29, జనవరి 2023, ఆదివారం

సద్బోధన

 *సద్బోధన*

            ➖➖➖


*భక్తులు అనే వారికి, భగవంతుని పై ముందుగా నమ్మకం, విశ్వాసం ముఖ్యం.*


*మనం భగవంతునికి శరణాగతులమయి ఉండాలి, నిస్సందేహంగా, షరతులు లేకుండా ప్రతిదీ ఆయనకు సమర్పించాలి..!* 


*అప్పుడు ఆయనే అన్నీ చూసుకుంటాడు, ఎప్పుడు చేయాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది పూర్తిగా భగవంతునికి వదిలేయాలి, ఆయన మనకు మంచినే యిస్తాడు.*


*ఇది కేవలం ఆయనపై అచంచల విశ్వాసంతో వున్నపుడే సాధ్యమవుతుంది...*

                       

         *లోకాః సమస్తాః సుఖినోభవన్తు!*

భీష్మాష్టమి

 🕉️👉 *భీష్మాష్టమి*👈🕉️


*గురుబోధ*

ఈరోజు సంతానార్థులైన వారు భీష్మోద్దేశ్యముగా శ్రాద్ధము ఆచరించవలెను. భీష్మ తర్పణం, అర్ఘ్యం మాత్రము(తల్లి తండ్రులు ఉన్నవారు కూడా) అందరూ చేయవలసినదే. 


వైయాఘ్ర పదగోత్రాయ ౹ సాంకృత్య ప్రవరాయచ ౹౹

గంగాపుత్రాయ భీష్మాయ ౹ ఆజన్మ బ్రహ్మచారిణే౹౹

అపుత్రాయ జలంధద్మి ౹ నమో భీష్మవర్మణే ౹౹

భీష్మశ్శాంతనవో వీరః ౹ సత్యవాదీ జితేంద్రియః ౹౹

అభిరద్భి రవాప్నోతు ౹ పుత్ర పౌత్రోచితాంక్రియామ్ ౹౹


తర్పణ క్రమః


1. వైయాఘ్రపద గోత్రం సాంకృత్య ప్రవరం గంగాపుత్రం భీష్మ వర్మాణం

   తర్పయామి -  3 సార్లు

2. ఆజన్మ బ్రహ్మచారిణం  అపుత్రాయ భీష్మవర్మాణం 

  తర్పయామి - 3సార్లు

3. శంతను తనూభావం వీరం సత్యవాదినం జితేంద్రియం

భీష్మవర్మాణం తర్పయామి - 3సార్లు


ఈ రీతిగా తర్పణమిచ్చి సవ్యంగా ఈ క్రింద శ్లోకంతో అర్ఘ్యం ఇవ్వవలెను.


 శ్లో.  వసూనామవతారాయ ౹ శంతనోరాత్మజాయచ ౹౹ 

అర్ఘ్యం దదామి భీష్మాయ  ౹ ఆబాల్య బ్రహ్మచారిణే ౹౹


ఇతిభీష్మ తర్పణ విధిః


https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial

గాయత్రి మంత్ర మహిమ..!!

 🙏గాయత్రి మంత్ర మహిమ..!!


🌿ప్రాచీన కాలంలో నెల్లై నగరాన్ని ముఖ్యనగరంగా

చేసుకొని పాండ్యరాజు ఒకరు

పాలిస్తూ వుండేవారు. 


🌸ఆ రాజుగారు  తీరని కడుపునెప్పి వ్యాధితో  అవస్ధ పడుతూండేవాడు. 

వైద్యులు ఎంత మంది

ప్రయత్నించినా గుణపర్చలేకపోయారు.


🌿అప్పుడు , ఒకనాడు రాజుగారి సభకి ఒక జ్యోతిష్కుడు   వచ్చాడు. మహారాజును చూసి

" తమకి ఏ ఔషధాలు అవసరం లేదు. 


🌸 జాతకరీత్యా వున్న దోష  విముక్తికి పరిహారం చేస్తే చాలు,  అని చెప్పాడు. జ్యోతిష్కుడు 

చెప్పిన ప్రకారం, పరిష్కార పూజ  మొదలయింది. 


