18, ఆగస్టు 2022, గురువారం

శ్రీ కృష్ణుడు ఎలా వచ్చాడు

 ఉడిపీకి శ్రీ కృష్ణుడు ఎలా వచ్చాడు? స్వయంగా రుక్మిణీ దేవి చేయించిన 'ఉడుపీ శ్రీ కృష్ణ విగ్రహ రహస్యం'!


🍁 శ్రీ కృష్ణుని ఆలయాలలో, నాలుగు ఆలయాలను ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇవి ఉత్తరాన ఉత్తర ప్రదేశ్ లోని మథుర, గుజరాత్ రాష్ట్రంలోని ద్వారక, దక్షిణ భారతదేశంలో కేరళలోని గురువాయూరు, కర్ణాటకలోని ఉడుపి. ద్వైత సిద్ధాంత ప్రతిపాద్యులు, త్రిమతాచార్యులలో ఒకరైన శ్రీ మధ్వాచార్యుల వారి జననం, జీవితం, ప్రసిద్ధ శ్రీ కృష్ణ క్షేత్రం, కర్ణాటకలోని ఉడుపితో ముడిపడి ఉంది. ఒక రోజు శ్రీ మధ్వాచార్యుల వారు, వేకువజామునే, సముద్ర తీరానికి వెళ్లి స్నానం చేసి, ప్రాత: సంధ్యాదికాలు ముగించుకుని, ఆ తీరంలోనే కూర్చుని, ద్వాదశ స్తోత్ర రచనను ప్రారంభించారు. తపోదీక్షతో, ద్వాదశ స్తోత్ర రచన సాగుతోంది. ఆ రోజు పర్వదినం కావడంతో, అనేక మంది ప్రజలు కూడా వచ్చి, సముద్రస్నానం చేశారు.


🍁ప్రశాంతమైన ప్రాత: కాలం, భక్తి ప్రపత్తులు ప్రసరించడానికి అనువైన సమయం. అలాంటి నేపద్యంలో, శ్రీ మధ్వాచార్యుల వారు నిరాటంకంగా, ద్వాదశ స్తోత్రంలోని అయిదు అధ్యాయాల రచన పూర్తి చేశారు. ఆరవ అధ్యాయం ప్రారంభం కాబోతున్న సమయంలో, ద్వారక నుండి సరుకులు తీసుకువస్తోన్న ఒక నౌక తీరం వెంట వెళుతుండగా, అకస్మాత్తుగా, విపరీతంగా గాలులు ప్రారంభమయ్యాయి. ఈ గాలులకు సముద్ర కెరటాలు, ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. నౌక ప్రమాదంలో చిక్కుకుంది. దానిని రక్షించుకోవడానికి, అందులోని నావికులు చేస్తోన్న ప్రయత్నాలు, ఫలించడం లేదు. క్రమంగా నౌకలోకి నీరు చేరడం ఆరంభమైంది. ఏ క్షణాన్నైనా, నౌక మునిగిపోవడానికి సిద్ధంగా ఉంది. నావికులందరూ భయాందోళనలకు గురైన సమయంలో, చివరి ప్రయత్నంగా, నౌకకు సంబంధించిన ముఖ్య వ్యాపారి ఒకతను, తీరం వైపు చూస్తూ, రక్షించేవారి కోసం ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. 


🍁అంత దూరం నుంచి కూడా, ఒడ్డున నిశ్చలంగా కూర్చొని రచన చేసుకుంటున్న శ్రీ మధ్వాచార్యుల వారు, ఆ వ్యాపారికి స్పష్టంగా గోచరించారు. ఆయననుద్దేశించి, మరింత ఆర్తితో ప్రార్థించసాగాడు. ద్వాదశ స్తోత్ర రచనలలో లీనమై ఉన్నప్పటికీ, అంతటి హోరుగాలిలోనూ అంత దూరంనుంచి వ్యాపారి చేస్తోన్న ప్రార్థన, మధ్వాచార్యుల చెవిని తాకింది. అప్రయత్నంగా అటుకేసి తల తిప్పారు. జాలి కలిగింది. వెంటనే తన ఉపవస్త్రం, ఒక కొసను పట్టుకుని గాలిలో నావ కేసి విసిరి, వెనక్కు తీసుకున్నారు. అంతే, ఆ క్షణం వరకూ సముద్రంలో మునిగిపోతుందా? అన్నట్లున్న నౌక, ఒక్కసారిగా స్థబ్దతకు వచ్చింది. ఎవరో తాళ్లు పట్టి లాగినట్లుగా, తీరానికి చేరి స్థిరంగా నిలిచింది. నావికులందరూ సురక్షితంగా ఒడ్డుకు చేరారు. అంతకు మునువు ప్రార్థన చేసిన వ్యాపారి, వడివడిగా మధ్వాచార్యుల వారిని సమీపించి, సాష్టాంగ నమస్కారం చేశాడు. అనేక విధాలుగా స్తుతించాడు. అనంతరం లేచి నిలబడి, అంజలి ఘటించి, ‘స్వామీ, నా వద్ద అమూల్యమైన వస్తువులు అనేకం ఉన్నాయి. వాటిలో మీరు కోరుకున్నది ఏదైనా సరే, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. దయచేసి కాదనకండి’. అని అనేక విధాల ప్రాధేయపడ్డాడు. 


🍁మధ్యాచార్యుల వారు చిరునవ్వు నవ్వి, చివరకి అతని కోరికను మన్నించారు. అయితే, ‘నువ్వు నాకు బహుమతిగా ఇవ్వాలనుకుంటున్న అమూల్యమైన వస్తువు, నీ నౌకలో ఉన్న రెండు గోపీ చందనపు గడ్డలు, ఈయగలవా’ అన్నారు. వ్యాపారి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే, గోపీచందనం, ద్వారకలో ఎక్కడపడితే అక్కడ దొరికే మట్టి. పడవలలో సరుకులు ఎక్కించేటప్పుడూ, దించేటప్పుడూ, బరువు సమతూకం తప్పిపోకుండా, గోపీ చందనపు గడ్డల సహాయంతో, నౌకలో సరుకును అటూ ఇటూ సర్దుతూ ఉంటారు. అలాంటి గోపీ చందనం మట్టి గడ్డలు, ఈ మహానుభావుడు కోరడం, ఆ వ్యాపారికి సుతరామూ నచ్చలేదు. ఎంత ప్రార్థించినప్పటికీ, మధ్వాచార్యుల వారు, తాను కోరిన గోపీ చందనానికి మించి, మరే బహుమతినీ తీసుకోవడానికి అంగీకరించలేదు. చివరికి ఆ వ్యాపారి, స్వామి కోరిన ఆ గోపీ చందనం గడ్డలను ఇవ్వడానికి సిద్ధపడి, అవే కోరడంలోని పరమార్థం ఏమిటో, ఆ మట్టి గడ్డల మహిమ, విశేషాలేమిటో, కనీసం అవైనా తెలుపమని, ప్రార్థించాడు. 



🍁స్వామి మళ్లీ చిరునవ్వు చిందిస్తూ, ‘నువ్వే చూడు’ అంటూ, ఆ గడ్డలను అందరూ చూస్తుండగానే, నీటితో కరిగించారు. ఆ సమయంలో, అక్కడ ఓ అద్భుతం జరిగింది. ఒక గడ్డ నుండి బలరాముని విగ్రహం, రెండవ దాని నుండి శ్రీ కృష్ణుని విగ్రహం బయటపడ్డాయి. అక్కడున్నవారందరూ, సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయారు. శ్రీ కృష్ణ విగ్రహ దర్శనం జరిగిన వెంటనే, మధ్వాచార్యులు, ద్వాదశ స్తోత్రంలోని ఆరవ అధ్యాయంలో, దశావతారాన్ని వర్ణించారు. బలరాముని విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించి, శ్రీ కృష్ణుని విగ్రహం తీసుకుని, ఉడుపీకి ప్రయాణమయ్యారు. శ్రీకృష్ణ ప్రాప్తి తరువాత, ద్వాదశ స్తోత్రాన్ని పరిసమాప్తి చేశారు. అందుకే, ద్వాదశ స్తోత్రం అత్యంత పవిత్రమైనది. అమృతరూపమైనటువంటి శ్రీ కృష్ణుని ఆగమనానికి కారణమైంది. అది విషాహార స్తోత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఇంతకీ శ్రీ కృష్ణుని విగ్రహ రహస్యం ఏంటి? వాస్తవానికి జరిగిందేంటి? అనే కథ మరింత ఆసక్తికరంగా ఉంటుంది. 


🍁ఆ శ్రీకృష్ణుని విగ్రహం, సామాన్యమైనదికాదు. ఒకసారి దేవకీదేవి, ‘కృష్ణా.. నీ బాల్య లీలలు చూసే భాగ్యం, యశోదకు కలిగినట్లు నాకు కలుగలేదు. వాటి గురించి వినీ, వినీ, ఎప్పటికైనా చూడాలని, నా మనస్సు ఉవ్విళూరుతోంది. చూపించవా కృష్ణా’ అని ప్రార్థించింది. కృష్ణుడు అనుగ్రహించాడు. మరుక్షణంలో శైశవ దశలో కృష్ణుడిగా మారిపోయాడు. తప్పటగులు వేస్తూ నడిచాడు. దేవకీ దేవి ఒడిలో కూర్చున్నాడు. ఆమె స్తన్యాన్ని త్రాగాడు. కేరింతలు కొట్టాడు. కుండ పగులగొట్టి వెన్న తిన్నాడు. ఒంటినిండా రాసుకున్నాడు. పామును తాడులాగా పట్టుకుని, మజ్జిగ చిలికినట్లు నృత్యం చేశాడు. మరీ ముఖ్యంగా, తనతో పాటు అన్న బలరాముణ్ణి కూడా చూపించాడు. ఈ చేష్టలను చూసి దేవకీ దేవి పరవశించి, మైమరచిపోగా, ఇదంతా గమనిస్తున్న రుక్మిణీ, తన పతి దేవుని శైశవ రూపాన్ని, ప్రపంచమంతా చూసి తరించాలని భావించి, వెంటనే విశ్వకర్మను పిలిపించి, ఆయా రూపాల్లో, శైశవ కృష్ణుడూ, బలరాముని విగ్రహాలను చేయించింది.


🍁ముందుగా తానే, సకల వైభవాలతో, విగ్రహాలను స్వయంగా పూజించింది. కృష్ణావతారం ముగిసింది. మరికొంత కాలానికి, ద్వారక సముద్రంలో మునిగిపోయే సమయం, ఆసన్నమైంది. దూరదృష్టితో అర్జునుడు, ఆ విగ్రహాలను తీసుకువెళ్లి, ఒక ప్రదేశంలో ప్రతిష్ఠించి, దానికి రుక్మిణీ వనం అని నామకరణం చేశాడు. కాలక్రమంలో, ఆ వనం యావత్తూ, గోపీ చందనం మట్టిలో కలిసి, కనుమరుగైపోయింది. నావికులు తమ నౌకల్లో, సమతూకాన్ని పాటించడం కోసం, గోపీ చందనం గడ్డల్ని మోసుకెళ్లే అలవాటు ప్రకారం, కాకతాళీయంగా, ఈ విగ్రహాలున్న గోపీ చందనం గడ్డల్ని కూడా, నౌకలోకి చేర్చారు. వాటి విలువ తెలియకుండానే, వాటిని తీసుకెళ్లే భాగ్యం, ఆ వ్యాపారికి లభించింది. ఆ విగ్రహం, ఆ నౌకలో వస్తోందని మధ్వాచార్యులవారి దివ్య దృష్టికి ముందే తెలుసు. ద్వాదశ స్తోత్రాన్ని రచిస్తూ, ఆ విగ్రహాలను ఆహ్వానించడానికే, ఆయన ఆరోజు, ఆ తీరానికి వెళ్లారు. శ్రీ కృష్ణుని ప్రతిమను మధ్వాచార్యులు, తమ శిష్యుల చేత, మాధవ సరోవరంలో, ప్రక్షాళన చేయించారు. తరువాత తానే స్వయంగా అభిషేకించారు. ఈ అభిషేకానికి మునుపు, నలుగురు శిష్యులు సునాయాసంగా ఎత్తిన ఆ విగ్రహం, మధ్వాచార్యుల వారు అభిషేకించిన తరువాత, 30 మంది కలిసినా ఎత్తడం సాధ్యం కాలేదు. ఎందుకంటే, మధ్వాచార్యుల అభిషేకంతో, ఆ విగ్రహంలో, శ్రీ కృష్ణుని దివ్య శక్తి పరిపూర్ణంగా ఏర్పడింది. 


