాధి" మహారాజు కుమారుడైన విశ్వామిత్రుడు ఒక సందర్భంలో వసిష్ఠ మహర్షి ఆశ్రమానికి వచ్చి ' కామధేనువు ' సహాయంతో తనకు, తన సైన్యానికి వసిష్ఠమహర్షి ఇచ్చిన అద్భుతమైన ఆతిథ్యానికి ఆశ్చర్యపోయాడు.

ఆ "కామధేనువు" ను బలాత్కారంగా అపహరించడానికి ప్రయత్నించి,

కామధేనువు సృష్టించిన సైన్యం చేతిలో ససైన్యంగా ఓడిపోయాడు

అందువల్ల ఏర్పడిన "వసిష్ఠ మహర్షి"  మీది స్పర్థతో, శివుణ్ణి గురించి తపస్సు చేశాడు.

శివుని మెప్పించి, ఆయన అనుగ్రహముతో ధనుర్వేదం పూర్తిగా స్వాధీనం చేసుకున్నాడు.

ఆ అస్త్రబలంతో తిరిగి వసిష్ఠమహర్షి ఆశ్రమానికి వచ్చి దివ్యమైన ఆ ఆశ్రమాన్ని తగలబెట్టాడు. వసిష్ఠుని సంహరించడానికి దివ్యాస్త్రాలు ప్రయోగించాడు.

వసిష్టమహర్షి తన "బ్రహ్మదండం"తో 

ఆ అస్త్రాలను నిర్వీర్యం చేయగా ఆయన మీద "బ్రహ్మాస్త్రం" ప్రయోగించాడు.

ఆ బ్రహ్మాస్త్రాన్ని కూడా వసిష్ఠుడు బ్రహ్మదండంతో  మ్రింగివేశాడు.

బ్రహ్మాస్త్రంతో సహా తన అస్త్రాలన్నీ అలా నిర్వీర్యమవటం చూసి, 

బ్రహ్మ బలం ముందు  క్షత్రియ బలం ఎందుకూ పనికిరాదని విశ్వామిత్రుడు గ్రహించాడు. 

అందువల్ల  "బ్రహ్మర్షి" అవడానికి దక్షిణ దిశకేగి తపస్సు ప్రారంభించాడు.

అక్కడ ఇక్ష్వాకు వంశీకుడైన " త్రిశంకువు" ను సశరీరంగా స్వర్గానికి పంపడం కోసం, వసిష్ఠ పుత్రుల  శాపంతో  "ఛండాలు" డైన, అతని చేత యజ్ఞము చేయించాడు.

ఆ యజ్ఞాన్ని, తనను , ఆక్షేపించిన వసిష్ఠ పుత్రులను, "మహోదయుడు"అనే మహర్షిని శపించాడు.

వేదవిరుద్ధమైనందున ఆ యజ్ఞం విఫలమయింది. హవిర్భాగాలు తీసుకోటానికి దేవతలు రాలేదు.

అప్పుడు తన తపశ్శక్తితో విశ్వామిత్రుడు త్రిశంకువును స్వర్గానికి  పంపాడు.

గురుశాపహతుడైనందున త్రిశంకువును 

స్వర్గం నుండి ఇంద్రుడు త్రోసివేయగా,

తలక్రిందుగా క్రింద పడబోతున్న

ఆయనను తపోబలంతో మధ్యలో ఆపి,

 అతని కోసం విశ్వామిత్రుడు "త్రిశంకు స్వర్గం" నిర్మించి సృష్టికి ప్రతి సృష్టి చేయడం ప్రారంభించాడు.

" ఇంకో ఇంద్రుని సృష్టించేదా ! లేక అసలు ఇంద్రుడనేవాడు లేకుండా చేసేదా !

(అన్యమింద్రం కరిష్యామి, లోకోవాస్యత్ అనింద్రకం)


అని ఆలోచిస్తుండగా భయభ్రాంతులైన దేవతలు విశ్వామిత్రుని శరణుజొచ్చారు.

వారి అభ్యర్థనను మన్నించి విశ్వామిత్రుడు ప్రతిసృష్టి ని నిలిపివేసి,  "త్రిశంకువు" "త్రిశంకు స్వర్గం" లో ఇంద్రభోగాలు అనుభవిస్తూ శాశ్వతంగా ఉండేటట్లు దేవతలను అంగీకరింపజేశాడు.

ఆ ప్రదేశంలో తన తపస్సుకు విఘ్నం వచ్చినందువల్ల విశ్వామిత్రుడు ఆ దక్షిణ దిక్కును వదిలేసి, పశ్చిమ దిశలో "పుష్కర" తీర్థము నందు తిరిగి తపస్సు చేయడం ప్రారంభించాడు.

అక్కడ అయోథ్యాధిపతియైన అంబరీషుడు అను రాజు యజ్ఞపశువుగా  కొనుక్కొని తీసుకు వెళ్తున్న తన అక్క సత్యవతి కుమారుడైన "శునశ్శేఫుని" రక్షించడం కోసం తన పుత్రులలో ఒకరిని యజ్ఞపశువుగా వెళ్లమని అడిగాడు.

వారు నిరాకరించగా స్వంత కుమారులని కూడా చూడకుండా, " ఆటవిక జాతులలో జన్మించి కుక్క మాంసం తింటూ వేలకొలది సంవత్సరాలు గడపండని " వారిని  శపించాడు.

మంత్రోపదేశం చేసి " శునశ్శేఫుని" రక్షించాడు.

తిరిగి గొప్ప తపస్సు చేసి బ్రహ్మ దేవుని చేత 

నీవిప్పుడు" రాజర్షి" నుండి, "ఋషి" వి అయినావు అనిపించుకున్నాడు.

అయితే తన లక్ష్యమైన బ్రహ్మర్షి అవడానికి విశ్వామిత్రుడు తిరిగి తీవ్రంగా తపస్సు ఆరంభించాడు.

విశ్వామిత్రుని తపస్సు భంగం చేయడానికి,

ఇంద్రుని పంపున "మేనక" అనే అప్సరస వచ్చింది.

ఆమె హావభావాలకు లొంగిన విశ్వామిత్రుడు

కామాతురుడై ఒక క్షణం లాగా పది సంవత్సరములు మేనకతో గడిపాడు.

ఒకరోజు హఠాత్తుగా తన తప్పు తెలుసుకొని, ఆమెను త్యజించి,

ఉత్తరదిక్కున ఉన్న హిమాలయములకు వెళ్లి తపస్సు ప్రారంభించాడు.

విశ్వామిత్రుని తీవ్ర తపస్సుకు సంతోషించిన బ్రహ్మ " నీ విప్పుడు మహర్షివి అయ్యావు" అన్నాడు.

"నేను మహర్షిని అయితే, కామ, క్రోధములను జయించినట్లే గదా!"అన్న విశ్వామిత్రునితో

 "నీవు ఇంకా కామ, క్రోధములను జయించలేదు, ప్రయత్నము కొనసాగింపుము" అని బ్రహ్మదేవుడు చెప్పాడు.

విశ్వామిత్రుడు తిరిగి తీవ్రంగా తపస్సు కొనసాగించాడు.

 

అప్పుడు దేవతల పంపున "రంభ" అనే అప్సరస విశ్వామిత్రుని తపస్సు భంగం చేయడానికి వచ్చింది.

అది గ్రహించి పట్టరాని కోపంతో  "రంభ"ను  శిలవై పోదువుగాక అని  విశ్వామిత్రుడు శపించాడు.

అయితే క్రోధమును జయించ లేక పోయినందుకు పశ్చాత్తాపం చెంది, విశ్వామిత్రుడు ఆ ఉత్తర దిక్కును కూడా వదిలేసి, తూర్పు దిక్కుకు వెళ్లి, పూర్తిగా మౌన వ్రతుడై  అక్కడ అతి తీవ్రమైన తపస్సు చేశాడు.

విశ్వామిత్రుని తపస్సుకు జగత్తంతా తపించింది.

దేవతలు, ఋషులు, వెంటరాగా బ్రహ్మ దేవుడు వచ్చి విశ్వామిత్రునితో " నీవు బ్రహ్మర్షి వయ్యావు" అన్నాడు.

విశ్వామిత్రుని కోరికననుసరించి వసిష్ఠమహర్షి కూడా అక్కడికేతెంచి " ఏ సందేహము లేదు. ఇప్పుడు నీవు బ్రహ్మర్షివే " అని సాదరంగా విశ్వామిత్రునితో అన్నాడు.

ఈవిధంగా పవిత్రము, అద్భుతము అయిన విశ్వామిత్ర చరిత్రను శతానందుడు చెప్పగా  రామలక్ష్మణులు, జనకమహారాజుతో సహా సభాసదులందరూ పరమాశ్చర్యానికి లోనయ్యారు.

వారందరు విశ్వామిత్రుని పూజించారు.


                    శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష.

                      ఓం శాన్తి శ్శాన్తి శ్శాన్తిః


(సశేషం)

శుభమస్తు.

తూములూరి మధుసూదనరావు.

24-3-'26

పంచాంగం


 

శ్రీ ఆంజనేయం

 ⚜️🕉️🚩 శ్రీ ఆంజనేయం 🌹🙏


💥హనుమ నామస్మరణం...సర్వపాప నివారణం💥


మనోజవం మారుత తుల్య వేగం

జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం

వాతాత్మజం వానర యూధ ముఖ్యం

శ్రీరామ దూతం శిరసానమామి


🌹వాయువేగ మనో వేగాలతో ప్రయాణించ గలవాడు, ఇంద్రియాలను జయించినవాడు, బుద్ధిమంతుడు,

అందరిలోకి ఉన్నతుడు, వాయుదేవుని పుత్రుడు, వానర యోధులలోకెల్లా ముఖ్యుడు, శ్రీరామ దూత అయిన ఆంజనేయునికి నమస్కరిస్తున్నాను అని దీని అర్థం.

ఈ శ్లోకాన్ని నిత్యం పఠిస్తే సకల భయాలు పోతాయి.

B

భక్తి, శ్రద్ధలతో ఆంజనేయస్వామి ఆరాధన అన్ని రకాల శుభాలను ఇస్తుంది. భయాలను పోగొడుతుంది.🌹🌹

రామాయణం - 11)

 శ్రీరామ (18 )


               ( వాల్మీకి రామాయణం - 11)


🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 సర్వే జనాః సుఖినో భవన్తు 🙏


  (23-3-'26 ' సాయంత్రం ' పోష్టు తరువాయి భాగము)


విశ్వామిత్రుని యాగ సంరక్షణ అయిన మరుసటి రోజు, రామ లక్ష్మణులు, ప్రాతః కాల సంధ్యావందనాది నిత్యకృత్యములు ఆచరించి విశ్వామిత్రునకు నమస్కరించారు.


శ్లో// ఇమౌ స్మ ముని శార్దూల కింకరౌ సముపస్థితౌ/

ఆజ్ఞాపయ యథేష్టం వై శాసనం కరవామ కిమ్//

( ఓ ముని శ్రేష్ఠా! ఇదిగో నీ కింకరులమైన మేము వచ్చాము. ఏమి చేయవలెనో మమ్ము ఆజ్ఞాపించుము).


ఆ విధంగా రామ లక్ష్మణులు అనగానే,విశ్వామిత్రుని అనుజ్ఞ తీసుకుని అక్కడ ఉన్న మహర్షులు, వారితో ఇలా అన్నారు.


" మేమందరము, మిథిలా పట్టణములో, జనకమహారాజు చేస్తున్న యజ్ఞం చూడాలనుకుంటున్నాము.


ఆ జనక మహారాజు దగ్గర అద్భుతమైన శివ ధనస్సు ఉన్నది.


