5, మార్చి 2026, గురువారం

శ్రీరామ స్తుతి🙏

 🌸శ్రీరామ స్తుతి🙏


సీ. జానకీ వల్లభా ! జగదభి రామయ్య !

               సజ్జన సేవితా !  సాధు పోష !

     సేతుబంధన రామ ! సేవిత కపిబృంద !

              పతితపావననామ ! పరమపురుష !

     నీలమేఘశ్యామ ! నిరుపమ గుణధామ !

               నిను నమ్మి యుంటిని  నిచ్చ లందు  

     నీ శరధాటికి నిక్కమ్ము  జలనిధి 

               భయమంది లంకకు బాట చూపె

తే.జప తపమ్ముల నొనరించ శక్తి లేదు 

    వేరు దైవంబె  నెఱుగ నే విమల చరిత !

    నీవే దిక్కని నమ్మితి నీరజాక్ష !

    దశరథాత్మజ ! రఘురామ ! ధర్మ తేజ !



       జయలక్ష్మి  పిరాట్ల

సుభాషితమ్

 🕉️ *నేటి శుభోదయం సుభాషితమ్*🕉️


శ్లో𝕝𝕝

*సత్యం తపో జ్ఞానమహింసతా చ*

*విద్వత్ప్రమాణం చ సుశీలతా చl*

*ఏతాని యో ధారయతే స విద్వాన్*

*న కేవలం యః పఠతే స విద్వాన్ll*


తా𝕝𝕝 సత్యము, తపస్సు, జ్ఞానం, అహింసా, విద్వత్ప్రమాణము, సత్ప్రవర్తన - ఇవి స్వయముగా ఎవడైతే కలిగి ఉండి, ఆచరించునో అతడే విద్వాంసుడు, పూజ్యుడు. అంతేకానీ, చదువుకున్నంత మాత్రమున విద్వాంసుడు, పూజ్యుడు కాడు. కాలేడు.

ॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐ


`నా అనువాదపద్యం`


తే.గీ.

సత్యము తపము జ్ఞానము సత్ప్రవర్త 

నమ్ము విద్వత్తు సచ్ఛీలనంపునడత 

కల్గువాడె విద్వాంసుడౌగాని గ్రంథ 

పఠనమునకాడు కాబోడు పండితుండు 

*~శ్రీశర్మద*

నేటి వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణము - శిశిర ఋతువు - ఫాల్గుణ మాసం - కృష్ణ పక్షం - ద్వితీయ - ఉత్తరాఫల్గుణి -‌‌ గురు వాసరే* (05.03.2026)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, ఈ 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

---------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

4, మార్చి 2026, బుధవారం

వేదాలు ధర్మానికి, కర్మలకు పరమ ప్రమాణం

 

వేదాలు ధర్మానికి, కర్మలకు పరమ ప్రమాణం. జీవుని ఉద్ధరించడానికి వేదాలలో రెండు మార్గాలున్నాయి. అవి: నివృత్తి, ప్రవృత్తి మార్గాలు. ఇహపర సుఖాల పట్ల ఆసక్తి లేనివారు (విరాగులు) జ్ఞానసాధనతో పరమాత్మను చేరుకోవడానికి అవలంబించేదినివృత్తిమార్గం. ఇది అనేక జన్మల పుణ్య సంస్కారంతోనే లభిస్తుంది. మార్గం అందరికీ సాధ్యం కాకపోవడమే కాక కష్టతరమైంది కూడా. తపస్సు, శమం (అంతరింద్రియ నిగ్రహం), దమం (బాహ్యేంద్రియ నిగ్రహం) వంటివి ఇందులోని కర్మలు. ఇహపర సుఖాల పట్ల ఆసక్తి గలవారు తమ కోర్కెలను తీర్చుకోవడానికి పరమాత్మను ఆరాధించే పద్ధతిప్రవృత్తిమార్గం. యజ్ఞయాగాది కర్మలు, వ్రతాలు, దీక్షలు వంటివి దీనికి చెందినవి. సాధారణంగా అత్యధిక మానవులు ఆచరించే క్షేమతరమైన మార్గం ఇదే.