🌿మంత్రాలతో ఒక యమధర్మరాజు బొమ్మని చేసి, ఆ బొమ్మ చేతిలో  ఒక  కత్తి ని అమర్చాడు జ్యోతిష్కుడు. 


🌸పిదప , "రాజా !  యీ  యముని బొమ్మ చేతిలో వున్న కత్తిని కింద

పడేట్లు చేసిన వారికి , ధనాన్ని  ,సువర్ణాన్ని  బహుమతిగా ప్రకటించమని

చెప్పాడు . 


🌿రాజావారు అలాగే తన దేశమంతా చాటింపువేయించాడు.

రాజుగారిచ్చే బహుమతి కోసం రాజ్యంలోని ప్రజలంతా

సభకి  వచ్చి  బొమ్మ చేతిలోని కత్తిని క్రింద పడవేసేందుకు ఎంతో ప్రయత్నించారు.


🌸కాని ఒక్కొక్కరు  ఆ బొమ్మ

వద్దకి రాగానే.. ఆ బొమ్మ మూడు వ్రేళ్ళను ఎత్తి చూపేది. వచ్చిన వారికి ఏమీ అర్ధం కాక ఏం చేయాలో తెలియక  తిరిగి వెళ్ళి పోయేవారు. 


🌿ఒకనాడు ఒక బ్రాహ్మణుడు రాజ సభకు వచ్చి  తను కూడా ప్రయత్నించి చూద్దామని ఆ మంత్రపు బొమ్మ దగ్గరకు

రాగానే   ప్రతిసారి లాగనే

ఆ బొమ్మ మూడు వేళ్ళు

ఎత్తి చూపింది. 


🌸బ్రాహ్మణుడు అర్ధమైనట్లుగా

" కుదరదు"  అన్నాడు. 

వెంటనే బొమ్మ రెండు వేళ్ళు

చూపించింది.  "అప్పుడు కూడా  ఒప్పుకోను"  అన్నాడు

బ్రాహ్మణుడు.  


🌿తరువాత ఒక్క వేలు మాత్రమే ఎత్తి  చూపించింది బొమ్మ.

దానికి   బ్రాహ్మణుడు 

సరేనని,  దగ్గర వున్న  

పాత్రలోని  నీటిని, తీసుకుని

ఆ నీటి ధారతో దానం చేశాడు.


🌸మరుక్షణమే  యమధర్మరాజు చేతిలోని కత్తి క్రింద పడిపోయింది. మరుక్షణమే 

మహారాజు గారి కడుపునొప్పి  అదృశ్యమై పూర్ణ ఆరోగ్యవంతుడైనాడు.


🌿పిదప  , ఆ మంత్ర బొమ్మ 

మూడు వ్రేళ్ళ రహస్యం ఏమిటి ? అని రాజు ,బ్రాహ్మణుని అడిగాడు.


🌸రాజా ! .. బొమ్మ మూడు వ్రేళ్ళు ఎత్తి  చూపి  , నేను

మూడు పూటలా చేసే 

గాయత్రి మంత్ర  జప పుణ్యఫలం దానంగా అడిగినట్లు తలచి,  ' వీలుకాదు' అని ఒప్పుకోలేదు.


🌿తరువాత రెండు వ్రేళ్ళను

మాత్రమే చూపింది బొమ్మ, 

అప్పుడు కూడా, రెండు

పూటలా జపించిన గాయత్రి

మంత్ర జప  పుణ్య ఫలాన్ని

అడుగుతున్నదని తలచి

ఇవ్వను అని చెప్పాను. 


🌸ఆఖరికి ఒక వ్రేలు చూపినది

బొమ్మ.   మహారాజావారి ఆరోగ్యాన్ని కాపాడడం కోసం వెంటనే ఒక  పూట నేను జపించిన గాయత్రీ మంత్ర

పుణ్య ఫలాన్ని  యివ్వడానికి

సమ్మతించి ఆ పుణ్యఫలాన్ని

ధారపోశాను. 


🌿దాని ఫలితంగా 

బొమ్మ కత్తిని క్రింద పడవేసింది.   అని బ్రాహ్మణుడు  వివరించాడు.