శ్లో//నాస్య దేవా న గన్ధర్వా నాసురా నచ రాక్షసా:/

కర్తు మారోపణం శక్తా న కథంచన మానుషా://


(దేవతలుగాని, గంధర్వులుగాని,అసురులు,రాక్షసులు గాని,ఆ వింటికి శరము సంధించటం, కాదు గదా, కనీసం ఆ ధనస్సును వంచి నారిని కూడా కట్టలేరు.ఇక మనుష్యుల సంగతి వేరే చెప్పనక్కర్లేదు).


వంశ పారంపర్యంగా జనక వంశీయుల చేత పూజలందుకుంటున్న ఆ ధనస్సును, యజ్ఞమును,నీవు కూడా చూద్దువుగాని. మాతోబాటు మిథిలా నగరానికి, మీ ఇరువురు రండి."

అన్నారు.

సంతోషముతో సమ్మతించిన, రామ లక్ష్మణులతోను, ఋషిగణముతోను,విశ్వామిత్ర మహర్షి, సిద్ధాశ్రమ వనదేవతలను పూజించి,ప్రేమతో తమను అనుసరించి వస్తున్న మృగములను,పక్షులను,వెనుకకు పంపించి, మిథిలా పట్టణానికి ప్రయాణం అయ్యాడు.

అనేక దివ్యమైన పుణ్యగాధలను వినిపిస్తూ, దీర్ఘ ప్రయాణము తరువాత విశ్వామిత్రమహర్షి, మిథిలా నగర ప్రవేశం చేశారు.

ఆ నగరాధి దేవతకు నమస్కరించారు.

వారంతా ఆ పట్టణ సమీపమున పాడుబడి ఉన్న ఒక ఆశ్రమాన్ని చూచారు.

ఆ ఆశ్రమాన్ని గురించి రాముడు అడుగగా మహర్షి ఈ విధంగా చెప్పారు.

" రామా! పూర్వము ఇది దివ్యమైన ఆశ్రమము.

అహల్యాదేవీ సమేతుడై గౌతమమహర్షి ఇక్కడ అనేక సంవత్సరములు తపస్సు చేశాడు.

ఒక రోజు గౌతమ మహర్షి నదీ స్నానమునకు వెళ్ళినప్పుడు, దేవేంద్రుడు, గౌతముని రూపంలో, రహస్యముగా ఆశ్రమంలో ప్రవేశించి, గౌతమ మహర్షి భార్య అయిన అహల్యతో సంభోగించాడు.

అతడు ఇంద్రుడని తెలిసినా కామం వల్ల ఏర్పడిన బలహీనత వల్ల,అహల్యాదేవి అడ్డు చెప్పలేదు.

ఇంతలో స్నానం పూర్తి చేసుకుని ఆశ్రమానికి వచ్చిన గౌతమ మహర్షి, తన రూపంతో ఆశ్రమం నుండి బయటకు వస్తున్న దేవేంద్రుని చూచాడు.

జరిగిన దుష్కృత్యాన్ని గ్రహించి తీవ్రమైన కోపంతో " నీ వృషణములు పడిపోవుగాక " అని దేవేంద్రుని శపించాడు.

శ్లో//గౌతమే నైవ ముక్తస్య స రోషేణ, మహాత్మనా/

పేతతుర్వృషణౌ భూమౌ సహస్రాక్షస్య తత్ క్షణాత్//

(గౌతముడు ఈ విధంగా కోపంతో శపించగానే, దేవేంద్రుని వృషణములు, తక్షణమే,నేలపై పడి పోయినవి)

ఉత్తమమైన తపస్సు ఆచరిస్తున్నా, మనోనిగ్రహము సాధించలేక అధర్మకార్యం చేసిన అహల్యను, "చాలా కాలం పాటు, ఎవరికీ కనిపించకుండా, వాయు భక్షణ చేస్తూ ఈ ఆశ్రమంలో తపస్సు చేస్తూ ఉండు.

శ్లో//యదా చై తద్వనం ఘోరం రామో దశరథాత్మజః/

ఆగమిష్యతి దుర్ధర్షః తదా పూతా భవిష్యసి//

(నరసంచారంలేకుండా భయంకరంగా అయిన ఈ వనానికి దశరథ కుమారుడైన రాముడు ఎప్పుడు వస్తాడో, అప్పుడు నీవు కల్మషములన్నీ పోయి,పవిత్రురాలవు కాగలవు) "

ఈవిధంగా ఇంద్రుని, అహల్యను,శపించి, గౌతమ మహర్షి, ఆశ్రమమును విడిచిపెట్టి, తపస్సు చేసుకోవడానికి హిమాలయ పర్వతములకు,వెళ్ళాడు.

నాయనా!రామా! పుణ్యాత్ముడైన ఈ గౌతముని ఆశ్రమంలో ప్రవేశించు. 

అత్యంత సౌందర్యవతి,గొప్ప సౌభాగ్యవతి, అయిన అహల్యను తరింపజేయుము" అన్నాడు.

ఆ మాటలు విని లక్ష్మణ సమేతుడైన రాముడు, విశ్వామిత్రుని వెనుక నడచుచు ఆ ఆశ్రమములో ప్రవేశించాడు.

ఆ ఆశ్రమంలో రాముడు అడుగు పెట్టగానే,

గౌతముని శాపం సమాప్తమైనది.

దివ్యకాంతులతో అహల్యాదేవి కనిపించింది.

తపస్సు చేత అమె దివ్యతేజస్సుతో మెరిసిపోతోంది.

దేవాసురమానవులు, కనులు మిరుమిట్లు గొలిపే ఆ కాంతిని చూడ లేకుండా వున్నారు. 


శ్లో//శాపస్యాంతముపాగమ్య తేషామ్ దర్శన మాగతా/

రాఘవౌ తు తతస్తస్యాః పాదౌ జగృహతుస్తదా//


(గౌతమ మహర్షి శాపం తొలగి పోవడంవల్ల, రామ లక్ష్మణులకు అహల్యాదేవి కనిపించింది. వారిద్దరూ ఆమె రెండు పాదములను పట్టుకుని నమస్కరించారు).


అహల్యాదేవి గౌతమ మహర్షి వచనములను స్మరించి, శాస్త్రంలో చెప్పిన ప్రకారం వారికి,మిక్కిలి భక్తి,శ్రద్ధలతో ఆర్ఘ్య పాద్యాలుఇచ్చి, అతిధి పూజ చేసింది.

రాముడు ఆ అతిధి పూజ స్వీకరించాడు.

తత్ క్షణమే గౌతమ మహర్షి అక్కడ ప్రత్యక్షమైనాడు.

పరమానందంతో అహల్యను తిరిగి స్వీకరించాడు.

ఆ శుభ సమయంలో,

శ్లో//పుష్ప వృష్టి ర్మహ త్యాసీత్ దేవ దుందుభి నిస్స్వనై:/

గంధర్వాప్సరసాం చైవ మహానాసీత్సమాగమ://

(దేవ దుందుభులు మ్రోగినై. పుష్పవృష్టి కురిసింది. గంధర్వులు, అప్సరసలు, ఆట పాటలతో సమాగమమయ్యారు).


శ్లో//సాధు సాధ్వితి దేవాస్తామహల్యాం సమపూజయన్/

తపోబల విశుధ్ధాంగీం గౌతమస్య వశానుగామ్//

(తపోబలంతో పవిత్రురాలైనది, గౌతమ మహర్షితో కూడినది, అయిన ఆ అహల్యాదేవిని "బాగు, బాగు" అని నుతిస్తూ దేవతలందరూ పూజించారు)


ఆ తరువాత గౌతమ మహర్షి, అహల్యాదేవితో కలిసి రాముని యధావిధిగా పూజించాడు.

యథా శాస్త్రముగా చేయబడిన ఆ పూజను రాముడు స్వీకరించాడు.


ఆ విధంగా వారిద్దరి అతిధ్యము స్వీకరించిన రామ లక్ష్మణులు, విశ్వామిత్రమహర్షి, మిక్కిలి ఆనందముతో మిథిలా పట్టణానికి వెళ్లారు.


                      శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష.

                        ఓం శా న్తి శ్శాన్తి శ్శాన్తిః


(సశేషం)

శుభమస్తు,

తూములూరి మధుసూదనరావు,

24-3-'26

క్రియాశీలకత్వం

   


క్రియాశీలకత్వం అంటే ఏదైనా పనిచేయాలనే భావన. మనుషులు శక్తిమంతులు చురుకుదనం కలవారికి మాత్రమే క్రియాశీలకత్వం ఉంటుంది. క్రియాశీలకత్వం వున్న మనుషులు ఎల్లప్పుడూ చురుకుగా ఆలోచిస్తూవుంటారు. ఏ కార్యం చేస్తే ఏ ఫలితం వస్తుంది అని ఆలోచించి తదనుగుణంగా ఒక ప్రణాళికాబద్ధంగా నిర్ణయాలు తీసుకుంటారు.


 


క్రియా శీలకత్వమే లక్ష్మీదేవి నివాసాలు ఇది వినటానికి ఆశ్చర్యంగా కనిపిస్తున్నది కదా కానీ ఇది ముమ్మాటికీ నిజం. ముందుగా త్రిమూర్తులను గూర్చి తెలుసుకుందాము. మొదటగా బ్రహ్మగారు ఆయనగారు సృష్టి రచన చేస్తారు అది మనందరికీ తెలుసు. ఆయన ధర్మపత్ని సరస్వతీదేవిగారు అమ్మగారు చదువుల తల్లి. సృష్టి రచనచేయటానికి కావలసింది జ్ఞ్యానం అందుకే ఆయనకు సహధర్మచారిణిగా వున్న తల్లి చదువుల తల్లి, తరువాత విష్ణుమూర్తిగారు ఆయన స్థితికారకుడు అంటే బ్రహ్మ సృష్టించిన సృష్టిని నిర్వహించే (మేనేజ్) దేముడు ఒక సంస్థానిర్వహించాలంటే కావలసింది ధనం అంటే సంపద కాబట్టి ఆయనగారి ధర్మపత్ని లక్ష్మీదేవిగారు ఆ తల్లి సకల సంపదలకు కారకురాలు. ఇక మూడవ దేవుడు పరమశివుడుగారు ఆయన పని లయకారకుడు అనగా సృష్టిని నశింపచేయటం అట్లా చేయాలంటే కావలసింది శక్తీ శక్తిలేకుండా వినాశనం జరగదు అది మనందరికీ తెలుసు అందుకే ఆ దేవదేవుడు పత్ని పార్వతీదేవి ఆ తల్లి శక్తి స్వరూపిణి. ఇటువంటి క్రమాన్ని మనకు అందించిన వేదాలు, మన మహర్షులు ఎంతటి మేధావులొకదా 


యతిభావం తత్ భవతి అనే ఆర్యోక్తి ననుసరించి మనం ఏ దేవుడిని లేక ఏదేవతను ఆరాధిస్తామో ఆ దేవీదేవతలు మనకు ప్రసన్నలై వారి ఆధిపత్యంలో వున్న శక్తిని మనకు ప్రసాదిస్తారు. అంటే చదువు కొరకు సరస్వతి అమ్మవారిని, సంపదలకొరకు లక్ష్మి అమ్మవారిని అదేవిధంగా శక్తికొరకు పార్వతి తల్లిని మనం కొలవటం కద్దు. 


ప్రతి పురుషుని ప్రయోజకత్వంలో తన ధర్మపత్ని సహాయసహకారాలు ఉంటాయి అంతేకాదు నడిపేశక్తి కేవలం అంటే కేవలం స్త్రీమూర్తిదే అదే మనం మనదేవుళ్ల ద్వారా తెలుసుకోవచ్చు. 


