9, జులై 2021, శుక్రవారం

బర్బరీకుడి కథ

 *మహాభారతంలో మహా మహులను అందరినీ ఒక్క నిముషంలో చంపి యుద్ధం మొత్తం ఒక్క నిముషంలో పూర్తి చేయగలిగే సామర్థ్యం ఉండి మొట్టమొదట తనను తానే బలిదానం చేసుకున్న బర్బరీకుడి  కథ:* ఎన్ని రకాల కేరక్టర్లు, ఎన్ని రకాల తత్వాలు. మహాభారతం తవ్వేకొద్దీ అనేకానేక పాత్రలు దర్శనమిస్తాయి. కొన్ని ఆలోచనల్లో పడేస్తే, కొన్ని ఆవేదనకు గురిచేస్తాయి. కొన్ని ఆశ్యర్యాన్ని కలిగిస్తే, కొన్ని దిగ్భమలో పడేస్తాయి. దాదాపు అన్ని ఉద్వేగాలకూ మహాభారతమే. మొత్తం భారతంలో అన్నింటికన్నా భిన్నమైన కేరక్టర్ ఒకటి ఉంది. తన పేరు బర్బరీకుడు. బహుశా ప్రస్తావనపూర్వకంగా ఎక్కడైనా తన పేరు విని ఉంటారేమో. కానీ తన గురించి ఇంకా తెలుసుకోవాలి. నిజానికి మహాభారతం అంటేనే శ్రీకృష్ణుడి చరిత్ర అనుకుంటాం. నిజానికి మహాభారతం నిండా కూడా శ్రీకృష్ణుడే. తను లేనిదే మహాభారతం లేదు. ఇంతకీ ఈ బర్బరీకుడు ఎవరు అంటారా. తను ఘటోత్కచుడి కొడుకు. లక్క ఇల్లు తగులబడ్డాక, ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని పరుగులు తీస్తున్న ఆ వనవాసంలో హిడింబి అనే ఓ రాక్షస యువతిని పెళ్లిచేసుకుంటాడు భీముడు. వాళ్ల కొడుకే ఘటోత్కచుడు. ఈ ఘటోత్కచుడు ఓ యాదవ రాజు మురు బిడ్డ మౌర్విని (అహిలావతి) పెళ్లాడతాడు. వాళ్ల కొడుకే ఈ బర్బరీకుడు. నిజానికి తను ఓ యక్షుడు. ఓ కారణం వల్ల మనిషిగా జన్మిస్తాడు. రాజస్థాన్లో ఖటుశ్యామ్జీ పేరిట, గుజరాత్లో బలియాదేవ్ పేరిట కొలుస్తారు బర్బరీకుడిని. అక్కడి జానపదాలు ఈ పాత్రను అంతగా జనంలోకి తీసుకెళ్లాయి. తను చిన్నప్పటి నుంచే తల్లి దగ్గర యుద్ధవిద్యలు నేర్చుకుంటాడు. దేవీ ఉపాసకుడు కూడా. దేవి ప్రత్యక్షమై మూడు ప్రత్యేక బాణాల్ని వరంగా ఇస్తుంది. ఆ మూడు బాణాల్నే బర్బరీకుడు తన వెంట ఉంచుకుంటాడు. అందుకే తనను *త్రిబాణధారి* అంటారు. పాండవులు, కౌరవుల నడుమ యుద్ధం అనివార్యం అని తెలిశాక, భారత చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో సైన్యాలు ఇరుపక్షాలకూ చేరుతున్న వేళ, బర్బరీకుడు ఆ యుద్దాన్ని చూడాలని కోరుకుంటాడు. వెళ్లే ముందు తల్లికి ఓ మాట ఇస్తాడు. *ఒకవేళ నేను యుద్ధంలో దిగి పోరాడాలని అనుకుంటే నేను బలహీనుల పక్షాన నిలబడి మాత్రమే యుద్ధం చేస్తాను. ఓడిపోయేవారిని గెలిపిస్తాను అని.* తర్వాత తన ధనుస్సు, నీలి గుర్రం, తన మూడు బాణాలు తీసుకుని బయల్దేరతాడు. యుద్ధం ప్రారంభం కావటానికి ముందు ప్రతి యోధుడినీ శ్రీకృష్ణుడు ఒక ప్రశ్న వేస్తాడు. *నీకే బాధ్యతలు ఇస్తే యుద్దాన్ని ఎన్ని రోజులలో ముగించగలవు? ఇదీ ప్రశ్న.* 20 రోజులు చాలునని భీష్ముడు అంటే, 25 రోజులు కావాలని ద్రోణుడు చెబుతాడు. 24 రోజులు సరిపోతాయని కర్ణుడు, 28 రోజులు పడుతుందని అర్జునుడు. ఇలా తలా ఓ రకంగా చెబుతారు. దూరంగా ఉండి ఇవన్నీ చూస్తున్న బర్బరీకుడిని గమనిస్తాడు *శ్రీకృష్ణుడు.* ఒంటరిగా తనను ఓ బ్రాహ్మణవేషంలో సమీపించి శ్రీకృష్ణుడు అందరినీ అడుగుతున్నాడు కదా, నీకూ ఆ ప్రశ్న వేస్తే ఏం చెబుతావు యోధుడా? అని అడుగుతాడు. *నిజంగా నేను బరిలోకి దిగితే ఒకే నిమిషంలో యుద్ధం ముగిసిపోతుంది అంటాడు బర్బరీకుడు.* శ్రీకృష్ణుడు ఒక్కక్షణం దిగ్భాంతికి గురై, అదెలా సాధ్యం అనడుగుతాడు. తన దగ్గర ఉన్న 3 బాణాలను చూపిస్తాడు బర్బరీకుడు. వాటి శక్తి వివరిస్తాడు. నేను మొదటి బాణాన్ని వేస్తే ఎవరెవరిని హతం చేయాలో, వేటిని ధ్వంసం చేయాలో వాటిని, వాళ్లందరినీ గుర్తించి పెడుతుంది. (టార్గెట్స్ ను ఐడెంటిఫై చేస్తుంది. రెండో బాణాన్ని వేస్తే ఎవరెవరిని రక్షించాలో మార్క్ చేసి పెడుతుంది. మూడో బాణం వేస్తే రక్షించాల్సిన వాళ్లను విడిచిపెట్టి, మొదటి బాణం మార్క్ చేసిన ప్రతిదాన్నీ ధ్వంసం చేస్తుంది. ఆ బాణాలు మళ్లీ నా దగ్గరకు వచ్చేస్తాయి అంటాడు బర్బరీకుడు. నేను నమ్మను, నేనే కాదు, ఈ సృష్టిలో ఎవరూ దీన్ని నమ్మరు, నమ్మలేరు అంటాడు శ్రీకృష్ణుడు. బర్బరీకుడిలో క్రమేపీ ఉక్రోషం పెరుగుతుంది. ఏదీ, ఆ రావిచెట్టుకున్న ఆకులన్నీ ఒకేసారి రాల్చేయగలవా అంటాడు శ్రీకృష్ణుడు. చాలా సులభం అంటాడు బర్బరీకుడు. చేసి చూపించు అంటాడు శ్రీకృష్ణుడు. బాణం వదిలేముందు దేవీ ధ్యానం కోసం ఒక్క క్షణం కళ్లు మూసుకుంటాడు బర్బరీకుడు. ఈలోపు శ్రీకృష్ణుడు ఒక ఆకును తన పాదం కింద దాచిపెడతాడు. ఆ బాణం ఆ చెట్టుకున్న ప్రతి ఆకును మార్క్ చేస్తుంది. చివరకు శ్రీకృష్ణుడి పాదం దగ్గరకు వెళ్తుంది. ఇదేమిటి అనడుగుతాడు అమాయకంగా శ్రీకృష్ణుడు. నీ పాదం కింద ఆకు ఉండి ఉంటుంది. అందుకే అదక్కడకు వచ్చింది. నీ పాదం తీసివేయి. లేకపోతే నీ పాదాన్ని చీల్చుకుని వెళ్లి మరీ ఆ ఆకును గుర్తిస్తుంది అది అంటాడు బర్బరీకుడు. తప్పనిసరై పాదం తీసేస్తాడు. మరో బాణం వెళ్లి చెట్టుపై ఉన్న పక్షుల్ని, ఇతర జీవులన్నింటినీ గుర్తిస్తుంది. (రక్షింపబడాల్సినవి). తరువాత బాణం ఆ ఆకులన్నింటినీ రాల్చేసి, ఒక్క దగ్గర మోపు కట్టేస్తుంది. ఆశ్చర్యంగా చూస్తాడు శ్రీకృష్ణుడు. ఈ బాణాల శక్తి నుంచి ఎవరినీ దాచలేమనీ, కాపాడలేమనీ అర్థమవుతుంది. అయితే ఆ యోధుడి వైఖరిలోనే ఓ తప్పుందని, గందరగోళం ఉందనీ గమనిస్తాడు. బర్బరీకుడు ఏ కారణం చేతనైనా సరే కౌరవపక్షాన చేరితే పాండవుల్ని తాను కాపాడలేననీ గుర్తించి కలవరపడతాడు. ఒకవేళ భీముడి మనమడు కాబట్టి పాండవుల పక్షాన చేరితే ఏం జరుగుతుంది? అందుకే దివ్యదృష్టిని సారించి కొన్ని నిజాలు తెలుసుకుని ఇలా ఓ లాజికల్ సంభాషణ ఆరంభిస్తాడు. ఏమోయీ, నువ్వు ఎవరు? నువ్వు కూడా యుద్ధం చేస్తావా? అని అడుగుతాడు. నేను ఘటోత్కచుడి కుమారుడిని. యుద్ధం చూడాలని వచ్చాను. యుద్ధం చేయాలనుకుంటే మాత్రం ఓడిపోయే బలహీనుల పక్షాన నిలబడతానని నా తల్లికి మాటిచ్చాను. పాండవుల పక్షాన కేవలం ఏడు అక్షౌహిణుల సైన్యం మాత్రమే ఉంది. కౌరవుల పక్షాన పదకొండు అక్షౌహిణులు. అంటే పాండవులే బలహీనులు కదా. అవును, అయితే నేను పాండవ పక్షాన నిలబడాల్సి ఉంటుంది. అదే జరిగితే వారితో జతకూడే నీ బాణాల శక్తి కారణంగా పాండవులు బలోపేతమవుతారు. కౌరవులు బలహీనులు అవుతారు కదా. అవునవును. తిరిగి నేను కౌరవుల పక్షాన చేరాల్సి ఉంటుంది. కానీ దాని వల్ల కౌరవులు బలోపేతులై తిరిగి పాండవులు బలహీనులు అవుతారు కదా. మరేం చేయుట? ఇక్కడే తను తీసుకున్న వైఖరిలో లోపమేమిటో బర్బరీకుడికి అర్థమవుతుంది. తన కారణంగానే మారిపోయే బలాబలాలను బట్టి తను ఎటూ స్థిరంగా నిలబడలేనని అటూఇటూ మారితే చివరకు ఇరుపక్షాలూ సమూలంగా హతమారిపోయి ఆఖరికి మరణించకుండా మిగిలేది తనొక్కడే అనీ. విజేత అంటూ ఎవరూ ఉండరు అని బోధపడుతుంది. శ్రీకృష్ణుడి వైపు చూస్తూ ఎవరు మహాశయా మీరు అని ప్రశ్నిస్తాడు అనుమానంగా. ముందు నాకు ఓ వాగ్దానం చేయి, నీకే తెలియని నీ జన్మ వృత్తాంతం కూడా చెబుతాను అంటాడు శ్రీకృష్ణుడు. అలాగే అని చేతిలో చేయి వేసి చెబుతాడు బర్బరీకుడు. అప్పుడు శ్రీకృష్ణుడు తన నిజరూపాన్ని చూపిస్తాడు. తనకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చు అంటాడు. సాక్షాత్తూ శ్రీకృష్ణుడే అడిగితే నేనేమి కాదనగలను అంటాడు బర్బరీకుడు. యుద్ధాన్ని చూడాలనేది నీ కోరిక కదా. ఇంత భారీ జనహనన యుద్దాన్ని ఓ అత్యంత సాహస వీరుడి బలితో ప్రారంభించాలనేది సంప్రదాయం. నిన్ను మించిన యోధుడు లేడిక్కడ. నిన్నెవరూ హతమార్చలేరు. అందుకే నువ్వే నీ తలను తీసి నాకివ్వు అంటాడు శ్రీకృష్ణుడు. నన్నే ఎందుకు బలి ఇవ్వాలి? ఇంతమంది యోధులు ఉండగా. పైగా వాళ్లంతా ప్రాణాలకు తెగించి వచ్చినవాళ్లు కదా అని ప్రశ్నిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా చెబుతాడు. *బర్బరీకా నువ్వు గత జన్మలో ఓ యక్షుడివి* భూమి మీద అధర్మం పెరిగిపోయింది నువ్వే కాపాడాలి *శ్రీమహావిష్ణు* అంటూ బ్రహ్మదేవుడిని వెంటేసుకుని ఓసారి దేవుళ్లంతా నా దగ్గరకు వచ్చారు. దుష్టశక్తుల్ని సంహరించటానికి త్వరలో మనిషిగా జన్మిస్తాను అని వాళ్లకు చెప్పాను. ఇదంతా వింటున్న నువ్వు *ఈ మాత్రం దానికి విష్ణువే మనిషిగా అవతరించడం దేనికి? నేనొక్కడిని చాలనా* అని ఒకింత పొగరుగా మాట్లాడావు. దానికి నోచ్చుకున్న బ్రహ్మ నీకు ఓ శాపం విధించాడు. *ధర్మానికీ, అధర్మానికీ నడుమ భారీ ఘర్షణ జరగబోయే క్షణం వచ్చినప్పుడు మొట్టమొదట బలయ్యేది నువ్వే* అని శపించాడు. అందుకే నీ బలి. అంతేకాదు నీ శాపవిమోచనం కూడా అని వివరిస్తాడు శ్రీకృష్ణుడు. కానీ నాకు యుద్దాన్ని చూడాలని ఉంది అంటాడు బర్బరీకుడు. ముందు నీ తలను ఇవ్వు అంటాడు శ్రీకృష్ణుడు. అప్పుడు సంతోషంగా తన తలను తనే నరుక్కుంటాడు బర్బరీకుడు. శ్రీకృష్ణుడు ఆ తలను ఓ గుట్టపైకి తీసుకెళ్లి, మొత్తం యుద్ధం కనిపించే ప్రదేశంలో పెడతాడు. యుద్ధం ముగిసింది. విజయ గర్వంతో ఉన్న పాండవులు ఈ విజయానికి నేనంటే నేనే కారణమంటూ వాదించుకుంటూ ఉంటారు. వారిని బర్బరీకుడి తల దగ్గరకు తీసుకెళ్తాడు శ్రీకృష్ణుడు. తన కథ చెబుతాడు. భీముడు విలపిస్తాడు. తరువాత శ్రీకృష్ణుడు బర్బరీకుడికి ఓ ప్రశ్న వేస్తాడు. *వత్సా! ఈ మొత్తం యుద్దంలో ఏ క్షణమేం జరిగిందో చూసింది నువ్వు ఒక్కడివే, నువ్వు చెప్పు ఏం గమనించావో?* స్వామీ! ఒక చక్రం యుద్ధక్షేత్రమంతటా తిరుగుతూ అధర్మం పక్షాన ఎవరుంటే వాళ్లను హతమార్చడాన్ని చూశాను. మహాకాళి వేల నాలుకలతో పాపులను బలితీసుకోవటాన్ని చూశాను. ఆ మహాశక్తి నువ్వు మాత్రమే. యుద్ద కారకులు, యుద్ధకర్తలు, మిగతావాళ్లంతా కేవలం పాత్రధారులు మాత్రమే అని సమాధానమిచ్చి తన శాపం ముగిసిపోయి తిరిగి యక్ష రూపాన్ని పొంది ఊర్ధ్వలోకాలకు వెళ్లిపోతాడు. ఇదీ మహాభారతంలోని బర్బరీకుడి కథ.