🌸రాజు గారు , గాయత్రీ మంత్ర

జప పుణ్యఫలాలను, 

అర్ధం చేసుకొని, బ్రాహ్మణునికి

విలవైన కానుకలను యిచ్చి

సత్కరించాడు.


🌿ఒక పూట గాయత్రీ జపానికే అంతటి మహత్తు వుంటే , నిత్యమూ నియమ నిష్టలతో భక్తితో గాయత్రీ మంత్రాన్ని జపించేవారు మరెంతటి మహిమాన్విత శక్తులు కలిగివుంటారో ఊహించలేము స్వస్తి...🙏💐

🌹ఓం శ్రీ గాయత్రి మాత్రేనమః…🙏


A collection from 

🙏mi Nagaraju Ravula guru swami 🪴🙏

 *ॐ            श्री आदित्य हृदयम्* 

            *శ్రీ ఆదిత్య హృదయమ్* 

        *SRI ADITYA HRUDAYAM* 


     *(महाकाव्य रामायण में युद्ध कांड से)* 

           *(శ్రీరామాయణాంతర్గతం)* 

   *(FROM SRIMADRAAMAAYAN)* 


                                *శ్లోకం :14/31* 

                        *SLOKAM :14/31* 


*आतपी मण्डली मृत्युः*  *पिङ्गलस्सर्वतापनः ।* 

*कविर्विश्वो महातेजाः*  *रक्तस्सर्वभवोद्भवः ॥१४॥* 


*అతీప మండలీ మృత్యుః* 

*పింగళః సర్వతాపనః I*  

*కవిర్విశ్వో మహాతేజాః* 

*రక్తః సర్వభవోద్భవ ॥* 


    *వేడిని కలిగియుండువాడు,*  

    *వృత్తాకారమైన బింబము గలవాడు,* 

    *విరోధులను రూపుమాపుతాడు.* 

    *ప్రభాతసమయమున పింగళవర్ణము కైగియుండువాడు,* 

    *మధ్యాహ్న సమయమున సర్వప్రాణులను తపింపజేయుచుండువాడు.* 

    *వ్యాకరణాది సమస్త శాస్త్రముల యందును పండితుడు.* 

    *విశ్వమును నిర్వహించువాడు,* 

    *గొప్ప తేజస్సు గలవాడు.*  

    *సకల ప్రాణులయందును అనురక్తి గలిగియుండు వాడు,*  

    *సమస్త ప్రాణుల ఉత్పత్తికి కారణమైనవాడు.*  


   *भगवान सूर्य वह हैं जो अंतरिक्ष के स्वामी हैं,* 

    *वे उत्पन्न करते हैं और गर्मी फैलाते हैं,* 

    *जीवन का निर्माण करते हैं और जीवन का अंत करते हैं।*

    *वह ब्रह्मांड में कार्रवाई को प्रेरित करता है।* 

    *वह सर्वव्यापी है।* 

    *उनकी चमकदार लाल किरणें इस ब्रह्मांड में जीवों को जीवित कर देती हैं।* 


*(Salutations to the Sun God)* 

    *His great orb (Mandala) which is full of Heat is like an incarnation of Death (Mrityu),* 

    *having Reddish Brown colour and burning everything within it.* 

    *He is a Poet who creates the World (by supplying energy for activities);* 

    *His great Fiery Energy, Red in colour, gives rise to this entire Worldly Existence.* 


https://youtu.be/T4CkKYfYhYw


                      *=x=x=x=*


  *— రామాయణం శర్మ* 

           *భద్రాచలం*

ముసలితనం

 శ్లోకం:☝️

*వార్ధక్యం వయసా నాస్తి*

  *మనసా నైవ తద్భవేత్‌ l*

*సంతతోద్యమ శీలస్య*

  *నాస్తి వార్ధక్య పీడనమ్‌ ll*


భావం: ముసలితనం వయసులో లేదు. మనసులోనూ ఉండకూడదు. ఎప్పుడూ పని చేసుకునేవానికి ముసలితనపు పీడ ఉండదని భావం. 