ఇక విషయానికి వస్తే క్రియాశీలత్వము అంటే ఒక కార్యం చేయాలనే భావన ఆ భావనే మనం లక్ష్మి అమ్మవారుగా భావించవచ్చు అదెట్లాగో తెలుసుకుందాం. 


నీవు నీ ఇంటిని వదిలి ఏదో ఊరుకు వెళ్లి కొంతకాలం తరువాత తిరిగి వచ్చావు అప్పుడు తలుపు తీయంగానే ఇల్లు మొత్తం దుమ్ము దూళితో పేరుకొని వుంది నీ శ్రీమతి వెంటనే మీరు కాసేపు బయట వుండండి ముందు ఇల్లు ఊడుస్తాను అని అనటం పరిపాటి. ఇల్లు ఊడవాలి అనే భావనే క్రియాశీలత్వం దానిని అమలు చేసినతరువాతే అంటే ఊడ్చిన తరువాతే ఇల్లు పరిశుభ్రంగా వున్నది. ఇటువంటివి కోకొల్లలుగా మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అందుకే మానధర్మంలో గృహిణిని గృహలక్ష్మి అని పేర్కొన్నారు అని అనిపిస్తుంది. 


ఫలానా వారి అబ్బాయికి పెండ్లి అయిందిగా వాళ్ళ కోడలిని చూసావా యెట్లా ఉంటుంది అని ఒకామె అడిగితె దానికి ఆమె స్నేహితురాలు ఇచ్చే జవాబు అమ్మాయి చక్కగా వుంది సాక్షాత్తు లక్షిం దేవిలా వుంది అనటం మనం చూస్తూ ఉంటాము. నిజానికి ప్రపంచంలో ఎవ్వరు లక్ష్మి అమ్మవారిని చూడలేదు మరి ఎలా అలా అంటారు అంటే మనం లక్ష్మి అమ్మవారికి కొన్ని గుణాలను ఉంటాయి అని తెలుసుకున్నాము కాబట్టి అటువంటి సద్గుణాలు వున్న స్త్రీలను ఆ తల్లితో పోలుస్తూవుంటాము. 


ప్రతి గృహస్తు తన దైనందిక జీవితాన్ని సుఖవంతంగా గడపటానికి ఏ ఉద్యోగమో, వ్యాపారమో చేయక తప్పదు. గడియారం ముల్లులాగా పరిగెత్తక తప్పదు అందుకే లక్ష్మీదేవిలాంటి సహధర్మచారిణి లభించి ప్రతి విషయంలోనూ తనక్రియాశీలకత్వాన్ని చూపెడితే ఆ పురుషుడు పురుషార్ధాలను సాధించగలడు. 


భర్త ఏదైనా కార్యార్థిగా వెళుతుంటే తన కార్యం సఫలంకావాలనే ఆపేక్షతో పత్నిని ఎదురు రమ్మనటం మన సాంప్రదాయం దానికి అర్ధం తన భార్య లక్ష్మి దేవిలాగా చక్కగా నుదిటిన కుంకుమ దిద్దుకొని, కురుల పువ్వులు పెట్టుకొని చేతులకు గాజులు వేసుకొని మనోహారిగా ఉన్న భార్య ముఖకమలం చూసి తన కార్యోన్ముఖుడు అయితే ఆ రోజంతా మనస్సు ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉండి తానూ చేసే పనిమీద మనసు లగ్నాత చేయగలడు. తత్వారా కార్యసిద్ధి కలుగుతుంది. మన సాంప్రదాయంలో స్త్రీలకు మహోన్నత స్థానాన్ని ఇచ్చారు 


యత్ర నార్యంతు పూజ్యతే, రమంతే తత్ర దేవత..' అంటే ఎక్కడ నారీ మణులు పూజింప బడుతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని.. భారత్‌లో పురాణాలు, ధర్మ శాస్త్రాలు చెప్పాయి. మన భారతీయ సంస్కృతీ స్త్రీ శక్తిని వేదకాలంలోనే పేర్కొన్నాయి. పురుషుని అభివృద్ధికి స్త్రీమూర్తే కారణం అదేవిధంగా స్త్రీ పౌభాగ్యానికి పురుషుడు కారకుడు. 


లక్ష్మి నివాసాలు 


గురు భక్తి .దేవ భక్తి .మాతాపితృ భక్తి .కలవారిలో లక్ష్మీ కటాక్షం ఉంటుంది.

అతి నిద్ర లేని వారిలో. ఉత్సాహం .చురుకుదనం. ఉన్నవారిలో లక్ష్మీకళ ఉంటుంది.

ముగ్గు. పసుపు .కుంకుమ. పువ్వులు .పళ్ళు .పాలు లక్ష్మి స్థానాలు.

దీపం .ధూపం .మంగళ ద్రవ్యాలు .ఆ తల్లికి నివాసాలు.

పాత్ర శుద్ధి శుభ్ర వస్త్రధారణ కలిగిన ఇల్లు అమ్మవారి నివాస స్థలం.

బుద్ధి .ధైర్యం .నీతి .శ్రర్థ.గౌరవించే స్వభావం .శాంతి. లక్ష్మి ని పెంచే శక్తులు.

సంతృప్తి లక్ష్మికి ప్రధాన నివాసం.


దీనిని పట్టి మనకు అర్ధం అయ్యేది ఏమిటంటే లక్మి దేవి మంగళకారిని సకల శుభాలకు కారణం లక్షి అమ్మవారి ఆ తల్లి అంటే చురుకుదనం, ఉత్సాహం, సత్వగుణం, శాంత స్వభావం, నిజాయితీ, ధర్మాచరణ ఇటువంటి గుణాలు అంటే ఇవ్వన్నీ కూడా క్రియాశీలకత్వమే కానీ వేఱొక్కటి కాదు. భార్గవశర్మ చెప్పేది ఏమిటంటే ప్రతి వారు క్రియాశీలకత్వాన్ని పెంపొందించుకుంటే జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించగలరు. 

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణము - వసంత ఋతువు - చైత్ర మాసం - శుక్ల పక్షం - ‌షష్టి - రోహిణీ -‌‌ బౌమ వాసరే* (24.03.2026)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, ఈ 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.




 

.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

---------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

హనుమఅశోక

 🌸హనుమఅశోక వనంలో ఉన్న సీతాదేవిని దర్శించిన సందర్భం



కడలిని దాటియు హనుమయు కడువేగమునన్.ధరణిజ కడకేగియు నా

గడుసరి రక్కసుల దునిమి 

 కడకును రామునికథనిక కమ్మగచెప్పెన్


సాహితీ శ్రీ జయలక్ష్మి🌸రామలక్ష్మణులను హనుమ సుగ్రీవునికి పరిచయము చేయు సందర్భము 


కనులారగతిలకింపుడు

జనితోడ్కొనితెచ్చితిటకు సంతోషముగన్

 ఘనులగు దశరథ తనయులు 

నినుకలయగవచ్చినారునృప సుగ్రీవా


సాహితీ శ్రీ జయలక్ష్మి

రామాయ‌ణ

 శ్రీ‌శ్రీ‌శ్రీ‌

           *ఇంటింటా రామాయ‌ణ*

*దివ్య‌క‌థా పారాయ‌ణ‌ము*


 **


           *6వ‌రోజు*


    *మహిమాన్విత* *సుంద‌ర‌కాండ కొనసాగింపు*


 *రామయ్యకు శుభవార్త*

               ***

          🌸🌸🌸🌸🌸


శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం

సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం

ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం

రామం నిశాచర వినాశకరం నమామి.

                ***

మనోజవం మారుత తుల్యవేగం

జితేంద్రియం బుద్ధిమతాం పరిష్టమ్ !

వాతాత్మజం వానరయూధ ముఖ్యం

శ్రీరామదూతం శిరసా సమామి

              ***


లంకలోని అశోక వనం లో సీతామాత‌ దర్శనం కలిగి, ఆమె ఆశీస్సులు అంద‌డంతో హ‌నుంతుడు ప‌ట్ట‌రాని సంతోషంతో గంతులు వేశాడు. ఇక పనిలో పనిగా రావణునిచూసి రావ‌ణుడి శ‌క్తిసామ‌ర్థ్యాల‌ను తెలుసుకోవాల‌నుకున్నాడు. రావ‌ణుడితో ముఖాముఖి మాట్లాడాల‌నుకున్నాడు. అలాగే యుద్ధ వ్యూహంతో లంకను పరిశీలించాల‌ని నిశ్చయించుకొన్నాడు. అలా చేయడం వల్ల రావణుడిని హెచ్చరించడానికీ, లంక రక్షణా వ్యవస్థను తెలుసుకోవడానికీ వీలవుతుందనుకున్నాడు. అంతే గాకుండా ఆ ప్రయత్నంలో లంకకు వీలయినంత నష్టం కలిగించవచ్చు నని భావించాడు. ఇలా సంకల్పించిన హనుమంతుడు వెంటనే ఉగ్రాకారుడై అశోకవనాన్ని ధ్వంసం చేశాడు, అడ్డు వచ్చిన వేలాదిమంది రాక్షసులను పిడిగుద్దులు గుద్ది మకరతోరణాన్ని అధిష్ఠించి కూర్చున్నాడు.


ఈ వింత వాన‌రాన్ని బంధించమని రావణుడు అపార సైన్యాన్నిపంపాడు. హనుమంతుడు వెంటనే,

 *జయత్యతిబలో రామో,* 

*లక్ష్మణశ్చ మహాబల:,*

 *రాజా జయతి సుగ్రీవో,*

 *రాఘవేణాభిపాలిత:,*

 *దాసోహం కోసలేంద్రస్య,* 

*రామస్యా క్లిష్ట కర్మణః,*

 *హనుమాన్ శత్రు సైన్యానాం,*

 *నిహన్తా మారుతాత్మజః అని* జయఘోష చేశాడు -


 మహా బలవంతుడైన శ్రీరామునకు జయము. 

మిక్కిలి పరాక్రమశాలియైన లక్ష్మణునకు జయము. రాఘవుల విధేయుడైన కిష్కింధ ప్రభువు సుగ్రీవునకు జయము. 

నేను శ్రీరామ దాసుడను, వాయుపుత్రుడను, హనుమంతుడను. శత్రు సైన్యాన్ని నాశనం చేస్తాను. వేయి మంది రావణులైనా యుద్ధంలో నన్నెదిరించలేరు. వేల కొలది శిలలతోను, వృక్షాలతోను సకల రాక్షసులను, లంకాపురిని ఒక్కదెబ్బతో నాశనం చేస్తాను. నా పని ముగించుకొని, సీతమ్మకు నమస్కరించి వెళతాను. రాక్షసులు ఏమీ చేయలేక చూచుచుందురు గాక - అంటూ.... గర్జిస్తూ హనుమంతుడు లంక ముఖద్వారానికి బిగించిన ఇనుప గడియతో రాక్షసులనందరినీ చావ చితకగొట్టాడు. పర్వతాకారంలో దేహాన్ని పెంచి, చైత్య ప్రాసాదాన్ని కూలగొట్టి, ఆ ప్రాసాద పెద్ద స్తంభాన్ని పరిఘలా త్రిప్పుతూ అందరినీ చావగొట్టాడు.

అప్పుడు రావణుడు విషయం తెలుసుకుని, ప్రహస్తుని కుమారుడు, మహా బలశాలీ అయిన జంబుమాలిని పంపాడు. హనుమంతుని చేతి పరిఘతో జంబుమాలి శరీరం చూర్ణమయ్యింది. ఆపై అగ్నివలె తేజరిల్లే యుద్ధవిద్యా నిపుణులైన ఏడుగురు మంత్రి పుత్రులు పెద్ద సేనతో కలిసి హనుమంతునిపై దండెత్తారు. హనుమంతుడు భయంకరంగా గర్జించి కొందరిని అర‌చేతితోను, కొందరిని ముష్టిఘాతాలతోను, కొందరిని తన వాడిగోళ్ళతోనూ చంపగా లంకాప‌ట్ట‌ణ వీధులు రాక్ష‌సుల‌ రక్త మాంసాలతో నిండిపోయాయి.