🙏🙏🙏 ksnm 🙏🙏🙏

Smell of a woman

 Smell of a woman!


  This is one of the best posts I have read about a woman ... please read it completely ... it's worth it ...


  *woman*.  .  .  .  .  .  .  .  .


  When God created the woman He worked late on Friday .......


  An angel came and asked.  "Why spend so much time on it?"


  Replied the lord.  "Did you see all the specifications I had to meet in order to design it?"


  ● It must function in all kinds of situations.

  ● She must be able to adopt several children at once.

  ● Have a hug that can heal anything from a bruised knee to a broken heart.

  ● She must do it all with just two hands.

  ● She heals herself when she is sick and can work 18 hours a day.


  The angel was impressed "Only two hands ..... impossible!


  And this is the standard model?  "


  The angel approached and touched the woman.

  "But you made her so soft, Lord."

  "She's soft," God said.

  "But I made her strong. You can not imagine what she can endure and overcome"


  "Can she think?"  Asked the angel ...

  Replied the lord.  "Not only can she think, she can reason and negotiate."


  The angel touched her cheek ....

  "God, this piece seems to be leaking! You've put too much of a burden on it."

  "She's not leaking ... it's a tear."  The Lord corrected the angel ...


  "What is it for?"  Asked the angel ......

  Said the lord.  "Tears are her way of expressing her sorrow, her doubts, her love, her loneliness, her suffering and her pride."  ...


  It made a great impression on the angel,

  "God, you're a genius. You thought of everything.

  A truly wonderful woman "


  Said the Lord.  "Indeed she is.

  ■ She has the power to amaze a man.

  ■ It can handle troubles and carry heavy loads.

  ■ She holds happiness, love and opinions.

  ■ She smiles when she feels like screaming.

  ■ She sings when she feels like crying, cries when she's happy and laughs when she's scared.

  ■ She fights for what she believes in.

  ■ Her love is unconditional.

  "Her heart breaks when a relative or friend dies, but she finds the strength to continue living."


  The angel asked: So she is a perfect being?

  The Lord replied: No.  It has only one drawback.

  "She often forgets what she's worth."


  Send it to all the women you respect .... 👍

  And to all the men who respect a woman 👍👍


  * Being a woman is invaluable * 💃💃

Been around but worth a read 




  Pass this on to every woman in your touch to make her feel proud of herself. 🙏🙏🙏

నారాయణీయము

 *నారాయణీయము* 


*(మొదటి భాగము.)*


 విష్ణు భక్తులందరూ ఎంతో ఆదరంతో పఠించే పుస్తకం నారాయణీయము. ఇది భాగవతం లో భక్తి వేదాంత విషయాలకు సంక్షిప్త వర్ణనము. ఇందులో ఉన్న శ్లోకాలలో బీజాక్షరాలూ, తత్వ సంబంధమైన రహస్యాలూ కొల్లలుగా ఉన్నాయి.  ఈ పుస్తక పఠనం ఆధ్యాత్మిక ఉన్నతి కే కాక ఆయురారోగ్యాలను శారీరక సౌఖ్యాన్ని కలుగజేస్తుందని  నమ్మి చాలామంది ఈ పుస్తక పఠనాన్ని నియమ పూర్వకంగా చేస్తుంటారు. ఈ పుస్తక రచన జరగడానికి పూర్వ రంగమైన  కథ ఒకటున్నది.


 కేరళ దేశంలో గురువాయుర్ దగ్గర *నారాయణ భట్టతిరి (భట్టాత్రి)* అనే విద్వాంసుడుండేవాడు. ఆయన నంబూద్రి బ్రాహ్మణులు. పురాణాలు వేద వేదాంగాలు సంస్కృత వ్యాకరణము బాగా చదువు కున్నారు. ఆయన గురువు గారికి వాత రోగం వచ్చింది. గురువు గారు చాలా తీవ్రంగా బాధ పడేవారు. నారాయణ భట్టతిరి గారు గురువుగారి బాధను చూసి తల్లడిల్లి పోయాడు. తన యోగబలంతో ను సంకల్పబలంతో ను ప్రయత్నించి ఆ వ్యాధిని గురువుగారి శరీరంనుంచి తన శరీరం లోనికి మార్పు చేసుకున్నారు. తనకున్న యోగబలంతో ఆ వ్యాధిని నియంత్రి ద్దామని  చూసారు గాని అది వీలు పడలేదు. పైగా ఆ అనారోగ్యం తిరగ బెట్టి ఈయనను పూర్తిగా మంచానపడేసే టట్లు చేసింది. ఊరికే మంచాన పడ్డా పర్వాలేదు శరీరమంతా ఓర్చుకోలేనంతగా బాధ పెట్టడం మొదలు పెట్టింది. వైద్య శాస్త్రం లో ఉన్న  ఔషధాల న్నీ ప్రయోగించినా ఆ బాధ తగ్గలేదు. బాధ భరించలేని స్థితికి వచ్చింది.


తుంజత్ ఎళుతచ్చన్  అనే మహా యోగి విష్ణు భక్తుడు ఆ ప్రాంతానికి వచ్చారట. భట్ట తిరిగారు తన కథంతా ఆయనకు చెప్పుకొని ఈ వ్యాధిని గురువుగారి శరీరంనుంచి తన శరీరం లోకి తెచ్చుకునే దాకా యోగశక్తి బాగానే పనిచేసింది తర్వాత నుంచి పని చేయడం మానేసింది  ఎందుకు ఇలా జరిగింది ప్రస్తుతం ఈ జబ్బు నాకు ఎలా తగ్గుతుంది నేనేం పుచ్చుకోవాలి అని అడిగారట. ఆయన నవ్వి భగవంతుని లీలలు అలాగే ఉంటాయి.  ఏదో ప్రయోజనం లేకుండా ఇలా జరగదు.  నీకు ఈ జబ్బు తగ్గాలంటే మొదట "చేప తో మొదలు పెట్టు తర్వాత తాబేలు" ఇలా చేస్తే గుణం ఇస్తుంది అక్కడి నుంచి క్రమక్రమంగా ముందుకు వెళ్ళు అన్నారట. ఆ సంభాషణ మొత్తమూ సంస్కృత భాషలో నే జరిగింది. ఆ ఉపదేశాన్ని ఇచ్చినాయన చాలా మితభాషి. మౌనంగా ఉండేవాడు. ఆ మాత్రం చెప్పడం కూడా ఎక్కువ. భట్టతిరి గారికి ముందు అర్ధం కాలేదు. చేపలు  కోడిగుడ్లు తినడం భట్టతిరి గారి ఆచార ప్రకారం నిషేధము. గురువు గారికి భట్టతిరి గారి ఆచారాలన్ని బాగా తెలుసు. మరి ఎందుకు ఇలా చెప్పారు. చాలా రోజులు అర్థం కాలేదట.