కర్మ ప్రవృత్తంచ నివృత్తమ ప్యృతం

వేదవివిచ్యోభయ లింగ మాశ్రితమ్

అని భాగవత వాక్యం. పుణ్యకర్మల వల్ల స్వర్గాది ఊర్ధలోకాలు, మోక్షం సంప్రాప్తిస్తాయి. పాపకర్మల వల్ల నరకం, పశుపక్షాది జన్మలు ఏర్పడుతాయి. పుణ్యపాప మిశ్రమ కర్మల వల్ల మానవజన్మ సిద్ధిస్తుంది. స్వర్గాదులతో మోక్షాన్ని సాధించడానికి గాని, నరకాన్ని, పశుపక్షాది జన్మలు పొందడానికి గాని లేదా మరలా మానవజన్మనే పొందడానికైనా మనిషి జన్మే కారణమవుతుంది. ఎందుకంటే, మనిషిలోనే శక్తి సామర్థ్యాలు, బుద్ధివికాసం, స్వేచ్ఛ వంటివి ఎక్కువ. వీటి కారణంగా మానవుడు సత్కర్మలతో తనకు శ్రేయస్సును కల్పించుకోగలడు. ప్రపంచ శాంతినీ సాధించగలడు. లేదా స్వార్థం, అహంకార మోహాలతో దుష్కర్మలకు పాల్పడటం వల్ల తనకు తానే హాని కలిగించుకొంటూనే ప్రపంచ వినాశానికీ కారణమవగలడు.

జంతువూ (ప్రాణీ) తన స్వాభావిక ధర్మాన్ని ఉల్లంఘించదు. ఒక్క మానవుడు మాత్రం స్వధర్మాన్ని ఉల్లంఘించే ప్రమాదం ఉంది. కనుకే, వేదాలు మనలను సరైన మార్గంలో నడిపించడానికి అనేక ధర్మాలను, విహిత-నిషిద్ధ కర్మలను సూచించాయి

వేదవిహిత కర్మల వల్ల పుణ్యాన్ని, నిషిద్ధ కర్మల వల్ల పాపాన్ని మూటగట్టుకోగలం. ‘కుర్వన్నే వేహ కర్మాణి జిజీవిషేచ్ఛ తగ్ సమాః. లోకంలో కర్మలు చేస్తూ నూరేండ్లు (పూర్ణాయుష్షు) జీవించడం అన్నది కోరుకోవాలనిఈశావాస్యోపనిషత్తుచెబుతున్నది. సత్తగుణ ప్రధాన కర్మలు జీవునికి ఉత్తమ గతిని కలిగిస్తాయి. కానీ, రజోగుణ, తమోగుణాలు మోహ పరవశుని చేస్తాయి. మోహితులైన మనుషులు ఇంద్రియ భోగాల పట్ల ఆసక్తితో ధనార్జనను, నిషిద్ధకర్మలను ఆశ్రయిస్తారు.

సంపద, ఇంద్రియ సుఖాల పట్ల నిరంతర వ్యామోహం మానవుని విచక్షణా జ్ఞానాన్ని కప్పివేస్తుంది. ‘నేను, నాదిఅనే స్వాభిమానంతో, ఈర్ష్యాద్వేషాలతో పాపకర్మలకు పాల్పడుతారు. దీంతో మానవజన్మ వృథా అయి, అన్యజన్మల బారిన పడతారు.

గుణాధికాన్ముదం లిప్సేదనుక్రోశం గుణమాధమాత్

మైత్రీం సమానాదన్వి చ్ఛేన్నతాపై రభి భూయతే

అని భాగవతం ప్రబోధిస్తున్నది. అందుకే, ‘తనకన్నా ఎక్కువ గుణాలు కలవారిపట్ల ప్రసన్నతను, తక్కువ గుణాలు కలవారిపట్ల దయను చూపాలి. సమాన గుణాలు కలవారితో మిత్రత్వం చేయాలి. రకంగా మానవుడు దుఃఖాలకు దూరమవుతాడు.’  