🍁మంత్ర విధులతో, మధ్వాచార్యులు అత్యంత శాస్త్రోకంగా, శ్రీ కృష్ణ విగ్రహాన్ని, విళంబి నామ సంవత్సరం, మాఘ శుక్ల తదియ నాడు, సామాన్య శకం, 1236 వ సంవత్సరంలో, ఉడుపిలో ప్రతిష్ఠింపజేశారు. ఆనాటి నుంచి, ఉడుపి ప్రాంత యాజ్ఞికులందరూ, శ్రీ మధ్వాచార్యులవారు అవలంభించిన విధానాలనే, అనుసరిస్తున్నారు. శ్రీ కృష్ణ మఠంగా పిలువబడే ఈ దేవాలయానికి అనుబంధంగా, తన 8 మంది శిష్యులచే నిర్వహింపబడేటట్లుగా, పెజావరు మఠం, పుట్టిగే, పాలిమరు, ఆడమారు, సోదే, కాణియూరు, శిరూరు, కృష్ణ పురా అనే ఎనిమిది మఠాలను, శ్రీ మధ్వాచార్యులు ఏర్పరచారు. వీటిని అష్టపీఠాలు అంటారు. ఇవన్నీ, ఉడుపి కేంద్రంగా, శ్రీ కృష్ణ మఠానికి చుట్టు ప్రక్కల ఉన్నాయి.

కొంగుబంగారం

 పూర్వం హిమాలయ పర్వతాల్లో ఒక చక్రవాకపక్షి ఉండేది. అది ప్రతిరోజూ ఉదయాన్నే ఆహారం కోసం తన నివాసాన్ని వదిలి ఆకాశమార్గాన అలా అలా పయనిస్తూ ఎన్నెన్నో దేశాలను దాటుకుంటూ కాశీ నగరానికి వచ్చి చేరేది.

అంత దూరం ప్రయాణించి మిట్టమధ్యాహ్న సమయానికి ఆ చక్రవాక పక్షి కాశీలోని అన్నపూర్ణాదేవి మందిరానికి చేరేసరికి దానికి ఆకలి వేస్తుండేది.

ఆ ఆకలి తీర్చుకోవటం కోసం అన్నపూర్ణాదేవి మందిరం చుట్టూ పడిఉన్న మెతుకులను ఏరుకొని తింటూ పొట్ట నింపుకొనేది.

ఇలా మెతుకులను ఏరి తినేందుకు దానికి తెలియకుండానే అది గుడి చుట్టూ ప్రదక్షిణ చేసేది.

అలా చాలాకాలం గడిచింది. కాలాంతరంలో ఆ చక్రవాక పక్షి ఆయువు తీరి మరణించింది.

ఇతర పక్షులలాగా మరణానంతరం కూడా నరకయాతనలేవీ పడకుండా నేరుగా స్వర్గానికి చేరుకుంది.

రెండు కల్పాలపాటు స్వర్గంలో ఆ పక్షి భోగాలను అనుభవించింది.

ఆ తర్వాత భూలోకంలో ఓ రాజుగారి ఇంట మగశిశువుగా ఆ చక్రవాక పక్షి జన్మించింది.

పెద్దలు ఆ శిశువుకు బృహద్రథుడు అని పేరు పెట్టారు.

పెరిగి పెద్దయిన రాకుమారుడికి పెద్ద రాజు రాజ్యాభిషేకం కూడా చేశాడు. బృహద్రథుడికి త్రికాలజ్ఞత ఉండేది. భూత, భవిష్యత్తు వర్తమానాలు ఆయన కళ్లెదుట ఎప్పుడూ కనిపిస్తుండేవి. బృహద్రథుడు ప్రజారంజకమైన పరిపాలకుడుగా పేరు తెచ్చుకొన్నాడు. యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉత్తముడిగా పెద్దలందరి చేత ప్రశంసలందుకున్నాడు.

వీటన్నిటితోపాటు బృహద్రథుడికి పూర్వజన్మ జ్ఞాపకాలు ఉండేవి. అతడి త్రికాలజ్ఞత, పూర్వజన్మ స్మృతి లాంటివి ఆనాడు ఆనోటా ఆనోటా ప్రజల అందరికీ చేరాయి.

గొప్ప గొప్ప మునులు సైతం ఆ రాజు మహత్తర శక్తికి ఆశ్చర్యపోతూ అంతటిశక్తి ఆయనకు ఎలా కలిగిందో తెలుసుకోవాలని ఉత్సాహపడుతుండేవారు. అలాంటి మునులలో కొందరు పెద్దవారు ధైర్యం చేసి ఒక రోజు రాజు దగ్గరకు బయలుదేరారు. మునులందరి రాకను గమనించిన బృహద్రథుడు తాను రాజునన్న అహంకారభావాన్ని కొంచమైనా మనసులో పెట్టుకోక ఆ మునులకు ఎదురు వెళ్లి నమస్కరించి, పూజించి, అతిథి సత్కారాలను చేసి, ఉచితాసనాలను సమర్పించి సత్కరించాడు.

యోగక్షేమపరామర్శలు అయ్యాక మునులు బృహద్రథుడికి త్రికాలజ్ఞత, పూర్వజన్మ స్మృతి ఎలా కలిగాయో చెప్పమని అడిగారు.

ప్రదక్షిణ ఫలితమే

అప్పుడు బృహద్రథుడు ఎంతో వినయంగా, అందులో పెద్ద రహస్యమేమీ లేదని, తాను ఆ శక్తుల సాధనకోసం ప్రత్యేకించి చేసిన యజ్ఞయాగాలు, క్రతువులు కూడా ఏవీ లేవన్నాడు. ఆ మాటకు మునులకు ఆశ్చర్యం కలిగింది. వారి ఆశ్చర్యాన్ని గమనించి బృహద్రథుడు మళ్లీ చెప్పసాగాడు.

గత జన్మలో తాను ఒక చక్రవాక పక్షినని ఆహారాన్వేషణలో తనకు తెలియకుండానే కాశీ మహానగరంలో ఉన్న అన్నపూర్ణాదేవి మందిరానికి ప్రదక్షిణం చేశానని చెప్పాడు. ఆ ఫలితమే తనకు ఎంతో పుణ్యాన్ని చేకూర్చి పెట్టి రెండు కల్పాలపాటు స్వర్గ సుఖాలను ఇచ్చి ఈ జన్మలో మహారాజయోగాన్ని కూడా కలగజేసిందన్నాడు. తనకు లభించిన శక్తులు, భోగాలు అన్నీ కాశీ అన్నపూర్ణాదేవి మందిరానికి చేసిన ప్రదక్షిణల ఫలితమేనని, జగదాంబ అయిన ఆ అన్నపూర్ణాదేవికి అంతటి మాహాత్మ్యం ఉందని బృహద్రథుడు చెప్పాడు. కాశీ అన్నపూర్ణావిశ్వేశ్వర స్వామి ఆలయ దర్శనం, ప్రదక్షిణ నమస్కారాలు ఎంతో విలువైనవి.

కాశి నగరంలోని అన్నపూర్ణాదేవి గుడి చుట్టూ చేసిన ప్రదక్షిణల ప్రభావం ఎంత గొప్పదో ఈ కథ సూచిస్తుంది.

కాశీ వెళ్లినప్పుడు తప్పకుండా విశ్వనాథ,అన్నపూర్ణ

మందిర ప్రదక్షిణం చేయండి.

కాశీ మహానగరం ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం. కాశీలో మరణించిన కుక్క కూడా స్వర్గానికే వెళుతుందన్నది నమ్మకం.

కాశీ మహానగరంలో ఉండే అన్నపూర్ణమ్మ తల్లి, విశ్వేశ్వరుడు నమ్మిన భక్తులకు కొంగుబంగారం లాంటివారు..