పాండిత్యం ఉంది కానీ మాయ వ్యామోహము మనసుని కప్పి ఉన్నందువల్ల స్పష్టంగా చెప్పిన మాటలకు కూడా "మందు, పధ్యము, అనుపానము" మొదలైన అర్థాలనే భట్ట తిరిగారు అన్వయించు కున్నారు.  తర్వాత చాలా రోజులు ఆలోచిస్తూ కూర్చున్నారట.  ఆయనకు తెలియని శ్లోకం కాదు. కానీ కొంతకాలానికి ఆయనకే  తట్టింది. ఆ శ్లోకం ఇది. 


*శరీరే జర్జరీ భూతే*

*వ్యాధి గ్రేస్తే కళేబరే* 

*ఔషధం జాహ్నవీ తో్యం*

*వైద్యో నారాయణో హరిః*


 *మనకు ఏదైనా జబ్బు రాగానే అల్లోపతి హోమియోపతి చప్పును గుర్తొస్తాయి. మూడోది పై శ్లోకంలో చెప్పినట్టు అల్లోపతి హోమియోపతి వాటి కంటే ముఖ్య మైనది  "తిరుపతి" ( దైవానుగ్రహం) అనేది కూడా ఒకటుంది.*

 ఎందుకో అది ఎవరికి అంతగా గుర్తు రాదు. భట్టతిరి గారి అదృష్టం కొద్దీ మన అదృష్టం కొద్దీ ఆయనకది ఎట్టకేలకు గుర్తు కొచ్చింది. ఆ గురువు గారు మత్యం తో ఆరంభించు  అన్న మాటకు " జబ్బు తగ్గడానికి, మందుగా  చేపలు తినమనే" అర్థం కాదని, నీ పాండిత్యాన్ని ఉపయోగించి మత్స్యావతారం దగ్గర నుంచి మొదలుపెట్టి దశావతారాల వర్ణనను చెయ్యమని అంటే నారాయణ స్తుతి చెయ్యమని గురువుల అసలు సూచన అని అర్థమైంది. విషయం అర్థం అయిన తర్వాత హమ్మయ్య అనుకున్నారట. అప్పటినుంచి వైద్యుల దగ్గరికి పోకుండా భగవంతుడి వైపుకు తిరిగిపోయాడు.


భట్ట తిరిగారు తన 27వ ఏట కావ్యాన్ని మొదలుపెట్టి నూరు రోజుల్లో రోజుకొక దశకం చొప్పున పూర్తి చేసి నారాయణునికి అంకిత ఇచ్చారు.  కావ్యం మాత్రం కేవలం దశావ తారాలు మాత్రమే కాకుండా వ్యాస భాగవత సారాన్నీ అందులోని  ఘట్టాలనీ క్లుప్తంగా  రాశారు.  కావ్యం చేప తో మొదలు కాదు కానీ దశావతారాల వర్ణన కూడా అందులో భాగవతంలో ఉన్నట్టుగానే వస్తుంది.


అపరిమితమైన పాండిత్యాన్ని సంపాదించి యోగమార్గంలో సిద్ధులు కూడా సంపాదించి మోక్ష మార్గాన్ని చూసుకోకుండా ఇంకా సంసారం లో ఉంటూ గురువుల కష్టాలు తన శారీరక కష్టాలు వీటి గురించి మాత్రమే ఆలోచిస్తున్న భట్ట తిరి గారికి భగవంతుడు మార్గాన్ని లక్ష్యాన్ని నిర్ణయించ డానికే తన లీలను చూపించాడు. పైన భగవంతుడు నిర్ణయము ఇక్కడ గురువు గారి సూచన రెండూ పనిచేసి పండితుడు భక్తుడయ్యాడు.  పాండిత్యం అత్యంత ఉన్నత స్థాయికి చెందిన కవిత్వం గా పరిణమించింది. భక్తుల కష్టాలు తీర్చడానికి నారాయణీయము అనే కావ్యం రూపు దిద్దుకున్నది. 


 ఈ కావ్యంలో ప్రతి దశకానికి చివర్లో నా వ్యాధిని తగ్గించు అనే మాట తప్పకుండా ఉంటుంది. కావ్యం మొదలుపెట్టగానే భట్టతిరి గారి శారీరక బాధ కొద్దికొద్దిగా తగ్గుతూ కావ్యం పూర్తయ్యేటప్పటికి పూర్తిగా ఉపశమించింది. తర్వాత ఆయన దాదాపు 96 సంవత్సరాల వయసు వరకు జీవించి చాలా గ్రంథాలు రాసి భగవంతునిలో లీనమైనారు.


భట్టతిరి వంటి జ్ఞాని మహా భక్తుడు మోక్షాన్ని కోరకుండా ప్రధానంగా ఆరోగ్యాన్ని ఎందుకు కోరుకున్నాడు అనే ప్రశ్నకు జవాబు నాలుగో దశకంలో లభిస్తుంది. శారీరకమైన ఆరోగ్యాన్ని మానవులు ఎందుకు కోరుకోవాలో పతంజలి మహర్షి తన యోగ శాస్త్రంలో కూడా అవే కారణాలను చూపిస్తారు. మోక్ష పురుషార్ధం తో పాటు మిగతా ఏ పురుషార్ధం సాధించుకోవాలి అన్నా శరీరం ఉండాలి. మోక్షం కోసం ప్రయత్నించడానికి కూడా శరీరమే ప్రధానము. అది పోతే మళ్లీ ఇంకో జన్మ ఎత్తాలి. అందుకే ఆయన ఆరోగ్యాన్ని కోరుకున్నాను అంటాడు.


భట్టతిరి గారి నారాయణీయానికి సంబంధించిన ఇంకొన్ని వివరాలను విశేషాలను తెలుసుకుందాము.


ఇంకా వుంది.......

*నారాయణీయము* 


*(రెండవ భాగము.)*


 నారాయణీయము లోపల వర్ణించిన కథను వ్యాసులవారు భాగవతంలో 18 వేల శ్లోకాలలో విపులంగా వర్ణించారు. అదే కథను భట్ట తిరిగారు వెయ్యి శ్లోకాలలో సంగ్రహంగా రాశారు. 10 శ్లోకాలకు దశకము అని పేరు. అట్లాంటివి ఈ పుస్తకంలో నూరు దశకాలు ఉన్నాయి. కొన్ని దశకాలలో 10 కంటే ఎక్కువ శ్లోకాలు కూడా ఉన్నాయి. ఆ   శ్లోకాలన్నీ కలుపుకుంటే 1034 అవుతాయి.


 ఈ కావ్యానికి నారాయణీయము అనే పేరు ఎందుకు పెట్టారు అనేదానికి కవి స్వయంగా నూరవ దశకంలోని ఆఖరి శ్లోకంలో కారణం చెప్పుకున్నారు. నారాయణ భట్ట తిరి పేరులో నారాయణ శబ్దం ఉన్నది. ఈ కావ్యం అంకితం ఇచ్చింది కూడా నారాయణుడికే. ఇచ్చిన వాళ్లు తీసుకున్నవాళ్లు ఇద్దరూ నారాయణులే. కాబట్టి ఈ కావ్యం పేరు రెండు విధాల ( ద్వేధా ) నారాయణీయ మవుతుంది అంటాడాయన. సంస్కృత భాషలో కావ్యం అనేది స్త్రీ లింగ పదము. కావ్యం రాసిన వాడిని తండ్రి అని కావ్యం పుచ్చుకున్న వాడిని భర్త అని వ్యవహరిస్తారు. ఈ కావ్య కన్యకకు పుట్టింట్లో పేరు నారాయణుడి కి సంబంధించినది అని, మెట్టినింట్లో పేరు కూడా నారాయణుడి కి సంబంధించినది అనేది ఆ చమత్కారం. 


గురువాయుర్ క్షేత్రం లో ఉన్న విష్ణుమూర్తిని శ్రోత గా ఊహించుకొని ఆయన తన ఎదురుగా కూర్చుని వింటున్నాడని భావిస్తూ,  ఆయనను సంబోధిస్తూ ( ప్రధమ పురుషలో) కవిత్వం నడుస్తుంది. అప్పుడు నువ్వు ఇలా చేశావు అప్పుడు అలా అన్నావు అన్న విధంగా ఆ శ్లోకాలు ఉంటాయి.


 *ఆ శ్లోకాలు భగవంతుడు వినడం అనేది భట్టతిరి గారి బ్రాంతి కాదు ఊహ అంతకంటే కాదు.*


 శ్రీకృష్ణుని బాల్య లీలలను వర్ణించేటప్పుడు భట్టతిరి గారు ఒక వర్ణన చేశారు. ఇది వ్యాసులవారి భాగవతం లో ఉన్న కథనే. యశోద ఒక రోజు పాలు పొయ్యిమీద పెట్టి పెరుగు చిలుకుతూ కూర్చున్నదట. బాలకృష్ణుడు బయటి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఆకలవుతుందని పాలివ్వమని గొడవ మొదలు పెట్టాడు. ఆవిడ కూడా ఆ కవ్వం చిలుకుతూనే కృష్ణుడి ని ఒళ్ళో పడుకోబెట్టుకుని పాలివ్వడం మొదలు పెట్టింది. ఈ లోపల పొయ్యి మీద పాలు పొంగడం మొదలు పెట్టాయి. యశోద హడావుడి పడుతూ కృష్ణుడిని కిందకు దించి పాల కుండ దగ్గరికి పరిగెత్తిందిట.  పాలిచ్చే మధ్యలో అలా దించి పోయినందుకు కృష్ణుడి కి చాలా కోపం వచ్చింది. పెరుగు కుండ కదలకుండా ఉండడానికి పెట్టిన నాలుగైదు రాళ్ళల్లో నుంచి ఒక గుండ్రాయి పుచ్చుకొని ఆ పెరుగుకుండను పగలగొట్టాడు. ఇది ఆ కథ. భట్టతిరి గారు ఈ కథ రాసేటప్పుడు ఆ కుండను శ్రీకృష్ణుడు కవ్వం తో పగలగొట్టాడు అని రాశాడు. ఆ శ్లోకం ఇది.

 

 *సామి పీత రస భంగ సంగత*

 *క్రోధ భార పరి భూత చేతసా*

 *మంధ దండ ముప గృహ్య పాటితం*

 *హంత దేవ దధి భాజనం త్వయా*  47/3.


*సామి అంటే సగము. మంధ దండ అంటే కవ్వము. పాటితం అంటే పగలగొట్టడము. దధి భాజనం అంటే పెరుగు కుండ అని అర్థాలు.  అమ్మ ఒడిలో హాయిగా పాలు తాగుతూ కాళ్లు ఊపుకుంటూ ఉన్నవాడిని హఠాత్తుగా దించి పక్కనపెట్టే సరికి రసభంగం అయ్యి కృష్ణుడికి చాలా కోపం వచ్చిందట. ఇది ఈ శ్లోక భావం.*

 

ఊర్లో పండితులు ఉంటారు కదా వాళ్లు వెంటనే అభ్యంతర పెట్టారట ఈ వర్ణన వ్యాసభారతాని కి వ్యతిరేకంగా ఉంది అని. "నేను శ్లోకాలు రాసేటప్పుడు ఆ ఘట్టం నాకు కళ్లముందు కనిపిస్తుంది. నాకు కనిపించే ప్రకారం నేను శ్లోకాలు రాస్తుంటాను.." అని భట్ట తిరిగారు వివరణ ఇచ్చారు. ఊర్లో పండితులు ఒప్పుకోలేదట. భట్టతిరి గారు మనస్సు చాలా కష్ట పెట్టుకున్నారు. ఆ శ్లోకాన్ని మార్చి రాద్దామని కూడా నిర్ణయించుకున్నారు. ఈ అభ్యంతరం పెట్టిన పండితులంతా  గుడికి వెళ్లి విష్ణుమూర్తి దర్శనం చేసుకుంటే ఆ గుడిలో ఉన్న విష్ణుమూర్తి విగ్రహం తాలూకు అభయ హస్తం కవ్వం పట్టుకొని దర్శనం ఇచ్చిందట. "ఆ సంఘటన అలా రెండు సార్లు జరిగింది. నేను రెండుసార్లు పెరుగు కుండ పగలగొట్టాను. ఒకసారి రాతితో ఒకసారి కవ్వంతో. వ్యాసులవారు ఒక సందర్భాన్ని మాత్రమే భాగవతంలో రాశారు" అని విష్ణుమూర్తి అందరికీ తెలియజేశారు. అందరూ చెంపలేసుకుని మళ్లీ భట్టతిరి గారి దగ్గరికి వచ్చి ఈ భగవంతుడి లీల గురించి చెప్పి ఆ శ్లోకాన్ని మార్చవద్దని అదేవిధంగా ఉంచమని వేడుకున్నారట.