విధి నిర్ణయాన్నిబట్టి తాను చేసుకొన్న కర్మల ప్రారబ్ధవశంలో లభించిన దానితో సంతృప్తిని పొందాలి. అలా పొందక పోవడమే దుఃఖం, అశాంతికి ప్రధాన కారణం. కనుక, ఎవరు లభించిన దానితో సంతోషపడతారో, తృప్తితో జీవిస్తారో వారు సంసారచక్రం నుండి బయటపడగలరు

యస్య యైద్దెవ విహితం తేన సుఖదుఃఖయోః

ఆత్మానం తోషయన్దేహీ తమసః పారమృచ్ఛతి

అనిభాగవతప్రమాణం. వారివారి అధికారాన్ని బట్టి, ఎవరైతే వేదవిహిత కర్మలు ఆచరిస్తారో, సత్కర్మలతో భగవంతుని సేవిస్తారో వారికికర్మబంధంఅంటదు. క్రమక్రమంగా చిత్తశుద్ధి కలుగుతుంది. దానితో ప్రధాన పురుషార్థమైన మోక్షం కూడా లభిస్తుంది. కనుక, వేదవిహిత కర్మలే శ్రేయస్కరం.

 

నాహం జానామి

 శుభోదయం.


శ్లో. *నాహం జానామి కేయూరే, నాహం జానామి కుండలే |*

*నూపురే త్వభి జానామి, నిత్యం పాదాభివందనాత్ ॥*


(రాముడు నగల మూటను పరిశీలించుమని తమ్మునకు చెప్పినాడు. అప్పుడు లక్ష్మణుడు:)


తా॥ *“ఈ దండ కడియములు నాకు తెలియవు! ఈ కమ్మలు (దుద్దులు) నేనెఱుగను! ఈ కాలి అందెలు మాత్రము నాకు తెలియును! మా వదినవే! ప్రతిదినమును పాదాభివందనము చేయుటచే పరిచయమైనవి*

⛳⛳⛳⛳⛳⛳⛳⛳

నిత్యుడు,సర్వగతుడు

 శ్రీరామ (101)


                             శుభోదయం.


🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 సర్వే జనాః సుఖినో భవన్తు 🙏



" నిత్యుడు,సర్వగతుడు, స్థిర రూపుడు,చలించని వాడు,ఆద్యంతములు లేక ఎల్లప్పుడూ ఉండేవాడు అనే శబ్దములతో వర్ణింపబడిన ఆత్మను నేను "

(నిత్యస్సర్వగతస్స్థాణు రచలో౽యం సనాతనః)


జాగ్రదవస్థలో ఈ శరీరం ఎండ, చలి, వర్షము, మొదలైన వాటిని తట్టుకుంటూ,

నానా రకాల వ్యాధులు,గాయములు, మొదలైన ఋగ్మతలతో సతమతమవుతున్నది.

అనేక ఆర్థిక, కుటుంబ, వృత్తి వ్యాపార సమస్యలతో మనస్సు అతలాకుతలమవుతున్నది.


కానీ సుషుప్త్యవస్థలో ఈ శారీరక, మానసిక బాధలన్నీ ఏమైనాయి ?

అన్నీ మరచిపోయి జీవుడు హాయిగా నిద్రపోతున్నాడు.


శ్లో//సుప్తే౽హమి న దృశ్యన్తే దుఃఖ దోష ప్రవృత్తయః/

అత స్తస్యైవ సంసారో న మే సంసర్తృ సాక్షిణః//


(అహంకారం నిద్రావస్థ చెందగా,

దుఃఖం గాని,రాగ,ద్వేషాది ప్రవృత్తి గాని ఆ సుషుప్తిలో లేవు.

కాబట్టి ఈ సంసారమంతా "అహంకారానిదే", నాది కాదు.

నాదైతే ఈ సంసార బాధలు, బాధ్యతలు సుషుప్త్యవస్థలో కూడా ఉండాలి.

అవి లేవు. కానీ అప్పుడు కూడా నేను ఉన్నాను.

 కాబట్టి " నేను " అనగా అహంకారానికి సాక్షిగా ఉన్న ఆత్మ స్వరూపుడను అని సిద్ధిస్తోంది.

ఆత్మస్వరూపుడనైన నాకు ఎటువంటి సంసార బంధములు లేవు).


అయితే ఈ అహంకారం తొలిగేదెలా ?


అహంకారమునకు "రుద్రుడు" అధిష్ఠాన దేవత.

ఆ రుద్రుని జప, హోమ, అర్చనాదులతో ప్రసన్నుని చేసుకుంటే అహంకారం తొలగి జీవుడు తన సచ్చిదానంద స్వరూపం తెలుసుకోవడం అనే మోక్షస్థితిని పొందుతాడు.


శుభమస్తు.

తూములూరి మధుసూదనరావు,

4-3-'26.