సేకరణ 🙏🏻

ఆప్యాయంగా పలకరించే వారు

 🌳విలువలతో కూడిన కథ 🌳


~~~~~~~~~~~~~



వెంకట్ ఒక గవర్నమెంట్ బ్యాంకులో పనిచేస్తున్నాడు...


రోజూ బైక్ లో ఆఫీసుకి వెళ్లడం, సాయంత్రం ఆఫీసు నుంచి నేరుగా ఇంటికి రావడం...


సిటీకి కొత్తగా రావడం వలన


ఆప్యాయంగా పలకరించే వారు ఎవరూ లేరు తనకు, డ్యూటీ తరువాత తన భార్యతో కలిసి కాసేపు అలా అలా తిరిగి రావడం అంతే...


హడావుడిగా పరుగులు తీసే జనాలు


ఎవరి అవసరం వారిది, ఎవరి పనులు వారివి. ఒక్కరికీ ఆగి ఆప్యాయంగా పలకరించే సమయం లేదు.


సిటీ కదా... ఇంతేనేమో అనుకుంటూ రొటీన్ గా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు.


రోజులను బిజీగా గడిపేస్తున్నాడే గానీ, జీవితంలో ఏదో తెలియని వెలితి.


బహుశా ఆ వెలితి అందరిలోనూ ఉందనుకుంటా, కానీ పైకి కనబడకుండా లేని పనిని కల్పించుకుని బిజీగా ఉన్నట్టు నటిస్తూ


వాస్తవానికి దూరంగా పారిపోతున్నట్టున్నారు...



ఒకరోజు సాయంత్రం డ్యూటీ ముగించుకుని ఇంటికి వస్తూ, యధాలాపంగా రోడ్డు పక్కన కూర్చున్న ఒక ముసలావిడను చూసాడు. ముందు చిన్న బుట్ట పెట్టుకుని ఏదో అమ్ముతోంది. దగ్గరకు వెళ్ళి చూసాడు...


బుట్టలో సపోటా పండ్లు పెట్టి అమ్ముతోంది. బాగా వయసు మళ్ళిన వృద్ధురాలు, ఈ వయసులో కూడా ఎంత కష్టపడుతోంది అనిపించింది వెంకట్ కి. కానీ ఒక్కరూ ఆవిడ దగ్గర ఆగి పండ్లను కొనడం లేదు, అసలు అక్కడ ఒక మనిషి కూర్చుని ఉందన్న విషయం కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు. చాలా బాధ కలిగింది తనకు,బండి ఒక ప్రక్కగా ఆపి ఆమె దగ్గరకు వెళ్ళాడు.


"ఎలా అమ్మా సపోటాలు, కిలో ఎలా ఇస్తున్నావ్" అనడిగాడు.


ఆమె రేటు చెప్పింది...


సరే ఒక కిలో ఇవ్వు అన్నాడు.


ఆమె ఒక కిలో తూచి సంచిలో వేసి ఇచ్చింది.


సంచిలోనుంచి ఒక పండు తీసి తిని, "ఏంటమ్మా అస్సలు తియ్యగా లేవు పండ్లు" అంటూ ఇంకో పండు సంచిలోనుంచి తీసి ఆమెకిచ్చాడు. ఆమె ఆ పండు తిని" అదేంటి నాయనా... పండు తియ్యగానే ఉంది కదా" అంది.


సరేలే అంటూ డబ్బులిచ్చి ఇంటికి బయలుదేరాడు.


ఆరోజు మొదలు ప్రతీరోజూ


ఆమె దగ్గర ఆగడం, ఒక కిలో సపోటాలు కొనడం, సంచిలోనుంచి ఒక పండు తీసుకుని తిని రుచిగా లేదు అని చెప్పడం, కావాలంటే నువ్వే చూడు అని ఆమెకు ఒక పండు ఇవ్వడం, ఆమె తిని బావుంది కదా అంటే డబ్బులు ఇచ్చి ఇంటికి వెళ్లడం - దినచర్య అయిపోయింది వెంకట్ కి.


ఒకరోజు తన భార్యతో కలిసి వెళుతూ ఆగాడు ఆమె దగ్గర...


ఎప్పటిలానే కిలో పండ్లు తీసుకున్నాడు. సంచిలోనుంచి ఒక పండు తీసుకుని తిని, పండ్లు తియ్యగా లేవని చెప్పి తన సంచిలోనుంచి ఒక పండు తీసి ఆమెకిచ్చాడు. ఆమె పండు తిని తియ్యగానే ఉన్నాయి కదా నాయనా అని చెప్పగానే డబ్బులిచ్చి బయలుదేరాడు. ఇదంతా చూసిన వెంకట్ భార్యకు కోపం వచ్చింది.


ఇంటికి వెళ్లాక


"రోజూ నువ్వు తీసుకుని వచ్చే పండ్లు చాలా తియ్యగా ఉంటాయి, ఎందుకని ఆవిడకు అబద్ధం చెప్పి బాధపెట్టావ్... పాపం కదా అసలే పెద్దావిడ" అనడిగింది.


వెంకట్ చిరునవ్వు నవ్వి


"ఆమె దగ్గర పండ్లు తియ్యగానే ఉంటాయని నాకూ తెలుసు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆవిడ ఆ పండ్లన్నింటినీ అమ్మడానికి కూర్చుంటుందే కానీ, ఒక్క పండు కూడా ఆమె తినదు. అలా అని నేను కొన్న పండ్లు ఆమెకు తినడానికి ఇస్తే ఆమె తీసుకోకపోవచ్చు. అందుకే అలా అబద్ధం చెప్పి, రోజూ ఆమె తినడానికి ఒక పండు ఇస్తున్నా"అని అసలు విషయం చెప్పాడు...



వెంకట్ తన భార్యతో కలిసి వెళ్లిపోగానే


వృద్ధురాలికి కొంచెం దూరంలో కూరగాయలు అమ్మే ఒకామె వృద్ధురాలి దగ్గరకు వచ్చి


" రోజూ చూస్తున్నాను... ఆ అబ్బాయి వస్తాడు, పండ్లు కొంటాడు. బాగాలేదని మొహం మీదే చెబుతాడు. అయినా కూడా రోజూ నువ్వు ఒక పండు ఎక్కువ తూయడం నేను చూస్తూనే ఉన్నా. అటువంటి వాడికి రోజూ ఒక పండు ఎందుకు ఎక్కువిస్తున్నావ్" అని అడిగింది.


వృద్ధురాలు చిన్నగా నవ్వి చెప్పింది


"పిచ్చిదానా... నేను తీసుకొచ్చే పండ్లన్నీ తియ్యగానే ఉంటాయని నాకు తెలుసు, అయినా తియ్యగా లేవని అబద్ధం చెప్పి కావాలనే రోజూ ఒక పండు నాచేత తినిపిస్తున్నాడు. ఆ అబ్బాయి చూపిస్తున్న ప్రేమకు ఆప్యాయతకు తెలియకుండానే ఒక పండు దానంతటదే ఎక్కువ తూగుతోంది" అని.



నిజంగా ఇలాంటి చిన్న చిన్న విషయాలలో ఎంతో ఆనందం దాగుంటుంది కదా. అన్ని ఆనందాలనూ డబ్బుతో కొనలేం, ఎదుటివారి పట్ల ప్రేమ ఆప్యాయతలే జీవితంలో నిజమైన తియ్యదనాన్ని నింపగలవు. మనిషికి ఉండవలసిన ఉదార స్వభావం కనుమరుగైపోతోంది. ఇవ్వడంలో ఉన్న ఆనందం, తీసుకోవడంలో దొరకదు.


ఆనందం పంచితే పెరుగుతుందే గానీ తగ్గదు.



అన్నీ ఉన్నా కూడా


ఈరోజుల్లో ఆప్యాయంగా పలకరించే వారు లేకుండా పోతున్నారు. ఆప్యాయంగా పలకరించడానికి ఎదుటివారితో మనకు బంధుత్వమే ఉండనవసరం లేదు, అందరూ ఆప్తులే అని చెప్పడం కోసమే ఈ చిన్న కధ.


🙏🙏🙏

జీవితం ఎప్పుడు అందమైంది

 🔥🔥🔥💥💥👑👑🥲🥲👩‍🦰👩‍🦰👳‍♀️👳‍♀️💐

     

రావు ఒక వాట్సాప్ గ్రూపులో సభ్యుడు. ఆ గ్రూపులో ఎవరు మెసేజస్ పెట్టినా ఖచ్చితంగా చదివి చక్కగా స్పందించి మంచి రిప్లై కామెంట్స్ పెడుతూంటారు. అలాంటి ---రావు గారు ఒకరోజు హఠాత్తుగా గ్రూపు నుండి లెఫ్ట్ అయ్యారు. అంతేగాక స్నేహితులతో అప్పుడప్పడూ సరదాగా కలవడానికి కూడా రావటం లేదు..


కొన్ని వారాలయ్యాక ఒకరోజు సాయంత్రం గ్రూప్ అడ్మిన్ .. లెఫ్ట్ అయిన రావు గారి ఇంటికి వెళ్ళేసరికి, ....

బాగా చలిగా ఉండటం వలన కొన్ని కర్ర దుంగలను కాల్చి ఆ మంట పక్కన చలి కాగుతూ ఒంటరిగా కూర్చున్నాడు రావు గారు.


అడ్మిన్ ను చూసి విష్ చేసి, మరేమీ మాట్లాడకుండా మిన్నకుండి పోయాడు...


 ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలింది.. కాలుతూ 

నాట్యం చేస్తున్న జ్వాలను చూస్తున్నారు... ఇద్దరూ..

 

మధ్యలో అడ్మిన్ లేచి బాగా కాలుతున్న కర్ర దుంగను పక్కకు లాగేసి మరల కుర్చీలో కూర్చున్నాడు.. 

జరిగే దానినంతా నిశితంగా చూస్తున్నాడు ---రావు 


అలా బాగా కాలుతున్నప్పుడు పక్కకు లాగిన ఆ ఒంటరి దుంగ, క్రమేపీ మంట ఆరి చల్లబడి నల్లని బొగ్గుగా మారింది...


 తిరిగి చచ్చుబడి, చల్లబడిన దుంగను కాలుతున్న మంటల్లో వేసాడు అడ్మిన్.

అది తిరిగి కాలుతున్న దుంగలతో కలసి మండి వేడిని కాంతిని ఇచ్చింది. 

*అడ్మిన్ తిరిగి వెళ్ళడానికి కుర్చీలోంచి లేచాడు... అప్పుడు ---రావు అతని దగ్గరకు వెళ్ళి, "ఇంటికి వచ్చి  నందుకు, మనసుకు హత్తుకునే పాఠం చెప్పినందుకు ధాంక్యూ.రేపటి నుండి మన మీటింగులకు వస్తాను. తిరిగి మన వాట్సాప్ గ్రూపులో నన్ను ఏడ్ చెయ్ అన్నాడు..* 


అసలు వాట్సాప్ గ్రూపు ఎందుకంటే ప్రతి మెంబరు మిగిలినవారి  నుండి జ్వాల, వేడిని ( fire & heat ) పొంది ఉత్తేజాన్ని పొందటానికి.. గ్రూపులోని వారందరూ వేడి తగ్గకుండా ఏక్టివ్ గా  ఉండాలి.. గ్రూపనేది ఒక కుటుంబం. ఏదో ఒక సమయంలో కొన్ని msgs, మాటల యుద్ధాలు, అపార్థాలు గ్రూపు సభ్యుల్ని బాధ పెట్టొచ్చు... గ్రూపనేది మనం కలవడానికి, ఆలోచనలు పంచుకోడానికి, మనం ఒంటరివాళ్ళం కాదని చెప్పడానికి...


*జీవితం నిజంగా ఎప్పుడు అందమైందని అనిపిస్తుందో తెలుసా! కుటుంబ సభ్యులు, మరియు స్నేహితులతో ఆత్మీయతతో కలిసి ఉన్నప్పుడు... ఇంకా మనలో హుషారు జ్వాలలు రగిలిస్తూ... స్నేహితులు, బంధువులూ.. అందరూ ఒకే కుటుంబంలా కలసి ఒకే గ్రూపులో అందరూ తమతమ అనుభవాలు, అభిప్రాయాలు పంచుకుంటూ  ఉన్నప్పుడే!.... అందుకే అలాంటి గ్రూపు క్రియేటర్ కు, గ్రూపు సభ్యులకు థ్యాంక్స్ చెబుదాం!*

 *(సేకరణ :Face Book నుండి)*



17, ఆగస్టు 2022, బుధవారం

రామ రామ రామేతి

 🙏🌺శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే

  సహస్రనామ తత్తుల్యమ్ రామనామ వరాననే🌺🙏


 🌺"శ్రీరాముడు" ఎక్కడుంటారు అని చెప్తారో తెలుసా శాస్త్రంలో...

"రామచంద్రమూర్తి"ని నమ్ముకొని బ్రతుకుతున్నవాడు ఎక్కడ ఉంటాడో...రాముడు అక్కడే ఉంటాడు. 

ప్రక్కనే ఉంటాడుట ధనుర్ధరుడై. 

ఆయన కూర్చుంటే కూర్చుంటాడు...

నిలుచుంటే నిల్చుంటాడు...

ఆయన వెడుతూంటే వెళతాడు. ఆయన పడుకుంటే గుమ్మం ముందు కూర్చుంటాడట.

ఎందుకంటే... ఆయనకి ఇబ్బంది ఎవరైనా కల్పిస్తారేమో అని.🌺

🌺రామచంద్రమూర్తి తనను నమ్మిన వాళ్ళను రక్షించడానికి గడప ముందుకొచ్చి కూర్చుంటాడు.

అందుకే రాముణ్ణి నమ్ముకున్న రామ భక్తులు ఎక్కడ ఉంటారో... అక్కడే "సీతారామలక్ష్మణులు" "హనుమ"  కూడా ఉంటారు. 

ఇది "తులసీదాసు" గారి జీవితంలో నిజమైంది. ఆయన "రామ"దర్శనం అవ్వాలి అనుకుంటూ పడుకుంటే... 

ఒక దొంగ వచ్చి లోపలికి వెళ్ళి... దొరికినవి మూట కట్టుకొని... బయటకు వద్దాం అనుకున్నాడు. 

తల బైటపెట్టాడు.

"రామలక్ష్మణులు" ఇద్దరూ కోదండాలు పట్టుకొని నిల్చొని ఉన్నారు.

నన్ను నమ్ముకున్న వాడి సొత్తు ఎత్తుకు పోతావా నువ్వు అని. 

ఆయన వాళ్ళు వెళ్ళిపోతారు కదా అని వెనక్కి వచ్చాడు. 

తెల్లవారే వరకు తల బైటపెడుతున్నాడు... 

లోపల పెడుతున్నాడు.

రామలక్ష్మణులు ఇద్దరూ అలాగే ఉన్నారు. తెల్లవారింది. తులసీ దాసు గారు నిద్రలేచారు. 