 పిమ్మట విరూపాక్షుడు, యూపాక్షుడు, దుర్ధరుడు, ప్రఘసుడు, భాసకర్ణుడు అనే గొప్ప సేనా నాయకులు తమ సేనలతో వచ్చి వన ముఖ ద్వారంపై కూర్చున్న హనుమంతునిపై విజృంభించారు. వారంతా కూడా హనుమ చేతిలో ప్రాణాలు కోల్పోయారు. రణ భూమి అంతా రాక్షస కళేబరాలతోను, ఆయుధ, రథ శకలాలతోను నిండిపోయింది.


*అక్ష‌కుమారుడితో భీకర‌స‌మ‌రం*


ఇక లాభం లేద‌నుకుని అక్షకుమారుడు సకలబలములతో హనుమంతుని సమీపించాడు. వారి మధ్య జరిగిన యుద్ధం సురాసురులను సంభ్రమపరచింది. అక్షకుమారుడు హ‌నుమంతుడిపై బాణాల వ‌ర్షం కురిపించాడు. అవి హనుమంతుని చాలా నొప్పించాయి. అతని పరాక్రమానికి హనుమంతుడు ముచ్చటపడ్డాడు. అంతటి పరాక్రమశాలిని, తేజోమయుని చంపడానికి తటపటాయించాడు. కాని అతనిని ఉపేక్షిస్తే తనకు పరాభవం తప్పదని తెలిసికొని హనుమంతుడు విజృంభించాడు. ఆకాశానికెగిరి వాయువేగంతో సంచరిస్తూ అరచేతితో అక్షకుమారుని అతని గుర్రాలను చరచి చంపేశాడు. తరువాత, గరుత్మంతుడు మహా సర్పాన్ని పట్టుకొన్నట్లుగా అక్షకుమారుని కాళ్ళను గట్టిగా చేజిక్కించుకొని, గిరగిర త్రిప్పి నేలకు విసరికొట్టాడు. అక్షకుమారుని శరీరం నుగ్గునుగ్గయ్యింది.


*ఇంద్ర‌జిత్తుతో యుద్ధం:*


అక్ష‌కుమారుడు మ‌ర‌ణించిన సంగ‌తి తెలుసుకుని రావణుడు కలవరపడడ్డాడు. ఇదెక్క‌డి వాన‌రం రా అని త‌ల‌ప‌ట్టుకున్నాడు. పెక్కు జాగ్రత్తలు చెప్పి, త‌న కుమారుడైన‌ ఇంద్రజిత్తును యుద్ధానికి పంపాడు. ఇంద్రజిత్తు బ్రహ్మవర సంపన్నుడు. ఇంద్రాదులకు కూడా నిలువరింప శక్యంగాని పరాక్రమశాలి, మంత్ర తంత్ర యుద్ధవిద్యానిపుణుడు. అతడు తన తండ్రి యైన రావ‌ణాసురుడికి నమస్కరించి, రణోత్సాహంతో పొంగిపోతూ, సేనలు లేకుండా ఒకడే దివ్యరథాన్ని అధిరోహించి హనుమంతునిపైకి వెళ్ళాడు. వారిద్దరి మధ్య యుద్ధం చిత్ర విచిత్ర రీతులలో సకల గణాలకు సంభ్రమం కలిగించింది. ఒకరిని ఒకరు జయించడం అశక్యమని ఇద్దరికీ తెలిసిపోయింది. ఇక లాభం లేదు, కనీసం ఆ వానరుని బంధించాలని సంకల్పించి ,ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అది హనుమంతుని బంధించింది. బ్రహ్మ హనుమంతునకిచ్చిన వరం ప్రకారం ,ఆ అస్త్రం అతనిని బాధించకుండా మరుక్షణమే తొలగిపోయింది. అయినా బ్రహ్మదేవునిపట్ల గౌరవసూచకంగా ఆ అస్త్రానికి కట్టుబడిపోయినట్లుగా హ‌నుమంతుడు నటించాడు. ఆ విధంగా రావణునితో మాట్లాడే అవ‌కాశం దొరుకుతుంద‌ని హనుమ తాను బంధింపబడినట్టు నటించాడు. రాక్షస సేనలు హనుమంతుని రావణుని సభా ప్రాంగణానికి తీసుకుపోయాయి.


*రావణునితో సంవాదం :*

బ్రహ్మాస్త్రానికి వశుడైనట్లు నటించి, హనుమంతుడు రావణుని సభాభవనంలోకి ప్రవేశించి రావణుని చూశాడు. రావణాసురుని సభాప్రాంగణం మణిమయమై శోభిల్లుతున్నది. రావణుని కిరీటం, ఆభరణాలు, వస్త్రాలు, అత్యద్భుతంగా ఉన్నాయి. మహా తేజశ్శాలి, వీరుడును అయిన‌ రావణుడు పది శిరస్సులు క‌లిగి ఉన్నాడు. ద‌శ కంఠుడు. మణిమయాలంకృతమైన ఉన్నతాసనంపై కూర్చొని ఉన్నాడు. మంత్రాంగ నిపుణులైన నలుగురు మంత్రులచే పరివేష్టితుడై కాటుక కొండవలె ఉన్నాడు. అప్పుడు హనుమంతుడు ఇలా అనుకొన్నాడు. - ’ఆహా! ఈ రావణుని రూపం అత్యద్భుతం. ధైర్యం నిరుపమానం. సత్వం ప్రశంసార్హం. తేజస్సు అసదృశం. నిజముగా ఈ రాక్షస రాజు సర్వ లక్షణ శోభితుడు. అధర్మానికి ఒడి గట్టకపోతే సురలోకానికి సైతం ఇతను ప్రభువయ్యేవాడు. లోకాలన్నీ ఇతనికి భయపడుతున్నాయి. ఇతడు కృద్ధుడైనచో సమస్త జగత్తునూ సముద్రమున ముంచి ప్రళయం సృష్టించగల సమర్ధుడు గదా!’ అని అనుకున్నాడు.

రావ‌ణుడు హ‌నుమంతుడిని చూశాడు. కళ్లెర్ర చేసాడు.

హనుమంతుడు ఎవరు? ఎందుకు వచ్చాడు? ఇత‌నిని ఎవరు పంపారు? - తెలుసుకోమని రావణుడు తన మంత్రులను ఆదేశించాడు. హనుమంతుడు రావణునకు ఇలా చెప్పాడు - రాజా! నేను సుగ్రీవుడి మంత్రిని. రాముని దూతను. హనుమంతుడనే వానరుడను. నీ కుశలము తెలిసికొమ్మని సుగ్రీవుడు స్నేహ భావంతో చెప్పాడు. రాముని పత్ని అయిన సీతను అప‌హ‌రించితెచ్చి నువ్వు పెద్ద తప్పిదం చేశావు. దీని వలన నీవు చేసుకొన్న పుణ్యమంతా నిష్ఫలమై పోతున్న‌ది. 

వాలి అంతటి వాడిని రాముడు సంహరించాడు. రాముని బాణాల ధాటికి నీవు గాని, మరెవరు గాని నిలువజాలరు. ఈ అకృత్యం వలన నీకూ,ఈ లంకకూ చేటు దాపురించింది. రాముడు మానవుడు. నీవు రాక్షసుడవు. నేను వానరుడను, నాకు పక్షపాతం లేదు. కనుక నా మాట విని సీతను రాముడికి అప్పగించి రాముని శరణు వేడుకో. రాముని క్రోధానికి గురియైనవానిని ముల్లోకాలలో ఎవరూ రక్షింపజాలరు. - అని హితవు చెప్పాడు.

ఆ మాట వింటూనే రావణుడు కోపించి ఆ వానరుని చంపమని ఆదేశించాడు. అంతలో విభీషణుడు అడ్డుపడి - దూతను చంపడం రాజ ధర్మం కాదు అన్నాడు. అంతే కాకుండా హ‌నుమంతుడు తిరిగి వెళ్ళకపోతే ,సోదరా నువ్వు శతృవులతో యుద్ధం చేసి వారిని ఓడించే అవకాశం కోల్పోతావు. కనుక, హ‌నుమంతుడిని దండించి వదిలివేయ‌మ‌ని రావణుడికి విభీషణుడు సూచించాడు. ఆ మాటలకు కాస్త నెమ్మదించిన రావణుడు ఆ వానరుని తోకకు నిప్పంటించి ఊరంతా త్రిప్పమని ఆదేశించాడు..


*లంకా దహనం*


 రాక్షస కింకరులు హనుమంతుని తోకకు పాత గుడ్డలు చుట్టి నిప్పు పెట్టారు. ఊరంతా త్రిప్పసాగారు. ఈ అవకాశం చూసుకొని హనుమంతుడు లంకా నగరాన్ని నిశితంగా పరిశీలించాడు. జరిగిన సంగతి విన్న సీతాదేవి క‌ల‌వ‌ర‌ప‌డింది. హనుమంతుని చల్లగా చూడమని అగ్నిదేవుని ప్రార్థించింది. తన తోక కాలుతున్నా గాని ఏ మాత్రం బాధ లేకపోవడం సీతమ్మ మహిమ వలన అని, తన తండ్రి వాయుదేవుని మిత్రుడైన అగ్ని కరుణ వలన అని గ్రహించిన హనుమంతుడు ఆ అగ్నికి లంకను ఆహుతి చేయాలని సంకల్పించాడు. తన బంధాలను త్రెంచుకొని, ఒక పరిఘతో రాక్షస మూకను చావబాదాడు. పైకెగిరి, మండుతున్న సూర్యునిలా విజృంభించాడు. ప్రహస్తుని ఇంటితో మొదలుపెట్టి లంకలోని అద్భుతభవనాలకు వరుసగా నిప్పంటించాడు. ఒక్క విభీషణుని ఇల్లు తప్ప లంకలో భవనాలను అన్నిటినీ బుగ్గిపాలు చేశాడు.


అప్పుడు ఒక్కమారుగా సీత సంగతి గుర్తుకు వచ్చి హనుమంతుడు హతాశుడయ్యాడు. 

తన తొందరపాటువలన లంకతో పాటు సీతమ్మ కూడా అగ్నికి ఆహుతయ్యిందేమో అన్న భ‌యంతో విలవిలలాడిపోయాడు. తన చాంచల్యం వలన తన జాతికి, పనికి కీడు తెచ్చినందుకు రోదించి ప్రాణత్యాగానికి సిద్ధమయ్యాడు. కాని సీత క్షేమంగా ఉన్నదని తెలిసి, ఊరట చెందాడు. మరొక్కమారు సీతమ్మవారిని దర్శించదానికి వెళ్ళాడు. ఆమెకు సాంత్వన వచనాలు పలికి, రాముడు సకల వానరసేనతో త్వరలో లంకపై దండెత్తి రాగలడని మ‌రోమారు చెప్పి సీత‌మ్మ పాదాల‌కు న‌మ‌స్క‌రించి, ఉత్తరదిశకు హనుమంతుడు తిరుగు ప్రయాణం అయ్యాడు .


ఇలా హనుమంతుడు ,రాముని దూతగా సాగరాన్ని లంఘించి, సీతమ్మను కనుగొని, రాక్షసులను సంహరించి, లంకాద‌హ‌నం చేసి, రావణుని మదమణచి, సీతమ్మకు సాంత్వన కూర్చి, తిరుగు ప్రయాణానికి అరిష్టము అనే పర్వతాన్ని అధిరోహించాడు.