ఇంకా వుంది.......


*నారాయణీయము* 


*(మూడవ భాగము.)*


ఒరిస్సాలో జయదేవుడు రాసిన గీత గోవిందానికి విపరీతమైన ఆదరణ ఉంది. జయదేవుడు వాళ్ళ కవి అని వాళ్లకు చాలా ఎక్కువ గౌరవము. అష్టపదిని ప్రయోగించకుండా ఒడిస్సీ నాట్య ప్రదర్శన ఉండనే ఉండదు. ఉత్తరాదిన తులసీదాసు రచించిన రామచరిత మానస్ అలాగ ఆదరణ పొందిన గ్రంథము. అలాగే నారాయణ భట్టతిరి రాసిన నారాయణీయము కేరళ ప్రాంతంలో ఇంచుమించు ప్రతి హిందువు ఇంట్లోనూ ఉంటుంది. వాళ్లకది నిత్య పారాయణ గ్రంధము. గురువాయూరు క్షేత్రం లో ఈ గ్రంథ పారాయణ నిత్యం జరుగుతుంది. కేరళ వాళ్ల సొంత నాట్య రీతి అయినటువంటి మోహినీ ఆట్టం లో ఎప్పుడూ ప్రార్ధన శ్లోకాలు నారాయణీయం నుంచి వాడతారు. నారాయణీయం లో భట్టతిరి వాడిన విష్ణుమూర్తి కి సంబంధించిన పేర్లన్నీ అదే క్రమంలో సహస్రనామం గా ఏర్పాటు చేసి నారాయణీయ సహస్రనామము అనే పేరుతో గురువాయూర్ లో పారాయణ చేస్తుంటారు. వాళ్లకు నారాయణీయం మీద ఉన్న భక్తికి అది పరాకాష్ట. 


ఈ కావ్యంలో ఉన్న భాష చాలా మధురంగా నూ గంభీరమైన భావాలతోనూ కావ్య పద్ధతిలో ఉంటుంది. ఏమాత్రము కాఠిన్యం ఉండదు. భక్తులను ఈ కావ్యం చాలా ఆనందింప చేస్తుంది. కథ క్లుప్తంగా ఉన్నప్పటికీ వ్యాస భాగవతంలో ఉండే రహస్యమైన వేదాంత విషయాలను స్పష్టంగా విడమరిచి చెబుతూ వర్ణనలు సాగుతాయి. గోవర్ధన పర్వతం కథ దగ్గర ఇంద్రుడు తన అధికార మదం తో శ్రీకృష్ణుడిని అవమానించడానికి పూనుకున్నాడని, అలాగే శిశుపాలుడు అసూయతో శ్రీకృష్ణుడిని అవమానించడానికి పూనుకున్నాడు అని ఇలా ప్రతి పాత్ర మనసులో ఉన్న దుర్గుణాలను స్పష్టంగా చెప్తూ పాఠకులకు ఊహించుకోవడానికి ఏమీ మిగలకుండా కథ నడిపిస్తాడు. సందేహాలు ఏర్పడే ప్రతి ఘట్టం లోనూ ఆ సందేహాలకు సమాధానం చెప్తూ ముందుకు వెళతాడు. ఇది భట్టతిరి గారు కథ చెప్పే పద్ధతి. మూల భాగవతం లో ఉండే భక్తి వేదాంత విషయాల సారాన్ని స్వీకరించి మిగిలిన విషయాన్ని వదిలిపెట్టి క్లుప్తంగా చేసిన రచన ఇది. భాగవతంలోని ఈ విషయాలన్నీ ఏమాత్రం పునరుక్తి లేకుండా సూటిగా స్పష్టంగాఈ పుస్తకంలో వివరించారు. సాధారణంగా నారాయణీయానికి తాత్పర్యం తో కలిసిన ప్రతులు దొరుకుతున్నాయి. కాస్త మనసు పెట్టి చదివితే ఈ విశేషాలన్నీ తెలుస్తాయి. 


తులసీదాసు తాను రచించిన రామచరిత మానస్ లో శ్రీరామచంద్రుడు సాధారణ మానవుడు అనే విషయాన్ని ఎప్పటికీ ఒప్పుకోడు. అవకాశం దొరికినప్పుడల్లా ఆయన పరమాత్మ పరబ్రహ్మము అని చెబుతూ ఉంటాడు. అందువల్ల వాల్మీకి రామాయణం లో ఉన్నట్లుగా రామచరిత మానస్ లో కథకు సంబంధించిన రక్తి ఏమాత్రము దొరకదు. భక్తి మాత్రమే ఉంటుంది. నారాయణీయము లో కూడా భట్టతిరి ఇదే పద్ధతిని అనుసరించాడు. ప్రతి దశకం లోనూ అవసరం ఉన్నా లేకున్నా నువ్వు పరబ్రహ్మానివి పరమాత్మవు అని పదేపదే చెబుతుంటారు. అందువల్ల ఈ పుస్తకం భక్తులకు తమ భక్తిని గట్టి చేసుకోడానికి పనికి వస్తుందే కానీ రక్తికి, లౌకికమైన కావ్యానందం పొందడానికి, మాత్రం పనికిరాదు.  


*ప్రధానంగా ఆయురారోగ్యాలను మోక్షాన్ని కోరుకునేవాళ్లు ఈ పుస్తకాన్ని పారాయణ చెయ్యాలి..* 


ఇంకా వుంది.......


*పవని నాగ ప్రదీప్.*


*పవని నాగ ప్రదీప్.*

.*

నేనెవరిని

 పొద్దున్నే నిద్రలేచి ఆధ్యాత్మిక విషయాలు ఆలోచిద్దామనుకుని

కళ్లు మూసుకుని ధ్యానముద్రలో మునిగి ఆలోచించడం మొదలెట్టాడు!🧎‍♂️

1. నేనెవరిని?

2. నేనెక్కడి నుండి వచ్చాను?

3. నేనెందుకు వచ్చాను?

4. నేనెక్కడికి వెళ్లాలి?


ఇంతలో వంటగదిలో నుండి భార్య అరుపులు వినబడ్డాయి.....

1. నువ్వొక పేద్ద సోమరిపోతువి.

2. ఎక్కణ్నుంచి తగలడ్డావో 

    నా ఖర్మకు.

3. నా జీవితం నాశనం 

    చేయడానికే పుట్టావు.

4. ముందు లేచి బాత్ రూంకు

    వెళ్లి స్నానం చేసి తగలడు. 

    టిఫిన్ రెడీ అవుతోంది.


*ఆ సౌండ్ దెబ్బకు ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికినట్టనిపించి తృప్తిగా నిట్టూర్చి, కళ్లు తెరిచి బాత్ రూం కి పరుగు....🏃‍♂️* 😀😃😄

వాస్తు చాలా మంది నమ్ముతాము

 వాస్తు చాలా మంది నమ్ముతాము (భయపడతాము) కదా ?

నేను కూడా నమ్మి నమ్మి ....ప్రస్తుతం ఈసంఘటన పరిపూర్ణం గా #నమ్మడం తో పాటు #రుజువులు చూపించగలను 

🍁ఒక చిన్నవాస్తు కథ🍁*

 👌👌👌👌👌👌👌


👉🏼హైదరాబాద్ కి చెందిన సత్యనారాయణ  ప్రముఖ వ్యాపారవేత్త, వారు హైదరాబాద్  శివారు పల్లెటూరులో కొంతభూమిని కొని, అక్కడ ఒక  ఫామ్ హౌస్ ని కట్టుకున్నారు.


ఆ ఫామ్ హౌస్ వెనుక వైపు  ఒక చక్కని స్విమ్మింగ్ పూల్, గార్డెన్ కూడా ఏర్పటుచేసుకున్నారు.


వాటితో పాటూ అక్కడ ఒక పెద్ద ఆహ్లాదపరిచే 50 ఏళ్ళ నాటి మామిడి చెట్టు కూడా ఉంది. నిజానికి ఆయన ఆ ఆస్తి కొన్నది కూడా ముఖ్యంగా ఆ పెద్ద మామిడిచెట్టును చూసి ముచ్చటపడేవాడు.


ఆ కొత్త ఇంటికి వాస్తు చూపించుకుని తగినమార్పులు చేయించుకోమని వారికి సన్నిహితులు గట్టిగా సలహా ఇచ్చారు.


సత్యనారాయణగారు వాస్తును పరిశీలించే శాస్త్రిగారిని తీసుకొని కారులో ఇద్దరూ  బయలుదేరారు.


కొంతప్రయాణం తర్వాత వారు వెళ్తున్న దారిలో సత్యనారాయణగారు కారును కొద్దిగా పక్కకు పోనిచ్చి, వెనుకగా ఓవర్ టేక్ చేసి వస్తున్న కొన్ని కార్లకు దారి ఇవ్వడం చూసిన శాస్త్రి గారు    చిరునవ్వుతో మీ డ్రైవింగ్ నిజంగా చాలా సురక్షితమైనది అన్నారు.


దానికి  సత్యనారాయణగారు నవ్వుతూ అయ్యా! వారికి ఎదో అత్యవసరపని అయిఉండొచ్చు, అందుకే తొందరగా వెళ్తున్నారు. అలాంటి వారికి ముందుకు వెళ్ళడానికి మనం దారిఇవ్వడం మన ధర్మం కదండీ! అన్నారు.


అక్కడ నుండి కారు చిన్న పల్లెటూరు సమీపించింది.

అక్కడి వీధులు చిన్నగా ఇరుకుగా ఉండడంతో సత్యనారాయణగారు కారు వేగం తగ్గించి నెమ్మదిగా నడుపుతున్నారు. ఇంతలో హఠాత్తుగా ఒక కొంటె కుర్రాడు రోడ్డుకు అడ్డంగా ఒక్కసారిగా పరిగెత్తాడు. గమనించిన సత్యనారాయణగారు అతడిని తప్పించి తన కారును మరింత  నెమ్మదిగా పోనిస్తున్నారు.


అది ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్లుగా ఉంది. 

ఇంతలో అదే దారిలో మరో కుర్రాడు కూడా అలాగే హఠాత్తుగా పరిగెత్తుతూ ముందుకు వెళ్ళిపోయాడు

ఈసారి ఆశ్చర్యపోవడం శాస్త్రీ  గారి వంతైంది. సార్! ఇలా ఇంకో పిల్లాడు మరలా వస్తాడను మీరెలా ఊహించారు అని ప్రశ్నించారు. దానికి

సత్యనారాయణ గారు నవ్వుతూ పిల్లలెప్పుడూ అంతేకదండి! ఒకడి వెంట మరొకడు వెంటపడుతూ ఆడుకుంటారు. వెనుక ఇంకొకడు లేకుండా ఒక్కడే ఎప్పుడూ అలా ఆడుకోరు కదా? అన్నారు.


