రాతిరి సూర్యుడు నంబరమున దోచెన్
ఆతతకాసారముల
బ్జాత మనోజ్ఞంబు లయ్యె జక్రములెల్లన్
గావరముడిగెను, ముగిసెన్
రాతిరి, సూర్యుడు నంబరమున దోచెన్
ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
రాతిరి సూర్యుడు నంబరమున దోచెన్
ఆతతకాసారముల
బ్జాత మనోజ్ఞంబు లయ్యె జక్రములెల్లన్
గావరముడిగెను, ముగిసెన్
రాతిరి, సూర్యుడు నంబరమున దోచెన్
*విజయవాడలో వింత జ్వరం!.. వైద్యులకూ అంతుబట్టని ‘స్క్రబ్ టైపస్’*
ప్రాథమిక దశలో గుర్తించలేకపోతున్న వైద్యులు
కరోనా, డెంగీ లక్షణాలతో వణికిస్తున్న అరుదైన వ్యాధి
విజయవాడకు చెందిన ఓ యువకుడు తీవ్రమైన చలి, జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పులు, కండరాల నొప్పులతో బాధపడుతున్నా ఫలితం లేకపోవడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాడు. ఆ రోగి వ్యాధి లక్షణాలను బట్టి డెంగీగా భావించి వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించారు. అయినా జ్వరం తగ్గకపోగా మరింత ఎక్కువైంది. కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతుండటంతో అన్ని రకాల వైద్యపరీక్షలు చేయించారు. అన్నీ నెగెటివ్ రావడంతో నిపుణులైన వైద్యులను సంప్రదించారు. చివరికి తేలిందేమంటే ఆ యువకుడికి సోకింది వైద్యుల ప్రాధాన్యక్రమంలో ఉన్న విషజ్వరాల జాబితాలోనిది ఏదీ కాదు. ఆ యువకుడు ‘స్క్రబ్ టైపస్’ వైరస్ బారిన పడ్డాడని వైద్యనిపుణులు గుర్తించారు. వెంటనే తగిన చికిత్స అందించి ఆ యువకుడిని ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడారు.
జిల్లాలో విష జ్వరాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఈ సీజన్లో డెంగీ, మలేరియా, టైఫాయిడ్ తదితర విష జ్వరాలు రావడం సాధారణమే అయినా.. ఈ మధ్య కాలంలో ‘స్క్రబ్ టైపస్’ కేసులు ఎక్కువగా వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ దీని బారినపడుతున్నారు. అయితే ఎక్కువగా పిల్లల్లోనే ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ వ్యాధి లక్షణాలు కూడా దాదాపు డెంగీని పోలి ఉండటం వల్ల వైద్యులు కూడా ప్రాథమిక దశలో దీనిని గుర్తించలేకపోతున్నారు. ఆలస్యంగా గుర్తించి రక్తపరీక్షలు చేయిస్తున్నా.. వాటి రిపోర్టులు రావడానికి కొన్ని వారాల సమయం పడుతుండటంతో సకాలంలో తగిన చికిత్స అందక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల జ్వరాలతో బాధపడుతూ ఆసుపత్రులకు వెళుతున్న రోగుల్లో కొందరు ‘స్క్రబ్ టైఫస్’ బారినపడినవారు ఉండడం వైద్యులను సైతం కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ వ్యాధికి సకాలంలో సరైన చికిత్స అందకపోతే 50 నుంచి 60 శాతం వరకు మరణాలు సంభవించే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.
స్క్రబ్ టైపస్ అంటే...?
ప్రాణాంతకమైన స్క్రబ్ టైపస్ వ్యాధి దోమలు కుట్టడం వల్ల రాదు. అదొక రకమైన కీటకం (టిక్స్) కుట్టడం వల్ల బ్యాక్టీరియా మనిషి శరీరంలోకి ప్రవేశిస్తుంది. దీని బారినపడినవారికి డెంగీ మాదిరిగానే తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, చర్మంపై ఎర్రటి దద్దుర్లు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. విజయవాడ నగరంతోపాటు జిల్లావ్యాప్తంగా ఈ బ్యాక్టీరియా వేగంగా విస్తరిస్తున్నట్టు వైద్యనిపుణులు భావిస్తున్నారు. ఈ స్క్రబ్ టైఫస్ వ్యాధిని అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోకపోతే ప్రమాదకరమైన పరిస్థితులు ఎదుయ్యే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు. ఇతర జ్వరాల్లో కాక, టైఫస్ లక్షణాలున్న పురుగులు కుట్టడం ద్వారానే ప్రాణాంతకమైన ఈ బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుంది. పెంపుడు జంతువులతో సహవాసం చేసేవారు, పొదలు, అటవీ ప్రాంతాల్లో నివాసించేవారిని ఈ స్క్రబ్ టైఫస్ సోకిన పురుగులు కుడితే, పది రోజుల తర్వాత వ్యాధి లక్షణాలు బయటపడతాయి. తొలుత పురుగు కాటు ఉన్న ప్రదేశంలో ఎర్రటి గాయం ఏర్పడుతుంది. క్రమంగా చలి, జ్వరం, తలనొప్పి, పొడి దగ్గు, వికారం, వాంతులు, విరేచనాలు, ఒళ్లు నొప్పులు, కాళ్ల వాపు, కండరాల నొప్పి, శరీరంపై ఎర్రటి దద్దుర్లు ఏర్పడటం, రక్తకణాలు పడిపోవడం, కిడ్నీలు, లివర్, గుండె, మెదడు తదితర అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి, తగిన చికిత్స అందించకపోతే ప్రాణాంతకం కావచ్చని వైద్యులు చెబుతున్నారు.
నివారణ పద్ధతులివీ..
స్రైబ్ టైఫస్ వ్యాధిని నివారించడానికి ఎలాంటి వ్యాక్సిన్ అందుబాటులో లేదు. దీని వ్యాప్తికి కారకాలైన పురుగుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఒక్కటే మార్గం. ఈగలు, పురుగులు, పేలు కుట్టినప్పుడు కూడా ఈ బ్యాక్టీరియా వ్యాపించే అవకాశాలున్నాయి. ఇది ఒకసారి రక్తంలోకి ప్రవేశిస్తే మెల్లగా పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఇంటి పరిసరాల్లో పురుగులు, కీటకాలకు ఆవాసంగా ఉండేలా మొక్కలు, పొదలు లేకుండా చర్యలు తీసుకోవాలి. ఆరుబయటకు వెళ్లేటప్పుడు చర్మంపైన, దుస్తులపైన క్రిమి వికర్షకమైన స్ర్పేలు, క్రీములను వాడవచ్చు. చిన్నపిల్లల శరీరం, చేతులు, కాళ్లు మొత్తం కప్పి ఉంచేలా దుస్తులను వేయాలి. లేదా దోమతెరలు, బేబీ క్యారియర్లలో వారిని నిద్రపుచ్చాలి. పిల్లలు, పెద్దలు కూడా వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వల్ల వ్యాధిని మోసే పురుగుల నుంచి రక్షణ పొందవచ్చు.
డెంగీ, కరోనాలతో కలిసి కూడా ఉండొచ్చు
ఇటీవల డెంగీ జ్వరాలతో పాటు స్క్రబ్టైపస్ కేసులు పిల్లల్లోనూ పెరుగుతున్నాయి. ఇది డెంగీ, కరోనా వైరస్లతో కూడా కలిసి ఉండొచ్చు. ఇలాంటి కాంబినేషన్ ఆఫ్ డిసీజెస్ ఇటీవల పెరుగుతున్నాయి. స్క్రబ్టైపస్ను గుర్తించడానికి మన దగ్గర ప్రస్తుతం ‘వైల్ఫిలిక్స్’ అనే టెస్టు మాత్రమే అందుబాటులో ఉంది. అందులో కూడా 40 నుంచి 50 శాతం మాత్రమే ఫలితాలు తెలుస్తున్నాయి. అది కూడా వారం దాటితేగాని రిపోర్టులు రావడం లేదు. ఈ కారణంగానే ప్రాథమిక దశలో స్క్రబ్టైపస్ను గుర్తించలేకపోతున్నారు. ఈ వ్యాధిని గుర్తించడానికి క్వాలిటీ ఇన్వెస్టిగేషన్స్ చేయించాల్సిన బాధ్యత వైద్యులపైనే ఉంది. ఇందుకు క్వాలిటీ ల్యాబ్ సపోర్టు కూడా అవసరం. నిపుణులైన పెథాలజిస్టులు, మైక్రోబయాలజిస్టులు మాత్రమే ఇలాంటి అరుదైన వ్యాధులను గుర్తించగలుగుతారు. స్క్రబ్టైపస్ను పూర్తిస్థాయిలో గుర్తించడానికి ఈ మధ్యనే ‘మాలిక్యులర్’ టెస్టు అందుబాటులోకి వచ్చింది. ఇది కూడా మెట్రో నగరాల్లో మాత్రమే ఉంది. ఈ వ్యాధి లక్షణాలు దాదాపు డెంగీ మాదిరిగానే ఉంటున్నా.. స్క్రబ్టైపస్ సోకిన బాధితుల్లో రక్తంలో సోడియం తగ్గుతుంది. ప్రాథమిక దశలోనే ఈ వ్యాధిని గుర్తించి తగిన చికిత్స అందించకపోతే శరీరంలోని ఇతర అవయవాలను దెబ్బతీస్తుంది. - డాక్టర్ చలసాని మల్లికార్జునరావు, పిల్లల వైద్యనిపుణులు
🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
శ్రీమతి శశికళ ఓలేటి గారి కథ*
🌷🌷🌷
దొంగజాంకాయ( ఇష్టమైన...పాత హాస్యకధ )
""""జోగారావురికి బాగాసీరియస్ గా ఉందిట కదా. నెల్లాళ్లు ఐసీయూ లో ఉంచి , లాభం లేదు. ఇంటికి తీసుకెళ్లిపోండి, అయినవాళ్లనందరినీ ఆఖరిచూపులుకు పిలుచుకోండి అని చెప్పేసారంట కదా! అప్పుడే వారమయిందట ఇంటికి తీసుకొచ్చి...........", ధనలక్ష్మితో... అదే తలనొప్పి. మొదలెట్టడమే... అవతలి వారికి మాటాడే అవకాశం ఇవ్వదు.
భార్య వాక్ప్రవాహానికి అడ్డుకట్టేస్తూ.. రాంబాబు అందుకున్నాడు.
" అవును! తెలుసు! ఇప్పుడు అక్కడినుంచే వస్తున్నా! అయితే ఏంటంట?! "...... కాస్త కటువుగా పలికాడు.
" ఏంటంటారేంటండీ! జోగారావుగారు మన యజమాని. మీ బాల్యస్నేహితుడు.
పైగా వామాక్షి నా ఫ్రెండు.
నాకు కనీసం మాటయినా చెప్పలేదు ఎవరూ. నేనింకా ఏదో సుస్తీయే అనుకుంటున్నా ఇంకా! ఇంత సీరియస్ సిట్యుయేషన్ అని చెప్పద్దూ మీరు!