ముసలితనం రెండు రకాలుగా వస్తుంది. వయోభారంతో వచ్చేది శారీరకం. దుఃఖం వల్ల వచ్చేది భావజం. వయోభారం వల్ల వచ్చేది కూడా ఆపాదింపబడిన ముసలితనమే. కొంతమంది యాభయ్యవ పడిలోకి రాగానే వృద్ధులయ్యారంటారు. కొందరు అరవై సంవత్సరాలకు ముసలివారనిపించుకుంటారు. 70 ఏళ్లు వచ్చినా చురుగ్గానే ఉండేవారు మరికొందరు. శరీర బలం తగ్గి, అవయవాలు పటుత్వం కోల్పోయి, నరాల కండరాల పట్టు సడలినా.. బుద్ధిబలంతో నిత్యం విజయాలను సాధించేవారు ఉన్నారు. కొందరికి సోమరితనం వల్ల వృద్ధాప్యం వస్తుంది.


పని చేయడానికి బద్ధకించి పని సామర్థ్యాన్ని కోల్పోతే దాన్ని మించిన వార్ధక్యం మరొకటి లేదు. అటువంటివారు సమాజ ప్రగతికే కాక సొంత ప్రగతికి కూడా శత్రువులే. అతి పిసినారితనం, స్వార్థం, మద్యపానం, ధూమపానం, మత్తుమందుల వాడకం వంటి దురలవాట్లు శరీరంలో అనేక సామర్థ్యాలను బలహీనపరుస్తాయి. అకాల వార్ధక్యానికి దారి తీస్తాయి. ఆయుర్దాయాన్ని తగ్గిస్తాయి. అటువంటి వృద్ధులు తమ కుటుంబాలకు సమాజానికి కూడా భారమే. 


మానసిక ఒత్తిడులు, కుంగుబాటు వల్ల వచ్చే ముసలితనం చెదపురుగులాంటిది. మనిషి భవితను సమూలంగా తినేస్తుంది.


మానసిక వృద్ధాప్యం అంటే.. ‘నాకు ముసలితనం వచ్చేసింది’ అనే భావన. అలాంటి వృద్ధాప్యాన్ని రానీయకూడదు. 


‘సంతతోద్యమ శీలస్య నాస్తి వార్ధక్య పీడనం’ అన్న మాటలను గుర్తుపెట్టుకుని ఏదో ఒక పని పెట్టుకోవాలి. 


భారతీయ సంప్రదాయంలో జ్ఞానవార్దక్యాన్ని అంగీకరించారు గానీ వయో వార్ధక్యాన్నికాదు. 


భరద్వాజ మహర్షి మూడు ఆయుర్దాయాల కాలం తపస్సు చేసి జ్ఞానాన్ని సంపాదించాడని పురాణ ప్రతీతి. 


నిత్యవ్యాయామం, యోగాభ్యాసం, సద్గ్రంథ పఠనం, సతతక్రియాశీలత, మితాహారం, హితాహారం, ఇష్టదేవతా ఉపాసనం, ఇవి ఉన్న చోట ముసలితనం ఉండదు.!!


ఓం నమో భగవతే వాసుదేవాయ!🙏

28, జనవరి 2023, శనివారం

రథోత్సవాలు

 మువ్వురు మానవులకు రథోత్సవాలు


దాదాపు ముప్పైయేళ్ళు గడిచిపోయాయి. అప్పుడు నేను కాంచీపురం తాలూకా కార్యాలయంలో రెవెన్యు ఇనస్పెక్టర్ గా పనిచేస్తుండేవాడిని. ఒకరోజు తహసీల్దారు గారు పిలుస్తున్నారని నా సహాయకుడు చెప్పడంతో వెళ్లాను.


“సుబ్రహ్మణ్యన్ ఈరోజు ఎండోమెంట్ బోర్డు కమీషనరు కంచి వస్తున్నారు. ఆయన మన కలెక్టరుకు కూడా స్నేహితులు కనుక కంచి పెరియవా దర్శనానికి దగ్గరుండి ఏర్పాట్లు చెయ్యి” అని ఆదేశించారు.