దొంగ మూట కట్టుకొని కూర్చుని ఉన్నాడు. 

నువ్వు ఏంటి ఇక్కడ కూర్చున్నావు? అని అడిగారు. బుద్ధి గడ్డితిని దొంగతనానికి వచ్చాం అన్నాడు.

పట్టుకెళ్ళపోయావా? అన్నారు. 

తీసుకు వెళదామని బయటికి వెళ్తే... ఎవరో ఇద్దరు ఉన్నారు. 🌺

🌺ఒకాయన నల్లగా మేఘంలా ఉన్నాడు. 

ఒకాయన ఎర్రగా ఉన్నాడు. 

కోదండాలు పట్టుకొని నిల్చున్నారు. హడలి లోపలికి వచ్చి కూర్చున్నాం అన్నారు. 

ఆయన అప్పుడు బయటికి వెళ్ళి చూశారు. 

"స్వామీ నా పర్ణశాల ముందు కాపలా ఉన్నావా? మీరెంత ధన్యులురా...

ఇన్నిమార్లు దర్శనం పొందారు, నాకు అవలేదు అని ఏడ్చారు. 

ఎవరు రాముణ్ణి నమ్మారో... వారున్నచోట రాముడు ఉంటారు తప్ప... ఇంకొక చోట రాముడు ఉంటారు అనుకోకండి. రామభక్తులు ఎక్కడ ఉంటారో... అక్కడే సీతారాములుంటారు.


కష్టాలను గట్టెక్కించే కరుణామూర్తి...

మనకు వచ్చిన ఆపదలను తొలగించి శాంతిని సుఖాన్ని ప్రసాదించే పరంధాముడు ఆ శ్రీరాముడు. 

సుఖ, శాంతులు, ఆయురారోగ్యాలే కదా ఆయన మనకిచ్చే సంపదలు. 🌺


🌺ఆపత్కాలంలో ఈ శ్లోకాన్ని జపిస్తే అన్ని బాధలు తొలగిపోతాయి.

అటువంటి మహిమాన్వితుడైన సుందర రాముని ఎల్లప్పుడూ తలచుకుందాం.

అదే ఈ శ్రీ రామ శ్లోకం...

ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం.

లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం.🌺

ధర్మాకృతి

 ధర్మాకృతి : శ్రీమఠం ఖైదు అయిన కథ -4


సరి! నిర్బందింపబడి తంజావూరునకు కొనిపోబడిన అనంతరం శ్రీమఠానికి కోలాహలమయిన రాజోపచారం జరగానారంభించింది. వెన్నట్రంగరై సత్రం మొదలయిన పెద్ద సత్రములు శ్రీమఠ నివాసార్ధం ఏర్పాటు చేయబడినవి. ఒక్కో సత్రంలోనూ గుండోదరుని కథలో సుందరేశ్వరుడు సృష్టి చేసిన మాదిరి భక్షణాల గుట్టలు అన్న పర్వతాలు అమర్చబడినాయి. విడవకుండా ఒకదాని తరువాయిగా ఇంకొకటిగా ఈ మర్యాద లేమి? అది అలా ఉండనీయండి. భక్తితో ఆహ్వానించకుండా ఈ మొరటు నిర్బంధ భక్తి ఏమి? అంతా చంద్రమౌళీశ్వరుని పనే!


ద్వితీయునితో శ్రీమఠాన్ని ఆహ్వానించడానికి సావకాశం లేదని త్రిప్పి పంపిన రాత్రి రాజావారికి కలవచ్చింది. స్వామివారికి కామాక్షీదేవి స్వప్నంలో సాక్షాత్కరించి జీర్ణోద్ధరణ కుంభాభిషేకాదులకు ఆనతి నిచ్చిన రీతి రాజావారి కలలో చంద్రమౌళీశ్వరుడు దర్శనమిచ్చి, తాను వసించియున్న మఠమునకూ, తదాచార్య స్వామికీ ఉపచారమొనరింప వలసినదిగా ఆదేశించినారు. అవిధేయుడైన పుత్రునిపై తండ్రికి అతి ప్రేమ ఉండే విధాన రాజావారు కుదరదని తిరస్కరించిన డానికి బహుమానంగా చంద్రమౌళీశ్వరుడే సాక్షాత్కరించారు. అందువలననే వారికంత ఆనందమూ, సంభ్రమమూనూ.


మరి ఈ రాక్షస భక్తో! కొంచెం నాళ్ళ ముందుగానే కదా శ్రీమఠ నిర్వహణాధికారిణి ముఖం మీద కుదరదని చెప్పి, త్రిప్పి పంపివేశారు. రాజ సింహాసనానికి పైనది ఈ ఆది శంకరుల ధర్మాసనం. ఇప్పుడు వచ్చి ఆహ్వానిస్తే నీవు ఆడిన ఆటకల్లా మేము తాళమేస్తామా అని శ్రీమఠమనవచ్చు. వైయక్తికంగా స్వామి మానాభిమానములకు అతీతులయి ఉండవచ్చు. కీడు చేసిన వారిని కూడా మనఃపూర్వకముగా ఆశీర్వదించే వారుగా ఉండవచ్చు. అయితే పీఠగౌరవ విషయంలో కొంచెం అయినా బిగువు సడలించరు కదా! ఇదంతా రాజు ఆస్థాన పురోహితులతో, విద్వాంసులతో ఆలోచించే ఈ అసుర భక్తి ప్రదర్శించారు. అయినా ఇదంతా మనకీ స్వారస్యమైన కథ ప్రసాదించడానికే కావచ్చు.


చంద్రమౌళీశ్వరుడు మంచి లాభం సంపాదించుకొన్నాడు. శివాజీ రాజా చంద్రమౌళీశ్వర పూజార్థం అనేక పాత్రలు, నవరత్న ఖచిత పాత్రలు, బంగారు కవచం తొడిగిన దక్షిణావర్త శంఖం సమర్పించారు. శ్రీవారిని ఎంతో వైభవంగా ఊరేగించారు. జోడు ఏనుగుల వెనుక పెద్ద వెండి అంబారీ కట్టి దానిపై ఊరేగవలెనని స్వామివారిని ప్రార్థించారు. ఇప్పుడు శ్రీమఠంలో పూజకోసం ఉపయోగించే వెండి రథానికి నాలుగింట మూడు వంతులుంటుందిట. ఈ అంబారీ ఎనిమిది కాళ్ళతో అష్టకోణంగా ఉండేదట. స్వామివారు పైకి ఎక్కడానికి అంబారీ కాళ్ళు అవరోధంగా ఉన్నవనీ, అంబారీ కొంచెం వంచితే అనుకూలంగా ఉంటుందనీ గ్రహించారు రాజా గారు. వెంటనే స్వయంగా నిచ్చెనలాంటి వేమి లేకుండానే ఒకే గంతులో ఏనుగునెక్కి అంబారీ గోపురాన్ని ఒక చేత్తో త్రోసిపెట్టి భుజం అంబారీ పీఠం క్రింద మోపి పెట్టి స్వామివారి ఆరోహణకు సౌకర్యం చేసి, ముగిసిన వెంటనే చెంగున క్రిందికి దుమికారట రాజుగారు. రాజ మర్యాదానుసారం అంబారీ ప్రక్క రక్షక స్థానంలో రాజుగారి ఒకే కూతురి భర్త అయిన సహారాం సాహెబు కూర్చుని ఉన్నారు. 


ఆ వెనుక ఇదే మాదిరి అంబారీ కట్టబడిన ఏనుగుల జోడి ఉన్నది. అందులో అంబారీ ముందు ప్రక్క రాజావారు కూర్చుని ఉన్నారు. అది రాచమర్యాద. అది విశేషం కాదు. వెనుక ప్రక్క పరమ మర్యాద సూచకమయిన రక్షక స్థానంతో ఎవరు కూర్చున్నారు అన్నదే విశేషం. పూర్వం ముఖంపై కొట్టి పంపటమే తరువాయిగా చేసి త్రిప్పి పంపబడిన ద్వితీయులు! పూర్వం దక్కవలసిన మర్యాద వడ్డీతో సహా తీర్చుతున్నట్లు రాజావారు తమ ప్రక్క కూర్చుండ పెట్టుకొని ఊరంతా చూసి గౌరవించారు.


ద్వితీయునిది లజ్జా స్వభావం. అది తెలిసిన రాజాగారు ఎవరూ చూడకుండా అంబారీలో ఊరేగే సమయంలో దోసిలి నిండా స్వర్ణ పుష్పాలు గ్రహించి ఈ ద్వితీయునకు బహుకరించారు. ఆ పరమ వైభవంలో అవి తమంతట తామే మూటకట్టుకోవడం లేకిగా అనుచితంగా ఉంటుందని భావించిన వీరు, క్రిందనున్న గుంపులో, తనకు బాగా కావలసిన వృద్ధుని చేతిలో పోశారు. ఆయన ఆ మూటతో పలాయనం చిత్తగించారు. దానిని సరుకు చేయలేదీయన. ఆత్మార్థంగా తాను గురువులకు చేసే కైంకర్యమునకు గురు కటాక్షరూపంగానే ప్రతిఫలం ఉండాలి గానీ, ధనరూపముగా కాదని భావించారు. ఊరందరికీ తెలిపేటట్లు రాజుగారు ఇంకో మర్యాద చేశారు. వారికి ‘హేజీబ్’ అనబడే గౌరవ పదవి ఇచ్చారు. పరమ ప్రతిష్ఠాకరమైన సంస్థకు ప్రతినిధులుగా ఉన్నవారు రాజ్యాంగంతో నేరుగా వ్యవహరించడానికుద్దేశించినది ఈ పదవి. రాజు వీరికి స్వర్ణ పుష్పములకు బహుకరించినది గుంపులో ఎవరికీ తెలియదు. వారంతా స్వామివారి ఊరేగింపు సంరంభం, తమ రాజా వారితో వెళ్ళే ఆయన గొప్పదనం తెలుసుకొని శ్లాఘించడంతో పూర్తిగా నిమగ్నమయి ఉన్నందున అది గ్రహించే అవకాశం లేకపోయింది.


ఆ సంరంభంలో అఖిలాండేశ్వరీ దేవాలయంలో అమ్మవారి సన్నిధిలో ఈ ద్వితీయుడు పాణిగ్రహణ మొనరించిన ఆ ఎనిమిదేళ్ళ చిన్నపిల్ల కూడా ఉన్నారు. ఆ బాల చుట్టూ ఊరి సువాసినులంతా చేరి రాజావారి ప్రక్కన రాజాలాగా వెలిగిపోతున్న నవ యౌవనుడయిన శాస్త్రి గారు ఈమె భర్తే అని బహుధా ప్రశంసింప సాగారట. ఆ మాటలకీ చిన్నపిల్లకు సిగ్గుతో ఏడ్పు వచ్చేది. సిగ్గుతో ఆమె ఎక్కడికి పారిపోతే అక్కడంతా సువాసినులు చుట్టేసేవారట. పాపం ఈ చిన్నపిల్ల ఏం చేస్తుంది. 


(సశేషం)


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

నేను' అంటే ఎవరు

 *'నేను' అంటే ఎవరు? శరీరమా? లేక ఆత్మా?*  


'నేను' అనే పదాన్ని కూడా ఉచ్చరించే స్థితిలో లేదు నేటి సమాజం. అంతగా మనుష్యులందరూ, వారి వారి పనులతో, మరియు సమస్యలతో సతమతమవుతూ ముందుకు వెళుతున్నారు. అలాంటిది, వారు నేనెవరు? శరీరమా లేక ఆత్మా? అని తెలుసుకునేంత సమయం ఎక్కడుంటుంది? కానీ, వారికి ఎన్ని పనులున్నా మరియు ఎన్ని సమస్యలున్నా, మనసు మాత్రం తన పని తానూ చేసుకుంటూ పోతుంది. అది ప్రతి రోజూ గుర్తు చేస్తూ ఉంటుంది. దానిని మనం లెక్క చేయం. ఎందుకంటే.. అది మనకు గుర్తు చేసిన విషయాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలో, ఎలా ముందుకు అడుగు వేయాలో, మనకు తెలియదుగనుక. పోనీలే ఎప్పుడైనా మనం తెలుసుకోవాలని ఎవరినైనా అడుగుదామంటే, వారికీ తెలియదు. పోనీలే అని వారి వారి మత గ్రంధాలు చెదివి తెలుసుకుందామనుకుంటే, అది పూర్తిగా అర్ధం కాదు. అప్పుడు ఎలా తెలుసుకోవాలో తెలియక, మళ్లీ మన పనులలో మనం తలమునకలై, దానిని వదిలేస్తుంటాం..  కానీ, ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.. నేనెవరు? పోనీ కాసేపు నేను శరీరం అని అనుకుందాం.. నేను శరీరం అని అనుకుంటే, మనకు మొదటగా వచ్చే జ్ఞాపకం, మన పేరు. అది ఏదైనా కావచ్చు.. సరే, మనం శరీరం అనుకుంటే, ఇలానే శాశ్వతంగా శరీరంతోనే ఉంటామా? అంటే, లేదు.. అని మొదటగా మన మనస్సు, మనకు జవాబు చెప్పేస్తుంది. అప్పుడు మనకు, అవును మరి నిజమే కదా? మన పూర్వీకులు ఎవరూ ఇప్పుడు లేరు.. వారంతా చనిపోయారు కదా?అంటే, శరీరాన్ని విడిచారు కదా? అని మనకు గుర్తు వస్తుంది. అయితే 'నేను' ఈ శరీరం కాదు.. మరి నేనెవరు? అనేది ఇక్కడ మనకు తేలాల్సిన విషయం!  చూశారుగా.. సాయిబాబా ఎంత గొప్ప ప్రయోగం చేశారో. దేనికి ఇదంతా చేయవలసి వచ్చిందంటే.. ఈ శరీరాలు మీరు కాదు! అని నిరూపించడానికే, ఆ మహానుభావులు ఆ విధంగా, ప్రత్యక్షంగా చేసి చూపించారు.. మరి నేను ఈ శరీరం కాదన్నప్పుడు, నేను వేరే ఏదైనా ఉండి ఉండాలి.. “దేన్నయితే మనస్సు గ్రహించలేకపోయినా, దేని చేత మనస్సు సర్వస్వం గ్రహిస్తున్నదో.. దేన్నయితే కళ్ళు

చూడలేకపోయినా, దేనిచేత కళ్ళు చూడగలుగుతున్నాయో.. దేన్నయితే చెవులు వినలేకపోయినా, దేనిచేత చెవులు వినేశక్తిని పొందగాలుగుతున్నాయో.. దేన్నయితే ముక్కు వాసన చూడలేకపోయినా, దేని చేత ముక్కు వాసన చూడగలుగుతుందో.. అదే ఆత్మ స్వరూపం” అని కేనోపనిషత్తులో సవివరంగా తెలియపరిచారు. 