కారు ఫామ్ హౌస్ కి చేరుకుంది. 

కారులోంచి వారు క్రిందికి దిగుతుండగా, అక్కడ ఒక్కసారిగా కొన్ని పక్షులు రెక్కలు కొట్టుకుంటూ  పైకి ఒక్కసారిగా ఎగిరాయి,


అది చూసిన సత్యనారాయణ  గారు శాస్త్రిగారిని  ఆపి, సర్ మీరు ఏమీ అనుకోకపోతే, మనం కొద్ధి సేపు ఇక్కడే  ఆగి వెళదాం..అక్కడ వెనక వైపు ఎవరో కొంతమంది పిల్లలు చెట్టెక్కి మామిడిపళ్ళు కొస్తున్నట్లు ఉంది, మనం కనుక హఠాత్తుగా వెళ్తే వాళ్ళు మనల్ని చూసి భయపడి చెట్టునుండి దూకితే క్రిందపడిపోతారు.

ఎందుకండీ అనవసరంగా

అంతలా వాళ్ళని భయపెట్టి సాధించేదేముంది అన్నారు.


శాస్త్రి గారు కొంతసేపు స్తబ్దుగా ఉండిపోయారు. ఆపై నెమ్మదిగా ఇలా అన్నారు. ఈ ఇంటికి ఎటువంటి వాస్తు మార్పులు చేర్పులు అవసరం లేదు !


ఈసారి ఆశ్చర్యపోవడం సత్యనారాయణ గారి వంతైంది.

ఎం?ఎందుకండి?


ఏ ప్రదేశం అయినా, మీలాంటి ఉత్తములు నివసిస్తూ ఉంటే, సహజంగానే అది ఉత్తమమైన వాస్తుగానే దానంతట అదే మార్పు చెందుతుంది, సందేహం లేదు.


ఎప్పుడైతే మన ఆలోచనలు, ఆకాంక్ష ఇతరుల శ్రేయస్సు, సంక్షేమం కోరుకుంటాయో, ఆఫలితం లబ్దిపొందే వారికే కాక, అది మనకి కూడా మంచి చేస్తుంది. అయితే ప్రత్యేకించి ఎల్లప్పుడూ అన్నిసమయాల్లోనూ ఇతరుల సంక్షేమం కాంక్షించే వ్యక్తి వారికి తెలియకుండానే మహోన్నతుడు, సత్పురుషుడుగా మరిపోతాడు.

నిజానికి సాధువు, సత్పురుషుడు అంటే  ఎల్లప్పుడూ సమాజానికి మేలు చేసే వ్యక్తులే కదా!


*👉🏼ధర్మస్య విజయోస్తు🙌🏼*

*👉🏼అధర్మస్య నాశోస్తు🙌🏼*

*👉🏼ప్రాణిషు సద్భావనాస్తు🙌🏼*

*👉🏼విశ్వస్య కళ్యాణమస్తు🙌🏼

కౌరవుల పేర్లు

 ఓ సారి చూడండి...


మీకు కౌరవుల పేర్లు తెలుసా !

**********************

సేకరణ :


            వ్యాస మహర్షి చాలా దూరం ప్రయాణం చేసి వచ్చినపుడు ఆయన గాయపడిన గాయాలకు గాంధారి సేవచేసి, ఆయనకు కావలసిన సపర్యలన్నీ చేసింది. ఇందుకు ఆయన సంతోషించి నీకు ఎలాంటి కోరిక ఉన్నా.. దానిని తీరుస్తాని ఆమెకు ప్రమాణం చేశాడు. గాంధారి తనకు 100 మంది కొడుకులు కావాలని కోరగా, మహర్షి అలాగే నీకు వంద మంది కొడుకులు పుడతారని అభయమిస్తాడు. అలా, గాంధారికి వంద మంది పుత్రులు కలుగుతారు. వీరినే కౌరవులుగా మహాభారతంలో పేర్కొంటారు. ఈ వంద మంది పేర్లు చాలా మందికి తెలియవు. ఇపుడు తెలుసుకుందాం. 

 

1. దుర్యోధనుడు. 2. దుశ్సాసనుడు. 3. దుస్సహుడు. 4. దుశ్శలుడు. 5. జలసంధుడు. 6. సముడు. 7. సహుడు. 8. విందుడు. 9. అనువిందుడు. 10. దుర్దర్షుడు. 11. సుబాహుడు. 12. దుష్పప్రదర్శనుడు. 12. దుర్మర్షణుడు. 13. దుర్మఖుడు. 15. దుష్కర్ణుడు. 16. కర్ణుడు. 17. వివింశతుడు. 18. వికర్ణుడు. 19.శలుడు. 20. సత్వుడు. 21. సులోచనుడు. 22. చిత్రుడు. 23. ఉపచిత్రుడు. 24. చిత్రాక్షుడు. 25. చారుచిత్రుడు. 26. శరాసనుడు. 27. ధర్మధుడు. 28. దుర్విగాహుడు. 29. వివిత్సుడు. 30. వికటాననుడు. 31. నోర్ణనాభుడు. 32. నునాభుడు. 33. నందుడు. 34. ఉపనందుడు. 

35. చిత్రాణుడు. 36. చిత్రవర్మ. 37. సువర్మ. 38. దుర్విమోచనుడు. 39. అయోబావుడు. 40. మహాబావుడు. 41.చిత్రాంగుడు.42.చిత్రకుండలుడు43. భీమవేగుడు. 44. భీమలుడు. 45. బలాకుడు. 46. బలవర్థనుడు. 47. నోగ్రాయుధుడు. 48. సుషేణుడు. 49.కుండధారుడు.50.మహోదరుడు. 51. చిత్రాయుధుడు. 52. నిషింగుడు. 53. పాశుడు. 54. బృఎందారకుడు. 55. దృఢవర్మ. 56. దృఢక్షత్రుడు. 57. సోమకీర్తి. 58. అనూదరుడు. 59. దఢసంధుడు. 60. జరాసంధుడు.61. సదుడు. 62. సువాగుడు. 63. ఉగ్రశ్రవుడు. 64. ఉగ్రసేనుడు. 65. సేనాని. 66. దుష్పరాజుడు. 67. అపరాజితుడు. 68. కుండశాయి. 69. విశాలాక్షుడు. 70. దురాధరుడు. 71. దుర్జయుడు. 72. దృఢహస్థుడు. 73. సుహస్తుడు. 74. వాయువేగుడు. 75. సువర్చుడు. 76. ఆదిత్యకేతుడు. 77. బహ్వాశి. 78. నాగదత్తుడు. 79. అగ్రయాయుడు 80. కవచుడు. 81. క్రధనుడు

82. కుండినుడు. 83. ధనుర్ధరోగుడు. 84. భీమరధుడు. 85.వీరబాహుడు. 86. వలోలుడు. 87. రుద్రకర్ముడు. 88. దృణరదాశ్రుడు. 89.అదృష్యుడు. 90. కుండభేది. 91. విరావి. 92. ప్రమధుడు. 93. ప్రమాధి. 94. దీర్గరోముడు. 95. దీర్గబాహువు. 96.ఉడోరుడు. 97. కనకద్వజుడు. 98. ఉపాభయుడు. 99. కుండాశి. 100. విరజనుడు. 


101వ బిడ్డగా దుశ్శల అనే ఆడపిల్ల జన్మిస్తుంది.

నోటరీలకు త్వరలో యూనిక్‌ ఐడీలు

 నోటరీలకు త్వరలో యూనిక్‌ ఐడీలు

ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ రూపొందిస్తున్న రిజిస్ట్రేషన్ల శాఖ

అవకతవకలకు ఆస్కారం లేకుండా చర్యలు

సాక్షి, అమరావతి : నోటరీలు పారదర్శకంగా పనిచేసేలా ప్రభుత్వం కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. కొందరు నోటరీలు తప్పుడు స్టేట్‌మెంట్లను నోటిఫై చేస్తున్నారనే ఆరోపణలు చాలాకాలంగా ఉన్నాయి. మరికొందరు లైసెన్సు లేకపోయినా నోటరీ చేస్తున్నారనే ఫిర్యాదులున్నాయి. వీటివల్ల నోటరీలు చేయించుకున్న వ్యక్తులు ఇబ్బందులు పడటంతోపాటు వివాదాలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో నోటరీ వ్యవస్థలో లోపాలను సరిదిద్దేందుకు రిజిస్ట్రేషన్ల శాఖ నడుం బిగించింది. నోటరీలు ఇచ్చే అఫిడవిట్లు, ఇతర సర్టిఫికెట్లను రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసేలా చర్యలు తీసుకుంటోంది.


ఇందుకోసం ప్రత్యేకంగా ఓ సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తోంది.

ఇకపై ప్రతి నోటరీకి వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయ్యేందుకు యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ఇచ్చి వారు జారీ చేసే సర్టిఫికెట్లను అప్‌లోడ్‌ చేయించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే లైసెన్సు ఉన్న ప్రతి నోటరీకి ఒక యూనిక్‌ ఐడీ ఇవ్వనున్నారు. నోటరీలు జారీచేసే అఫిడవిట్లపై ఈ యూనిక్‌ ఐడీ ఉంటుంది. దీనివల్ల ఇబ్బందులు ఎదురైనప్పుడు వాటిని పరిష్కరించేందుకు, విచారించేందుకు రిజిస్ట్రేషన్ల శాఖకు అవకాశం ఉంటుంది. నోటరీలను పర్యవేక్షించేందుకు ఈ రెండు చర్యలు ఉపయోగపడతాయని భావిస్తున్నారు. అవతవకలకు ఆస్కారం ఉండదని చెబుతున్నారు. రెండు నెలల్లో వీటిని అమల్లోకి తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు.

నోటరీ లైసెన్సులు పెంచేందుకు చర్యలు

మరోవైపు నోటరీ లైసెన్సుల్ని పెంచేందుకు చర్యలు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో 1,906 మంది నోటరీలకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. అంతకుముందు 13 జిల్లాల్లో సుమారు 2,400 మంది నోటరీలు ఉండేవారు. తక్కువ మంది నోటరీలకే అవకాశం ఉండటంతో దానికి అనుగుణంగా లైసెన్స్‌ పీరియడ్‌ ముగిసిన వారికి రెన్యువల్‌ చేయడం నిలిపివేశారు.

కొత్తగా నోటరీ లైసెన్సుకు దరఖాస్తు చేసుకున్న వారికి అవకాశం ఇవ్వలేకపోతున్నారు. దీంతో నోటరీల అవసరం, న్యాయవాదుల ఉపాధి వంటి విషయాలను దృష్టిలో పెట్టుకుని మరో 500 మందికి నోటరీ లైసెన్సులు ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని రిజిస్ట్రేషన్ల శాఖ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అనుమతి వస్తే కొత్తగా మరికొందరు న్యాయవాదులకు నోటరీ లైసెన్సులు జారీ చేసే అవకాశం ఉంది.

లోపాలను సరిదిద్దేందుకు చర్యలు

నోటరీ వ్యవస్థ పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. అక్కడక్కడా కొందరిపై ఫిర్యాదులు వస్తున్నాయి. అవకతవకలకు ఆస్కారం లేకుండా ఉండేందుకు యూనిక్‌ ఐడీ విధానం, వారు జారీ చేసిన అఫిడవిట్లను ప్రభుత్వ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయించేలా కొత్త వ్యవస్థను తీసుకురాబోతున్నాం.