మన చిన్నది అమెరికా నుండి కాల్ చేసి చెప్పింది. వాళ్ల చిన్నబ్బాయి కూడా వచ్చేసాట్ట కదా!
మనం ఇలాంటి సమయంలో దగ్గర లేకపోతే నలుగురూ ఏమనుకుంటారు?.........."
మళ్లీ ఆపాల్సి వచ్చింది అతనికి.. ఆమె వాగ్ధోరణిని.
" ఏం మాట్లాడుతున్నావ్ ధనా?
వాడు మనకు యజమానేమిటి?
నన్ను బిజినెస్ పార్టనర్ గా చేర్పించి, మన ఆస్తంతా అమ్మించి ,పెట్టుబడి పెట్టించి, ఆనక నష్టాలొచ్చాయని కంపెనీ మూసేసాడు!
కొత్త వ్యాపారం మొదలెట్టి , కోట్లు గడించాకా, నాకన్నా విశ్వాసపాత్రుడు దొరకడని, నన్నే మేనేజర్ గా పెట్టుకుని, పూలమ్మిన చోట కట్టెలమ్మిస్తున్న చీట్ ఆ జోగారావు.
స్నేహం విలువెరగని ట్రైటర్ వాడు.
మంచి శాస్తే అయింది.
అందరి పొట్టలూ కొట్టి, సంపాదించింది తినకుండానే... పోతున్నాడు"! .......కక్షగా నొక్కి మరీ చెప్పాడు రాంబాబు.
" నిజమే నండి! ఆ వామాక్షి మాత్రం తక్కువా! చీరల వ్యాపారం పెడదామంటే , మా అమ్మా వాళ్లిచ్చిన ఎకరమూ అమ్మి చేతులో పెట్టా! మూడునెలలు లాభం చూపించి ...నాలుగోనెల కస్టమర్లు డబ్బివ్వలేదని మూసేసింది.।
నా చేతిలో పదిచీరలూ, పదివేలూ పెట్టేసి నోరుమూయించి, గప్ చుప్ గా దొడ్డిదారిని వ్యాపారం చేసుకుంది అప్పట్లో!...విచిత్రం చూడండి... వామాక్షి అంటే కుచేలుడి పెళ్లంట.
మనం కుచేలుళ్లమయ్యాం.
ఆమె ధనలక్ష్మి అయిపోయింది. అయినా దేవుడున్నాడా అసలు? ఈ అన్యాయాలు చూస్తూ కూడా ఎలా సహిస్తున్నాడో............."
భార్యనాపకపోతే ఆమె శాపాలకి ప్రపంచం భస్మమైపోతుందని గ్రహించి , రాంబాబు
" సరే! తయారవ్వు. నువ్వూ ఒకసారి చూసేద్దువు గాని ...ఆ జోగిగాడిని"..... అంటూ బాత్రూంలో దూరాడు.
స్నానం చేసొచ్చి, కాస్సేపు ధ్యానం చేద్దామని కూర్చున్నాడు కానీ , ఎక్కడా మనసు లగ్నం అవ్వడం లేదు. జోగారావు మీదకే ఆలోచనలన్నీ మళ్లాయి.
పెంటపాడులో తనతండ్రి పెద్దకామందు. తనూ, తన అన్నగారూ పిల్లజమిందార్లలా తిరిగేవారు. ఈ జోగిగాడు కరణంగారబ్బాయి. పదిమంది పిల్లల్లో ఎనిమిదో వాడు. తన తండ్రికీ, కరణం గారికీ ఉన్న లావాదేవీల వలన జోగారావు తండ్రితో ...తమింటికి వస్తూ పోతూ... తనకి మిత్రుడయ్యాడు.
తనూ, అన్నయ్యా ఆడుకుంటుంటే ఆటలో అరటిపండులా వచ్చిచేరి, కొంచెం సేపటికే లీడర్ అయిపోయేవాడు. ఖాళీజేబూలు గోళీలతో నిండేవి. కొన్నాళ్లకి వయసుతో పాటూ వాడు గెలుచుకునే వస్తువులూ పెరిగాయి. బేట్లు, బుష్ షర్టులు, రేమాండ్ పేంట్లు, రేబాన్ కళ్లద్దాలు, చివరకు తమ పోకెట్ మనీలూ.
వాళ్లనాన్నా తక్కువ తినలేదు. తనతండ్రి మంచితనాన్ని ఆసరా చేసుకుని , తమ్మినిబమ్మి చేసి, ఆరుగురి కూతుళ్ల పెళ్లి చేసాడు.
ఖర్మకాలీ జోగారావు తనకు కాకినాడ ఇంజినీరింగ్ కాలేజీలో కూడా తగులుకున్నాడు. అరబ్బూ-ఒంటే కధలోలా, మెల్లగా తన గదంతా హాయిగా ఆక్రమించి, తన తిండితిని , తన బట్టలన్నీ వాడి, తనతోనే ఫీజులు కట్టించి... మొత్తానికి ఇంజినీరయ్యాననిపించాడు.
అలా కేవలం కాళ్లూ, చేతులతో వచ్చేసి, పైసా ఖర్చుపెట్టకుండా... పైకొచ్చిన వాడు అతనే. పొరుగువాడి దేదైనా తనది కావలసిందే. నవ్వుతూనే అవతలివాళ్ల మెడకాయమీంచి తలకాయ లాగేసే రకం.
ఎలా సంపాదించాడో తెలీదు, తనఅత్తెసరు మార్కులతోనే , నాగార్జున సాగర్లో అసిస్టెంట్ ఇంజినీరుగా చేరిపోయాడు.
అక్కడే తమకు బంధువులయిన ఈ.ఈగారి కూతురు వామాక్షిని పెళ్లాడేసి , అంచెలంచెలుగా ఎదిగిపోయాడు.
వామాక్షి విషయంలోనూ వంచనే!
నిజానికి వామాక్షి తన మేనత్తకూతురు. తనకనుకున్న సంబంధం.
చూచాయిగా ఈవిషయం జోగి కి తెలుసు.
అంతే సాగర్ వెళ్లడమేమిటి పావులు కదిపి, తన మేనత్త వేపునుండి నరుక్కొచ్చి వామాక్షిని సొంతం చేసుకున్నాడు.
అప్పుడే తనని అన్నయ్య హెచ్చరించాడు..."జోగిగాడి నీడకూడా పడకుండా దూరంగా ఉండరా"... అని!
తండ్రిపోయాకా , ఆస్తుల పంపకం చేసుకుని... తను కాకినాడలో కాంట్రాక్ట్ లు చేసుకుంటూ, బానే సంపాదిస్తూ ఉండేవాడు. ధనలక్ష్మి, ఇద్దరు పిల్లలతో సుఖంగా ఉంది జీవితం.
అదిగో అప్పుడే మళ్లీ ఊడబడ్డాడు జోగారావ్. ఉద్యోగం ఒదిలేసి... కాంట్రాక్టర్ అవతారం ఎత్తానని, స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్, నేవీ క్వార్టర్స్ సబ్ కాంట్రాక్ట్ దొరికిందని, మొత్తం రెండొందల కోట్ల పనులనీ ..... ఓ ఊదరగొట్టేసాడు.
వచ్చినప్పుడల్లా, కొత్తకారులో రావడం, పిల్లలకేవో బహుమానాలు తేవడం చేసేవాడు.
మెల్లగా జోగారావ్ చూపించే అరచేతి వైకుంఠం తనకీ, ధనాకీ బాగా బుర్రకెక్కింది.
అన్నగారు చెప్తున్నా వినకుండా తన వంతు ఆస్తులమ్మి జోగారావ్ ఫర్మ్ లో పెట్టాడు.
చాకిరీ యేమో తనది.
బిల్లులూ, బడ్జెట్లూ వాడివీ.
ఆఖరికి ఐదేళ్లకల్లా ఫర్మ్ లో నష్టాలూ, తన చేతికి చిప్పా చూపించాడు .
కొన్నాళ్లకు జోగారావ్ పెట్టిన "వామాక్షీ ఇంజినీరింగ్ కంపెనీకి" మేనేజర్ లెవల్లో తను కుదురుకోవలసి వచ్చింది.
జోగారావ్ నల్లగా ఉంటాడు. పెద్ద పర్సనాలిటీ కూడా ఉండదు. కానీ సమ్మోహనంగా నవ్వుతాడు. అంతకన్నా మధురంగా మాట్లాడతాడు.
ఈ నేర్పుతోనే ఇద్దరు వంటరి మహిళలు ఆస్తులతో సహా ఇతనివైపు ఆకర్షితులయ్యారు. అవన్నీ తెరవెనుక భాగోతాలే!
వామాక్షికి ఇవన్నీ పెద్ద పట్టింపు లేదు. "భర్త సమర్ధుడు! అదే చాలు!" అనుకునే మనిషి. ధనలక్ష్మి వట్టి భోళా! అమాయకురాలు. తనకి తగ్గట్టే!
జోగారావు పుణ్యమా అంటూ ఎక్కడో ఉండవలసిన తన కుటుంబం ఎక్కడికి చేరిందో తలుచుకున్నప్పుడల్లా.... తన మనసు వికలం అయిపోతుంది.
దీర్ఘంగా నిట్టూర్చి, ధ్యానం నుండి లేచాడు రాంబాబు. అప్పటికే ధనలక్ష్మి తయారయి ఉంది.
*^*^*^*^*^*^*^*^*^*^*^*^*^*^*^*^^^^^^^*^*
కారు డ్రైవ్ చేస్తున్న రాంబాబు దృష్టి యూనివర్సిటీ రోడ్డుపక్క అమ్ముతున్న లేతాకు పచ్చలో పెద్దపెద్ద దబ్బకాయలంత జామకాయల మీద పడింది. కారాపి, బేరం చేసి డజను ఎనిమిదొందలికి కొని తెచ్చాడు.
" మతి లేదేంటి? కోమాలో ఉన్నవాడికి పళ్లెందుకు? ఇంట్లో వాళ్లు మింగడానికా?.....కోపంగా అడిగింది ధన!
" అన్నట్టు చెప్పలేదు కదూ! జోగారావ్ ఇప్పుడు డెలీరియంలో ఉన్నాడు. అస్తమానూ "జామకాయ" "జామకాయ"! అనే కలవరిస్తున్నాడు. వాడికి పాపం చిన్నప్పటి నుండి జాంకాయలంటే పిచ్చి. అందరి గోడలెక్కి, అందరి దొడ్లలో దూరి జాంకాయలు దొంగతనం చేసి తన్నులు తినేవాడు.....మా రామారావు సార్ వాడిని " దొంగ జాంకాయ!" అనేవారు. వాడికి ఆఖరికోరిక లాగుంది... జామకాయ తినడం!"