తరువాత నేను కంచి మఠానికి విషయం తెలిపి, కావాల్సిన ఏర్పాట్లను చేశాను. ముందుగా నిర్ణయించిన సమయానికే ఎండోమెంట్ బోర్డు కమీషనరు మఠానికి వచ్చి, పరమాచార్య స్వామివారికి నమస్కరించి, స్వామి ఎదురుగా కూర్చున్నారు.

దివ్యతేజస్సు ఉట్టిపడుతుండగా మహాస్వామి వారు కమీషనరుతో మాట్లాడటం మొదలుపెట్టారు. వారి సంభాషణ చిన్న దేవాలయాలలో జరగాల్సిన జీర్ణోద్ధరణతో పాటు పెద్ద పెద్ద దేవాలయాలలో చెయ్యాల్సిన కుంబాభిషేకాల దాకా వెళ్ళింది.


శ్రీ శంకరాచార్య స్వామివారికి సాధారణంగా ఒక అలవాటు ఉంది. అక్కడున్న భక్తులను మన ధర్మానికి సంబంధించిన ప్రశ్నలను అడిగి సమాధానం చెప్పమంటారు. వారు ఇరకాటంలో ఉన్నప్పుడు స్వామివారే వాటికి సమాధానాలు చెప్పి అందరినీ సంతోషపరుస్తారు. అలా శ్రోతలను ప్రశ్నలను అడిగి వారే సమాధానాలు చెప్పడం ద్వారా అవి మరుగునపడక బాగా జ్ఞాపకం ఉంటాయని స్వామివారి ఆలోచన.


ఆరోజు కూడా కంచి స్వామివారు ఒక ప్రశ్న అడిగారు. అది కూడా కమీషనరుకే. “ఇది నువ్వు చెప్పగలవా? మానవ జన్మను పొంది పరమపదం చేరిన మువ్వురు వ్యక్తులకు తీర్థ్-తిరువిళ (రథోత్సవం) జరుపుతారు ఇప్పటికి. ఆ మువ్వురు ఎవరు?” అని అడిగారు.


అది అడిగినది కమీషనరుకే ఆయినే అక్కడున్న మేమందరమూ మా బుద్ధికి పనిపెట్టాము. సాధారణంగా రథోత్సవం దేవుళ్ళకు మాత్రమే చేస్తాము. కానీ పరమాచార్య స్వామివారు అడుగుతున్నది మానవులుగా పుట్టినవారు అని!

మా పరిస్థితిని గమనించిన స్వామివారు “మరొక్క ఐదు నిముషాల సమయం ఇస్తాను. ఎవరైనా సమాధానం చెప్పవచ్చు” అని అన్నారు.


ఐదు నిముషాలు గడిచినా ఎవ్వరం సమాధానం చెప్పలేకపోయేసరికి స్వామివారు, “పర్లేదు. మిమ్మల్ని మీరు బాధపెట్టుకోకండి. నేనే సమాధానాలు చెబుతాను” అని చెప్పనారంభించారు.


“’చూడికొడుత్త నాచ్చియార్’ గా ప్రసిద్ధి పొందిన ఆండాళ్ కు శ్రీవిల్లిపుత్తూర్ లో రథోత్సవం; శ్రీవైష్ణవ స్థాపకులైన శ్రీ రామానుజులకి శ్రీపెరుంబదూర్ లో రథోత్సవం; శ్రీ మాణిక్యవాచకులకు తిరుప్పేరుందురైలో రథోత్సవం జరుగుతాయి. ప్రతి సంవత్సరం వీరు మువ్వురికి పెద్ద ఎత్తున రథోత్సవం జరుగుతుంది. ఇటువంటి చిన్ని విషయాలు కూడా మీకు తెలిసిఉంటే మంచిది, అందుకనే అడిగాను” అని చిన్నపిల్లాడిలా గట్టిగా నవ్వారు.

ఆ నవ్వు ఎలాంటిది అంటే పచ్చని చెట్టుకు కొట్టిన మేకులాగా ఇప్పటికి నా జ్ఞాపకాల పొరల్లో తాజాగా ఉంది.