*తిరుగు ప్ర‌యాణం:*


హనుమంతుడి పద ఘట్టనంతో అరిష్ట పర్వతం నేలలో క్రుంగిపోయింది. ఒక మహానౌక సముద్రాన్ని దాటినట్లుగా హనుమంతుడు సునాయాసంగా ఆకాశాన్ని దాటాడు. దారిలో మైనాక పర్వతాన్ని గౌరవంగా స్పృశించి, ఉత్తర సాగర తీరం సమీపించగానే పెద్దయెత్తున గర్జించాడు. ఆ కేక విని జాంబవంతాదులు ఇది హనుమంతుని విజయసూచక ధ్వానమని గ్రహించి హర్షంతో గంతులు వేయసాగారు. 

మేఘంలాగా హనుమంతుడు మహేంద్రగిరిపై దిగి గురువులకు, జాంబవంతాది వృద్ధులకు, యువరాజు అంగదునకు ప్రణామం చేశాడు. హనుమంతుడు 

*కనుగొంటి సీతమ్మను* అని అన్నాడు. ఆమె రాక్షసుల బందీయై, రాముని కొరకు ఎదురు చూస్తూ కృశించియున్నది. " అని హనుమంతుడు చెప్పాడు. *"కనుగొంటిని"* అన్న హనుమంతుడిమాటలతో వానరు లందరూ పరమానందము పొందారు. అతనిని కౌగలించుకొని సంతోషంతో చిందులు వేశారు. తరువాత తన లంకా నగర సందర్శన విశేషాలను అన్నింటినీ తన బృందంలోనివారికి వివరంగా చెప్పాడు హనుమంతుడు.


ఇంక అంతా కలసి వెళ్ళి లంకను నాశనం చేసి, రావణుని ఓడించి, సీతమ్మను తెచ్చి రామునకు అప్పగించాలని అంగదుడు అభిప్రాయపడ్డాడు. కాని జాంబవంతుడు అందుకు వారించి, ముందుగా జరిగిన సంగతిని రామునకు, సుగ్రీవునకు నివేదించ‌డ‌మే సరైనపని అని ఆ తర్వాత ఏం చేయాలో వారు సూచిస్తారని చెప్పాడు. అందరూ సంరంభంగా కిష్కింధకు బయలుదేరారు.

*మధువనం:*

సీత జాడ తెలియడం వలన అంగదాది వానరులంతా ఉత్సాహంగా హనుమంతుని వెంట‌బెట్టుకుని కిష్కింధకు బయలుదేరారు. దారిలో మధువనమనే మనోహరమైన వనాన్ని చేరుకొన్నారు. అది సుగ్రీవునిది. దధిముఖుడనే వృద్ధ వానర వీరుని పరిరక్షణలో ఉంది. అంగదుని అనుమతితో వానరులంతా ఆ వనంలో ఫలాలను కోసుకొని తింటూ, మధువులను గ్రోలుతూ, చిందులు వేస్తూ, వనాన్ని ధ్వంసం చేయసాగారు. అడ్డు వచ్చిన దధిముఖుని తీవ్రంగా దండించారు. దిక్కు తోచని దధిముఖుడు తన తోటి వన రక్షకులతో కలిసి వేగంగా సుగ్రీవుని వద్దకు ఎగిరిపోయి జరిగిన అకృత్యం గురించి మొరపెట్టుకొన్నాడు.


సీతాన్వేషణా కార్యం సఫలమయి ఉండకపోతే తన భృత్యులైన వానరులు అంతటి సాహసం చేయజాలరని సుగ్రీవుడు ఊహించాడు. వనభంగం అనే నెపంతో దధిముఖుడు సీతాన్వేషణా సాఫల్య సమాచారాన్ని ముందుగా సూచిస్తున్నాడని, శుభవార్త వినే అవకాశం ఉన్నదని రామలక్ష్మణులకు సుగ్రీవుడు చెప్పాడు. శుభవార్త తెలిపినందుకు దధిముఖుని అభినందించాడు. దధిముఖుడు మధువనానికి తిరిగి వెళ్ళి అంగదాదులతో సాదరంగా మాట్లాడి త్వరగా సుగ్రీవుని వద్దకు వెళ్ళమన్నాడు. అంగదుడు, హనుమంతుడు, తక్కిన బృందం రివ్వున ఆకాశానికెగిరి ఝంఝూమారుతంలాగా సుగ్రీవుని వద్దకు బయలుదేరారు.


*రాముడికి శుభవార్త*

*సీతమ్మ‌ జాడ తెలుపుట:*


అంగదాది ప్రముఖులు, హనుమంతుడు మహోత్సాహంతో సుగ్రీవుడు, రామలక్ష్మణులు మొదలైనవారున్న ప్రస్రవణగిరిపై దిగారు. *దృష్టా దేవీ (చూచాను సీతమ్మను)* అని హనుమంతుడు చెప్పగానే రామలక్ష్మణులు మహదానంద భరితులయ్యారు. హనుమంతుని కార్య సాధనపై విశ్వాసము గల లక్ష్మణుడు సుగ్రీవునివంక ఆదరంగా చూశాడు. తక్కిన వానరుల ప్రోద్బలంతో హనుమంతుడు దక్షిణ దిక్కుకు తిరిగి సీతమ్మకు ప్రణమిల్లి, ఆమె ఇచ్చిన చూడామణిని రామునికి సమర్పించి, తన సాగర లంఘనా వృత్తాంతమును రామలక్ష్మణసుగ్రీవులకు వివరించాడు.


ఓ రామా! సీతామాత నిరంత‌రం నిన్ను స్మ‌రిస్తూ రాక్షస స్త్రీల నిర్బంధములో దీనురాలై నిరంతరము నీకోసం ఎదురుచూస్తున్న‌ది. అందరిని కుశలమడిగినది. నీవు అనతి కాలములోనే వచ్చి ఆమెను విముక్తురాలను చేసి స్వీకరిస్తావ‌నే ఆశ మాత్రముననే జీవించియున్నది. ఒక నెల‌ లోపల అలా జ‌ర‌గ‌కుంటే తాను ప్రాణాల‌తో ఉండజాలనన్నది. 

రామా! సింహ పరాక్రముడైన రాముని, ధనుష్పాణియైన లక్ష్మణుని త్వరలో లంకా ద్వారంలో చూడగలవని నేను సీతమ్మతల్లికి చెప్పి వచ్చాను. - అని హనుమంతుడు శ్రీరామునకు విన్నవించాడు.

       ******

రామాయణంలో సుందరకాండకు విశేషమైన స్థానం ఉంది.

బ్రహ్మాండ పురాణం రామాయణంలోని ఒక్కొక్క కాండం పారాయణానికి

 ఒక్కొక్క ఫలసిద్ధిని పేర్కొంటూ సుందరకాండ గురించి ...

*"చంద్రబింబ సమాకారం వాంఛితార్ధ ప్రదాయకం*,

*హనూమత్సేవితం ధ్యాయేత్ సుందర కాండ ఉత్తమమ్‌* అని పేర్కొన్నది.

అంతటి మహిమాన్వితమైనది ఈ సుందర కాండ పారాయణం

                  ***

ఆపదా మపహ‌ర్తారం ధాతారం సర్వసంపదామ్

లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్

                    ***

నమో నమస్తే ఖిల పూజితాయ నమో నమస్తేందు నిభాననాయ

నమో నమస్తే రఘువంశజాయ నమోస్తు రామాయసలక్ష్మణాయ

                  ***

గోష్పదీకృత వారాశిం

మశకీకృత రాక్షసమ్

రామాయణ మహామాలా

రత్నం వందే అనిలాత్మజమ్.


*రామాయణ పారాయణం* *చేస్తున్న భక్తుని ఎదురుగా కూర్చుని అదృశ్య రూపంలో హనుమ పరవశంతో వింటాడని భక్తుల విస్వాసం.*


అటువంటి మారుతికి మరొక్కమారు భక్తితో 

నమస్కారం.....


మనోజవం ,మారుతు తుల్యవేగం

జితేంద్రియం,బుద్ధిమతాం వరిష్టం.

వాతాత్మజం

వానర యూధ ముఖ్యం

శ్రీ రామ దూతం

శిరసా నమామి


 *( మహిమాన్విత సుంద‌ర‌కాండ స‌మాప్తం)*

జీవుడే దేవుడన్న శ్రీ శంకరుల అద్వైతం)

 శ్రీరామ (121)


                          శుభోదయం.


🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 సర్వే జనాః సుఖినో భవన్తు 🙏


    (జీవుడే దేవుడన్న శ్రీ శంకరుల అద్వైతం)


సమస్తమైన ఉపనిషత్తుల సారము ' ప్రేమ ' 

ప్రతి జీవుడు తనకు తెలియకుండానే తనను తాను ప్రేమిస్తాడు.

అంటే ప్రతి జీవిలోను ప్రేమ ఉంది.

మనలో ప్రేమ అనేది ఉండబట్టే భార్యా పిల్లలనుగాని, ఇతర జీవులనుగాని, ప్రేమించ గలుగుతున్నాము.

మనకు ఉన్నదే ఎవరికైనా ఇవ్వగలంగాని, మనకు లేనిది ఎలా ఇవ్వగలం ?

ఈ ప్రేమే " ఆత్మ " యొక్క స్వరూపం అనగా మనయొక్క నిజమైన స్వరూపం.

భగవంతుడు మనకన్నా వేరే లేడు కాబట్టి ఆత్మ తత్త్వమన్నా భగవంతుని తత్త్వమన్నా ఒకటే.

గురుశుశ్రూష చేసి ప్రేమే ఆత్మ యొక్క స్వరూపం అని తెలిసిన జ్ఞానులు,చీమ, దోమలతో సహా సమస్త జీవులయందు ప్రేమతో ఉంటున్నారు.

క్రమంగా జీవన్ముక్తులు, విదేహముక్తులు, అవుతున్నారు.

ఈ ఆత్మజ్ఞానం లేని వారు కొందరిమీద ప్రేమతోను,కొందరిమీద ద్వేషంతోను, ఉంటూ సంసారచక్రంలో పరిభ్రమిస్తున్నారు.

ఆత్మతత్త్వమే ప్రేమతత్త్వం అని తెలియజేయటానికే,

రాధాకృష్ణుల ప్రేమ, సీతారాముల ప్రేమ,

ప్రకృతి రామణీయకత మీద ప్రేమ, 

మొదలైనవాటిని, విజ్ఞులు,

ఆటలు, పాటలు, నృత్యాలు, కవితలు,శిల్పాల రూపంలో ప్రచారంలోకి తెచ్చారు.



శ్లో// అహమస్మి సదాభామి కదాచిన్నాహ మప్రియః /

బ్రహ్మైవాహ మతః సిద్ధం సచ్చిదానన్ద లక్షణమ్ //


(అహం = నేను (అనగా ఆత్మ) అస్మి = ఎల్లప్పుడూ ఉన్నాను (సత్)

మనం అనుకుంటున్న 'మరణం' అనేది ఒక దేహాన్ని వదిలి ఇంకో దేహాన్ని ధరించడమేగాని, జీవుడికి మరణం లేదని శాస్త్రం.

సదాభామి = ఎల్లప్పుడూ ప్రకాశిస్తున్నాను. అనగా తెలివిగా ఉన్నాను (చిత్)

నిద్రలో కూడా ఆత్మ తెలివిగా ఉండబట్టే ఉచ్ఛ్వాస నిశ్శ్వాసలు నడుస్తున్నాయి.

కదాచిన్నాహమప్రియః = ఎప్పుడూ కూడా, నాకు నేను అప్రియుడను కాను. అనగా నేను ఎప్పుడూ ఆనందంగా ఉన్నాను.