"వామాక్షి అప్పటికీ...పాపం కడియం, ద్వారపూడి, పాలకొల్లు, విజయవాడ మనిషిని పంపి జాంకాయలు తెప్పించింది. ...పెద్దకొడుకు కలకత్తానుండి తెచ్చాడు. చిన్నాడు అమెరికానుంచి మెక్సికో జాంపళ్లు తెచ్చాడు. ఆడపిల్ల ఇంకో మెట్టెక్కి ఏకంగా చైనానుండి జాంపళ్లు తెప్పించింది. వాళ్ల బావగారు ఏదో ఎయిర్ లైన్స్ డైరక్టర్ కదా!"
"జోగి ముందు ఎన్ని రకాలు చూపించి, ముక్కలు పెట్టినా ఆత్రంగా చూడడం , నిరాశగా మొహం తిప్పి, కిటికీ కేసి, యమదూతల కోసం చూస్తున్నట్టు చూస్తుంటాడు... వెధవ! ఎంత శత్రువయినా ఇప్పుడు ఇలా చూస్తుంటే కడుపుతరుక్కుపోతోంది."
"అప్పటికీ నేను మనూరి జాంకాయలూ... తెప్పించా! అన్నయ్యకు చెప్పి! "
"కాదుట! కళ్లమ్మట నీరు కారుస్తాడు! జాంకాయ! జాంకాయ్ అని గొణుగుతాడు. అందుకే ధనా ! ఇవి కొన్నా"......... చెప్తూనే చొక్కా లోపల పేంట్లో దోపుకున్న పవర్ ఆఫ్ అటార్నీ కాయితాలు తడుముకున్నాడు రాంబాబు!!
ధనలక్ష్మి కళ్లల్లో కూడా నీళ్లు చిప్పిల్లాయి.
వెళ్తూనే ధనలక్ష్మి... వామాక్షిని కావులించుకుని భోరుమంది.
వామాక్షి ఆల్రెడీ ప్రిపేర్ అయివుండడంతో, అతి ప్రయత్నం మీద కన్నీరు సృష్టించుకుని, ధనని పొదివిపట్టుకుని సోఫాలో కూర్చోపెట్టి, జాగారావు కేమయిందో, ఏమవబోతోందో ...అన్నీ చెప్పుకొచ్చింది.
ఇంట్లో పండుగ వాతావరణంలా ఉంది. ఈవేళో రేపో అనుకుని వచ్చేసిన చుట్టాలంతా సోఫాల్లో, వరండాల్లో, గదుల్లో, లాన్లో సర్దేసుకున్నారు!
పెద్ద ఇల్లేమో ! పిల్లలంతా హాయిగా పరుగులెడుతూ ఆడుకుంటున్నారు! కొంత మంది చేతుల్లో కాఫీకప్పులూ, అందరి చేతుల్లో మాత్రం జాంకాయలు. ఇల్లంతా పండిపోయిన జాంపళ్ల వాసనతో ఒకలా ఉంది.
ధనా, వామాక్షి, రాంబాబు .... జోగారావు గదిలోకి వెళ్లారు. మనిషి నెలలోనే చిక్కిశల్యమై మంచానికి అతుక్కుని ఉన్నాడు.
ఏసీ గదిలో వెంటిలేటర్ల శబ్దం తప్ప మారులేదు. ధనలక్ష్మి నీరునిండిన కళ్లతో అతని చెయ్యి పట్టుకుంది.
కన్నీరు కారుస్తూ " జాంకాయ" అంటూ నిర్వేదంగా బయటకు చూస్తున్నాడు జోగారావ్.
ఒక్కసారి ఘొల్లుమంది వామాక్షి
" ఇది ధనా! వరస! .....అంటూ!
ధన ..తను తెచ్చిన జాంకాయలు రెండు చేతుల్లో పట్టుకుని అతని కళ్లముందాడించింది. మార్పులేదు.
చూపు కూడా తిప్పలేదు.
నిరాశగా ఆడవాళ్లిద్దరూ గదినుంచి నిష్క్రమించారు.
రాంబాబు... చలనం లేని జోగి చెయ్యి.. తనచేతిలోకి తీసుకుని,
" జోగారావ్! నీతో కొంచెం మాట్లాడాలి. నీ పరిస్థితి నీకు తెలుసో లేదో నాకు తెలీదు... కానీ నువ్వింక బ్రతికి బట్టకట్టవని డాక్టర్లు తేల్చేసారు.
అమెరికా తీసుకెళ్లడానికీ లేదు. నీ బీపీ , పల్స్ రేట్ పడిపోతున్నాయి. ఇలా వెన్నెముక విరిగిపోయి, కాళ్లూ చేతులూ చచ్చుబడిపోయి, నువ్వు రోజుల్లో ఉన్నావు.
నీ వ్యాపారం నీ కలల సౌధం అని నాకు తెలుసు!!నీ తరువాత ఎవరు? అన్నది ఎవరికీ అవగాహన లేదు !
మన ప్రాజెక్టుల మీద నాకు తప్పా... మరి ఎవరికీ పూర్తి సమాచారం లేదు!
నేను మోసగాణ్ని కాదని నీకు తెలుసు. తలుచుకుంటే నేనిప్పుడే నీ అప్పోనెంట్స్ తో చేతులు కలిపి కావలసిన సమాచారం అందించచ్చు. కానీ నేనెప్పటికీ అలా చెయ్యను.
కనుక నాకు పవర్ ఆఫ్ అటార్నీ ఇయ్యి. నీ వ్యాపారం పువ్వుల్లో పెట్టి చూసుకుని భద్రంగా... నీ కొడుకులకు అప్పజెప్తా!" ........
అది వినగానే , జోగారావు మొహంలోకి కోపం ఛాయలు పొడజూపాయి.
" వామాక్ క్ క్...... అనుకుంటూ గొణిగాడు!
" ఛీఛీ! నీదెంత పాడుబుద్ధిరా!
చావుపడక మీద కూడా ఎంత అభద్రత నీకు!. వామాక్షి నాకు పెళ్లి ముందు మరదలయినా , పెళ్లయ్యాకా నాకు సోదరిసమానురాలు.
ఆమెను వశపరచుకుని నీ ఆస్తి కాజేస్తానేమో అనే కదా నీ భయం? అవన్నీ నువ్వు చేసిన వెధవ పనులు! నేనంత నీచుడ్ని కాదు!
చిన్నప్పటినుండీ పరాన్నభుక్కు లాగా ఇంకోళ్ల సొమ్ము మీద పడి తిన్నది నువ్వు. పక్కవాడి దగ్గర ఏది నదురుగా వుంటే , దాన్ని సాధించేదాకా నిద్రపోలేదు!
ఎవడేమి వ్యాపారం చేస్తే దానిలో దిగిపోవడం, తమ్మినిబమ్మి చేసి, వాడిని నాశనం చేయడం. ఇదేగా మనం చేస్తున్న వ్యాపారం!! చెప్పరా! అలాంటిది... నువ్వు వామాక్షీ, నా ...పేరత్తడం నీ..నీచత్వానికి పరాకాష్ట!!
" సరే విను! యూఎస్ లో... మా అమ్మాయీ, మీ చిన్నకొడుకూ ఒకళ్లంటే ఒకళ్లు ఇష్టపడ్డారు.
మా పెద్దపాపని మీ పెద్దాడికిమ్మని.. వామాక్షి అడిగింది.
కనుక నాకన్నా సరయిన వాడు నీకు దొరకడు... నీ ఆస్తి కాపాడడానికి.
నువ్వు 'ఊ'...అంటే లాయర్నీ, మేజిస్ట్రేట్ నీ పిలిపిస్తా. రాతకోతలు చేసుకుందాం! పైగా నీ వ్యాపారంలో... నా డబ్బుందని నీకూ తెలుసు".....
జోగారావు మూసుకుపోతున్న కళ్ల వెనుక భావమేదో అర్ధమవ్వలే.. రాంబాబుకు. చూపు మాత్రం... పక్క తలుపుమీంచి తిప్పడంలే!!
ఒళ్లుమండుకొచ్చింది రాంబాబుకి. కుర్చీలోంచి విసురుగా లేచి... పక్క తలుపు తెరుచుకుని బాల్కనీలోకెళ్లాడు.
విశాలమైన బాల్కనీలో ఉయ్యాలబల్ల మీద కూర్చుని సిగరెట్ వెలిగించాడు. పెరట్లో ఎవరో ఆడవాళ్ల వాదన వినిపించింది. జోగారావ్ ఇంటి పనిమనిషి... పక్కింటి పనిమనిషితో గొడవపడుతోంది.
వెనక్కితిరిగి పోబోతున్న రాంబాబు చెవుల్లో అసంకల్పితంగా కొన్ని మాటలు చెవున పడ్డాయి. ఆగి చెవులు రిక్కించి...వారి మాటలు విన్నాడు. మసక చీకట్లో పెరడూడుస్తున్న జోగారావు పనిమనిషి.,. తమింట్లో రాలుతున్న పక్కింటి చెట్ల ఆకుల గురించి గొడవపడుతోంది. అదేమీ విచిత్రం కాదు... కానీ ఆ ఆకులు రాలుస్తున్న చెట్లు జామచెట్లు! వంగుని పిట్టగోడ మీంచి పారాపెట్ మీదకు వాలి చూసాడు రాంబాబు!
పక్కింటి వాళ్ల ...పెద్ద జామిచెట్టు కొమ్మకటి ....వీళ్ల పేరాపెట్ మీదకు... ఎండ కోసమై విస్తరించి ఉంది.
పేరాపెట్ ఎత్తుగా మొదటి అంతస్తులో ఉండడం వలన ఎవరికీ అందదు.
మిగిలిన కొమ్మలన్నీ పిందే పీపీతో ఉంటే, పేరాపెట్ మీదున్న విశాలమైన కొమ్మకు మాత్రం... ఆరముగ్గినవీ, దోరగా పండిన జామకాయలు పెద్దవి గుత్తులు గుత్తులుగా..గుత్తంగా పడున్నాయి...నోరూరిస్తూ!
రాంబాబు పెదవులమీదకి ఒక్కసారిగా... విశాలమైన నవ్వు పాకింది.
అది అతని మనసుని చక్కిలిగిలి పెట్టి... పకపకలాడించింది.
కాసేపు అక్కడే నిలబడి... మనస్ఫూర్తిగా నవ్వుకుని , లోపలికి వెళ్లేముందు... రెండు ఫోన్ కాల్స్ చేసి, తలుపు తెరుచుకుని, జోగారావు బెడ్ రూంలోకి వచ్చాడు.
సవ్వడి విని జోగారావు... అతికష్టం మీద కళ్లు విప్పాడు.
రాంబాబు చేతులకేసి ఆశగా చూసాడు.
అతని రిక్తహస్తాలు చూసి... జోగారావు కన్నీళ్ల పర్యంతమయ్యాడు.
రాంబాబు మిత్రుడిని సమీపించి... ప్రేమగా నుదుటి మీద ముద్దుపెట్టుకున్నాడు.
అతని చచ్చుబడిపోయిన చేతిని... తన చేతిలోకి తీసుకుని మార్దవంగా......
" జోగీ! నిజం చెప్పు! ఆరోజు... నువ్వుఆ పక్కింటాళ్ల జాంకాయలు కోద్దామని ..చీకట్లో వంగి, మేడమీంచి పడిపోయావ్ కదూ!