- ఎంవీ శేషగిరిబాబు, కమిషనర్‌ అండ్‌ ఐజీ, రిజిస్ట్రేషన్ల శాఖ

గుణదోష ఫలితాలే


ఈర్ష్య, అసూయ,ద్వేషం అన్నీ గుణదోష ఫలితాలే.

 సూర్యుడు 9 కోట్ల 60 లక్షల మైళ్ళ

నుండి భూమిమీదకు కిరణాలు వెదజల్లుతున్నాడుకదా.

సూర్యుడు వేరు సూర్యకిరణాలు వేరు.

అలాగే పరమాత్మ తనలోని చైతన్యాత్మలొ ఒకే భాగం జీవచైతన్యంగా వెదజల్లుతున్నాడు. 

కిరణాలు వేరైనా సూర్యుడు ఒక్కడే అయినట్లు, చైతన్యాత్మలు వేరు ఉపాధులలొ ఉన్నా చైతన్యం ఇచ్చే పరమాత్మ ఒక్కడే.

నేను, నువ్వు, అతడు, ఆమె అంతా ఒక గూటి పక్షులం. అద్దం మీద మురికి వల్ల మన స్వరూపం 

చూడనట్లే అహంకారం అనే గుణదోషం వల్ల ఈ ఆధ్యాత్మికత్వం

కనుగొనలేకపోతున్నాము.💐

భగవద్గీత చదవాలి?*

 📖 *భగవద్గీత ఎందుకు చదవాలి?* 📖

🙏🛕🛕🛕🛕🦚🦚🛕🛕🛕🛕🙏


*కృష్ణం వందే జగద్గురుమ్*


 సంతోషంగా ఉన్నావా ... >>> 

*భగవద్గీత చదువు.*


బాధలో ఉన్నావా ... >>>

*భగవద్గీత చదువు.*


ఏమీ తోచని స్థితి లో ఉన్నావా ... >>> 

*భగవద్గీత చదువు.*


ఏదో గెలిచినావా ... >>>

*భగవద్గీత చదువు.*


ఏదో ఓడిపోయినావా ... 

*భగవద్గీత చదువు.*


నువ్వు మంచి చేసినావా ... >>> 

*భగవద్గీత చదువు.*


నువ్వు చెడు చేసినావా ... >>>

*భగవద్గీత చదువు.*


నువ్వు ఏదో సాధించాలి అనుకుంటున్నావా... >>>

*భగవద్గీత చదువు.*


నువ్వు ఏది సాధించ లేక పోతున్నావా... >>> 

*భగవద్గీత చదువు.*


నువ్వు చాలా ధనవంతుడవా... >>> 

*భగవద్గీత చదువు.*


నువ్వు చాలా బీద వాడివా ... >>> 

*భగవద్గీత విను.*


నువ్వు సమాజాన్ని బ్రతికించాలని అనుకుంటున్నావా... >>> 

*భగవద్గీత చదువు.*


నువ్వు ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటున్నావా... >>>

*భగవద్గీత చదువు.*


నువ్వు మోసం చేసినావా ... >>>

*భగవద్గీత చదువు.*


నువ్వు మోసపోయినావా... >>> 

*భగవద్గీత చదువు.*


నీకు అందరూ ఉన్నారా... >>> 

*భగవద్గీత చదువు.*


నీవు ఒంటరివా.... >>>

*భగవద్గీత చదువు.*


నీవు చాలా ఆరోగ్యంగా ఉన్నావా... >>>

*భగవద్గీత చదువు.*


నీవు వ్యాధిగ్రస్తుడవయ్యావా... >>>

*భగవద్గీత చదువు.*


నీవు చాలా విద్యావంతుడవా... >>> 

*భగవద్గీత చదువు.*


నీవు విద్యా హీనుడవా ... >>> 

*భగవద్గీత చదువు.*


నీవు పురుషుడవా... >>>

*భగవద్గీత చదువు.*


నీవు మహిళవా... >>>

*భగవద్గీత చదువు.*


నీవు ముసలివాడివా ...>>>

*భగవద్గీత చదువు.*


నీవు యవ్వనస్తుడివా ... >>>

*భగవద్గీత చదువు.*


దేవుడు ఎక్కడ ఉన్నాడో నీకు తెలుసుకోవాలి అని ఉందా ... >>> 

*భగవద్గీత చదువు.*


దేవుడు లేడు అని అనుకుంటున్నావా .... >>>

*భగవద్గీత చదువు.*


ఆత్మ అంటే ఏమిటి? తెలుసుకోవాలని అనుకుంటున్నావా... >>>

*భగవద్గీత చదువు.*


పరమాత్మ తత్త్వం ఎలాంటిదో తెలుసుకోవాలని అనుకుంటున్నావా...>>>

*భగవద్గీత చదువు.*


మనిషి జీవితం ఎందుకో తెలుసుకోవాలని అనుకుంటున్నావా ... >>>

*భగవద్గీత చదువు.*


కర్మ అంటే ఏమిటో  తెలుసుకోవాలని ఉందా... >>> *భగవద్గీత చదువు.*


ఈ సృష్టి ఎలా వచ్చిందో తెలుసుకోవాలని వుందా... >>>

*భగవద్గీత చదువు.*


పుట్టకముందు మనం ఎవరో తెలుసుకోవాలని వుందా... >>>

*భగవద్గీత చదువు.*


చనిపోయిన తర్వాత మనం ఏమవుతామో  తెలుసుకోవాలని వుందా... >>>

*భగవద్గీత చదువు.*


దేవుడంటే అసలు ఎవరో తెలుసుకోవాలని వుందా... >>>

*భగవద్గీత చదువు.*


నీలో కామం, క్రోధం, లోభం, మొహం, మధం, మాత్సర్యము వంటి అరిషడ్వర్గాలు ఉన్నాయా... >>>

*భగవద్గీత చదువు.*


నీవు ప్రేమిస్తున్నావా... >>> 

*భగవద్గీత చదువు.*


నీవు ద్వేషిస్తున్నావా... >>>

*భగవద్గీత చదువు.*


నీలో వైరాగ్యం ఉందా... >>>

*భగవద్గీత చదువు.*


జ్ఞానం మరియు అజ్ఞానం అంటే ఏమిటో తెలుసుకోవాలని వుందా...>>>

*భగవద్గీత చదువు.*


బంధాలు, అనుబంధాలు ఎలా ఉండాలో తెలుసుకోవాలని వుందా... >>> 

*భగవద్గీత చదువు.*


ధర్మం అంటే ఏమిటో తెలుసుకోవాలని వుందా... 

*భగవద్గీత చదువు.*


మోక్షం అంటే ఏమిటో, స్వర్గం అంటే ఏమిటో, నరకం అంటే ఏమిటో తెలుసుకోవాలని ఉంటే ...>>>

*భగవద్గీత చదువు.*


పంచ భూతాలు అంటే ఏమిటి, అవి ఎందుకు ఉన్నాయి? తెలుసుకోవాలంటే.... >>>

*భగవద్గీత చదువు.*


ప్రకృతి, పురుషుడు, భగవంతుడు అనే వాటి యొక్క సంబంధం ఏమిటో తెలుసుకోవాలంటే... 

*భగవద్గీత చదువు.*


ఇక చివరగా... 

నీవు ఎవరు, 

ఎక్కడ నుండి వచ్చావు, 

ఎక్కడికి పోతావు, 

నీవారు ఎవరు, 

నీ అసలు గమ్యం ఏమిటి 

అని తెలుసుకోవాలి అంటే....

*భగవద్గీత చదువు.*



🙏🛕🛕🛕🛕🦚🦚🛕🛕🛕🛕🙏

పిన్నీసు కథ...*

 సేకరణ 


🧷🧷🧷🧷🧷


*పిన్నీసు కథ...*


ప్రతి ఒక్కరికి మంచి రోజులు వస్తాయి...


*ప్రతిభ కనపర్చిన ఆటగాడి మెడలో వేలాడే మెడల్స్ ఎంత పవర్ ఫుల్లో,*


*ముప్పైఏళ్ళ క్రితం మొలతాడులకూ,

ఆడవారి పసుపుతాడులకూ వేలాడే సూదిపిన్నీసులు అంతే!!!.*


ఆ రోజుల్లో *హవాయి చెప్పు  తెగిపోతే కాపాడేది పిన్నీసే.*

*మూడు నాలుగు సంవత్సరాలకోసారి కుట్టించే నిక్కరు ఎనకాల కుట్లూడిపోతే* కాపాడింది ఆ పిన్నీసే.

*ఆ రోజుల్లో*—

 ఎప్పుడుపడితే అప్పుడు బట్టలు కొనేవారు కాదు,

*సంవత్సరానికోసారి, అదైనా పండక్కే.*

*కాల్లో ముల్లుగుచ్చుకుంటే పిన్నీసే,*

*చెవిలో గులిమి(గుబిలి) తీసుకోవాలంటే పిన్నీసే,*

*పంట్లో ఏదైనా ఇరుక్కున్నా పిన్నీసే,*

*చిన్నప్పుడు పెన్ను పాళీ సరిగ్గా రాయకపొతే పాళీని తీసేసి దానికున్న గాడిలోంచి గడ్డకట్టిన ఇంకును పిన్నీసుతోటే శుభ్రం చేసేవాళ్ళం,*

బాల్ పెన్నులో వుండే బాల్ సరిగ్గా తిరగకపోయినా *ఆ పిన్నీసుతోటే రిపేరు చేసేవాళ్ళం.*

జెండా వందనం రోజున *పిల్లల జేబులకి జెండా బొమ్మని పిన్నీసుతోనే* పెట్టుకున్న గుర్తు.

అటువంటి పిన్నీసుకు *కాలం చెల్లింది అనుకునే టైంలో*

ఇవాళ ఒకబ్బాయి "అంకుల్, పిన్నీసుంటే ఓసారివ్వరా?

*సెల్లో సిమ్ము తీసుకోవాలి"*

 అన్నప్పుడు,

*నాకు చాలా గర్వంగా అనిపించింది.*

*మన చిన్నప్పటి పిన్నీసుకు మళ్ళీ మంచిరోజులు వచ్చాయా* అని?


   🧷🧷🧷🧷🧷


UNIVERSITY OF WHATSAPP

వాయిదా వద్దు*

 🔔 *వాయిదా వద్దు*🔔


ఒకసారి కర్ణుడు తన ఆంతరంగిక మందిరంలో అభ్యంగన స్నానం చేస్తూ ఉన్నాడు. 


ఇంతలో ఓ విషయం మాట్లాడేందుకు శ్రీకృష్ణుడు అక్కడకు వచ్చాడు. ద్వారపాలకులు సమాచారం ఇవ్వగానే కృష్ణుడిని వెంటనే తన దగ్గరకు తోడ్కొని రమ్మని చెప్పాడు కర్ణుడు. 


కృష్ణుడు అక్కడకు రాగానే ఆయన దృష్టి రాధేయుడి ఎదుట ఉన్న స్నానలేపనాల పాత్రపై పడింది. ఖరీదైన ఆ రత్నఖచిత బంగారు పాత్రను చూసి అబ్బురపడుతూ వివరాలు అడిగాడు. 


వెంటనే కర్ణుడు కృష్ణా! ఇది నీకు అంతగా నచ్చిందా... అయితే నీ మందిరానికి దీన్ని తీసుకెళ్లు... అంటూ ఎడమచేతితో ఇచ్చాడు. ఆ క్షణంలో కర్ణుడి కుడి చేయంతా నూనెలతో మలినంగా ఉంది. దీంతో వామహస్తంతో దాన్ని ఇచ్చాడు. 