అతః = అందువలన,

(బ్రహ్మ అనగా సచ్చిదానంద స్వరూపుడు అని వేదం చెప్పింది)

సచ్చిదానంద లక్షణం = సత్, చిత్, ఆనంద లక్షణమైన,

బ్రహ్మైవాహం = బ్రహ్మనే నేను అని,

సిద్ధం = సిద్ధించినది.

(అద్వైతమకరందం)


గురువులను భక్తితో సేవించి, "అహం బ్రహ్మాస్మి" అని శ్రీ శంకరులు ఉపదేశించిన అద్వైత తత్త్వం తెలుసుకొని, జన్మ సార్థకం చేసుకొందుముగాక.


శుభమస్తు,

తూములూరి మధుసూదనరావు,

24-3-'26.

రామాయణం - 11)

 శ్రీరామ (18 )


               ( వాల్మీకి రామాయణం - 11)


🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 సర్వే జనాః సుఖినో భవన్తు 🙏


  (23-3-'26 ' సాయంత్రం ' పోష్టు తరువాయి భాగము)


విశ్వామిత్రుని యాగ సంరక్షణ అయిన మరుసటి రోజు, రామ లక్ష్మణులు, ప్రాతః కాల సంధ్యావందనాది నిత్యకృత్యములు ఆచరించి విశ్వామిత్రునకు నమస్కరించారు.


శ్లో// ఇమౌ స్మ ముని శార్దూల కింకరౌ సముపస్థితౌ/

ఆజ్ఞాపయ యథేష్టం వై శాసనం కరవామ కిమ్//

( ఓ ముని శ్రేష్ఠా! ఇదిగో నీ కింకరులమైన మేము వచ్చాము. ఏమి చేయవలెనో మమ్ము ఆజ్ఞాపించుము).


ఆ విధంగా రామ లక్ష్మణులు అనగానే,విశ్వామిత్రుని అనుజ్ఞ తీసుకుని అక్కడ ఉన్న మహర్షులు, వారితో ఇలా అన్నారు.


" మేమందరము, మిథిలా పట్టణములో, జనకమహారాజు చేస్తున్న యజ్ఞం చూడాలనుకుంటున్నాము.


ఆ జనక మహారాజు దగ్గర అద్భుతమైన శివ ధనస్సు ఉన్నది.


శ్లో//నాస్య దేవా న గన్ధర్వా నాసురా నచ రాక్షసా:/

కర్తు మారోపణం శక్తా న కథంచన మానుషా://


(దేవతలుగాని, గంధర్వులుగాని,అసురులు,రాక్షసులు గాని,ఆ వింటికి శరము సంధించటం, కాదు గదా, కనీసం ఆ ధనస్సును వంచి నారిని కూడా కట్టలేరు.ఇక మనుష్యుల సంగతి వేరే చెప్పనక్కర్లేదు).


వంశ పారంపర్యంగా జనక వంశీయుల చేత పూజలందుకుంటున్న ఆ ధనస్సును, యజ్ఞమును,నీవు కూడా చూద్దువుగాని. మాతోబాటు మిథిలా నగరానికి, మీ ఇరువురు రండి."

అన్నారు.

సంతోషముతో సమ్మతించిన, రామ లక్ష్మణులతోను, ఋషిగణముతోను,విశ్వామిత్ర మహర్షి, సిద్ధాశ్రమ వనదేవతలను పూజించి,ప్రేమతో తమను అనుసరించి వస్తున్న మృగములను,పక్షులను,వెనుకకు పంపించి, మిథిలా పట్టణానికి ప్రయాణం అయ్యాడు.

అనేక దివ్యమైన పుణ్యగాధలను వినిపిస్తూ, దీర్ఘ ప్రయాణము తరువాత విశ్వామిత్రమహర్షి, మిథిలా నగర ప్రవేశం చేశారు.

ఆ నగరాధి దేవతకు నమస్కరించారు.

వారంతా ఆ పట్టణ సమీపమున పాడుబడి ఉన్న ఒక ఆశ్రమాన్ని చూచారు.

ఆ ఆశ్రమాన్ని గురించి రాముడు అడుగగా మహర్షి ఈ విధంగా చెప్పారు.

" రామా! పూర్వము ఇది దివ్యమైన ఆశ్రమము.

అహల్యాదేవీ సమేతుడై గౌతమమహర్షి ఇక్కడ అనేక సంవత్సరములు తపస్సు చేశాడు.

ఒక రోజు గౌతమ మహర్షి నదీ స్నానమునకు వెళ్ళినప్పుడు, దేవేంద్రుడు, గౌతముని రూపంలో, రహస్యముగా ఆశ్రమంలో ప్రవేశించి, గౌతమ మహర్షి భార్య అయిన అహల్యతో సంభోగించాడు.

అతడు ఇంద్రుడని తెలిసినా కామం వల్ల ఏర్పడిన బలహీనత వల్ల,అహల్యాదేవి అడ్డు చెప్పలేదు.

ఇంతలో స్నానం పూర్తి చేసుకుని ఆశ్రమానికి వచ్చిన గౌతమ మహర్షి, తన రూపంతో ఆశ్రమం నుండి బయటకు వస్తున్న దేవేంద్రుని చూచాడు.

జరిగిన దుష్కృత్యాన్ని గ్రహించి తీవ్రమైన కోపంతో " నీ వృషణములు పడిపోవుగాక " అని దేవేంద్రుని శపించాడు.

శ్లో//గౌతమే నైవ ముక్తస్య స రోషేణ, మహాత్మనా/

పేతతుర్వృషణౌ భూమౌ సహస్రాక్షస్య తత్ క్షణాత్//

(గౌతముడు ఈ విధంగా కోపంతో శపించగానే, దేవేంద్రుని వృషణములు, తక్షణమే,నేలపై పడి పోయినవి)

ఉత్తమమైన తపస్సు ఆచరిస్తున్నా, మనోనిగ్రహము సాధించలేక అధర్మకార్యం చేసిన అహల్యను, "చాలా కాలం పాటు, ఎవరికీ కనిపించకుండా, వాయు భక్షణ చేస్తూ ఈ ఆశ్రమంలో తపస్సు చేస్తూ ఉండు.

శ్లో//యదా చై తద్వనం ఘోరం రామో దశరథాత్మజః/

ఆగమిష్యతి దుర్ధర్షః తదా పూతా భవిష్యసి//

(నరసంచారంలేకుండా భయంకరంగా అయిన ఈ వనానికి దశరథ కుమారుడైన రాముడు ఎప్పుడు వస్తాడో, అప్పుడు నీవు కల్మషములన్నీ పోయి,పవిత్రురాలవు కాగలవు) "

ఈవిధంగా ఇంద్రుని, అహల్యను,శపించి, గౌతమ మహర్షి, ఆశ్రమమును విడిచిపెట్టి, తపస్సు చేసుకోవడానికి హిమాలయ పర్వతములకు,వెళ్ళాడు.

నాయనా!రామా! పుణ్యాత్ముడైన ఈ గౌతముని ఆశ్రమంలో ప్రవేశించు. 

అత్యంత సౌందర్యవతి,గొప్ప సౌభాగ్యవతి, అయిన అహల్యను తరింపజేయుము" అన్నాడు.

ఆ మాటలు విని లక్ష్మణ సమేతుడైన రాముడు, విశ్వామిత్రుని వెనుక నడచుచు ఆ ఆశ్రమములో ప్రవేశించాడు.

ఆ ఆశ్రమంలో రాముడు అడుగు పెట్టగానే,

గౌతముని శాపం సమాప్తమైనది.

దివ్యకాంతులతో అహల్యాదేవి కనిపించింది.

తపస్సు చేత అమె దివ్యతేజస్సుతో మెరిసిపోతోంది.

దేవాసురమానవులు, కనులు మిరుమిట్లు గొలిపే ఆ కాంతిని చూడ లేకుండా వున్నారు. 


శ్లో//శాపస్యాంతముపాగమ్య తేషామ్ దర్శన మాగతా/

రాఘవౌ తు తతస్తస్యాః పాదౌ జగృహతుస్తదా//


(గౌతమ మహర్షి శాపం తొలగి పోవడంవల్ల, రామ లక్ష్మణులకు అహల్యాదేవి కనిపించింది. వారిద్దరూ ఆమె రెండు పాదములను పట్టుకుని నమస్కరించారు).


అహల్యాదేవి గౌతమ మహర్షి వచనములను స్మరించి, శాస్త్రంలో చెప్పిన ప్రకారం వారికి,మిక్కిలి భక్తి,శ్రద్ధలతో ఆర్ఘ్య పాద్యాలుఇచ్చి, అతిధి పూజ చేసింది.

రాముడు ఆ అతిధి పూజ స్వీకరించాడు.

తత్ క్షణమే గౌతమ మహర్షి అక్కడ ప్రత్యక్షమైనాడు.

పరమానందంతో అహల్యను తిరిగి స్వీకరించాడు.

ఆ శుభ సమయంలో,

శ్లో//పుష్ప వృష్టి ర్మహ త్యాసీత్ దేవ దుందుభి నిస్స్వనై:/

గంధర్వాప్సరసాం చైవ మహానాసీత్సమాగమ://

(దేవ దుందుభులు మ్రోగినై. పుష్పవృష్టి కురిసింది. గంధర్వులు, అప్సరసలు, ఆట పాటలతో సమాగమమయ్యారు).


శ్లో//సాధు సాధ్వితి దేవాస్తామహల్యాం సమపూజయన్/

తపోబల విశుధ్ధాంగీం గౌతమస్య వశానుగామ్//

(తపోబలంతో పవిత్రురాలైనది, గౌతమ మహర్షితో కూడినది, అయిన ఆ అహల్యాదేవిని "బాగు, బాగు" అని నుతిస్తూ దేవతలందరూ పూజించారు)


ఆ తరువాత గౌతమ మహర్షి, అహల్యాదేవితో కలిసి రాముని యధావిధిగా పూజించాడు.

యథా శాస్త్రముగా చేయబడిన ఆ పూజను రాముడు స్వీకరించాడు.


ఆ విధంగా వారిద్దరి అతిధ్యము స్వీకరించిన రామ లక్ష్మణులు, విశ్వామిత్రమహర్షి, మిక్కిలి ఆనందముతో మిథిలా పట్టణానికి వెళ్లారు.


                      శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష.

                        ఓం శాన్తి శ్శాన్తి శ్శాన్తిః


(సశేషం)

శుభమస్తు,

తూములూరి మధుసూదనరావు,

24-3-'26

రామాయ‌ణ

 శ్రీ‌శ్రీ‌శ్రీ‌

           *ఇంటింటా రామాయ‌ణ*

*దివ్య‌క‌థా పారాయ‌ణ‌ము*


 **


           *6వ‌రోజు*


    *మహిమాన్విత*      *సుంద‌ర‌కాండ కొనసాగింపు*


 *రామయ్యకు శుభవార్త*

               ***

          🌸🌸🌸🌸🌸


శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం

సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం

ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం

రామం నిశాచర వినాశకరం నమామి.

                ***

మనోజవం మారుత తుల్యవేగం

జితేంద్రియం బుద్ధిమతాం పరిష్టమ్ !