మీ వాళ్లంతా నువ్వు ఫోన్ మాట్లాడుతూ కళ్లుతిరగడం వలన కిందపడి, అక్కడున్న రోటిమీద పడడం వలన అయ్యిందనుకుంటున్నారు ...పిచ్చాళ్లు.
ఒరే! నాకు తెలీదురా నువ్వెంత దొంగజాంకాయవో!
నీ విస్తరిలో పంచభక్ష పరవాన్నాలున్నా, పక్కోడి విస్తరిలోంచి ఆవకాయ బద్ద దొబ్బుకుతింటే కానీ... నీకు పూటగడవదు కదా!
సరే! అదంతా వదిలేయ్! నీకు ఆ పక్కింటి జాంకాయలు... కోసిస్తా.
మరి నాకు పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తావా?
ఇలా అడగడం మానవత్వం కాదని తెలుసురా జోగీ!
కానీ అవన్నీ నీకు పట్టవు కదా! పరవాలేదు! "
కానీ జోగారావుకి ఇవేవీ పట్టట్లేదు.
స్నేహితుడికి ...తన ఆఖరికోరిక తెలిసిపోయిందన్న సంగతి తెలియగానే... మొహంలోకి విపరీతంగా వెలుగొచ్చేసింది.
ముద్దముద్దగా " పెడతా! పెడతా!" అని గొణిగాడు.
ఆ తరువాత రాంబాబు ఒక్క క్షణం ఆలస్యం చెయ్యలేదు.
అప్పటికే వచ్చివున్న లాయర్, మెజిస్ట్రేట్, జోగారావు కొడుకులూ, భార్యా సమక్షంలో తన అన్ని వ్యాపారలమీద... రాంబాబుకు పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తూ ...ఒప్పందాలు అయిపోయాయి.
డాక్టర్, అతని సిబ్బంది జోగారావుని వీల్ చెయిర్ లో కుదేసారు.
ఆక్సిజన్ మాస్క్ తోనే పక్కనున్న బాల్కనీలోకి తోసుకెళ్లారంతా!
అప్పటికే అక్కడ ఏర్పాటు చేసిన... ఫ్లడ్ లైట్ల వెలుగులో ఆ ప్రాంతమంతా వేడిగా, వెలుగుగా ఉంది.
జోగారావుని... పేరాపెట్ వాల్ దగ్గరగా తెచ్చారు.
రాంబాబు మెల్లగా తాడు సాయంతో పళ్లతో నిండిన కొమ్మలు పైకిలాగాడు, పేరాపెట్ మీద నిలబడ్డ నౌకర్.. పైకి ఎత్తితోస్తుంటే!!
జోగారావు ఒళ్లోకి గుత్తుల గుత్తుల జాంపళ్లు వచ్చాయి. వామాక్షి.... ఏడుస్తూ ఒక జాంపండు కాకెంగలి చేసి ...జోగారావు నోటికందించింది.
అదే ఆఖరికి ...అతని పాలిట తులసితీర్ధమయింది.
పదకొండోరోజు పిండప్రధానానికి.... అన్నం ముద్దలు పేరాపెట్ వాల్ మీదే పెట్టారు. అక్కడే పదిరోజులుగా తిష్టవేస్తున్న కాకి ..ఆరోజు ఆ పిండప్రసాదాన్ని ముట్టలేదు!
జోగారావు కొడుకులు ఆర్ద్రంగా " నాన్నా! రా నాన్నా! తిను నాన్నా! "....అన్నా తినలేదు. పక్కింటాళ్ల జాంకాయ పెట్టారు . అయినా తినలేదు.
ఈలోపల రాంబాబు ఒక బాక్సులోంచి తన ఇంట్లోంచి తెచ్చిన అన్నం ముద్దలు చేతికిచ్చి... పెట్టమన్నాడు. వెంటనే కాకొచ్చీ చటుక్కున తినేసి... పారిపోయింది. ఎవ్వరికీ అర్ధం కాలేదు... ఒక్క రాంబాబుకు తప్పా.
ఆకాకి మళ్లీ జోగారావు ఇంటిమీద వాలలేదు. ఇప్పుడు రాంబాబు తినే ప్రతీ మొదటిముద్దా... తనింటి మీదే కాపరం పెట్టిన కాకికి ...పెట్టాలిసిందే!
మరి... కోట్ల ఆస్థికి బాధ్యత కట్టబెట్టిందిగా! తీసుకోడమే తెలిసిన చెయ్యికి, మొదటిసారిగా ఇవ్వాలిసొచ్చింది. కనుక ఇంక కాకి బాధ్యత రాంబాబుదే!
రాంబాబూ మాత్రం విసుక్కోడు! మంచి నెయ్యేసి కలిపిన అన్నం ముద్ద పట్టుకుని , *"ఒరే! దొంగ జాంకాయ్!"* అని పిలవగానే తయారుగా ఉంటుంది కాకి!!
🌷🌷🌷
*శశికళ ఓలేటి*
పన్నులు ఏ విధంగా వసూలు చేయాలంటే.
..............................................................
ఓ రాజా ! తోటమాలి(మాలకారుడు) ఏ విధంగానైతే మొక్కలను నాటి పాదుచేసి నీల్లుపోసి కలుపును ఏరివేసి పెద్దచేసి వాటి పూలను సంరక్షించి సేకరించి మాలలను కట్టి ధనం ఎలా సంపాదిస్తాడో అలానే రాజనేవాడు కూడా ప్రజలను విద్యావంతులను భాగ్యవంతులకు చేసి అపై పన్నులు వసూలు చేయాలి.
అలా కాకుండా
స్వతహాగా పెరిగిన చెట్టును నరికి కాల్చి బొగ్గులుచేసి, అమ్మి ధనం సంపాదించినట్లుగా చేయరాదు.
కాబట్టి రాజు ప్రజలు ప్రజలను రక్షించి వారినుండి పన్నులు వసూలు చేయాలి.
పై విషయాన్ని భవభూతి *ఉత్తరరామచరితం* కింది శ్లోకంలో తెలియచేస్తోంది.
*"పుష్పమాత్రం వినుచియాత్,* *మూలఛ్చేదం న కారయేత్*
*మాలాకార ఇవ ఆ న యథాంగారకారక:"*
........... ............ .............
ఇంకా పన్నుల వసూలవిధానం ఎలా వుండాలో కింది *సుభాషితశ్లోకం* తెలియచేస్తోంది.
*"యాథాల్పాల్ప మదంత్యాద్యం వార్యోకో వత్సషట్పాదా:*
*తథాల్పోల్పో గృహితవ్యో రాష్ట్రా ద్రాజ్ఞాఅబ్దిక:కర:"*
అంటే
తేనెటీగలు పుప్వులనుండి తెనెను సేకరించినట్లుగా
దూడ ఆవునండి పాలను త్రాగినట్లుగా
జలగ నొప్పి తెలియకుండా రక్తాన్ని పీల్చినట్లుగా రాజు కొంచెంకొంచెంగా పన్నులు వసూలు చేయాలి.
అప్పుడేప్పుడో చెప్పింది ఇప్పటిరాజులు పాటిస్తారా ?
॥సేకరణ॥
...............................................................................
జిబి.విశ్వనాథ.9441245857. అనంతపురం.
అజరా అమర వ త్ ప్రా జ్న : , వి ధ్యా 0 అర్ధం చ సాధయే త్. గృహీత ఇవ కేశేషు మృత్యునా ధర్మ మా చ రేత్. ఈ సాధనతో నీవు నిత్యుడవే, మార్పు లేనివాడవే! ధర్మ స్వరూపుడవే అనే గ్రహింపు కలుగుతుంది. ఇప్పుడు ఎలాగ నేను ఎప్పటికైనా నశించె వాడను అని స్థిరంగా అనిపిస్తోందో, అప్పుడు నేను శా శ్వ తుడనే అనే అవగాహన కలుగుతుంది. ఓం నమః
మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి లీలలు..
*స్వప్న సాక్షాత్కారం..*
1998 వ సంవత్సరం..విజయవాడలో ఉంటున్న పద్మావతి గారు కనకదుర్గా దేవి కి భక్తురాలు..తనకు ఏపాటి కష్టం కలిగినా..ఇంద్రకీలాద్రి కి వెళ్లి, ఆ తల్లిని దర్శించుకొని..తన బాధలు విన్నవించుకొని వచ్చేది..ఆ కనకదుర్గమ్మ దయతో పద్మావతి గారి సంసారం చక్కగా సాగిపోతున్నది..భర్త ప్రభుత్వద్యోగి..ఇద్దరు పిల్లలూ హైస్కూలు చదువులో వున్నారు..
కానీ..కొన్నాళ్లుగా ఆవిడకు స్వప్నంలో త్రిమూర్తి స్వరూపుడు శ్రీ దత్తాత్రేయుడు కనబడి..అంతలోనే మరో యోగి రూపంలోకి మారిపోయినట్లుగా దర్శనం అవుతున్నది..నవ్వుతూ తనను ఆశీర్వదిస్తున్నట్లుగా అనిపిస్తోంది..ఇలా రెండు మూడు సార్లు స్వప్నం లో అనుభవం అయిన తరువాత..భర్త తో ఈ విషయం చెప్పింది..ఆయన పెద్దగా పట్టించుకోలేదు సరికదా.."నువ్వు ఎక్కువగా పూజలు చేస్తుంటావు కదా..ఆ భ్రమ లోంచి బైటకు రాకపోవడం చేత..ఇలాటి కలలు వస్తున్నాయేమో..సరే..నువ్వు నమ్మిన ఆ అమ్మవారి వద్దకు వెళ్లి నమస్కారం చేసుకొని వచ్చేయి..అన్నీ ఆ తల్లే చూసుకుంటుంది.." అని చెప్పారు..పద్మావతి గారికి భర్త అలా తేలిగ్గా మాట్లాడటం నచ్చలేదు కానీ..కనకదుర్గా దేవిని దర్శించమని చెప్పిన సలహా మాత్రం మనసులో నాటుకున్నది..
సాయంత్రమే దుర్గగుడికి పద్మావతి గారు వెళ్లారు..అమ్మవారిని దర్శించుకున్న తరువాత..అక్కడే కూర్చున్నారు..ఇంతలో ఆవిడకు కొద్దిదూరంలో నలుగురైదుగురు ఆడవాళ్లు కూర్చుని వున్నారు..వాళ్ళ లో ఒకావిడ లేచి వచ్చి పద్మావతి గారి ప్రక్కనే కూర్చుని..తన చేతిలోని పుస్తకాన్ని తీసుకొని చదువుకోసాగింది..పద్మావతి గారు కేవలం కుతూహలం కొద్దీ..తన ప్రక్కన కూర్చున్నావిడ చదువుతున్న పుస్తకం ఏమిటని ఆవిడను అడిగారు..
"ఇది మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి చరిత్ర అనీ..తాము శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టారు గారి అనుయాయులమనీ..అమ్మవారి దర్శనానికి విజయవాడ వచ్చామని..ఈ ఆలయం లో కొద్దిసేపు పారాయణ చేసుకుందామని ఆ పుస్తకాన్ని చదువుకుంటున్నాననీ.." చెప్పింది..
("మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారితో మా అనుభవాలు" పేరుతో శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు వ్రాసిన రచన మొట్టమొదట శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టారు గారి ఆధ్వర్యంలో వెలువడుతున్న సాయిబాబా పత్రికలో ముద్రితం అయింది..తరువాత శ్రీ భరద్వాజ మాస్టారు గారి ఆధ్వర్యంలోనే పుస్తక రూపంలో ముద్రించారు..)
పద్మావతి గారు ఆ పుస్తకాన్ని చేతిలోకి తీసుకొని..చూసారు..ఆశ్చర్యం!..ఆ పుస్తకం పై తనకు స్వప్నం లో కనిపించి ఆశీర్వదించిన యోగి ఫోటో ముద్రించి ఉన్నది..పద్మావతి గారు ఒక్కక్షణం మాన్ప్రడి పోయి..తేరుకొని.."అమ్మా..ఈ క్షేత్రం ఎక్కడ ఉన్నది?..ఎలా వెళ్ళాలి?..ఈ ఫొటోలో ఉన్న మహానుభావుడి దర్శనం నాకు స్వప్నంలో జరిగింది..మీరు వివరాలు చెప్పగలరా?.." అని గబ గబా అడిగేసారు..
ఆ వచ్చినావిడ..ఓపికగా శ్రీ దత్తాత్రేయ స్వామి వారి గురించి..ఆయన చరిత్ర..కపాలమోక్షం ద్వారా సిద్ధి పొందడం..మొగలిచెర్ల వెళ్ళడానికి మార్గం..వివరంగా తెలిపారు..పద్మావతి గారు ఆవిడకూ..ఆవిడతో పాటు ఉన్న మిగిలిన ఆడవాళ్లకూ ధన్యవాదాలు తెలిపి..పరుగు పరుగున ఇంటికి వచ్చారు..ఆసరికే కార్యాలయం నుంచి వచ్చిన తన భర్త కు ఈ విషయం చెప్పి..మొగలిచెర్ల కు వెళ్లి ఆ అవధూత సమాధిని..ఆ యోగికి ఆశ్రయం కల్పించిన శ్రీధరరావు, ప్రభావతి గార్లను కూడా చూసి వద్దామని పట్టు బట్టారు..ఒక్క రెండురోజులు ఆగిన తరువాత ఆదివారం నాడు వెళదామని ఆయన చెప్పారు..
ఆదివారం నాడు కారు మాట్లాడుకుని..భర్త పిల్లలతో సహా పద్మావతి గారు మొగలిచెర్ల చేరారు..ముందుగా శ్రీధరరావు ప్రభావతి గార్లను కలిశారు..ఆ దంపతుల తో శ్రీ స్వామివారి గురించి వివరాలు తెలుసుకొని..శ్రీ స్వామివారి మందిరానికి చేరి..శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకున్నారు..అక్కడ ఉన్న శ్రీ స్వామివారి ఫోటో ను చూసిన పద్మావతి గారికి కళ్లలోంచి ధారగా కన్నీళ్లు కారిపోసాగాయి..తనను ఆ దత్తాత్రేయుడి రూపంలో వచ్చి ఆశీర్వదించినది ఈ మహానుభావుడే అని భర్తతో పదే పదే చెప్పుకున్నారు..శ్రీ స్వామివారి సమాధికి సాగిలబడి నమస్కారం చేసుకున్నారు..శ్రీ స్వామివారికి నైవేద్యంగా ఇతర భక్తులు సమర్పించిన పొంగలిని, పద్మావతి గారు ప్రసాదంగా స్వీకరించి, భర్తకూ పెట్టారు..ఇటువంటి దత్త క్షేత్రం లో అన్నదానం చేస్తే విశేష ఫలితముంటుందని భర్త గారికి చెప్పి, ఒప్పించి..ఆ ప్రక్క ఆదివారం అన్నదానం చేయడానికి అయ్యే మొత్తం ఖర్చును విరాళంగా ఇచ్చారు..
ఆరోజునుంచీ..పద్మావతి గారి కుటుంబం మొత్తం శ్రీ స్వామివారికి భక్తులుగా మారిపోయారు అంటే ఆశ్చర్య పోనక్ఖరలేదు కదా...
సర్వం..
శ్రీ దత్తకృప!
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..పిన్:523114.. సెల్..94402 66380 & 99089 73699)
9. పక్వాని తరుపర్ణాని
పతంతి క్రమశో యథా|
తథైవ జంతవః కాలే
తత్ర కా పరివేదన||
తా:- పండిన ఆకులు చెట్టునుండి ఏ విధముగా రాలిపోవునో అదే విధముగా ఆయువు తీరిన వారు మరణింతురు. దానికై దుఃఖించుట ఎందులకు?
10. ఏక వృక్ష సమారూఢ
నానాజాతి విహంగమాః|
ప్రభతే క్రమశో యాంతి
తత్ర కా పరివేదన||
తా:- చీకటి పడగానే అనేక జాతులు పక్షులు
ఒకే వృక్షం ఆశ్రయించి విశ్రమిస్తాయి. తెల్లవారగానే ఆ పక్షులు అన్నీ చెట్టును విడచి తమతమ ఆహార సంపాదనకు వెళ్ళిపోతాయి. అదే విధంగా బంధువులతో కూడిన
మానవుడు కాలమాసన్నమైనపుడు తన శరీరాన్ని
ఇంటిని వదలి వెళ్ళిపోతాడు. అందుకు బాధపడ
నవసరములేదు.
* సర్వే జనాః సుఖినోభవంతు *
సంకలనం:
స్వరాజ్యే పూజ్యతే తెలుగు
స్వదేశే పూజ్యతే హిందీ
స్వభూమౌ పూజ్యతే ఆంగ్లం
సంస్కృతం సర్వత్ర పూజ్యతే
లోకాః సమస్తాః సుఖినః భవంతు
సర్వాః భాషాః వర్ధితాః భవంతు
*2.10.2021 సాయం కాల సందేశము*
*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*ఏకాదశస్కంధము - పదకొండవ అధ్యాయము*
*బద్ధజీవుల-ముక్తజీవుల-భక్తుల లక్షణములు*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*శ్రీభగవానువాచ*
*11.1 (ప్రథమ శ్లోకము)*
*బద్ధో ముక్త ఇతి వ్యాఖ్యా గుణతో మే న వస్తుతః|*
*గుణస్య మాయామూలత్వాన్న మే మోక్షో న బంధనమ్॥12614॥*
*శ్రీభగవానుడు వచించెను* ఉద్ధవా! సత్త్వాది గుణములను బట్టియే బద్ధులు, ముక్తులు అని వ్యావహారికముగా పేర్కొనుచుందురు. కాని వాస్తవముగా (తత్త్వదృష్టితో) కాదు. గుణములన్నియును మాయా మూలకములు. నేను గుణాతీతుడను. కావున నా స్వరూపమైన ఆత్మకు మోక్షముగాని, బంధనము గాని లేవు.
*11.2 (రెండవ శ్లోకము)*
*శోకమోహౌ సుఖం దుఃఖం దేహాపత్తిశ్చ మాయయా|*
*స్వప్నో యథాఽఽత్మనః ఖ్యాతిః సంసృతిర్న తు వాస్తవీ॥12615॥*
శోకమోహములు, సుఖదుఃఖములు, దేహము ప్రాప్తించుట, నశించుట అనునవి అన్నియును మాయా మూలకములు. ఇవి అన్నియును స్వప్నసదృశములు. కనుక, మిథ్యయే. ఈ దృశ్యజగత్తు అంతయును మాయవలన గోచరించును. కావున, అది వాస్తవముకాదు.
*11.3 (మూడవ శ్లోకము)*
*విద్యావిద్యే మమ తనూ విద్ధ్యుద్ధవ శరీరిణామ్|*
*మోక్షబంధకరీ ఆద్యే మాయయా మే వినిర్మితే॥12616॥*
ఉద్ధవా! విద్యయు, అవిద్యయు అను రెండును నా శక్తులే. ఇవి శరీరధారులకు క్రమముగా మోక్షమును, బంధమును కలిగించును. అనాదియైన ఈ రెండును నా మాయాశక్తులే.
*11.4 (నాలుగవ శ్లోకము)*
*ఏకస్యైవ మమాంశస్య జీవస్యైవ మహామతే|*
*బంధోఽస్యావిద్యయానాదిర్విద్యయా చ తథేతరః॥12617॥*
మహాత్మా! ఈ జీవుడు మాత్రము నా అంశయే. అనాదియైన అవిద్యవలన జీవునకు బంధనములు ఏర్పడును. నా యొక్క విద్యాశక్తివలన మోక్షము గలుగును.
*11.5 (ఐదవ శ్లోకము)*
*అథ బద్ధస్య ముక్తస్య వైలక్షణ్యం వదామి తే|*
*విరుద్ధధర్మిణోస్తాత స్థితయోరేకధర్మిణి॥12618॥*
నాయనా! బద్ధులకును, ముక్తులకును గల భేదమును నీకు తెలిపెదను. జీవుడు నా స్వరూపమే యగుట వలన వాస్తవముగా జీవుడన్నను, ఆత్మయన్నను ఒకటే. కానీ, ఆ రెండిటిమధ్యగల భేదమును వినుము. ఆత్మస్వరూపుడనైన నేను శాసకుడను. జీవుడు శాసింపబడువాడు. నేను ఆనందస్వరూపుడను. జీవుడు శోకమోహములకు వశుడై సుఖదుఃఖములను అనుభవించును.
*11.6 (ఆరవ శ్లోకము)*
*సుపర్ణావేతౌ సదృశౌ సఖాయౌ యదృచ్ఛయైతౌ కృతనీడౌ చ వృక్షే|*
*ఏకస్తయోః ఖాదతి పిప్పలాన్నమన్యో నిరన్నోఽపి బలేన భూయాన్ ॥12619॥*
ఈ శరీరరూపవృక్షముపై హృదయమను గూటిలో రెండు పక్షులు జతగా నివసించు చుండును. సమానధర్మముగల ఈ పక్షులు రెండును మిత్రభావమును గలిగియుండును. ఆ రెండింటిలో ఒకటి ఈ శరీరముద్వారా చేయబడు కర్మలఫలరూపమున శబ్దాది విషయములను అనుభవించును. ఐనను అది క్షీణించుచుండును. మఱియొక పక్షి ఫలములను అనుభవింపకున్నను మిగుల బలిష్ఠముగానుండును.