బుధవారం రాశి ఫలితాలు

 శ్రీ గురుభ్యోనమః 🙏

04-03-2026 బుధవారం రాశి ఫలితాలు


మేషం


స్వల్ప అనారోగ్యం సమస్యలుంటాయి. చేపట్టిన పనులు శ్రమతో గాని పూర్తికావు. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉద్యోగస్తులకు రావలసిన పదవుల విషయంలో కొంత జాప్యం కలుగుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటాబయట బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.

---------------------------------------


వృషభం


దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి కొంత కీలక సమాచారం అందుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపార పరంగా సమస్యలను అధిగమిస్తారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

---------------------------------------


మిధునం


దూరప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. ధన పరమైన విషయాల్లో జాగ్రత్త వహించాలి. నూతన ఋణ ప్రయత్నాలు ఫలించవు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం నిరుత్సాహంగా ఉంటుంది.

---------------------------------------


కర్కాటకం


ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. గృహమున సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం వరిస్తుంది. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. నిరుద్యోగులకు అధికారుల అండదండలతో నూతన అవకాశాలు లభిస్తాయి.

---------------------------------------


సింహం


అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. కొన్ని విషయాలలో బంధుమిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం కలుగుతుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారస్తులకు స్వల్ప లాభాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.

---------------------------------------


కన్య


ఇంటాబయట ఒత్తిడులు అధిగమించి ముందుకు సాగుతారు. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. వ్యాపారస్తులకు పెట్టుబడులు సకాలంలో అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి.

---------------------------------------


తుల


ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వాహన వ్యాపారస్తులకు మరింత పురోగతి కలుగుతుంది. ఆత్మీయులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగ పరంగా అధికారులతో చర్చలు అనుకూలిస్తాయి. నిరుద్యోగుల కలలు సాకారం అవుతాయి. కొన్ని వ్యవహారాలలో తెలివిగా వ్యవహరించి అందరి మన్ననలు పొందుతారు.

---------------------------------------


వృశ్చికం


వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి లభించదు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచన విధానం మార్చుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి చేసే ప్రయత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి.

---------------------------------------


ధనస్సు


గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. చేపట్టిన పనులలో శ్రమ మరింత అధికమవుతుంది. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారస్తులకు కష్టానికి తగిన ఫలితం లభించదు. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది.

---------------------------------------


మకరం


గృహ వాతావరణం ఉత్సాహకరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలను అందుకుంటారు. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వాహన యోగం ఉన్నది. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. జీవిత భాగస్వామి సలహాలు కలసివస్తాయి.

---------------------------------------


కుంభం


వ్యాపార విషయంలో ఆప్తుల సలహాలు తీసుకోవడం మంచిది. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. ముఖ్యమైన పనులు సజావుగా సాగుతాయి. మిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. వ్యాపారాలలో అవరోధాలు అధిగమిస్తారు. ఉద్యోగమున విధులలో ఆటంకాలు తొలగుతాయి.

---------------------------------------


మీనం


ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు మార్చుకుంటారు. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. కుటుంబసభ్యుల నుంచి ఆశించిన సహాయం లభించదు. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వ్యాపారమున చిక్కులు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది.

---------------------------------------

*శ్రీ మహావిష్ణు పురాణం*

  🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*మంగళవారం 3 మార్చి 2026*


       *శ్రీ మహావిష్ణు పురాణం*                

           *14వ భాగం*


*బ్రహ్మాండం - అర్థనారీశ్వర స్వరూపం ఆవిర్భావం*```


శౌనకాది మునులు సూత మహర్షిని "బ్రహ్మాండం అంటే ఏమిటి? బ్రహ్మ విష్ణువులలో నిజమైన సృష్టికర్త ఎవరు?" అని అడిగారు.


సూత మహర్షి సమాధానం చెబుతూ "అనంతమైన ఈ విశ్వాంతరాళాన్ని అవ్యక్తం అని కూడా అంటారు. సృష్టికి పూర్వం నిరాకారంగా శూన్యంలో ఉన్నది అవ్యక్తమే. అవ్యక్తము నుంచి పరబ్రహ్మ స్వరూపం వ్యక్తమైంది. పరబ్రహ్మ సృష్టికి సంకల్పంచేశాడు అప్పుడు పరబ్రహ్మం రోమకూపాల నుంచి అనంత విశ్వంలోకి పంచభూతాత్మకమైన అనేక బ్రహ్మాండాలు వెలువడ్డాయి. ప్రతి బ్రహ్మాండాన్ని ఆవరించి ఏడు ఆవరణలు ఏర్పడ్డాయి.