అంటే, మన శరీరం, మనస్సు మరియు బుద్ధి, అన్నీ ఒక ఆత్మ శక్తి ద్వారానే పనిచేస్తున్నాయి. ఆ శక్తి మాత్రమే శాశ్వతం.. అదియే నీవు.. ఆ శక్తి ఎప్పుడైతే శరీరాన్ని వదలి వెళుతుందో, అపుడు ఆ శరీరం నిర్జీవమవుతుంది.. అప్పుడు శరీరంలోనివి ఏవీ పనిచేయవు..


మానవుని శరీరంలో ఆత్మ రాజయితే, మనస్సు మంత్రి, లేక సైన్యాధిపతి అయి నడుస్తూ ఉన్నాడు.. 

ఆత్మ రాజయినప్పటికీ, సాక్షిమాత్రంగా సంచరిస్తూ ఉండడం వలన, మంత్రే (మనస్సు) స్వతంత్రించి నడుస్తూ, అహంకారంతో ప్రవర్తించడం జరుగుతోంది. మనస్సనే మంత్రి, రాజును మించిపోయి నడుస్తూ ఉన్నాడు. 

ఎప్పుడైతే మనిషి ఆత్మే 'నేను' అనే జ్ఞానాన్ని తెలుసుకుని, అంటే, రాజే 'నేను' అని తన రాజ్యాన్ని పాలించాలని పూనుకుని, పనిచేసుకుంటూ వెళతాడో, అప్పుడు మనస్సనే మంత్రి ఏమీ చెయ్యలేడు. 

జ్ఞానమార్గంలో ఇంద్రియాలను అంతర్ముఖం చెయ్యటం వలన, మనస్సు ఆత్మలో లయించ వలసి వస్తుంది. అప్పుడు ఆత్మే రాజై, శాంతి సౌఖ్యాలను అందిస్తుంది. ఎప్పుడైతే జ్ఞానాన్ని గ్రహించి, 'నేనే ఆత్మను' (రాజు పెళ్ళిను) అని తెలుసుకుంటూ ముందుకు వేళతామో, అప్పుడు మనసు (మంత్రి) అందుకు సహకరిస్తుంది..


.'నేను' కు ఇంకొక్క అక్షరం కూడా చేర్చకుండా

అక్కడితో ఆగిపోతే, ఆ 'నేనే' పరమాత్ముడు అవుతాడు.

*కృష్ణ సందేశం

 *కృష్ణ సందేశం*


*కృష్ణా!*

*కృష్ణా!*

*కృష్ణ అన్న శబ్ధం దివ్యమైనది.*

*ఇంతటి దివ్యనామాన్ని పెట్టింది యాదవుల గురువు 'గార్గ మహర్షి'.*


శ్రీకృష్ణుడు శిష్టరక్షణ, దుష్టశిక్షణ, ధర్మ సంస్థాపనకై అవతరించిన భగవంతుడు. శ్రీకృష్ణ జననమే ఓ అద్భుతం. జననమునుండియే నేను మానవుణ్ణి కాను, భగవంతుడిని అనే భావం ప్రతీ పలుకులో, ప్రతీ పనిలో ప్రస్ఫుటం చేస్తుంటాడు. తను రాకముందే తన మాయను ఈ లోకానికి రప్పించడం, పుట్టినపిమ్మటే అందరినీ మైకంలో పడేసి కారాగారంనుండి బయటపడడం, రెండు పాయలుగా యమునానది చీలి వసుదేవునికి దారి ఇవ్వడం, తనకు ఆడపిల్ల పుట్టినవిషయం గానీ, బిడ్డను తీసుకుపోయి మగపిల్లవాడుని తన ప్రక్కన పెట్టిన విషయంగానీ యశోదమ్మకు తెలియకపోవడం ...... అన్నీ పరమాద్భుతఘటనలే. అలానే బాల్యంనందే పూతనను సంహరించడం, మద్దిచెట్లు రూపంలో ఉన్న నలకూబర, మణిగ్రీవులకు శాపవిమోచన చేయడం, కాళియమర్ధనం, వస్త్రాపహరణం......ఇత్యాది పరమాద్భుత ఘటనలన్నీ భగవంతుని బాల్యలీలలు. పరమాత్ముని లీలలన్నీ పారమార్ధిక సందేశాలే.


ఓం దేవకీ గర్భసంజాతాయ నమః 

ఓం యశోదేక్షణ లాలితాయ నమః 

కృష్ణుడు ఇద్దరు తల్లుల ముద్దుబిడ్డ. దేవాదిదేవుని కన్నది దేవకీమాతయితే, దేవాదిదేవుని దివ్యలీలలను కాంచినది యశోదమాత. యశోదమాత కాంచిన దివ్యదర్శనములలో ఒకటి -

ఓ దినం ఎప్పటిలాగే కృష్ణుడు, బలరామ గోపబాలకులతో కలిసి ఆడుకుంటూ మట్టి తిన్నాడు. మట్టి తిన్నట్లు గోపబాలకుల ద్వారా తెలుసుకున్న యశోదమ్మ కృష్ణుని పిలిచి మందలించగా -

అమ్మా! మన్ను దినంగా నేశిశువునో? యా కొంటినో? వెఱ్ఱినో?

నమ్మంజూడకు వీరి మాటలు మదిన్, నన్నీవు గొట్టంగా వీ

రిమ్మార్గంబు ఘటించి చెప్పెదరు కాదేనిన్ మదీయాస్యగం

ధమ్మాఘ్రాణముసేసి నా వచనముల్ దప్పైన దండింపవే

అని నోరు తెరిచి చూపగా చిన్నికృష్ణుని నోటిలో చరాచర సృష్టినే కాంచిన ధన్యమాత యశోద.


🚩 *డైలీ విష్* 🚩

Prime Minister of India

 Read it till end, to know the facts

sent as it came

 🕉

 Hello my dear Indians.


   *I am the Prime Minister of India, Narendra Modi!*


  *It has been 7 years since you gave this responsibility!  I would like to take this opportunity to share a few things!  When I was sworn in as prime minister, the throne was thorny!*


  *All government institutions were scattered by the misgovernance, corruption and fraud of 10 years of the previous government!  Huge foreign debt remained, and Indian companies were making losses!*


   *Iran's debt was ₹48,000 crore;*


   *United Arab Emirates' debt account for ₹40,000 crore;*


   *Indian fuel companies had a loss of ₹ 1,33,000 crore;*


   *Indian Airlines' loss was ₹58,000 crore;*


   *The loss of Indian Railways was ₹22,000 crore;*


   *BSNL's loss was ₹1,500 crore;*


  *The soldiers didn't have basic weapons, they didn't have bullet proof jackets!  There were no state-of-the-art fighter planes!  If there was a war, the army would not have survived even for 4 days.*


  *That's when I decided!*


  *At that time my main responsibility was to set up all systems properly!*


  *Fortunately, for Indians, fuel prices in the international market have come down!  But you haven't benefited from all the reduced prices!  You must be feeling that the government has done wrong!*


  *You love me a lot, but you're a little angry with me for the cost of fuel!  I know, but I couldn't help you, because I'm working with my future generations!*


  *The foolishness of the previous government was a curse for us*


  *They borrowed and bought crude oil!  However, they did not increase the price to avoid the aggression of civilians!*


  *Then he had taken a foreign loan of ₹2,50,000 crore!  For this we had to pay ₹25,000 crore as interest every year!*


  *Huge amount of loan was given to our country!  And we were told to pay off our debts, so that India can get fuel without any hiccups!*


  *What is the reason for levying tax on fuel?  We can proudly say that today we have repaid a loan of ₹2,50,000 crore with interest!*


  *Railway was doing damage!  We have completed all the projects started by the previous governments, which are running smoothly!  We completed all the electrification of railway lines at a faster pace than before in the past!*


  *As well as ..*


  *18,500 villages electrified!*


  *5 crore free gas connections have been given to the poor!*

 *Hundreds of kilometers of new roads were built!*


  *Loans worth ₹ 1,50,000 crore were given to the youth!*


  *A medical insurance scheme of ₹ 1,50,000 crore launched for 50 crore citizens named "Ayushman Bharat"!*


  *Our soldiers are provided with all latest and updated version weapons and bullet proof jackets, Rafale fighter aircraft, and many other types of lethal weapons and other facilities!*


*Where did the money come from for all these works?  That money is given by you!  When you all buy petrol and diesel, you give that money to the country*


  *If we remove tax on petrol and diesel, was it possible to pay off our debts?  We can pay off debt, as well as bring on many new projects, so indirectly we need to raise taxes on everything!  The responsibility of 130 crore citizens cannot be of the vehicle owners alone!*


  *One last thing.. As the head of your family, what do you do when there is a huge debt burden on your family?*


   *Do you spend carelessly?*


   *Or do you pay off the loan?*


  *If the loan and interest are not repaid carelessly, what will be the future of the family?*


  *Don't fall into the wrong game of opponents...*


  *You, as a patriotic citizen of this country, please participate in the development of the country.*


  *This protest has always been electoral, some politicians are trying to mislead citizens with false propaganda!*


  *I request all of you, please share this truth with all of you Indians*


   *your,*

   *Narendra Modi*

 *Long live Mother India*

 *Jai Hind!*

 🙏


 *With 1,500 squatters kicked out from Lutyens Bungalows, it might explain why its always Modi vs All!*


 https://www.opindia.com/2018/02/with-1500-squatters-kicked-out-from-lutyens-bungalows-it-might-explain-why-its-always-modi-vs-all/


 *The cleaning up has in fact happened in Lutyens' Delhi, since the BJP came to power, 7 years back!*


 *In the first year itself, more than 460 squatters were sent packing out of their cosy Lutyens' Bungalows!*