వాతాత్మజం వానరయూధ ముఖ్యం

శ్రీరామదూతం శిరసా సమామి

              ***


లంకలోని అశోక వనం లో సీతామాత‌ దర్శనం కలిగి, ఆమె ఆశీస్సులు అంద‌డంతో హ‌నుంతుడు ప‌ట్ట‌రాని సంతోషంతో గంతులు వేశాడు.  ఇక పనిలో పనిగా రావణునిచూసి రావ‌ణుడి శ‌క్తిసామ‌ర్థ్యాల‌ను తెలుసుకోవాల‌నుకున్నాడు. రావ‌ణుడితో ముఖాముఖి మాట్లాడాల‌నుకున్నాడు. అలాగే యుద్ధ వ్యూహంతో లంకను పరిశీలించాల‌ని నిశ్చయించుకొన్నాడు. అలా చేయడం వల్ల రావణుడిని హెచ్చరించడానికీ, లంక రక్షణా వ్యవస్థను తెలుసుకోవడానికీ వీలవుతుందనుకున్నాడు. అంతే గాకుండా ఆ ప్రయత్నంలో లంకకు వీలయినంత నష్టం కలిగించవచ్చు నని భావించాడు. ఇలా సంకల్పించిన హనుమంతుడు వెంటనే ఉగ్రాకారుడై అశోకవనాన్ని ధ్వంసం చేశాడు, అడ్డు వచ్చిన వేలాదిమంది రాక్షసులను పిడిగుద్దులు గుద్ది మకరతోరణాన్ని అధిష్ఠించి కూర్చున్నాడు.


ఈ వింత వాన‌రాన్ని బంధించమని రావణుడు అపార సైన్యాన్నిపంపాడు. హనుమంతుడు వెంటనే,

 *జయత్యతిబలో రామో,* 

*లక్ష్మణశ్చ మహాబల:,*

 *రాజా జయతి సుగ్రీవో,*

 *రాఘవేణాభిపాలిత:,*

 *దాసోహం కోసలేంద్రస్య,* 

*రామస్యా క్లిష్ట కర్మణః,*

 *హనుమాన్ శత్రు సైన్యానాం,*

 *నిహన్తా మారుతాత్మజః అని* జయఘోష చేశాడు -


 మహా బలవంతుడైన శ్రీరామునకు జయము. 

మిక్కిలి పరాక్రమశాలియైన లక్ష్మణునకు జయము. రాఘవుల విధేయుడైన కిష్కింధ ప్రభువు సుగ్రీవునకు జయము. 

నేను శ్రీరామ దాసుడను, వాయుపుత్రుడను, హనుమంతుడను. శత్రు సైన్యాన్ని నాశనం చేస్తాను. వేయి మంది రావణులైనా యుద్ధంలో నన్నెదిరించలేరు. వేల కొలది శిలలతోను, వృక్షాలతోను సకల రాక్షసులను, లంకాపురిని ఒక్కదెబ్బతో నాశనం చేస్తాను. నా పని ముగించుకొని, సీతమ్మకు నమస్కరించి వెళతాను. రాక్షసులు ఏమీ చేయలేక చూచుచుందురు గాక - అంటూ.... గర్జిస్తూ హనుమంతుడు లంక ముఖద్వారానికి బిగించిన ఇనుప గడియతో రాక్షసులనందరినీ చావ చితకగొట్టాడు. పర్వతాకారంలో దేహాన్ని పెంచి, చైత్య ప్రాసాదాన్ని కూలగొట్టి, ఆ ప్రాసాద పెద్ద స్తంభాన్ని పరిఘలా త్రిప్పుతూ అందరినీ చావగొట్టాడు.

అప్పుడు రావణుడు విషయం తెలుసుకుని, ప్రహస్తుని కుమారుడు, మహా బలశాలీ అయిన జంబుమాలిని పంపాడు. హనుమంతుని చేతి పరిఘతో జంబుమాలి శరీరం చూర్ణమయ్యింది. ఆపై అగ్నివలె తేజరిల్లే యుద్ధవిద్యా నిపుణులైన ఏడుగురు మంత్రి పుత్రులు పెద్ద సేనతో కలిసి హనుమంతునిపై దండెత్తారు. హనుమంతుడు భయంకరంగా గర్జించి కొందరిని అర‌చేతితోను, కొందరిని ముష్టిఘాతాలతోను, కొందరిని తన వాడిగోళ్ళతోనూ చంపగా లంకాప‌ట్ట‌ణ వీధులు  రాక్ష‌సుల‌ రక్త మాంసాలతో నిండిపోయాయి.

 పిమ్మట విరూపాక్షుడు, యూపాక్షుడు, దుర్ధరుడు, ప్రఘసుడు, భాసకర్ణుడు అనే గొప్ప సేనా నాయకులు తమ సేనలతో వచ్చి వన ముఖ ద్వారంపై కూర్చున్న హనుమంతునిపై విజృంభించారు. వారంతా కూడా హనుమ చేతిలో ప్రాణాలు కోల్పోయారు. రణ భూమి అంతా రాక్షస కళేబరాలతోను, ఆయుధ, రథ శకలాలతోను నిండిపోయింది.


*అక్ష‌కుమారుడితో భీకర‌స‌మ‌రం*


ఇక  లాభం లేద‌నుకుని అక్షకుమారుడు సకలబలములతో హనుమంతుని సమీపించాడు. వారి మధ్య జరిగిన యుద్ధం సురాసురులను సంభ్రమపరచింది.  అక్షకుమారుడు హ‌నుమంతుడిపై  బాణాల వ‌ర్షం కురిపించాడు. అవి హనుమంతుని చాలా నొప్పించాయి. అతని పరాక్రమానికి హనుమంతుడు ముచ్చటపడ్డాడు. అంతటి పరాక్రమశాలిని, తేజోమయుని చంపడానికి తటపటాయించాడు. కాని అతనిని ఉపేక్షిస్తే తనకు పరాభవం తప్పదని తెలిసికొని హనుమంతుడు విజృంభించాడు. ఆకాశానికెగిరి వాయువేగంతో సంచరిస్తూ అరచేతితో అక్షకుమారుని అతని గుర్రాలను చరచి చంపేశాడు. తరువాత, గరుత్మంతుడు మహా సర్పాన్ని పట్టుకొన్నట్లుగా అక్షకుమారుని కాళ్ళను గట్టిగా చేజిక్కించుకొని, గిరగిర త్రిప్పి నేలకు విసరికొట్టాడు. అక్షకుమారుని శరీరం నుగ్గునుగ్గయ్యింది.


*ఇంద్ర‌జిత్తుతో యుద్ధం:*


అక్ష‌కుమారుడు మ‌ర‌ణించిన సంగ‌తి తెలుసుకుని రావణుడు కలవరపడడ్డాడు. ఇదెక్క‌డి వాన‌రం రా అని త‌ల‌ప‌ట్టుకున్నాడు. పెక్కు జాగ్రత్తలు చెప్పి, త‌న కుమారుడైన‌ ఇంద్రజిత్తును యుద్ధానికి పంపాడు. ఇంద్రజిత్తు బ్రహ్మవర సంపన్నుడు. ఇంద్రాదులకు కూడా నిలువరింప శక్యంగాని పరాక్రమశాలి, మంత్ర తంత్ర యుద్ధవిద్యానిపుణుడు. అతడు తన తండ్రి యైన రావ‌ణాసురుడికి నమస్కరించి, రణోత్సాహంతో పొంగిపోతూ, సేనలు లేకుండా ఒకడే దివ్యరథాన్ని అధిరోహించి హనుమంతునిపైకి వెళ్ళాడు. వారిద్దరి మధ్య యుద్ధం చిత్ర విచిత్ర రీతులలో సకల గణాలకు సంభ్రమం కలిగించింది. ఒకరిని ఒకరు జయించడం అశక్యమని ఇద్దరికీ తెలిసిపోయింది. ఇక లాభం లేదు, కనీసం ఆ వానరుని బంధించాలని సంకల్పించి ,ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అది హనుమంతుని బంధించింది. బ్రహ్మ హనుమంతునకిచ్చిన వరం ప్రకారం ,ఆ అస్త్రం అతనిని బాధించకుండా మరుక్షణమే తొలగిపోయింది. అయినా బ్రహ్మదేవునిపట్ల గౌరవసూచకంగా ఆ అస్త్రానికి కట్టుబడిపోయినట్లుగా హ‌నుమంతుడు నటించాడు. ఆ విధంగా రావణునితో మాట్లాడే అవ‌కాశం దొరుకుతుంద‌ని హనుమ తాను బంధింపబడినట్టు నటించాడు. రాక్షస సేనలు హనుమంతుని రావణుని సభా ప్రాంగణానికి తీసుకుపోయాయి.


*రావణునితో సంవాదం :*

బ్రహ్మాస్త్రానికి వశుడైనట్లు నటించి, హనుమంతుడు రావణుని సభాభవనంలోకి ప్రవేశించి రావణుని చూశాడు. రావణాసురుని సభాప్రాంగణం మణిమయమై శోభిల్లుతున్నది. రావణుని కిరీటం, ఆభరణాలు, వస్త్రాలు, అత్యద్భుతంగా ఉన్నాయి. మహా తేజశ్శాలి, వీరుడును అయిన‌ రావణుడు పది శిరస్సులు క‌లిగి ఉన్నాడు. ద‌శ కంఠుడు. మణిమయాలంకృతమైన ఉన్నతాసనంపై కూర్చొని ఉన్నాడు. మంత్రాంగ నిపుణులైన నలుగురు మంత్రులచే పరివేష్టితుడై కాటుక కొండవలె ఉన్నాడు. అప్పుడు హనుమంతుడు ఇలా అనుకొన్నాడు. - ’ఆహా! ఈ రావణుని రూపం అత్యద్భుతం. ధైర్యం నిరుపమానం. సత్వం ప్రశంసార్హం. తేజస్సు అసదృశం. నిజముగా ఈ రాక్షస రాజు సర్వ లక్షణ శోభితుడు.  అధర్మానికి ఒడి గట్టకపోతే సురలోకానికి సైతం ఇతను ప్రభువయ్యేవాడు. లోకాలన్నీ ఇతనికి భయపడుతున్నాయి. ఇతడు కృద్ధుడైనచో సమస్త జగత్తునూ సముద్రమున ముంచి ప్రళయం సృష్టించగల సమర్ధుడు గదా!’ అని అనుకున్నాడు.

రావ‌ణుడు హ‌నుమంతుడిని చూశాడు. కళ్లెర్ర చేసాడు.

హనుమంతుడు ఎవరు? ఎందుకు వచ్చాడు? ఇత‌నిని ఎవరు పంపారు? - తెలుసుకోమని రావణుడు తన  మంత్రులను ఆదేశించాడు. హనుమంతుడు రావణునకు ఇలా చెప్పాడు - రాజా! నేను సుగ్రీవుడి మంత్రిని. రాముని దూతను. హనుమంతుడనే వానరుడను. నీ కుశలము తెలిసికొమ్మని సుగ్రీవుడు స్నేహ భావంతో చెప్పాడు. రాముని పత్ని అయిన సీతను అప‌హ‌రించితెచ్చి నువ్వు పెద్ద తప్పిదం చేశావు. దీని వలన నీవు చేసుకొన్న పుణ్యమంతా నిష్ఫలమై పోతున్న‌ది. 

వాలి అంతటి వాడిని రాముడు సంహరించాడు. రాముని బాణాల ధాటికి నీవు గాని, మరెవరు గాని నిలువజాలరు. ఈ అకృత్యం వలన నీకూ,ఈ లంకకూ చేటు దాపురించింది. రాముడు మానవుడు. నీవు రాక్షసుడవు. నేను వానరుడను, నాకు పక్షపాతం లేదు. కనుక నా మాట విని సీతను రాముడికి అప్పగించి రాముని శరణు వేడుకో. రాముని క్రోధానికి గురియైనవానిని ముల్లోకాలలో ఎవరూ రక్షింపజాలరు. - అని హితవు చెప్పాడు.