అన్నిటికన్నా పైన మహత్తత్త్వం ఉంటుంది. దీనిలోపల అహంకార తత్త్వం ఉంది. అహంకార తత్త్వం లోపల ఆకాశ తత్త్వం, ఆకాశ తత్త్వం లోపల వాయు తత్త్వం, వాయుతత్త్వం లోపల తేజోతత్త్వం, తేజతత్త్వం లోపల జలతత్త్వం, జలతత్త్వం లోపల పృధ్వీ తత్త్వం ఉంటాయి. 

ఈ సప్త ఆవరణలు ఒకదానికన్నా ఒకటి పది రెట్లు పెద్దవి. ఒకదానిలో మరొకటి ఇమిడి ఉంటాయి. సప్త ఆవ రణలు ఈవిధంగా కలిగి ఉన్నదానిని బ్రహ్మాండం అంటారు.


ప్రతి బ్రహ్మాండంలోను పద్నాలుగు లోకాలు ఉన్నాయి. సుఖాలు ఇచ్చేవి ఊర్థ్వలోకాలు, దుఖాలు ఇచ్చేవి అధోలోకాలు. సుఖదుఃఖాలు ఇచ్చేది మధ్యనున్నభూలోకo. మూడురకాల అనుభవాలు ఇచ్చేవి కనుక మూడింటిని త్రిలోకాలు అంటారు. సృష్టికర్త ఆద్యుడైన పరబ్రహ్మ మాత్రమే. ఎందుకంటే పరబ్రహ్మ నుంచి అనంతకోటి బ్రహ్మాండాలు ఉద్భవించాయి. అందుకని పరబ్రహ్మను పరమాత్మ అని, నారాయణుడు అని, సర్వేశ్వరుడు అని అంటాము.


బ్రహ్మాండాలలో సృష్టికార్యం కోసం నారాయణుడు చతుర్ముఖ బ్రహ్మలను సృష్టించాడు. చతుర్ముఖ బ్రహ్మల ద్వారా ఆయా బ్రహ్మాండాలలో సృష్టి కార్యం జరుగుతుంది. పరబ్రహ్మ చేసే సృష్టి అద్వారక సృష్టి, స్వయంసృష్టి అయితే, చతుర్ముఖ బ్రహ్మలు చేసే సృష్టిని సద్వారక సృష్టి లేదా పరోక్ష సృష్టి అంటారు. ప్రతి బ్రహ్మాండంలో 

ఆ బ్రహ్మాండానికి సంబంధించిన చతుర్ముఖ బ్రహ్మ పరబ్రహ్మ సంకల్పించిన సృష్టి కార్యాన్ని పూర్తి చేస్తాడు.


ఈ చతుర్ముఖ బ్రహ్మలకు ఒకరితో మరొకరికి ఎలాంటి సంబంధం ఉండదు. కానీ పరబ్రహ్మను అందరూ తమ సృష్టికర్తగా, తమకి తండ్రిగా భావిస్తారు. పరబ్రహ్మము నుంచి చతుర్ముఖ బ్రహ్మల ద్వారా సకల సృష్టి జరుగుతుంది. అలాగే మహా లయం జరిగినప్పుడు బ్రహ్మలతో కలసి సకలం పరబ్రహ్మం లోనే విలీనం అవుతుంది"


విన్న శౌనకాదిమునులు ఆనందంతో నమస్కరించి "మహర్షీ! ఈ కథనం విన్నాక పరబ్రహ్మఅయిన శ్రీమహావిష్ణువు దివ్యలీలలు మీ నుంచి తెలుసుకోవాలనే కుతుహలం మరింత పెరిగింది. మన బ్రహ్మాండంలో పద్నాలుగు లోకాలు సృష్టి తరువాత చతు ర్ముఖ బ్రహ్మ సృష్టి కార్యం ఎలా ప్రారంభించాడో వివరించి చెప్పండి" అని కోరారు.