*11.7 (ఏడవ శ్లోకము)*
*ఆత్మానమన్యం చ స వేద విద్వానపిప్పలాదో న తు పిప్పలాదః|*
*యోఽవిద్యయా యుక్ స తు నిత్యబద్ధో విద్యామయో యః స తు నిత్యముక్తః॥12620॥*
ఫలములను అనుభవింపని పక్షి తనను తెలిసికొనును, తన సఖుడైన ఆ జీవునిగూడ తెలిసికొనును. కాని కర్మఫలములను అనుభవించునట్టి పక్షి తనను తాను తెలియదు. ఆత్మస్వరూపుడైన తన మిత్రునిగూర్చి గూడ తెలిసికొనజాలదు. ఈ విధముగా అవిద్యకు వశుడైనవాడు నిత్యబద్ధుడు. తన నిజస్వరూపమును ఎరిగినవాడు నిత్యముక్తుడు.
*11.8 (ఎనిమిదవ శ్లోకము)*
*దేహస్థోఽపి న దేహస్థో విద్వాన్ స్వప్నాద్యథోత్థితః|*
*అదేహస్థోఽపి దేహస్థః కుమతిః స్వప్నదృగ్యథా॥12621॥*
ఆత్మజ్ఞాన సంపన్నుడగు పురుషుడు స్వప్నము ముగిసి, నిద్రనుండి మేల్కనిన పిమ్మట స్వప్నము నందలి శరీరముతో ఎట్టి సంబంధమును కలిగి ఉండడు. అదేవిధముగ అతడు సూక్ష్మ, స్థూల శరీరమునందు ఉండినప్పటికినీ, వాటితో ఎటువంటి సంబంధమును కలిగియుండడు. కాని, అజ్ఞానియగు పురుషుడు స్వప్నమును చూచునప్పుడు కనిపించే స్వప్నశరీరముతో సంబంధమును జోడించుకొనినట్లుగా వాస్తవమునందు ఎట్టి సంబంధములేని శరీరమునందు అజ్ఞానమువలన శరీరమునందే తాను ఉన్నట్లుగా తాదాత్మ్యమును అనుభవించును.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని పదకొండవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319, 9505813235
What a beautiful answer!
Comparison between two "Generations" ....... Everyone must read 👌👌
A youngster asked his father: "How did you people live before with-
No access to technology
No aeroplanes
No internet
No computers
No dramas
No TVs
No air cons
No cars
No mobile phones?"
His Dad replied:
"Just like how your generation lives today with -
No prayers
No compassion
No honor
No respect
No character
No shame
No modesty
No time planning
No sports
No reading"
"We, the people that were born between 1940-1985 are the blessed ones. Our life is a living proof:
👉 While playing and riding bicycles, we never wore helmets.
👉 After school, we played until dusk. We never watched TV.
👉 We played with real friends, not internet friends.
👉 If we ever felt thirsty, we drank tap water not bottled water.
👉 We never got ill although we used to share the same glass of juice with four friends.
👉 We never gained weight although we used to eat a lot of rice everyday.
👉 Nothing happened to our feet despite roaming bare-feet.
👉 our mother and father never used any supplements to keep us healthy.
👉 We used to create our own toys and play with them.
👉 Our parents were not rich. They gave us love, not worldly materials.
👉 We never had cellphones, DVDs, play station, XBox, video games, personal computers, internet chat - but we had real friends.
👉 We visited our friends' homes uninvited and enjoyed food with them.
👉 unlike your world, we had relatives who lived close by so family time and ties were enjoyed together.
👉 We may have been in black and white photos but you will find colourful memories in those photos.
👉 We are a unique and, the most understanding generation, because *we are the last generation who listened to their parents*.
*Also , the first who have had to listen to their children.*
and we are the ones who are still smarter and helping you now to use the technology that never existed while we were your age!!!
We are a *LIMITED* edition!
So you better -
Enjoy us.
Learn from us.
Treasure us.
Before we disappear from Earth and your lives."
పూజకు సిద్ధమయ్యారా? మరి పూజకు పువ్వులు తెచ్చారా? తీసుకురాలేదా? మరైతే పదండి మీ తోటకి వెళ్ళి తెద్దాం ...అన్నట్టు భగవంతునికి ఇష్టమైన పూలేమిటో తెలుసా!
ఇవిగో....
అహింసా ప్రథమం పుష్పం!
పుష్పం ఇంద్రియ నిగ్రహః !!
సర్వ భూత దయా పుష్పం !
క్షమా పుష్పం విశేషతః !!
జ్ఞాన పుష్పం తప: పుష్పం !
శాంతి పుష్పం తథైవ చ !!
సత్యం అష్ట విధం పుష్పో: !
విష్ణో హో ప్రీతి కరం భవేత్ !!
1.అహింసా పుష్పం:
ఏ ప్రాణికీ మానసికంగా బాధ కలిగించకుండా ఉండటమేదేవునికి సమర్పించే ప్రధమ పుష్పం....
2.ఇంద్రియ నిగ్రహం:
చేతులు, కాళ్లు మొదలైన కర్మేంద్రియాలు లను అదుపులో ఉంచుకోవడమే దేవుని అందించాల్సిన రెండో పుష్పం....
3.దయ:
కష్టాల్లో, బాధలో ఉన్న వారిబాధను తొలగించడానికి చేసేదే దయ.....ఇది దేవునికి అర్పించే మూడో పుష్పం.....
4.క్షమ:
ఎవరైనా మనకి అపకారం చేసినా,ఓర్పుతో సహించడమే క్షమ....ఇది దేవునికి సమర్పించే నాలుగవ పుష్పం.....
5.ధ్యానం:
ఇష్ట దైవాన్ని నిరంతరం మనసులో తలచుకుంటూ ఆయన మీదే మనసు లగ్నం చేయడం....ఇది దేవుని అందించే ఐదో పుష్పం....
6.తపస్సు:
మానసిక ( మనస్సు),వాచిక (మాట),కాయక( శరీరం)లకు నియమాలు ఉండం తపస్సు.....ఇది దేవునికిచ్చే ఆరవ పుష్పం....
7.జ్ఞానం:
పరమాత్మ గురించి సరైన తెలివితో ఉండడమే జ్ఞానం....ఇది దేవుని అర్చించాల్సిన ఏడవ పుష్పం.....
8.సత్యం:
ఇతరుల కు బాధ కలుగకుండా నిజాన్ని చెప్పడమే సత్యం.... ఇది దేవునికి అలంకరించాల్సిన ఎనిమిదవ పుష్పం....
అవి చాలా అరుదైన పుష్పాలు, అవి మా తోటలో అన్ని లేవే అంటున్నారా! మరేం ఫరవాలేదు ఇవాళే మొక్కలు నాటండి..... త్వరలోనే మిగతా పూలు పూయించండి...
🙏🏻
doctor uses iPhone 13 Pro Max camera for eye treatment. వైద్య చరిత్రలో ఇదో అద్భుతం.అతి సున్నితమైన కంటి చూపును మెరుగు పరిచేందుకు ఓ డాక్టర్ యాపిల్ ఐఫోన్13ను ఉపయోగించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు.ఫోన్లో ఉన్న మ్యాక్రోమోడ్ టెక్నాలజీని జోడించి కంటి సమస్యల్ని పరిష్కరిస్తున్నారు. ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్లు సైతం 'డాక్టర్ బాబు'..కార్నియా రాపిడి నయమైందని అంటున్నారు.వినడానికి వింతగా ఉన్న ఇది మెడికల్ మిరాకిల్ అని అంటున్నారు వైద్య నిపుణులు.
అమెరికా కాలిఫోర్నియాలోని శాన్డియాగో అనే ప్రాంతానికి చెందిన టామీ కార్న్ టెక్సాస్ సౌత్ వెస్ట్రన్ మెడికల్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను పూర్తి చేశారు. అనంతరం 21 సంవత్సరాలుగా కంటి వైద్యుడిగా సేవలందిస్తున్నారు. ప్రస్తుతం షార్ప్ మెమోరియల్ ఆస్పత్రిలో ప్రముఖ ఆప్తమాలజిస్ట్గా,డిజిటల్ ఇన్నోవేటర్(టెక్నాలజీతో చేసే వైద్యం)గా పనిచేస్తున్నారు.
అయితే తాజాగా ఈయన,ఐఫోన్13 ప్రో మ్యాక్స్లో ఉన్న మ్యాక్రోమోడ్ని ఉపయోగించి'ఐ'ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అంతేకాదు ఈ టెక్నాలజీ ద్వారా కంటి చూపు ఏ స్థాయిలో ఉందో గుర్తించి ఫోటోల్ని క్యాప్చర్ చేస్తున్నారు. ఆ ఫోటోల సాయంతో కార్నియా ఆపరేషన్ తరువాత వచ్చే రాపిడి సమస్యల్ని పరిష్కరిస్తున్నారు. ఇలా సాధారణ ట్రీట్మెంట్తో పరిష్కరించలేని ఎన్నో సున్నితమైన సమస్యల్ని మ్యాక్రోమోడ్ ఫీచర్ తో కంటికి ట్రీట్మెంట్ ఎలా చేస్తున్నారో లింక్డిన్లో పోస్ట్ చేశారు.
మ్యాక్రోమోడ్ ఫీచర్ అంటే?
ప్రొఫెషనల్గా ఫోటోలు తీయాలంటే ఫోటోగ్రాఫర్ కావాల్సిన అవసరం లేదు. చేతిలో ఫోన్ ఉంటే చాలు.. సినిమాటిక్ మోడ్, మ్యాక్రోమోడ్ ఫీచర్ల సాయంతో సాధారణ లొకేషన్లలో అందంగా ఫోటోల్ని క్యాప్చర్ చేయోచ్చు.ఇప్పుడు ఐఫోన్13 ప్రో మ్యాక్స్లో ఉన్న మ్యాక్రోమోడ్ ఫీచర్ను ఉపయోగించే డాక్టర్ టామీ కార్న్ కంటి వైద్యం చేస్తున్నారు. ఫోన్లో ఎన్ని ఫోటో ఫీచర్స్ ఉన్నా..మ్యాక్రోమోడ్ చాలా ప్రత్యేకం. ఉదాహరణకు కంట్లో ఉన్న అతి సూక్ష్మమైన నలుసుని సైతం అడ్వాన్స్డ్ మ్యాక్రోమోడ్ టెక్నాలజీతో హెచ్డీ క్వాలిటీ ఫోటోల్ని తీయొచ్చు.
ఐఫోన్13 ప్రో మ్యాక్స్తో ట్రీట్మెంట్..
కంటిలో ముందు భాగాన్ని కార్నియా అంటారు. ఇది చాలా పలచగా ఉంటుంది. వెలుతురిని కంటి లోపలి భాగాలకు చేరవేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అయితే ఇటీవల ఓ వ్యక్తి కార్నియా ఆపరేషన్ చేయించుకున్నారు. ఆ ఆపరేషన్ తరువాత తాత్కాలికంగా కంటి లోపల రాపిడి జరుగుతుంది. ఆ సమస్యను అధిగ మించేలా ఐఫోన్ 13లో ఉన్న మ్యాక్రో మోడ్తో కంట్లో కార్నియాను చెక్ చేశారు. అనంతరం ఆ సమస్య గురించి డాక్టర్ టామీకార్న్ పేషెంట్ను అడగ్గా..తన కంటి చూపు మెరుగుపడిందని సంతోషంగా చెప్పాడు. ఆ పేషెంట్కు అందించిన ట్రీట్మెంట్ విధానాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
. మంగళం కాదది మంగలం
---------------------------------------------------
మంగళంపేరుతో కొన్ని గ్రామాలున్నాయి. తిరుపతినగరానికి ప్రక్కనే మంగళం వుంది. ఇదే జిల్లాలో
గంగాధరనెల్లూరు మండలంలో మహాదేవమంగళం పేరుతో ఓ గ్రామమంది .