ఆ మాట వింటూనే రావణుడు కోపించి ఆ వానరుని చంపమని ఆదేశించాడు. అంతలో విభీషణుడు అడ్డుపడి - దూతను చంపడం రాజ ధర్మం కాదు అన్నాడు.  అంతే కాకుండా హ‌నుమంతుడు తిరిగి వెళ్ళకపోతే ,సోదరా నువ్వు శతృవులతో యుద్ధం చేసి వారిని ఓడించే అవకాశం కోల్పోతావు. కనుక, హ‌నుమంతుడిని దండించి వదిలివేయ‌మ‌ని రావణుడికి విభీషణుడు సూచించాడు. ఆ మాటలకు కాస్త నెమ్మదించిన రావణుడు ఆ వానరుని తోకకు నిప్పంటించి ఊరంతా త్రిప్పమని ఆదేశించాడు..


*లంకా దహనం*


 రాక్షస కింకరులు హనుమంతుని తోకకు పాత గుడ్డలు చుట్టి నిప్పు పెట్టారు. ఊరంతా త్రిప్పసాగారు. ఈ అవకాశం చూసుకొని హనుమంతుడు లంకా నగరాన్ని నిశితంగా పరిశీలించాడు. జరిగిన సంగతి విన్న సీతాదేవి  క‌ల‌వ‌ర‌ప‌డింది. హనుమంతుని చల్లగా చూడమని అగ్నిదేవుని ప్రార్థించింది. తన తోక కాలుతున్నా గాని ఏ మాత్రం బాధ లేకపోవడం సీతమ్మ మహిమ వలన అని, తన తండ్రి వాయుదేవుని మిత్రుడైన అగ్ని కరుణ వలన అని గ్రహించిన హనుమంతుడు ఆ అగ్నికి లంకను ఆహుతి చేయాలని సంకల్పించాడు. తన బంధాలను త్రెంచుకొని, ఒక పరిఘతో రాక్షస మూకను చావబాదాడు. పైకెగిరి, మండుతున్న సూర్యునిలా విజృంభించాడు. ప్రహస్తుని ఇంటితో మొదలుపెట్టి లంకలోని అద్భుతభవనాలకు వరుసగా నిప్పంటించాడు. ఒక్క విభీషణుని ఇల్లు తప్ప లంకలో భవనాలను అన్నిటినీ బుగ్గిపాలు చేశాడు.


అప్పుడు ఒక్కమారుగా సీత సంగతి గుర్తుకు వచ్చి హనుమంతుడు హతాశుడయ్యాడు. 

తన తొందరపాటువలన లంకతో పాటు సీతమ్మ కూడా అగ్నికి ఆహుతయ్యిందేమో అన్న భ‌యంతో విలవిలలాడిపోయాడు. తన చాంచల్యం వలన తన జాతికి, పనికి కీడు తెచ్చినందుకు రోదించి ప్రాణత్యాగానికి సిద్ధమయ్యాడు. కాని సీత క్షేమంగా ఉన్నదని తెలిసి, ఊరట చెందాడు. మరొక్కమారు సీతమ్మవారిని దర్శించదానికి వెళ్ళాడు. ఆమెకు సాంత్వన వచనాలు పలికి, రాముడు సకల వానరసేనతో త్వరలో లంకపై దండెత్తి రాగలడని మ‌రోమారు చెప్పి సీత‌మ్మ పాదాల‌కు న‌మ‌స్క‌రించి,  ఉత్తరదిశకు  హనుమంతుడు తిరుగు ప్రయాణం అయ్యాడు .


ఇలా హనుమంతుడు ,రాముని దూతగా సాగరాన్ని లంఘించి, సీతమ్మను కనుగొని, రాక్షసులను సంహరించి, లంకాద‌హ‌నం చేసి, రావణుని మదమణచి, సీతమ్మకు సాంత్వన కూర్చి, తిరుగు ప్రయాణానికి అరిష్టము అనే పర్వతాన్ని అధిరోహించాడు.


*తిరుగు ప్ర‌యాణం:*


హనుమంతుడి పద ఘట్టనంతో అరిష్ట పర్వతం నేలలో క్రుంగిపోయింది. ఒక మహానౌక సముద్రాన్ని దాటినట్లుగా హనుమంతుడు సునాయాసంగా ఆకాశాన్ని దాటాడు. దారిలో మైనాక పర్వతాన్ని గౌరవంగా స్పృశించి, ఉత్తర సాగర తీరం సమీపించగానే పెద్దయెత్తున గర్జించాడు. ఆ కేక విని జాంబవంతాదులు ఇది హనుమంతుని విజయసూచక ధ్వానమని గ్రహించి హర్షంతో గంతులు వేయసాగారు. 

మేఘంలాగా హనుమంతుడు మహేంద్రగిరిపై దిగి గురువులకు, జాంబవంతాది వృద్ధులకు, యువరాజు అంగదునకు ప్రణామం చేశాడు. హనుమంతుడు 

*కనుగొంటి సీతమ్మను* అని అన్నాడు. ఆమె రాక్షసుల బందీయై, రాముని కొరకు ఎదురు చూస్తూ కృశించియున్నది. " అని హనుమంతుడు చెప్పాడు. *"కనుగొంటిని"* అన్న  హనుమంతుడిమాటలతో వానరు లందరూ పరమానందము పొందారు. అతనిని కౌగలించుకొని సంతోషంతో చిందులు వేశారు. తరువాత తన లంకా నగర సందర్శన విశేషాలను అన్నింటినీ తన బృందంలోనివారికి వివరంగా చెప్పాడు హనుమంతుడు.


ఇంక అంతా కలసి వెళ్ళి లంకను నాశనం చేసి, రావణుని ఓడించి, సీతమ్మను తెచ్చి రామునకు అప్పగించాలని అంగదుడు అభిప్రాయపడ్డాడు. కాని జాంబవంతుడు అందుకు వారించి, ముందుగా జరిగిన సంగతిని రామునకు, సుగ్రీవునకు నివేదించ‌డ‌మే సరైనపని అని ఆ తర్వాత ఏం చేయాలో వారు సూచిస్తారని చెప్పాడు. అందరూ సంరంభంగా కిష్కింధకు బయలుదేరారు.

*మధువనం:*

సీత జాడ తెలియడం వలన అంగదాది వానరులంతా ఉత్సాహంగా హనుమంతుని వెంట‌బెట్టుకుని కిష్కింధకు బయలుదేరారు. దారిలో మధువనమనే మనోహరమైన వనాన్ని చేరుకొన్నారు. అది సుగ్రీవునిది. దధిముఖుడనే వృద్ధ వానర వీరుని పరిరక్షణలో ఉంది. అంగదుని అనుమతితో వానరులంతా ఆ వనంలో ఫలాలను కోసుకొని తింటూ, మధువులను గ్రోలుతూ, చిందులు వేస్తూ,  వనాన్ని ధ్వంసం చేయసాగారు. అడ్డు వచ్చిన దధిముఖుని తీవ్రంగా దండించారు. దిక్కు తోచని దధిముఖుడు తన తోటి వన రక్షకులతో కలిసి వేగంగా సుగ్రీవుని వద్దకు ఎగిరిపోయి జరిగిన అకృత్యం గురించి మొరపెట్టుకొన్నాడు.


సీతాన్వేషణా కార్యం సఫలమయి ఉండకపోతే తన భృత్యులైన వానరులు అంతటి సాహసం చేయజాలరని సుగ్రీవుడు ఊహించాడు. వనభంగం అనే నెపంతో దధిముఖుడు సీతాన్వేషణా సాఫల్య సమాచారాన్ని ముందుగా సూచిస్తున్నాడని, శుభవార్త వినే అవకాశం ఉన్నదని రామలక్ష్మణులకు సుగ్రీవుడు చెప్పాడు. శుభవార్త తెలిపినందుకు దధిముఖుని అభినందించాడు. దధిముఖుడు మధువనానికి తిరిగి వెళ్ళి అంగదాదులతో సాదరంగా మాట్లాడి త్వరగా సుగ్రీవుని వద్దకు వెళ్ళమన్నాడు. అంగదుడు, హనుమంతుడు, తక్కిన బృందం రివ్వున ఆకాశానికెగిరి ఝంఝూమారుతంలాగా సుగ్రీవుని వద్దకు బయలుదేరారు.


*రాముడికి శుభవార్త*

*సీతమ్మ‌ జాడ తెలుపుట:*


అంగదాది ప్రముఖులు, హనుమంతుడు మహోత్సాహంతో సుగ్రీవుడు, రామలక్ష్మణులు మొదలైనవారున్న ప్రస్రవణగిరిపై దిగారు. *దృష్టా దేవీ (చూచాను సీతమ్మను)* అని హనుమంతుడు చెప్పగానే రామలక్ష్మణులు మహదానంద భరితులయ్యారు. హనుమంతుని కార్య సాధనపై విశ్వాసము గల లక్ష్మణుడు సుగ్రీవునివంక ఆదరంగా చూశాడు. తక్కిన వానరుల ప్రోద్బలంతో హనుమంతుడు దక్షిణ దిక్కుకు తిరిగి సీతమ్మకు ప్రణమిల్లి, ఆమె ఇచ్చిన చూడామణిని రామునికి సమర్పించి, తన సాగర లంఘనా వృత్తాంతమును రామలక్ష్మణసుగ్రీవులకు వివరించాడు.


ఓ రామా! సీతామాత నిరంత‌రం నిన్ను స్మ‌రిస్తూ రాక్షస స్త్రీల నిర్బంధములో దీనురాలై నిరంతరము నీకోసం ఎదురుచూస్తున్న‌ది. అందరిని కుశలమడిగినది. నీవు అనతి కాలములోనే వచ్చి ఆమెను విముక్తురాలను చేసి స్వీకరిస్తావ‌నే ఆశ మాత్రముననే జీవించియున్నది. ఒక నెల‌ లోపల అలా జ‌ర‌గ‌కుంటే తాను ప్రాణాల‌తో ఉండజాలనన్నది. 

రామా! సింహ పరాక్రముడైన రాముని, ధనుష్పాణియైన లక్ష్మణుని త్వరలో లంకా ద్వారంలో చూడగలవని నేను సీతమ్మతల్లికి చెప్పి వచ్చాను.  - అని హనుమంతుడు శ్రీరామునకు విన్నవించాడు.

       ******

రామాయణంలో సుందరకాండకు విశేషమైన స్థానం ఉంది.

బ్రహ్మాండ పురాణం రామాయణంలోని ఒక్కొక్క కాండం పారాయణానికి

 ఒక్కొక్క ఫలసిద్ధిని పేర్కొంటూ సుందరకాండ గురించి ...

*"చంద్రబింబ సమాకారం వాంఛితార్ధ ప్రదాయకం*,

*హనూమత్సేవితం ధ్యాయేత్ సుందర కాండ ఉత్తమమ్‌* అని పేర్కొన్నది.

అంతటి మహిమాన్వితమైనది ఈ సుందర కాండ పారాయణం

                  ***

ఆపదా మపహ‌ర్తారం ధాతారం సర్వసంపదామ్

లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్

                    ***

నమో నమస్తే ఖిల పూజితాయ నమో నమస్తేందు నిభాననాయ

నమో నమస్తే రఘువంశజాయ నమోస్తు రామాయసలక్ష్మణాయ

                  ***

గోష్పదీకృత వారాశిం

మశకీకృత రాక్షసమ్

రామాయణ మహామాలా

రత్నం వందే అనిలాత్మజమ్.


*రామాయణ పారాయణం* *చేస్తున్న భక్తుని ఎదురుగా కూర్చుని అదృశ్య రూపంలో హనుమ పరవశంతో వింటాడని భక్తుల విస్వాసం.*


అటువంటి మారుతికి మరొక్కమారు భక్తితో 

నమస్కారం.....


మనోజవం ,మారుతు తుల్యవేగం

జితేంద్రియం,బుద్ధిమతాం వరిష్టం.

వాతాత్మజం

వానర యూధ ముఖ్యం

శ్రీ రామ దూతం

శిరసా నమామి


 *( మహిమాన్విత సుంద‌ర‌కాండ స‌మాప్తం)*