 *Many of them had been staying there for generations, and had started considering it their private property.  Some approached the Courts with appeals to let them keep their fiefdoms.  But to no avail!  The Courts, too, refused!*


 *Ajit Singh, the son of former Prime Minister Charan Singh was squatting on a Bungalow.  He was locked out, and his belongings thrown out on the lawns!*


 *Painter Jatin Das, the father of actor Nandita Das, was enjoying another Bungalow in Lutyens.  Had to be evicted!*


 *"The Print", a Congress IT Cell publication, asked why Narendra Modi does not have an army of intellectuals defending him, unlike the Nehrus and the Gandhis?*


 *The word "intellectuals" is a joke!  Most are the lowest moral scums of society, willing to sell anything for a gift in cash or kind!*


 *By late 2016, the number of evictions had swelled to 1,500!*


 *There are only a handful of articles in the media documenting this cleanup mission in Lutyens' Delhi!*


 *A lot of free loading journalists, in love with the Congress gifts, got kicked out, too!*


 *There is this absolute gem of a quote in "The Telegraph" from an unnamed Congress MP:*


 *"The Congress had a long tradition of not implementing the rules so strongly! "*


 *Amazing suggestion:*


 *Looks like Lutyens Delhi was a rent-free district of people who were supporting the political party, in exchange for rent free palatial Bungalows!*


 *In the Congress Raj, before a case went to the Supreme Court, everything was managed - which Judge would go to the bench, and what decision will the Judge give!*


 *This is the biggest secret of the success of 70 years of Congress, that it has managed all the media and the Judiciary, and ruled the country!*


 *Have you ever heard Rahul Gandhi, Lalu Yadav, Sitaram Yechury, Mayawati, Akhilesh, Mamata, Mehbooba, and other Opposition leaders calling each other thieves?*"


  *No !!!*


 *While some of them have been convicted, some are in jail, some are on bail and some are facing trial in Courts, but they do not call each other a thief!*


 *But, Modi, who has no official charge, no FIR, no trial is going on, no court has even ordered any investigation, all these leaders are calling him a thief!*


 *No Blessed Understanding, nor a sense of responsibility towards the country!  It is a shame on such traitors!*

విఘ్నవిదారణదక్షం

 శ్లోకం:☝️

*గణపతిపదయుగమాశ్రయ సతతం*

*విఘ్నవిదారణదక్షం*

*ఇంద్రాదిదేవ వరదానవ సంఘైః*

*ప్రేమ్నా సంస్థుత యుగళం*

*విఘ్నధ్వాంత వినాశన భానుం*

*ఆశ్రిత జన సంపోషం*

*తవ శుభ రూపం దృష్వా*

*దివిషద ముఖ్యాస్సర్వే*

*ముక్తాస్తవ కృపయా చ*

*జనగణ ఈప్సితదాయకమనిశం*

*మూషకవాహనమీశం*

*ప్రణమః ప్రణమః ప్రణమః*

*మమ భవహరణం ప్రణమః*


అన్వయం: *విఘ్న-విదారణ-దక్షం,*

*ఇంద్రాది-దేవ-వర-దానవ-సంఘైః ప్రేమ్నా-సంస్థుత-యుగళం,*

*విఘ్నధ్వాంత-వినాశన-భానుం,*

*ఆశ్రిత-జన-సంపోషం*

*గణపతి-పద-యుగం సతతం ఆశ్రయ |*

*తవ శుభ-రూపం దృష్వా సర్వే దివిషద-ముఖ్యాః, జనగణాః చ తవ కృపయా ముక్తాః భవంతి |*

*ఈప్సితదాయకం, మూషకవాహనం, ఈశం, మమ భవహరణం అనిశం ప్రణమః ||*


భావం: విఘ్నాలను నాశనం చేయగల సమర్థత కలిగినవి,

ఇంద్రాది దేవతలు మరియు దానవ శ్రేష్ఠులు ప్రేమతో కొలిచేవి,

విఘ్నాలనే చీటికిని నాశనం చేసే సూర్యుడు వంటివి,

తనను ఆశ్రయించిన భక్తులను పోషించేవి,

అయిన గణపతి పాదపద్మములను ఎల్లప్పుడూ ఆశ్ర యించు (ఓ మనసా!)

ఇంకా ఆ దివ్య పద యుగళ దర్శనం చేత పుణ్యాత్ములయిన మానవులు , దేవతలు ముక్తులవుతున్నారు.

కోరిన కోర్కెలను తీర్చేవాడు, మూషికవాహనుడు, ఈశ్వరుడు, ముక్తిదాయకుడు ఆయన గణపతికి సర్వదా నమస్కరిస్తున్నాను.

16, ఆగస్టు 2022, మంగళవారం

 తీవ్రమైన గ్యాస్ సమస్య నివారణ కొరకు అద్భుత యోగం  -


    ప్రస్తుత కాలంలో చాలామంది తీవ్రమైన గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం సరైనటువంటి ఆహారం సరైనవేళల్లో తీసుకోకపోవడమే దీనికి ప్రధాన కారణం . ఇప్పుడు నేను చెప్పబోవు ఈ అద్భుత చిట్కా మిమ్మల్ని గ్యాస్ సమస్య నుంచి మిమ్మల్ని అద్భుతంగా బయటపడవేయును.


      వాము  250 గ్రాములు .


      జీలకర్ర  250 గ్రాములు .


      ధనియాలు  250 గ్రాములు . 


         మూడింటిని వేరువేరుగా నూనె కాని నీరు కాని వేయకుండా కడాయిలో ఒక నిమిషంపాటు సన్నటి సెగ మీద వేయించి మూడింటిని కలిపి మెత్తటి చూర్ణంగా చేయవలెను . ఆ చూర్ణమును ఒక డబ్బా యందు గాలి పోకుండా నిలువ చేసుకొనవలెను . ఒక గ్లాసు నీటిని బాగా మరిగించి పొయ్యి మీద నుంచి కిందకి దింపిన తరువాత 2 స్పూనుల చూర్ణాన్ని మరిగించిన నీటిలో వేసి మూత పెట్టవలెను కొంచం ఆగి గోరువెచ్చగా అయినతరువాత వడకట్టుకొని తాగవలెను. ఇలా ప్రతి ఉదయం బ్రష్ చేసిన వెంటనే మరియు సాయంత్రం ఆహారానికి గంట ముందు మరలా చేసుకుని తాగవలెను.


            పైన చెప్పిన యోగం 40 రోజులపాటు చేసినచో మీ గ్యాస్ సమస్య సంపూర్ణంగా పోవును . అలాగే ఆహారం తీసికొనుటకు అర్థగంట ముందు చిన్న అల్లం ముక్క కు ఉప్పు అద్ది నోటి యందు ఉంచుకుని రసం మింగుతూ ఉండవలెను . దీనివలన జీర్ణక్రియ మెరుగుపడి ఆహారం సంపూర్ణంగా జీర్ణం అగును.


  అజీర్ణరోగముతో బాధపడువారు పాటించవలసిన ఆహార నియామాలు  -


  పాటించవలసిన నియామాలు  -


      తేలికయిన పాతబియ్యపు అన్నం . పాతబియ్యపు నూకల జావ , బార్లీ జావ , పెసలు , పేలాలు , పెసరకట్టు , మేక మాంసం , చిన్న చేపలు , అల్లం , ఉప్పు , తక్కువ కారం , లేత ముల్లంగి , వెల్లుల్లి , ఉల్లిపాయ , లేత అరటికాయలు , లేత మునగ కాయ , పొట్లకాయ , బీరకాయ , లేత వంకాయ , కాకరకాయ , నక్క దోసకాయ , చుక్కకూర , పెరుగు తోటకూర , పొన్నగంటి కూర , మెంతికూర , ఉశిరికాయ , దానిమ్మ , నారింజ పండు , బత్తాయి , మజ్జిగ , పలచని మిరియాల చారు , తాంబూలం , వేడినీరు , తేనె , చేదు , నూనె పలచటి పదార్దాలు , వగరు , చేదుగల పదార్దాలు తీసికొనవలెను . వ్యాయమం చేయవలెను .


 పాటించకూడనివి  -


       కొత్త బియ్యపు అన్నం , పెద్ద చేపలు , బచ్చలికూర , అధికంగా నీరు తాగరాదు , ఆలస్యముగా జీర్ణం అయ్యే పదార్ధాలు . కంద , పెండలం , చామ , ఆలుగడ్డ , నేరేడు పండ్లు , గోధుమలు , పాలు , పాలతో చేసిన పదార్థాలు , చారపప్పు , జీడిపప్పు , నూనె అధికంగా ఉపయోగించి చేసే పదార్దాలు , వేపుళ్లు , పాతపచ్చళ్లు , ఉడకని పదార్దాలు , ముందు తినిన ఆహారం జీర్ణం కాక మునుపే మరలా తినరాదు . అమిత భోజనం , నిద్ర మేలుకుని ఉండటం , మలమూత్ర నిరోధం . టీ మరియు కాఫీ నిషిద్దం 


          పైన చెప్పిన ఆహారనియమాలు పాటిస్తూ నేను చెప్పిన యోగాన్ని పాటించుచుండిన అతి త్వరగా మీ సమస్య నుంచి విముక్తి పొందగలరు.


   పూర్తి తీవ్రమైన గ్యాస్ సమస్య నివారణ కొరకు అద్భుత యోగం -


    ప్రస్తుత కాలంలో చాలామంది తీవ్రమైన గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం సరైనటువంటి ఆహారం సరైనవేళల్లో తీసుకోకపోవడమే దీనికి ప్రధాన కారణం . ఇప్పుడు నేను చెప్పబోవు ఈ అద్భుత చిట్కా మిమ్మల్ని గ్యాస్ సమస్య నుంచి మిమ్మల్ని అద్భుతంగా బయటపడవేయును.


      వాము 250 గ్రాములు .


      జీలకర్ర 250 గ్రాములు .


      ధనియాలు 250 గ్రాములు . 


         మూడింటిని వేరువేరుగా నూనె కాని నీరు కాని వేయకుండా కడాయిలో ఒక నిమిషంపాటు సన్నటి సెగ మీద వేయించి మూడింటిని కలిపి మెత్తటి చూర్ణంగా చేయవలెను . ఆ చూర్ణమును ఒక డబ్బా యందు గాలి పోకుండా నిలువ చేసుకొనవలెను . ఒక గ్లాసు నీటిని బాగా మరిగించి పొయ్యి మీద నుంచి కిందకి దింపిన తరువాత 2 స్పూనుల చూర్ణాన్ని మరిగించిన నీటిలో వేసి మూత పెట్టవలెను కొంచం ఆగి గోరువెచ్చగా అయినతరువాత వడకట్టుకొని తాగవలెను. ఇలా ప్రతి ఉదయం బ్రష్ చేసిన వెంటనే మరియు సాయంత్రం ఆహారానికి గంట ముందు మరలా చేసుకుని తాగవలెను.


            పైన చెప్పిన యోగం 40 రోజులపాటు చేసినచో మీ గ్యాస్ సమస్య సంపూర్ణంగా పోవును . అలాగే ఆహారం తీసికొనుటకు అర్థగంట ముందు చిన్న అల్లం ముక్క కు ఉప్పు అద్ది నోటి యందు ఉంచుకుని రసం మింగుతూ ఉండవలెను . దీనివలన జీర్ణక్రియ మెరుగుపడి ఆహారం సంపూర్ణంగా జీర్ణం అగును.


  అజీర్ణరోగముతో బాధపడువారు పాటించవలసిన ఆహార నియామాలు -


  పాటించవలసిన నియామాలు -