పుత్తూరు మండలంలో పరమేశ్వరమంగలం అనే గ్రామముంది.
మంగళంపల్లె అనే గ్రామం కడపజిల్లాలోని ఓబులవారిపల్లె మండలంలోని వుంది.
తెలంగాణాలో కరీంనగరు జిల్లాలో కోనారావుపేట మండలంలో మంగలంపల్లి గ్రామముంది.
మంగళమంటే స్త్రీ, పార్వతి, శుభం, క్షేమం అనే అర్థాలున్నాయి.
కనుక మంగళంపల్లి, మంగళం, పరమేశ్వరమంళం అనే గ్రామాలలోని మంగళం అనేమాట శుభం, క్షేమమనే అర్థాలను ఇస్తున్నట్లుగా భావించి, తమగ్రామం మంగళకరమైనదిగా కొందరు భావిస్తున్నారు.
నిజానికి ఆ పేర్లన్ని మంగలం అనేమాటకు సంబంధించినవే. మంగలమంటే 58 బ్రాహ్మణకుటుంబాలు నివాసమున్న గ్రామమని అర్థం.
అలాగే చతుర్వేదమంగలం పేరుతో కొన్ని గ్రామాలుండేవని కింది శాసనంవలన తెలుస్తోంది.
1205 ACE * కాలంనాటి శాసనంలో.... గంగ్గగొండ చోడవలనాట్టి ప్రోలునాణ్టి చుత్తమల్లి చతుర్వేదమంగలమున శ్రీ పురుషోత్తమపట్టనము (Sll V - 8) అనగా గంగకొండ చోడవలనాడు (రాష్ట్రానికి)కు చెందిన ప్రోలుమల్లి నాడు (జిల్లా)లోని చతుర్వేద మంగళానికి చెందిన శ్రీ పురుషోత్తమపట్టణమని అర్థం.
మంగలమంటే క్షురకర్మకు సంబంధించినదని, పలుకటానికి శుభప్రదంగా వుండదని మనం మంగలాన్ని మంగళంగా పిలుచుకొంటున్నాం. ఒకపేరులో నిందార్థముందని దానిని మార్చుకొని పిలవడం, వ్రాయడం, వ్యవహరించడం తప్పు.
భారత గ్రామనామాల సంఘం (Place Names Society of India) ప్రకారం గ్రామానికున్న ప్రతిపేరు అక్కడి చరిత్ర, సంస్కృతి, వారసత్వాలను తెలియచేస్తాయి. పేరును మార్చడం వలన ఆ గ్రామనికున్న చారిత్రిక, సాంస్కృతిక విలువలు గతించిపోయే అవకాశముంది.
కనుక మంగలం అనే గ్రామాలను మంగళం అని పిలవడం తప్పు.
కనుక వాటిని మంగలమనే పిలుచుకొందాం.
ఇక ఆంగ్లభాషాపుణ్యాన కూడా కొన్ని గ్రామాలపేర్లు ఉనికిని కోల్పోతున్నాయి. ఉదా॥ గోళ్ళపల్లి గొల్లపల్లిగాను, గోళ్ళాపురం గొల్లపురంగాను, గోళ్ళను గొల్లగాను పిలుస్తూ వ్రాస్తున్నాము. గోళ్ళపల్లి, గోళ్ళాపురంలోని గోళ్ళ అనేమాటకు దృఢమైన గోడలు (కోటగోడలు ) వున్న గ్రామమని అర్థం.
ఉరుము ఉరిమి మంగలం మీద పడినట్లు అనే సామెతకూడా వుంది. ప్రస్తుతతరం (Generation) వారు సామెతలు ఉపయోగించడం పూర్తిగా మర్చిపోయారనుకోండి.
మంగలం అంటే ఏమిటో పట్టణాలలో ఉండే వారికి తెలియదు. కానీ గ్రామాలలో ఉండేవారికి తెలుసు. ఇదోవేపుడు చట్టి. సాధారణంగా పాతకుండను తీసుకుని దాని పైభాగాన్ని జాగ్రత్తగా పగులగొట్టి మిగిలిన కిందిభాగాన్ని వేయించుకొనేందుకు బాణలిగా పల్లెలలో వాడేవారు. మంగలంలో ఎండు మిరపకాయలు, వేరుశెనగపప్పు, ఎండుచేపలు,పేలాలు లాంటివి వేయించుతారు.పనైపోయిన తరువాత ఇంటి ముందర అరుగుపై ఆరబెట్టుకొంటారు. ఇక్కడ మంగలమంటే దాదాపుగా అత్యంత బలహీనమైన మట్టిపాత్ర కదా! దీనిపై అత్యంత శక్తివంతమైన ఉరుము (పిడుగు) మీద పడితే ఆ మంగలం ముక్కలై పెంకులైఎగిరిపోతుంది.
బలవంతుడు బలహీనుడిపైబడితే ఈ సామెతను ఉపయోగిస్తారు.
* క్రీ.శ.లేదా AD కి బదులుగా After common Era (ACE), క్రీ.పూ.లేదా BC కి బదులుగా Before Common Era (BCE) ఉపయోగించాలనే నిర్ణయం జరిగింది.
॥సేకరణ॥
-----------------------------------------------------------------
జిబి.విశ్వనాథ.9441245857. అనంతపురం
దేవీ నవరాత్రులు సమీపించుచున్న శుభతరుణంలో అమ్మవారి ప్రసాదములు తయారు చేసే విధానం
1.! శ్రీ బాలత్రిపురసుందరిదేవి !!
మొదటి రోజు.
!! పొంగల్ !!!! కావలసినవి !!
పెసరపప్పు 150 గ్రాం
కొత్త బియ్యం 100 గ
మిరియాలు 15
పచ్చిమిరప కాయలు 6
పచ్చి కొబ్బెర 1 కప్
కాచిన నెయ్యి 1/4 కప్
జీడిపప్పు 15
జీర 1/2 టేబల్ స్పూన్
ఆవాలు 1/4 టేబల్ స్పూన్
ఎండుమిర్చి 3
మినపప్పు , శనగపప్పు 2 టేబల్ స్పూన్స్
కోత్తమిర , కరేపాకు , తగినంత
ఉప్పు రుచిని బట్టి
ఇంగువ 2 చిటికెళ్ళు.
!! చేయవలసిన విధానము !!
దళసరి పాత్రలొ లో కాస్త నేయి వేడి చేసి
పెసరపప్పుని దోరగా ఏయించండి .బియ్యం కడిగి నీళ్ళన్నీ తీసేసిన తరువాత బియ్యం కూడా బాగా వేయించండితెలుపు రంగు పోకూడదు సుమా 5 నిమిషాలు
వేపితే చాలు పెసరపప్పుకూడ కలర్ మార కూడదు,
అదే మూకుడులో మరికాస్త నెయ్యి వేసి
జీడిపప్పులను వేయించి పెట్టడి.సన్నగా తరిగిన పచ్చి మిర్చిపచ్చికొబ్బెర కోరి , జీలకర్ర మిరియాలు వేయించిన బియ్యం
పెసరపప్పు ఇవన్నీ 4 కప్పుల నీళ్ళతో
కుక్కర్లో వుంచి 3 whistles / కూతలు వచ్చాక ష్టవ్ కట్టివేయడం చేయండి.
చల్లారాక అందులో ఆవాలు , మినపప్పు ,
శనగపప్పు , జిలకర్ర , ఎండుమిర్చి ,ఇంగువ, కరేపాక్ వేసి తాలింపు పెట్టిమిగిలిన నేయ్యి అంతా పొంగలిలో వేసివేడి వేడి ప్రసాదము ఆతల్లి త్రిపురసుందరీదేవికి నైవేద్యంపెట్టి
భక్తిగా పూజించి ఈ దసరా 10 రోజులు మాకు శక్తినిచ్చి నీకు సేవ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించు తల్లీ అని ప్రార్ధించాలి .
2 .గాయత్రి దేవి !!
రెండవ రోజు
!! పులిహోర !! కావలసినవి !!
బియ్యం 150 గాం
చింతపండు 50 గ్రాం
పసుపు1/2 స్పూన్
ఎండుమిర్చి 5
ఆవాలు 1/2 స్పూన్
మినపప్పు 1 స్పూన్
శనగ పప్పు 2 స్పూన్
వేరు శనగ పప్పు 1/2 కప్పు
కరివేపాకు 2 రెబ్బలు
ఇంగువ చిటికెడు
నూనె 1/4 కప్పు
ఉప్పు తగినంత
బెల్లం కొద్దిగా
!! చేయవలసిన విధానం !!
అన్నం వండి చల్లార్చి పసుపు , ఉప్పు , కలిపి పెట్టాలి .చింతపండును అరకప్పు నీళ్ళు పోసి
నాన పెట్టి ,చిక్కటి గొజ్జు తీసి పెట్టండి, మూకుడులో కాస్త నూనె వేసి అందులో ఆవాలు ఎండుమిర్చి వేసి ఈ చింతపండు గుజ్జు వేసి కాస్తబెల్లం వేసి బాగా వుడికించండి (కావాలంటే పచ్చి మిర్చి వేసుకోవచ్చుగుజ్జులో )
వుడికిన గుజ్జు అన్నంలో కలిపండి .
బాణలిలో నూనె వేడి చేసి ముందుగా ఆవాలు ,మినపప్పు , శనగ పప్పు , ఇంగువ , ఎండుమిర్చి , వేసి ఆ వాలు చిటపట అన్న తరువాతవేరుశనగ గుళ్ళు వేసి అన్నీ బాగా వేగాక కరేపాక్ వేసి , అన్నంలో కలపడమే కమ్మటి పులిహోర రెడీవ్వగానే శ్రీ జగదీశ్వరీ మాతైన ఆ గాయిత్రి దేవికి నైవేద్యం పెట్టి ఆ తల్లి ఆశీస్సులతో అందరూ బాగుండాలని కోరుకొందాము
3 .! అన్నపూర్ణా దేవి !!
మూడవ రోజు
!! కొబ్బెరన్నం !కావలసినవి !!
బియ్యం 1/2 కిలో
తురిమిన పచ్చికొబ్బెర 1 కప్
పచ్చిమిర్చి 5
కరేపాక్ , కోత్తమిర , ఉప్పు .
పోపు సామాగ్రి ఎండుమిర్చి , ఇంగువ .
జీడి పప్పు 10
నూనె , 1/4 కప్
నెయ్యి 1 టెబల్ స్పూన్
!! చేయవలసిన పద్ధతి !!
అన్నం పోడి పోడి గా వండుకొనిపచ్చికొబ్బెర కాస్త నేతిలో వేయించి ఈ వేగిన కొబ్బెర అన్నంలో కలిపండి .