🌿అప్పుడు కృష్ణుడు కర్ణా! నువ్వు ఎంతో ఇష్టపడే ఈ పాత్రను వామహస్తంతో ఇవ్వడం భావ్యమా? అని అన్నాడు. 


🌿అప్పుడు కర్ణుడు.. కృష్ణా! చేయి శుభ్రం చేసుకుని వచ్చేలోపు మనసు ఎలా మారతుందో తెలీదు.ఏ మంచిచైనా అనుకున్న క్షణంలో చేయడం మంచిది... అందుకే అలా ఇచ్చాను...


*క్షణం చిత్తం క్షణం విత్తం జీవితమాయయో*

*యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితా గతిః*


👉ఇప్పుడున్న ధనం మరుక్షణాన మాయమై పోవచ్చు. యమధర్మరాజు ఎవరిపై కరుణ చూపడు.  జీవితం క్షణంలో అంతమై పోవచ్చు. 


👉అందుకే ధర్మాన్ని ఆచరించడం వాయిదా వేసుకోకూడదు. అన్నాడు దాన కర్ణుడు...


*ధర్మో రక్షతి రక్షితః*

🙏🙏🙏🙏🙏

పాల్గార్ స్వామి - ఒక సాదువు..*

 *పాల్గార్ స్వామి - ఒక సాదువు..* 


పేద దళిత కుటుంబంలో జన్మించి పురాతన పీఠానికి అధిపతిగా ఎదిగి తన ఆద్యాత్మిక జీవనమ్ కొనసాగిస్తూ పర్యటనలు చేస్తూ ఆద్యాత్మిక చైతన్యాన్ని కలుగచేసే ప్రయత్నం చేశారు..


ఎక్కడా కాంట్రావర్సీ లేదు ఎవరినీ మతమార్పిడి చేయలేదు కనీసం చిన్న చీమకు కూడా హాని చేయని సున్నిత మనస్కుడు..


పర్యటనలో బాగంగా పాల్గార్ లో బస చేసిన సందర్భంలో స్థానిక రోహింగ్య / క్రైస్తవ పాస్టర్లు ఆయన్ను బయటకు పిలిచి 

పోలీసుల ముందే 


కేవలం కాషాయం కట్టాడు..ఏమీ చేయలేని బలహీన సన్యాసి అని ఆయన్నూ..ఆయన సహాయకుడిని ( ఆయన కూడా సాధువే ) ఆయన కారు డ్రైవర్ నూ కర్రలతో మోది అత్యంత కిరాతకంగా చంపేశారు...


హిందూ సంస్థలు తీవ్రంగా బాధపడ్డాయి..

జాతీయవాదుల మనస్సు విలవిల లాడింది.. 

ఆయన మరణిస్తూ నవ్విన ఆ అసహాయ చిర్నవ్వు ఇప్పటికీ మమ్మల్ని వెంటాడుతుంది..


అయినా ఇప్పుడు మొసలి కనీరు కారుస్తున్న ఏ మానవతావాది నాడు కనీసం అయ్యో అని కూడా అన్నట్టు గుర్తులేదు..

*కారణం ' కేవలం కాషాయం '...*



*స్టాన్ లూర్డు స్వామి* 

 

తన జీవితం మొత్తం వనవాసిలను మతం మార్చడానికి తాను స్థాపించిన చర్చి ద్వారా పనిచేశారు..


కేవలం మతం ఆధారంగా వనవాసులకు సహాయం చేశారు..


హిందూ మతం మీద ద్వేషంతో .. మోడీజీ మీద కక్ష తో దేశానికి వ్యతిరేకంగా కుట్ర చేశాడు..


ఏకంగా ప్రధాని హత్యకే కుట్ర పన్నాడు.. జైల్లో పడ్డాడు..


జైల్లో తన పితృ దేశం ప్రపంచం మీదకు వదిలిన చైనా వైరస్ బారిన పడ్డాడు..


అతనికి అత్యున్నత వైద్యం మనం కట్టిన పన్నుల సొమ్ముతో అందించారు..


అది కూడా అతను కోరుకున్న హాస్పిటల్ ల్లో..

క్రైస్తవ మిషనరీ హాస్పిటల్ ' హోలీ ఫ్యామిలి హాస్పిటల్ లో 


'..అద్భుతమైన కార్పొరేట్ వైద్యం అందించారు లక్షలు ఖర్చుపెట్టి ప్రజలు కట్టిన పన్నులతో..


అక్కడ పోస్ట్ కోవిడ్ సమస్యలతో చనిపోయాడు..


దానికి వీళ్ళు రాజ్య హింస అని కొవ్వుత్తుల నృత్యం మొదలెట్టారు..


అతనికి వైద్యసేవలు అందించినవాళ్లు మొత్తం అతను కోరుకున్న క్రైస్తవ డాక్టర్లు క్రైస్తవ నర్సులు..


కావాలంటే వాళ్ళ వెబ్-సైట్ కు వెళ్ళి చూసుకోవచ్చు..ఇక దీంట్లో ప్రభుత్వం తప్పేంటి??..


నిజంగా రాజ్య హింస జరిగింది అంటే పోలీసుల సమక్షంలో జరిగిన పాల్గార్ సాధువు హత్య..


ఈ లూర్డు సామి మరణం కాదు..


*ఒక దేశద్రోహికి..ఒక రాజ్యాధినేతను హత్య చేయడానికి కుట్ర పన్నిన వ్యక్తికి మన భారత్ లో కాబట్టి ఇంత రాచవైబోగంతో అతను కోరిన సౌకర్యాలు ఇచ్చారు..*


బహుశా అతన్ని సప్పోర్ట్ చేస్తున్న చైనా లో కూడా ఇలాంటివాళ్లని ఎలా 🐕 ని కాల్చినట్టు కాలుస్తారో వీళ్ళకి తెలిసినంతగా మనకు తెలియదు..


*మరొక్కసారి పాల్గార్ స్వామీజీ మృత్యు హాసం గుర్తుకు తెచ్చుకుంటూ..*😢🙏



...

చదవాల్సిన మెసేజ్*

 *ప్రతి ఓటరు చదవాల్సిన మెసేజ్*


అన్నా స్కూలు పోతా ... 

15 వేలు తీసుకో


అన్నా ఆటో తోలుతా... 

10 వేలు తీసుకో


అన్నా కటింగ్ చేస్తా .. 

10 వేలు తీసుకో


అన్నా ముసలోడిని ... 

2250 తీసుకో


అన్న నేను మహిళని... 

15 వేలు తీసుకో


అన్న నేను కాపును.. 

15 వేలు తీసుకో


అన్నా నేను బట్టలు కుట్టే టైలర్ ని.... 

10 వేలు తీసుకో.. 


అన్నా నేను జాలరి ని... 

అవునా.. 

అయితే 10 వేలు తీసుకో.... 


ఒక పిట్ట కథ విందామా?


ఒక దొర ఊర్లో డబ్బులు పంచుతాను రండి అని డప్పు వేయించాడు. 

దొర గారు డబ్బులు పంచుతున్నారట... అని ఊర్లో అందరూ పరుగెత్తుకుంటూ వెళ్లారు. 


అందరినీ ఊరి బయటున్న స్టేడియంలోకి తీసుకెళ్లారు వచ్చినోళ్లందరికీ అందరికీ 

డబ్బులు పంచాడు దొరగారు. 


డబ్బులు తీసుకుని ఊర్లో కెళుతంటే పోయేటపుడు కనిపించని టోల్ గేట్ ఈసారి ప్రత్యక్షమైంది. 


అందులో లోపలికి వెళ్లినా 4 రూపాయలు కట్టాలి, 

బయటకు వచ్చినా నాలుగు రూపాయలు కట్టాలి. 

దొరగారు ఇచ్చిన డబ్బులు 

నెలరోజుల్లే ఆ టోల్ కి సరిపోయాయి. 

మిగతా 11 నెలలు జనం కష్టపడి సంపాదించి ఆ టోల్ కట్టారు.


ప్రభుత్వాలకు రాజ్యాంగం పన్నులు వసూలు చేసుకునే హక్కు కల్పించింది ఎందుకు?... 

మనంతట మనమే రోడ్డేసుకోలేం, 

బడి కట్టుకోలేం, 

గుడి కట్టుకోలేం 

ఆస్పత్రి కట్టుకోలేం. 


ఆ పనుల్నీ చేయడానికి ఒక వ్యవస్థను పెట్టిన దానికి గవర్నమెంటు అని పేరు పెట్టారు. 


ఆ గవర్నమెంటు వ్యవస్థకు మన పనులు చేసిపెట్టే బాధ్యత అప్పగించారు. అందుకోసం ట్యాక్సుల రూపంలో 

మన డబ్బులు తీసుకుని 

మనకోసం బడి కట్టాలి, 

రోడ్డు వేయాలి, 

ఆస్పత్రి కట్టాలి, 

కరెంటు తయారుచేయాలి, 

డ్రైనేజీలు వేయాలి. 

చెరువులు కట్టాలి. 

ప్రాజెక్టులు కట్టాలి. 


కానీ మనం కట్టిన డబ్బులను నాయకులు తమ పేర్లు పెట్టుకుని 

తమకు నచ్చిన వాళ్లకు పంచుతున్నారు. 


కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి. 

ఏపీలో కరిగేపోయాయి. 

మొన్నే 40 వేల కోట్లు డబ్బులు పంచాం అని ఘనంగా చెప్పుకున్నారు. 


ఎవరి  సొమ్ము అది? 

ప్రజలు కట్టిన పన్నులే కదా. 

మరి వాటిని ఇష్టారాజ్యంగా పంచుతుంటే ప్రజలు ప్రశ్నించాలి కదా. 


రేపటి నుంచి ....


ఏపీలో ఇతర రాష్ట్రాల కంటే 

4 రూపాయలు ఎక్కువ పెట్టి 

పెట్రోలు కొనాలి


ఏపీలో ఇతర రాష్ట్రాల కంటే 

4 రూపాయలు ఎక్కువ పెట్టి 

డీజిల్ కొనాలి


ఇప్పటికే ఇతర రాష్ట్రాల కంటే 

75 రూపాయలు ఎక్కువ పెట్టి 

క్వార్టర్ కొంటున్నారు. 


ఇదే పన్ను మిగతా రాష్ట్రాల్లో వేశారనుకో... 

జనం పాలకులను నిలదీస్తారు. కడిగేస్తారు. 

ఎందుకంటే వారు అడ్డదిడ్డంగా అప్పనంగా గవర్నమెంటు డబ్బులు తినలేదు. 


కాబట్టి మూసుకుని కూర్చోరు. తాటతీస్తారు. 


కానీ ఏపీ ప్రజలు పుడితే పథకం, చదివితే పథకం, 

పెద్దయితే పథకం, 

స్కూలుకెళితే పథకం, 

సంఘానికెళితే పథకం, 

వ్యవసాయం చేస్తే పథకం, 

పెళ్లి చేసుకుంటే పథకం...


 పెంచడం కష్టం గాని 

పంచడం ఎంత సేపు 

5 నిమిషాల పని.  


ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు. 

డబ్బులు ఇస్తున్నపుడు సంతోషంగా తీసుకున్నారు. 

మరి ఎక్కడి నుంచి వస్తాయి 

తిరిగి కట్టకపోతే. 

అదే జరుగుతోంది. 


చాలా సింపుల్ లాజిక్... 

*మనం డబ్బులు ట్యాక్సుల రూపంలో కడితేనే గవర్నమెంటు వద్ద డబ్బులుంటాయి.* 


ఆ డబ్బులను ఎలా వాడితే పెరుగుతాయి అన్నది *నాయకుడిని* బట్టి ఉంటుంది. 