      తేలికయిన పాతబియ్యపు అన్నం . పాతబియ్యపు నూకల జావ , బార్లీ జావ , పెసలు , పేలాలు , పెసరకట్టు , మేక మాంసం , చిన్న చేపలు , అల్లం , ఉప్పు , తక్కువ కారం , లేత ముల్లంగి , వెల్లుల్లి , ఉల్లిపాయ , లేత అరటికాయలు , లేత మునగ కాయ , పొట్లకాయ , బీరకాయ , లేత వంకాయ , కాకరకాయ , నక్క దోసకాయ , చుక్కకూర , పెరుగు తోటకూర , పొన్నగంటి కూర , మెంతికూర , ఉశిరికాయ , దానిమ్మ , నారింజ పండు , బత్తాయి , మజ్జిగ , పలచని మిరియాల చారు , తాంబూలం , వేడినీరు , తేనె , చేదు , నూనె పలచటి పదార్దాలు , వగరు , చేదుగల పదార్దాలు తీసికొనవలెను . వ్యాయమం చేయవలెను .


 పాటించకూడనివి -


       కొత్త బియ్యపు అన్నం , పెద్ద చేపలు , బచ్చలికూర , అధికంగా నీరు తాగరాదు , ఆలస్యముగా జీర్ణం అయ్యే పదార్ధాలు . కంద , పెండలం , చామ , ఆలుగడ్డ , నేరేడు పండ్లు , గోధుమలు , పాలు , పాలతో చేసిన పదార్థాలు , చారపప్పు , జీడిపప్పు , నూనె అధికంగా ఉపయోగించి చేసే పదార్దాలు , వేపుళ్లు , పాతపచ్చళ్లు , ఉడకని పదార్దాలు , ముందు తినిన ఆహారం జీర్ణం కాక మునుపే మరలా తినరాదు . అమిత భోజనం , నిద్ర మేలుకుని ఉండటం , మలమూత్ర నిరోధం . టీ మరియు కాఫీ నిషిద్దం 


          పైన చెప్పిన ఆహారనియమాలు పాటిస్తూ నేను చెప్పిన యోగాన్ని పాటించుచుండిన అతి త్వరగా మీ సమస్య నుంచి విముక్తి పొందగలరు.


   పూర్తి వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 


    గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            కాళహస్తి వేంకటేశ్వరరావు 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు .


              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                          9885030034 సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 


    గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            కాళహస్తి వేంకటేశ్వరరావు 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు .


              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                          9885030034

mobile surrender at night

 ఆఫీస్ పని మీద పొద్దున్నే హైద్రాబాద్ వచ్చాను.ఒక రోజులొనే పని అయిపోతే, సాయంత్రమే బయలు దేరి వెళ్లి పోవచ్చు అనుకున్నాను. కానీ ఒక రోజులో అయ్యేలాగా లేదు మరి. ఏదైనా  Lodge లో రూమ్ బుక్ చెయ్య మని చెప్పాను మా ఆఫీస్  వాళ్ళకి.వాళ్లు అదే పనిలో ఉన్నారు. 


ఈ లోగా నా బాల్య మిత్రుడు మూర్తి కి ఫోన్ చేసాను. వాడు చాలా సంతోషించాడు. కుశల ప్రశ్నలు అయ్యాక అడిగాడు నేను ఎక్కడ stay చేస్తున్నాను అని. నేను చెప్పాను మా వాళ్లు రూమ్ బుక్ చేస్తున్నారు అని.

మా వాడికి కోపం వచ్చింది, వాళ్ళ ఇంటికి రాకుండా ,ఎక్కడో ఓ lodge రూమ్ లో ఉండ వలసిన అవసరం ఏమిటి అని నన్ను తిట్టి, వాళ్ళ ఇంటికే రమ్మన్నాడు. నేను సరే అని వాళ్ల ఇంటికే బయలు దేరాను, మా ఆఫీస్ వాళ్లకు రూమ్ బుక్ చేయ వద్దు అని చెప్పి.


నేను వాళ్ల ఇంటికి ఒక అరగంటలో చేరుకున్నాను.

అప్పటికి మా మూర్తి  ఇంటికి రాలేదు. వాడి శ్రీమతి నన్ను అన్నయ్య గారు అని పిలుస్తుంది ఎంతో ఆప్యాయంగా. చల్లటి మంచి నీళ్లు, వేడి coffe ఇచ్చింది. కుశల ప్రశ్నలు అడుగుతూ ఉంటే తెలిసింది, వాళ్ల అత్త గారు, అంటే, మా మూర్తి గాడి అమ్మగారు ఇక్కడే ఉంటున్నారు అని.  నాకు చాలా సంతోషం అనిపించింది, వెంటనే ఆవిడ ఉండే రూమ్ లో కి వెళ్లి, ఆవిడకు  నమస్కారం చేసాను. నేను ఆవిడ పడుకున్న  మంచానికి దగ్గరలో ఉన్న కుర్చీలో కూర్చుని ,ఆవిడతో మాట్లాడుతో ఉన్నాను. ఈ లోగా మూర్తి కూడా వచ్చాడు ,వాడు కూడా ఆ గది లోకే వచ్చాడు సరాసరి.

వాడు నాతో మాట్లాడక ముందే, వాడి జేబు లోనుంచి మొబైల్ తీసి ,వాళ్ల అమ్మ చేతిలో పెట్టాడు. మేము ఇద్దరం మాట్లాడు కుంటున్నాము, coffe తాగుతూ,

నేను రెండో సారి. ఇంతలో మూర్తి గాడి అబ్బాయి వచ్చాడు , ఆ అబ్బాయి  ఎంటెక్ చేస్తున్నాడు,jntu లో.

అతను కూడా, మొబైల్ హాండ్సెట్  తీసి  మామ్మ చేతిలో పెట్టాడు. ఇంకో అయిదు నిముషాలు ఆయాక మూర్తి గాడి అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయి ఇంజనీరింగ్  చేస్తున్నది ట, ఆ అమ్మాయి కూడ వాలెట్ లోనుంచి మొబైల్ తీసి పెద్దావిడ చేతిలో పెట్టి, నన్ను పలకరించి వెళ్లి పోయింది.

నేను ఆశ్చర్య పోయి అడిగాను మూర్తిని, అందరూ మొబైల్స్ ఆ పెద్దవిడకి ఎందుకు  ఇచ్చేస్తున్నారు అని.

అప్పుడు మెల్లగా నవ్వి చెప్పాడు మూర్తి 'ఒరే, ఇంటికి వచ్చాక కూడా అందరూ  మొబైల్స్ పట్టుకుని, వాట్సాప్  లు, ఫేస్ బుక్లు చూసుకుంటూ ఉంటే, ఇది ఇల్లులా ఉండటంలేదు,ఒకళ్ళ సంగతలు వీరోకళ్లకు తెలియటం లేదు, అసలే బయట జీవితం   యాంత్రికంగా ఉంటోంది,ఇంట్లో కూడా అలా ఉండ కూడదు అని, మా శ్రీమతి ఈ నిర్ణయం తీసుకుంది " అని ఏకధాటిగా చెప్పి వాళ్ళ  ఆవిడను మెచ్చుకోలుగా చూసాడు.


 "అవును అన్నయ్య గారు,  పిల్లలు,ఆయన ఎపుడు వస్తారా,వాళ్ళతో  కబుర్లు చెపుదాము అని నేను ఆశగా ఎదురు చూస్తూ వుంటే, వాళ్ళు మాత్రం మొబైల్స్ తో నే కాలం గడిపేస్తున్నారు, ఇంటికి వచ్చినా, అందుకే ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నాను, దానికి మా అత్త గారు కూడా సపోర్ట్ ఇస్తున్నారు. మొదట్లో moblies నా దగ్గరే పెట్టు కునే దాన్ని, కానీ వాళ్ళు న మాట వినే వారు కాదు,ముఖ్యంగా మా ఆయన, అందుకే ఇప్పుడు ఆ డ్యూటీ పెద్దవిడకి ఇచ్చాను,ఆవిడ అంటే అందరికి గౌరవం , అందుకే అందరూ కట్టుబడి ఉంటారు, ఈ నిబంధనకి " అని ముగించారు Mrs murthy.

నేను కూడా మా ఆవిడతో క్లుప్తంగా మాట్లాడి, నా మొబైల్ కూడా ఆ పెద్దవిడకు ఇచ్చేసా.


కానీ అప్పుడు ఓ సందేహం వెలుబుచ్చాను, ఎవరైనా బయట వాళ్లు ,వీళ్ళతో మాట్లాడాలి అంటే ఎలా అని.

Mrs murthy చెప్పారు, ,అన్నయ్య గారు, నా ఫోన్ నెంబర్ అందరికి తెలుసు, urgent  అయితే నాకు వాళ్లు ఫోన్ చేస్తారు, పైగా నా ఫొన్ స్మార్ట్ ఫొన్ కాదు, ఒక బేసిక్ ఫోన్ మాత్రమే, నా ఫోన్ కి ఈ నియమం వర్తించదు'  అని  వివరణ ఇచ్చారు


రాత్రి dinner చేస్తున్నప్పుడు, అందరూ చక్కగా మాట్లాడు కుంటూ, ఒకరి సంగతులు మరొకరు తెలుసు కుంటూ, వంటకాలను ఆస్వాదిస్తూ కడుపు నిండా తిన్నారు. ఓ మంచి idea  వాళ్ళ ఇల్లుని బొమ్మరిల్లుగా మార్చేసింది. 

నేను మా ఇంట్లో  mobile surrender  @ night

అనే  నిబంధన అమలు పరచాలి అని నిర్ణయించుకుని,

వాళ్ళ అందరి లాగే ఓ మంచి తెలుగు పుస్తకం చదువుతూ నిద్రలోకి జారుకున్నాను.

Janaganamana

 


ధర్మాకృతి

 ధర్మాకృతి : శ్రీమఠం ఖైదు అయిన కథ -3


స్వామివారికి కూడా ఒక్కటే మనఃక్లేశము. నా కాలంలో మఠానికి ఇంత క్లిష్ట పరిస్థితి వచ్చిందేమా అని. నేనీ కేసు వ్యాజ్యము లాంటి లౌకిక వ్యవహారాలలో ప్రవేశించాల్సిన అవసరం రాకుండానే సర్వజనామోదకంగా ఏది జరిగితే మంచిదో ఆ మంచి జరిగి ఉండకూడదా! కక్షిదారులు తమకే ఆ ప్రతిష్ఠరావాలని కేసు వేసినపుడు, ఎదురు వ్యాజ్యమాడక వారికే ఆ ప్రతిష్ఠ వదిలితే పోయేదికదా! అని వారు ద్వితీయుని ముందు క్లేశపడినారు. కార్యనిర్వాహణాధికారిగా వున్న వీరికి తాము సరిగా కార్యము నిర్వర్తింపజాలనందులకే స్వామివారికి మనఃక్లేశమేర్పడినదని బాధవేసింది.


బాగుంది! విజయం కలిగిన వెంటనే మనకు అహంకారమెక్కడ పెరిగిపోతుందో అని అమ్మ ఈ రకమైన కష్టములు కలుగజేస్తుంది. ఆమె కృప చేతనే కష్ట నివృత్తికి దారి దొరుకుతుందనే నమ్మకంతో మనస్సులో నొచ్చుకోకుండా మన కర్తవ్యము మనం నిర్వహించుకు పోతూ ఉంటే తుదకు సంతోషం, జయం లభిస్తాయి. ద్వితీయులు శ్రీచరణులపై, అమ్మవారి అనుగ్రహ బలంపై నమ్మిక యుంచి ఈ క్లిష్ట పరిస్థితి ఎదుర్కొనడానికి తన వల్లనయ్యే అన్ని ప్రయత్నాలూ చేయడానికి తీర్మానించుకొన్నారు. తన ప్రయత్నాలు ఏ రకంగా ఫలిస్తాయో అని స్వామివారితో సహా ఎవరికీ తెలియపరచకుండా, చడీచప్పుడు చేయకుండా తాను నిర్ణయించుకొన్న ప్రణాళికను అమలుపరచ సంకల్పించారు. 


వెంటనే తంజావూరు వెళ్ళారు. అప్పటికే సర్వోజీ రాజా కాలం ముగిసి వారి పుత్రుడు శివాజీ మాహారాజు రాజ్యానికొచ్చారు. వారి వద్దకు పోయిన ఈ ద్వితీయులు మఠగౌరవానికి భంగము వాటిల్లని విధంగా నాజూకుగా విషయం తెలియజేశారు. ఒక పెద్ద వ్యాజ్యం అయింది. తంజావూరు సీమకే ప్రతిష్ఠ తెచ్చిన శ్రీమఠాన్ని తిరుచ్చి నుండి కుంభకోణం పోయేటప్పుడు తంజావూరు ఆహ్వానించి తగిన మర్యాద చేస్తే బాగుంటుందని సూచించారు. రాజావారు ఏ రకమైన ఇబ్బందుల్లో వున్నారో, వెంటనే ఆ సూచనను ఒప్పుకోనూ లేదు, తిరస్కరించనూ లేదు. మూడునాళ్ళు ఆలోచించి తుదకు తన అశక్తతను తెలియబరిచారు. రాజుగార్ని కలిసి శ్రీమఠాన్ని ఈ ఇక్కట్ల నుండి కొంత వరకూ బయటపడవేయవచ్చని దిటవు చేసుకున్న ఈ ద్వితీయుని హృదయం మరల దిగజారిపోయింది. తన ఉద్దేశ్యము మంచిదే అయినప్పటికీ తన గురువులయిన శ్రీచరణులు ఆజ్ఞ తీసుకొనకయే, వారి ఆశీర్వాదము లేకయే ఈ ప్రయత్నము చేసినందున శ్రమ వృధా అయింది అని చాలా బాధపడ్డారు. స్వామివారి వద్దకు తిరిగి వచ్చి తన హృదయ వేదనంతా వెళ్ళబోసుకున్నారు. స్వామివారు ఎంతో దయతో ఓదార్పు వాక్యములు పలికి “అమ్మ దయ! అంతా ఆమె దయకు వదిలి మనం బయలుదేరదాం అంటూ శ్రీమఠం కుంభకోణం తిరుగు ప్రయాణానికి ఆజ్ఞాపించారు. 