అదే మూకుడులో నూనె వేసి పోపుసామాగ్ర వేసి ఎండుమిర్చి , ఇంగువ , వేసి ఆవాలు చిటపట చిటపట అనగానేపొడవుగా తరిగిన పచ్చిమిరప కాయలు , కరే పాక్ , కోత్తమిర ,
అందులో వేసి తీసేయండి ఈ వేగనిచ్చినదంతా అన్నంలో కలిపి ఉప్పు జీడిపప్పుకూడ వేసి పైన కాస్త కోత్తిమీర చల్లండి కమ్మటి కొబ్బెరన్నం రెడి .
శ్రీ అన్నపూర్ణా దేవికి నైవేద్యం పెట్టి మనస్సు పూర్తిగా ప్రార్థించి అమ్మ కృప కు పాత్రులవుదాము.
4 .లలితా దేవి !!
నాల్గవ రోజు
!! అల్లం గారెలు కావలసినవి !!
మినపప్పు2 కప్స్
అల్లం చిన్న ముక్క
పచ్చిమిరప కాయలు 6 సన్నగా తరిగినవి
జీరా 1/4 స్పూన్
ఉప్పు రుచికి తగినంత
కరేపాక్ , కోత్తమిర తగినంత
నూనె గారెలు వేయించేందుకు
!!! చేసే విధానం !!!
మినపప్పు బాగా కడిగి 4 , 5 , గంటలు (hours) నానపెట్టి ( లేకుంటే ముందు రోజు రాత్రి నానపెట్టుకొండి ) .
నానిన మినపప్పును గ్రైండర్లో వేసి , ఉప్పు , కాస్త సోడ , వేసి బాగా గ్రైడ్ చేసుకోండి . ఆ పిండిలో అల్లం,పచ్చిమిరప కాయలు కరివేపాకు, కోత్తమిర , సన్నగా తరిగి వేసి కాగిన నూనెలో ఈ మినపిండిని చేతిలో తీసుకొని రౌడుగా అదిమి నూనెలో విడచాలి .
దోరగా వేగిన వడలను , సహస్రనామాలతో ఆ శ్రీ లలితాదేవి కి ఆరాధించి నైవేద్యం పెట్టి
ఆశీర్వాదం పొందుదాము
5 .! సరస్వతి పూజ !!
ఐదవ రోజు
!! పెరుగన్నం , దద్ధోజనం !!కావలసినవి !!
బియ్యం 1/4 కిలో
పాలు 1/2 లీ
చిక్కటి పెరుగు 1/2 లీ
నూనె 1/2 కప్పు
నెయ్యి 1 స్పూన్
కొత్తమిర , కరివేపాకు
చిన్న అల్లం ముక్క
పచ్చిమిర్చి
పోపు సామాగ్రి
జీడిపప్పు 20
ఉప్పు , ఇంగువ ఎండుమిర్చి
!! చేసే విధానం !!
ముందు బియ్యం కడిగి అన్నం వండి , కాస్త చల్లారాక కాచినపాలు , పెరుగు , ఉప్పు , వేసి బాగా కలిపి వుంచండి,
సన్నగా తరిగిన చిల్లి , కొత్తమిర ,కోరిన అల్లం ,అన్నీరెడ్డిగ్గా వుంచుకొని ష్టవ్ పై మూకుడుంచి అందులో నునె వేసి పోపు కావలసినవన్నీ వేసిఎండుమిర్చి ఇంగువ తో పాటు తరిగి వుంచిన వన్నీ వేసి బాగా వేగనిచ్చి పెరుగులో కలిపికాస్త నేతిలో జీడి పప్పులు వేయించి అవీవేయండిరుచికరమైన దద్ధోజనం అంటే ఆ చదువుల తల్లికి అంత మక్కువ ఆ తల్లి దీవెనలతో అందరూ బాగా చదివి అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని కోరుతూ ప్రార్థించాలి.
6 !! శ్రీ మహాలక్ష్మిదేవి !!
ఆరవ రోజు
!! రవ్వ కేసరి కి కావలసినవి !!
రవ్వ 1 కప్
షుఘర్ 3/4 కప్
నెయ్యి 2 టెబల్ స్పూన్
కేసరి కలర్ / చిటికెడు.
యాలకులు 4
ఎండు ద్రాక్షా 6
జీడిపప్పు 10
మిల్క్ 1 కప్ ( మిల్క్ మేడ్ 1 )
వాటర్ 1/2 కప్
!!! చేసే విధానం !!!
ముందు మూకుడులో కాస్త నెయ్యి వేసి రవ్వ దోరగా వేయించి తీసి ప్లేట్ లోవేసివుంచండి .
మూకుడులో కాస్త నెయ్యి వేసి జీడిపప్పు , ఎండుద్రాక్షవేయించితీసివుంచండి .నీళ్ళూ ,పాలూ ,కలిపి బాగా మరగనివ్వాలి.అందులో
కేసరి కలర్ ,చెక్కర , రవ ,వేసి నెయ్యి వేస్తూ బాగాకలిపిఅందులోద్రాక్షా ,జీడిపప్పు ,మిగిలిన నెయ్యి అంతా వేసి బాగా కలిపి వేడి వేడి గా ఘుమ ఘుమగా నేతితో ఆ మహాలక్ష్మికి నైవేద్యం గా పెట్టి సౌభాగ్యం ఇవ్వమని ప్రాథించి నైవేద్యం పెట్టండి
7 .!! కదంబం ప్రసాదం !!
ఏడవ రోజు
!! కావలసినవి !!
కందిపప్పు 1/2 కప్
బియ్యం 1/2 కప్ ( కొత్తబియ్యం అయితే మరీ రుచిగా వుంటుంది )
1 వంకాయ
1/4 సొర్రకాయ
1 దోసకాయ
బీన్స్ తగినన్ని
1 పోటాటో
వేరుశెనక్కాయలు ( పీనట్ ) 2 పిడికిళ్ళు
2 మొక్కజొన్నలు
1/2 క్యారెట్
2 టోమాటో
తగినంత కరివేపాకు
కోత్తమీర
కోరిన పచ్చి కొబ్బెర 1 చిప్ప
4 పచ్చి మిర్చి
నూనె తగినంత
నెయ్యి చిన్న కప్పు
చింతపండు గొజ్జు తగినంత
కాస్త బెల్లం ( జాగిరి )
ఉప్పు , పసుపు తగినంత
3 చెంచాలు సాంబర్ పౌడర్
పోపు గింజలు ,ఎండుమిర్చి, ఇంగువ .
!!!! చేయవలసిన విధానము !!!!
ముందుగ కాయగూరలన్ని మీకు కావలసిన సైజులో తరుక్కోని వుంచుకోండి
కుక్కర్లోకందిపప్పు ,బియ్యం ,పీనట్ ,టోమాటో తప్ప అన్నీ కూరగాయలు వేసి
పసుపు , ఉప్పు ,నీళ్ళు 5 పావులు వేసి రెండు విజిల్ వచ్చాక stove off చేయండి .
మూకుడులో కొద్దిగ నూనె వేసి వేడి చేసాక అందులో కొద్దిగ ఆవాలు వేసి అవి చిట్లిన తరువాతపచ్చిమిర్చి ,కరేపాకు ,టొమాటో ,చింతపండు గొజ్జు ,సాంబర్ పౌడర్ , జాగిరి .వేసి బాగా వుడికిన తరువత ఆ గ్రేవి అంతావుడికినరైస్లోవేసి,కోత్తమీర ,కరేపాక్ ,నెయ్యి వేసిమరోసారి వుడికించండి అంతా బాగావుడికినతరువాత ,ఎండుమిర్చి ,ఇంగువతో తాలింపు పెట్టికొబ్బరి కలిపి దించండి వేడి వేడిగా దుర్గాదేవికి నెయ్యివేసి నైవేద్యం పెట్టి ఆ తల్లి దీవెనలు పొందండి
8.మహిషాసుర మర్ధిని !!
ఎనిమిదవ రోజు
!! బెల్లం అన్నం కావలసినవి !!
బియ్యం 100 గ్రాం
బెల్లం 150 గ్రాం
యాలకులు 5
నెయ్యి 50 గ్రాం
జీడిపప్పు 10
!! చేసే విధానం !!!
ముందుగా బియ్యం కడిగి అరగంట నానని వ్వండి .తరువాత మెత్తగా వుడికించాలి .
అందులో తరిగిన బెల్లం వేసిమొత్తం కరిగెంత వరకు వుడికించాలి .జీడిపప్పులు నేతిలో దోరగా వేయించి ,యాలకుల పొడి మిగితా నెయ్యి మొత్తంఅన్నంలోకలిపిదించేయడమే .
తియ్యని కమ్మని నైవేద్యం సమర్పించి కొని అమ్మ కృప కు పాత్రులవుదాము.
9. !! రాజ రాజేశ్వరి దేవి ప్రసాదం
తొమ్మిదవ రోజు
!! పరమాన్నం కావలసినవి !!
చిక్కటి పాలు 6 కప్స్ ( 1 టిన్ మిల్క్ మేడ్ ) బియ్యం 1 కప్
Sugar 1,1/2 కప్స్
ద్రాక్షా , జీడిపప్పు 1/4 కప్
ఏలకలుపౌడర్ 1/2 స్పూన్
నెయ్యి 5 టేబల్ స్పూన్స్
!! చేసే విధానం !!
ముందు దట్టమైన వెడల్పాటి పెద్ద గిన్నెలో కాస్త నెయ్యి వేసిఅందులో బియ్యం పోసి పచ్చి వాసన పోయెంత వరకు వేయించండి
తరువాత పాలు , ఏలక పౌడర్ , వేసి కుక్కర్`లో 2 విజిల్ వచ్చెంత వరకు వుంచండిఅది పక్కన పెట్టి చిన్న మూకుడు ష్టవ్ పై వుంచిఅందులో కాస్త నెయ్యి వేసి ఈ ఎండు ద్రాక్ష. ద్రాక్షా , జీడిపప్పు దోరగా వేయించి వుంచండి .చల్లారిన కుక్కర్ మూత ఓపన్ చేసి వుడికిన అన్నానికి చెక్కరవేసి
ఒక్క 5 నిముషాలు మళ్ళీ వుడికించి
( అలా వుడికి నప్పుడు బియ్యం పాలు చక్కర కలుసుకొని చిక్కగా కావాలి )
అందులో వేయించిన జీడిపప్పు అవి వేసి బాగా కలిపి కస్త నెయ్యి వేసి వేడి వేడి గా ఆ రాజ రాజేశ్వరిదేవికి నైవేద్యం పెట్టండి
10. ప్రధాన దేవత ను సర్వాభరణములతో అలంకారం.పదవ రోజుఈ తొమ్మిది రోజులూ చేసిన అన్ని ప్రసాదములను నైవేద్యముగా ఏట్టాలి .
*ఓం శ్రీ మాత్రే నమః*
🙏🔱🙏🔱🙏🔱🙏🔱🙏🔱🙏
(సేకరణ)