సూత మహర్షి సరేనని "పద్నాలుగు లోకాల సృష్టి జరిగిన తరువాత పద్నాలుగు లోకాల నివాసులను సృష్టించడానికి శ్రీమహావిష్ణువు సహాయం కోరుతూ అష్టాక్షరి మంత్ర జపంచేస్తూ ధ్యానంలో నిమగ్నుడైనాడు. చాలా కాలం తపస్సు చేసిన తరువాత పరబ్రహ్మ ప్రసన్నుడై జరగబోయే సృష్టి తత్త్వము బ్రహ్మకు తెలియజేయాలని అర్థ నారీశ్వర రూపంతో బ్రహ్మముందు ప్రత్యక్షమైనాడు.


సగం పురుషుడు, సగం స్త్రీగా తనముందు సాక్షాత్కరించిన దివ్య రూపం చూసి మొదట బ్రహ్మ ఆశ్చర్యం చెందాడు. తరువాత ఆ రూపానికి గల మహత్తు అర్థం చేసుకున్నాడు.


"పరబ్రహ్మము నుండి సృష్టి కోసం పురుషుడు, స్త్రీ రూపంతో ప్రకృతి అవతరించారని. సృష్టి ముందుకు సాగడానికి పురుషునికి ప్రకృతి సహచర్యం అవసరమని" బ్రహ్మ దేవుడు అవగతం చేసుకున్నాడు. ఇందుకోసం తనకు మార్గదర్శనం చేయమని ఆ అర్థనారీశ్వరుడిని కోరాడు.


అర్థనారీశ్వరుడు బ్రహ్మను చూసి "చతుర్ముఖా! జన సృష్టి నీవు చేయాలంటే సంతానప్రదాయిని, జీవసృష్టికి అధిదేవత అయిన ‘సావిత్రీదేవి’ ని ప్రసన్నం చేసు కోవాలి" అని చెప్పగానే బ్రహ్మ విస్మయం చెంది "ఈ సావిత్రీదేవి ఎవరు? ఎక్కడ ఉంటుంది? అసలు అర్థనారీశ్వరుడైన మీరెవ్వరు?

నాకు తెలిసినది నారాయణ స్వరూపం ఒక్కటే" అని నమస్కరించి అడిగాడు.


అర్థనారీశ్వరుడు "బ్రహ్మదేవా! ప్రకృతి పురుషుల కలయిక తోనే సృష్టి జరుగుతుంది. నేను సృష్టి స్థితి లయ కార్యం కోసం శ్రీమన్నారాయణుని నుంచి అవతరించిన ‘పరమేశ్వరుడి’ని. 

నేను,విష్ణువు ఏకాత్ములము. కేశవుడిగా విష్ణువు ఉంటే శివుడిగా ఈ రూపంలో నేను ఉన్నాను. శివకేశవులం అయిన మేమిద్దరం ఒకటే. మాలో ఎటువంటి భేదం లేదు.


నా అర్థశరీర భాగమైన స్త్రీ స్వరూపము గురించి వివరిస్తాను. పరదేవత అయిన ఈ శక్తి స్వరూపం నా నుంచి ఉద్భవించి నాలో సగమై ఉంటూ నాతో కలసి ఉంది. పరాశక్తిగా నా అర్థనారీశ్వరి ఐన ఈ ప్రకృతి విష్ణువు వక్షస్థలంలో లక్ష్మీదేవిగా నివసిస్తుంది. త్రిమూర్తులమైన మనకు ఈ శక్తిస్వరూపం తోడు లేకపోతే సృష్టి స్థితి లయ కార్యాలు జరుగవు. గాయత్రిగా, సరస్వతిగా నీ వద్ద ఉండేది ఈ శక్తి స్వరూపమే అని గ్రహించుము. వీరి వలన నీకు బ్రహ్మజ్ఞానం, సర్వశాస్త్ర వేదజ్ఞానము

లభించింది. కానీ జీవసృష్టి నీవు చేయాలంటే నీ వద్ద సృష్టికి అధిదేవత అయిన సావిత్రీదేవి ఉండాలి. సావిత్రీదేవి గోలోకంలో కృష్ణుని సేవిస్తూ కృష్ణుడి సన్నిధిలో ఉంది. ఆమెను ప్రసన్నం చేసుకుని నీవద్దకు తెచ్చుకొనుము. జీవసృష్టి చేయ గలుగుతావు" అని ఆశీర్వదించి అర్థనారీశ్వరుడు అదృశ్య మయ్యాడు.


*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