శ్రీమఠం కుంభకోణానికి బయలుదేరింది. తిరువానైక్కావల్ నుండి కుంభకోణం పోయేటప్పుడు తంజావూరు మీదుగా పోనవసరం లేదు. కోవలడి మీదుగా మఠం పరివారం, బళ్ళు, లొట్టి పిట్టలు, ఏనుగులు, గుర్రపు బళ్ళు ఈవిధంగా సాగిపోతున్నాయి. వెనుక మేనాపై స్వామి వెళుతున్నారు. బళ్ళు తిరువయ్యార్ కి కావేరి అవతల గట్టున సాగిపోతున్నాయి. హఠాత్తుగా అనేకమంది సిపాయిలు ఆ బళ్ళను చుట్టుముట్టి కావేరిలో దింపి ఇవతలి గట్టు మీదుగా తంజావూరు మార్గం పట్టించారు. బండి వారంతా ఇవి శ్రీమఠం బళ్ళు, మేమీ గట్టునే పడి కుంభకోణం పోవలెనని విన్నవించుకొన్నారు. సిపాయిలు వింటేనా! వారిలో కొందరు ఆ బళ్ళకు కావలిగా పోయారు. వెనుక వస్తున్న ఏనుగులు, గుఱ్ఱములు, ఒంటెలకు కూడా అదే గతి పట్టింది.


స్వామి మేనా కూడా ఆపబడింది. అయితే వారితో ఎంత మర్యాదతో ప్రవర్తించారు. రాజుగారి పురోహితులు పూర్ణ కుంభములతో స్వామిని తంజావూరు విచ్చేయవలెనని ప్రార్థించుతుండగా, నాల్గు ప్రక్కల సిపాయిలు మొహరించి ఉన్నారు. ప్రస్తుత కాలంలో కూడా సిపాయిలు coup చేసినపుడు రాజుగారిని ఎంతో మర్యాదగా గృహనిర్బంధం చేస్తారు కదా! తానావిధంగా చేయబడినానని అర్థం చేసుకున్నారు స్వామివారు.


స్వామివారు అంతకు 6-10సం. ముందు కామాక్షీ దేవి ఆలయము జీర్ణోద్ధారణ, కుంభాభిషేకము చేసిన వారు. అమ్మవారే స్వప్నంలో ఆదేశించి వారి మూలంగా కుంభాభిషేకం చేయించుకున్నది. పిదప ఇప్పుడు అఖిలాండేశ్వరీ తాటంక ప్రతిష్ఠ చేశారు. అయినా తిరువానైక్కావల్ నుండి బయలుదేరే ముందు అంతా అమ్మ దయకు వదలి బయలు దేరుదాం అని కదా బయలుదేరారు. “అమ్మా నీదయ! ఈ రకంగా నడుపుతున్నావా? అయితే ఇదీ సమ్మతమే” అనుకుంటూ సిపాయిల మధ్యలో బ్రాహ్మణుల వేదఘోష నడుమ స్వామి తంజావూరు బయలుదేరారు. 


ఈ రకంగా సిపాయిలను పంపినది సర్వోజీ మాహారాజా వారి పుత్రులు శివాజీ మహారాజా! శ్రీ మఠాన్ని ఆహ్వానించి మర్యాద చేయడానికి తగిన వసతి లేదని మూడు రోజుల ప్రతీక్షానంతరముచెప్పినది వీరే! శ్రీమఠాన్ని శివాజీ మహారాజా అరెస్ట్ చేయించారు అని మొదట్లో చెప్పాను కదా! అది వీరిని ఉద్దేశించి చెప్పినదే. మీరందరూ ఛత్రపతి శివాజీ అని ఏమరుపాటునొంది ఆశ్చర్యపోవాలనే ఆ రకంగా చెప్పాను. కతారసం కోసం ఈ రకంగా కికురించడం కవులకు సహజమే కదా! మీకందరికీ చరిత్ర గుర్తు ఉండి ఉంటే అంత ముందు శతాబ్దంలోని ఛత్రపతి ఈ కథలోనికి ఎలా వచ్చారా అని మీకు వెంటనే సంశయం కలిగి నన్నడిగి ఉండేవారే!


(సశేషం)


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Message

 Message of  Pujyashri Shankara Vijayendra Saraswathi Shankaracharya Swamigal on the 75th Anniversary of INDIA'S Independence


शान्ति समृद्धं अमृतम्


15th August 2022


Bharata Varsha' is a sacred land, a Punya Bhoomi. It is not merely a geography or a physical entity, but a repository of great culture-a great civilization. It is a land of great spirituality - a place of Dharma. Blessed by the Gods and nurtured by holy sages, the Punya Bhoomi is venerable as our Mother land-fynfeft teft - Janani Janma Bhumishcha Svargadapi Gariyasi- as remarked by Sri Rama addressing Lakshmana.


This holy land witnessed several trials and tribulations at different points in time in the past. Several sacrifices were made by men and women, families and the entire society. Finally, Bharat attained independence 75 years ago on the 15th August 1947. bestowing on us "Freedom". The country was born again, unshackling itself from the bonds. People of our country kept immense faith and patience. throughout these difficult times. through their devotion to almighty and the Country.


Our Paramacharya Pujya Mahaswamigal had given a special message of blessings on the day of Independence in 1947 emphasising the spiritual greatness of our Nation and how the tricolored Indian Flag symbolises three Shaktis - Durga, Lakshmi and Saraswathi with the Chakra - the embodiment of Dharma in the middle. He also pointed out the importance of every individual to develop independence- one

can consider himself independent if he can understand oneself fully. One must endeavour to develop that state of mind which ensures complete freedom.


75 years have passed since the birth of our Nation. Several developments have occurred, and several things have changed. That one constant which guides us all is our Sanatana Dharma- the bedrock of our civilization. Vedas and Shastras help sustain our Dharma. Upansihad says -Satyam Vada- Dharmam Chara - Dharma is the path on which we must lead our lives. It is the moral compass, it is the differentiator between the Good and Evil. If our country has withstood aggressions of various types for acons. it is because, our people had the strength given to them by Dharma. Dharma can be translated as virtuous acts, as being good to others, being charitable, not harming anyone or anything, being truthful to our inner conscience. When the mortals digressed from the path of Dharma, God himself incarnated in different forms to uphold Dharma. Ramo Vigrahavan Dharma - Sri Rama was the epitome of Dharma and by his very conduct, he showed to the world the greatness of Dharma. Our puranas and Itihasas abound with episodes that show how the adharmic paths appear to be easy and successful, but the path of dharma even though riddled with difficulties is the one that leads us to victory ultimately - Truth alone Triumphs. Sage Tiruvalluvar in Tirukkural has written several profound couplets on Truth and Dharma. If one does not accept Dharma and is opposed to it, he or she is not only causing great harm to oneself, but also to the Society and the Nation.


Sri Adi Shankaracharya through his teachings and works has not only guided us about the Advaita philosophy, but has also shown the path of National Integration so very vital for our Bharata. His yatras throughout the country from Kanyakumari to Kashmir and Kasi to Rameshwaram in his brief earthly sojourn instil in us a feeling of oneness. The Shankaracharya Hills in Kashmir are testimony to this. When forces inimical to our Dharma were increasing. He won over them through discussions and debate and reestablished the Dharmie way of life and established Shanmata the six schools of worships, namely Ganapatyam,Saivam, Saktam, Sauram, Vaishnavam and Kaumaram. The seeds of unity sown by him provide the vital undercurrents for the Unity of our Nation to this day - in spite of diversities in different aspects like region, religion, language etc.


Ours is a very ancient civilization. It is the Bhumi of Rishi- Krishi - the land of Rishis and the land of agriculture. Our Dharma is unique and provides us with a broad mindset we have always believed in the concept of "Vasudhaiva Kutumbakam" and Swadeso bhuvanatrayam" - the whole world is one for us. While we may not be most advanced or prosperous in materialistic terms, our Culture and civilization is the richest. Villages are the soul of our Nation - they show us the virtues of simplicity, of being content with limited wants, of being in harmony with Nature, of being altruistic.


If our Dharma could be propagated, it would lead to peace and happiness in the whole world. If there is any country in the world which can be a Gurn in the realm of Dharma & religion, it can only be our country. Adi Shankara's teachings will provide us with a sound basis for peace and friendship not only among the people of India but also peoples of the whole world.


We pray to Lord Chandramouleeswara to shower His blessings on the entire Nation on this auspicious 75th Independence Day.


Dharmo Rakshati Rakshitaha.