కులాల వారిగా చేసే వృత్తుల వారిగా కోట్లమంది హక్కుని కొంతమందికి  పంచితే మిగతా వారి తలపై అప్పులు ధరల రూపంలో గుది బండై కూర్చోవా...???


అందుకే అన్నారు

 *దురాశ దు:ఖానికి చేటు* అని.


ఓ ఓటరు మహాశయా మేలుకో


 ఉచితంగా ఏది రాదు.... 

అనేది అందరూ అర్థం చేసుకోవాలి...✔️

[16/06, 10:45] +91 99519 94059: పరిపాలించే *ప్రభుత్వాలు జనం పై ఎన్ని రకాల పన్నులు* వేస్తాయో? ఒక్కసారి గమనించండి.

*ప్రభుత్వాలు ఇచ్చే సంక్షేమ పథకాలు, రాయితీలు మన కష్టార్జితాలే*

 అవి ఎలానో తెలుసుకుందాం.


1 *సంపాదిస్తే  income tax*

2. *అమ్మితే sales tax*

3. *ఉత్పత్తి చేస్తే peoduction tax*

4. *మార్కెట్‌ చేస్తే* commercial tax

5. *సినిమాకి వెళ్తే        entertainment tax*

6. వెహికల్‌ *కొంటే life tax*

7.  *దాన్ని రోడ్‌ పైకి తెస్తే road tax*

8. లాంగ్‌ *జర్నీ చేస్తే toll tax*

9. *బండిలో పెట్రోల్‌ పోస్తే fuel surcharge tax*

 10. *భార్య, పిల్లలతో పార్క్‌ కి వెళితే entery tax*

11. *ఉద్యోగం చేస్తే professional tax*

12. వ్యాపారం చేస్తే  trade tax

13. *బట్టలు కొంటే vat tax*

14. *కరెంటు, వాటర్‌ బిల్‌ కడితే

     series tax*

15. *ఆస్థి పై property tax*

16. చివరకి పబ్లిక్‌ *urinals కి వెళ్తే swachh bharat charge*

17. *సబ్బు కొంటే customer charge*

18. ఒక వస్తువు *కొంటె tax, దాన్ని వినియోగిస్తే tax,*

*దాన్ని రిపేరు చేపిస్తే tax,*

దాన్ని లెక్కల్లో చూపిస్తే tax,

19. *సంపాదించింది ఖర్చుపెడితే tax*

20. మొత్తం మీద మనిషి *జన్మిస్తే tax,*

21. *మనిషి సంపాదిస్తే tax*,

మనిషి *సంతోషిస్తే tax,*

మనిషి *మరణిస్తే tax.*


*ఇలా పలు రకాల టాక్స్'లతో మనిషి పుట్టిపెరిగిన నుండి మొదలుకొని అతడు చచ్చే వరకు* వారి శక్తికి మించి పన్నులు చెల్లిస్తూ, ఆ వచ్చే *రాయితీలు ప్రభుత్వాల, నాయకుల బిక్షగా భావించుకుంటున్నారు అది నిజంకాదు, అవన్నీ ప్రజల యొక్క కష్టార్జితాలే.*


👏👏👏👏

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*ఖేదం..మోదం..*


"పరమాత్మా..ఈ వయసులో..ఈ మతిస్థిమితం లేని పిల్లతో నాకు ఈ క్షోభ ఎందుకు పెట్టావయ్యా..?" అంటూ బాధపడుతున్న పెద్దావిడ అంతకు రెండురోజుల ముందు మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి..24 ఏళ్ల వయసున్న మనుమరాలితో సహా వచ్చింది..ఆమె దాదాపు అరవై ఏళ్ళ వయసు కలది..మనుమరాలికి గత సంవత్సర కాలంగా మానసికంగా బాగాలేదు..ఉన్నట్టుండి ఏడుస్తూ లేచి కూర్చుంటుంది..హఠాత్తుగా ఉన్మాదిలా పరుగెడుతుంది..స్థిమితం అన్న మాటే లేదు..


ఆ పెద్దావిడ పేరు లక్షమ్మ గారు..ఒంగోలు దగ్గర లోని పల్లెటూరు..ఆవిడతో వచ్చిన అమ్మాయి ఆమె కూతురి బిడ్డ..మనుమరాలు..మూడేండ్ల క్రిందట వివాహం చేసారు.. లక్షణంగా కాపురం చేసుకుంటున్నది..భర్త పరంగా ఎటువంటి ఇబ్బందులు లేవు..మొదటి రెండు సంవత్సరాల కాలం హాయిగానే కాపురం చేసుకుంటున్న ఆ అమ్మాయి ప్రవర్తన లో విపరీతపు మార్పు వచ్చింది..పిచ్చి పట్టినట్లు ప్రవర్తించసాగింది..ఒంగోలు లోని డాక్టర్లకు చూపించారు..మానసిక నిపుణులకూ చూపించారు..ఎన్నో రకాల మందులు వాడారు కానీ..ఫలితం కనబడటం లేదు..ఆ అమ్మాయి భర్త ఏమీ చేయలేక నిస్సహాయంగా చూడసాగాడు..


లక్షమ్మ గారికి మొగలిచెర్ల శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరం గురించిన అవగాహన వున్నది..ఒకసారి శ్రీ స్వామివారి మందిరం వద్దకు అమ్మాయిని తీసుకెళ్లి..అక్కడ నిద్ర చేయిస్తే తగ్గిపోతుందని నమ్మకం తో వున్నది..ముందుగా కూతురితో ఈ మాట చెప్పింది..పెద్దగా సుముఖత చూపలేదు..

ఆ అమ్మాయి భర్త కూడా.."ఇన్ని రకాల వైద్యం తో నయం కానిది..ఆ స్వామి మందిరం వద్ద తగ్గుతుందా..?" అని సందేహంగా అన్నాడు..

లక్షమ్మ గారు పట్టు వదల్లేదు.."మీరెవ్వరూ  తోడు రానక్కరలేదు..ఆ పిల్లదాన్ని తీసుకొని నేను వెళతాను..ఒక వారంపాటు ఆ స్వామి సన్నిధిలో వుంటాము..నామాట వినండి..అమ్మాయికి ఏ దయ్యామో..ఏదో పూనిందని నా అనుమానం..ఆ స్వామి వారి వద్ద ఇటువంటి గాలిచేష్ట లన్నీ పోతాయని చెప్పుకుంటారు.." అని గట్టిగా చెప్పి..పట్టుబట్టి మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరానికి ఆ అమ్మాయితో సహా వచ్చేసారు..


మొదటి రెండు రోజుల్లో ఆ అమ్మాయి లో ఏ మార్పూ కనబడలేదు..పైగా మరింత ఎక్కువగా రచ్చ చేయడం మొదలుపెట్టింది..లక్షమ్మ గారికి ఏమీ పాలుపోలేదు..శ్రీ స్వామివారి సమాధి ముందట సాగిలబడి...వేడుకున్నారు..మూడోరోజు మధ్యాహ్నం నాటికి అమ్మాయి లో మార్పు వచ్చింది..ఎటువంటి విపరీతపు పోకడలు పోకుండా..బుద్దిగా కూర్చున్నది..నాలుగోరోజుకు శ్రీ స్వామివారి మందిరం  శుభ్రం చేయడం..స్వామివారి పటానికి అగరుబత్తీలు వెలిగించడం..తులసికోట వద్ద దీపం పెట్టడం..చేయసాగింది..మరో రెండు రోజుల కల్లా..ఆ అమ్మాయి మామూలుగా మారిపోయింది..లక్షమ్మ గారిక్కూడా ఆశ్చర్యం వేసేటంతగా అమ్మాయిలో మార్పు వచ్చింది..తన కూతురికి..ఆ అమ్మాయి భర్తకూ ఈ వార్త చెప్పి పంపారు..వాళ్ళూ ఆఘమేఘాల మీద మొగలిచెర్ల చేరారు..భర్తనూ..తల్లినీ.. ఆ అమ్మాయి ఆప్యాయంగా పలకరించింది..వాళ్ళు నమ్మలేక పోయారు..


ఆ ప్రక్కరోజు ఆదివారం నాడు లక్షమ్మ గారు.. శ్రీ స్వామివారికి పొంగలి నైవేద్యం పెట్టి..మనుమరాలితో సహా శ్రీ స్వామివారి సమాధి ముందు భక్తిగా నమస్కారం చేసుకున్నారు..అందరూ కలిసి సంతోషంగా వాళ్ళ వూరు చేరారు..


ఈ సంఘటన 2006 వ సంవత్సరం నాటిది..ఇప్పటికీ లక్షమ్మ గారు ఓపిక చేసుకొని..శ్రీ స్వామివారి దర్శనానికి మనుమరాలి సంసారం తో సహా  వస్తూ ఉంటారు..ఆ అమ్మాయి ప్రస్తుతం ఇద్దరు బిడ్డల తల్లి కూడా..శ్రీ దత్తాత్రేయ స్వామివారిని అత్యంత భక్తి తో కొలుస్తూ ఉంటుంది..శ్రీ స్వామివారి మందిరానికి వచ్చిన ప్రతిసారీ తలారా స్నానం చేసి, ముఖ మంటపం లో సాగిలపడి స్వామివారిని ప్రార్ధిస్తూ ఉంటుంది..


"పరమాత్మా! నీ దయవల్లే ఈ పిల్ల హాయిగా సంసారం చేసుకుంటున్నది స్వామీ.." అని మనస్పూర్తిగా చెప్పుకుంటారు లక్షమ్మ గారు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్:523114..సెల్..94402 66380 & 99089 73699).

ప్రశ్న పత్రం సంఖ్య: 7

 ప్రశ్న పత్రం సంఖ్య: 7                            కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

 క్రింది ప్రశ్నలకు జవాబులు తెలుపండి ప్రతి పదం "లం " తో అంతమౌతాయి   

1) ప్రతి వారు శరీరంలో  ఇది వుండాలని కోరుకుంటారు 

2) రామ దాసుకి సంబందించిన క్షేత్రం 

3) ఒక సినీ నటుడు తమిళంలో కూడా నటించాడు 

4) గొడవ లేక హడావిడి 

5) ఇది విషమే 

6) ఒక ప్రసిద్ధ సాహిత్యకారుడు 

7) రైతు మడిలోకి దీనితో వెళతాడు 

8) అప్లికేషన్ ఫోరంలో ఈ కాలం తొలగించి అందరిని సమానంగా చూడాలని కొందరంటారు 

9) వైజాగ్ దగ్గర నరసింహ స్వామి క్షేత్రము 

10) మాంసము 

11) పండు 

12) వానరం తోటి ఉండేది 

13) సమయం 

14)ఇది వినగానే మనకు రమణ మహర్హిగారు గుర్తుకు వస్తారు. 

15) ఈ ఊరు మంచి స్టీలు సమానులకు ప్రసిద్ధి తమిళనాడులో వుంది 

16)  నీటిలో పెరిగే మంచి పుష్పం 

17)  సుకుమారం లాంటిదే 

18)  పూర్వపు ఒక ఆయుధ విశేషం 

19)  అగ్నిహోత్రుడు.

20)  వాయువు 

21) ఈశ్వరుడు దీనిని ధరిస్తారు 

22)  రైతు వ్యవసాయం చేయటానికి ఇక్కడికి వెళుతాడు 

23)  మంచినీటి కోసం ఇసుకలో తీసే గుంత 

24)  నిలకడ లేదు 

25) పట్టిన పట్టు మేము _____