--- ఏరాసు, చెన్నై - 61. మహాపెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 2


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

గంగా పుష్కరాలు

 *గంగా పుష్కరాలు 2023*

                                                                           హిందూ సంప్రదాయంలో మానవుడు నీటిని 

గంగా, 

యమునా, 

గోదావరి, 

కావేరీ 

మొదలైన నదులను స్త్రీశక్తి రూపాలుగా పూజిస్తారు. ఒక్క బ్రహ్మపుత్ర తప్ప మిగిలిన నదులన్నీ స్త్రీల పేర్లతో ఉన్నాయి. మానవుడు ఆచరించు అన్నిరకాల  మంగళకరమైన అర్చనలు, ఆరాధనలు, క్రతువులు, యజ్ఞాలు మొదలైన సంప్రదాయాలన్నీ నీటితో ముడిపడి ఉన్నాయి. అంతేకాక శ్రాద్ధకర్మలు, పిండ ప్రదానాలు, తర్పణాలు మొదలైన ఖర్మలుకూడా నీటితో ముడిపడినవే. స్నానాలు అన్నిటిలో పుష్కరసమయంలో సంబంధిత నదీస్నానం చేయడం పుణ్యప్రథమని పురాణాల్లో తెలుపబడింది. పుష్కరసమయంలో సంబంధిత నదులు ప్రవహించు పరీవాహకప్రాంతాలో ముఖ్యంగా పుణ్యక్షేత్రాలలో మరణించిన పూర్వీకులకు  శ్రాద్ధకర్మలు, పిండ ప్రదానాలు, తర్పణాలు మొదలైన ఖర్మలు చేయుట ఉత్తమమని కూడా తెలుపబడింది. బ్రహ్మ ఆకాశం, వాయువు, జలం, అగ్ని,భూమి అను పంచ భూతాలు సృష్టించగా పంచ భూతాల నుండి జీవులు పుట్టాయని ఉపనిషత్తుల సారాంశం. మనిషి ఉదయం నిద్రలేచింది మొదలుగా  నిద్రకు ఉపక్రమించేవరకు దైనందిన కార్యక్రమాలు నీటితో ముడిపడ్డవే. మానవజీవితంలో ప్రధానమైన నీటి  ప్రాముఖ్యత గుర్తుచేసేవే పుష్కరాలు.

దైనందిన కార్యక్రమాలలో 12 సంవత్సరాలు కాలం లేదా సమయం చెప్పడానికి పుష్కరకాలం అనిచెప్పడం సాధారణం.. మనదేశంలోని 12 ముఖ్యమైన నదులకు నదికి సంబంధించిన రాశిలో  బృహస్పతి ప్రవేశించినట్లు గణనచేసి ఆనదీజలం సాధారణ రోజులకంటే 12 రోజుల కాలం పుష్కరాలకాలం పవిత్రమైనట్లు భావిస్తారు. పుష్కరాలకుకల ఖ్యాతిపై కధనం ఉన్నది. పురాణకథ ప్రకారం  పుష్కరుడనే బ్రాహ్మణుడు శివుని కోసం తపస్సుచేయగా శివుడు ఆయన భక్తికిమెచ్చి ప్రత్యక్షమై వరం కోరుకోమ్మని అడిగాడు.  పుష్కరుడు జీవులు చేసిన పాపాలవల్ల వారు స్నానంచేసిన నదులు అపవిత్రమవుతున్నాయని,నదులు పునీతమైతే ప్రజలు సుభిక్షంగా ఉంటారని, లోకహితం కోరి తన శరీర స్పర్శచే నదులు పునీతమయ్యేట్లు వరం ఇవ్వమని అడిగాడు. శివుడు పుష్కరుడు ఏ నదిలో ప్రవేశిస్తే ఆనది పుణ్యతీర్థం అవుతుందని, ఆ నదీలో స్నానం ఆచరించిన వారంతా పాప విముక్తులవుతారని వరం ఇచ్చాడు.  

సింధూనదికి కుంభ రాశిలో  20-11-2021 తేదీన  ప్రణహితనదికి మీన రాశిలో 13-04-2022 తేదీన పుష్కరాలు జరిగియున్నవి. రాబోవు పుష్కరాలు గంగానదికి  మేష రాశిలో 22-04-2023 తేదీన, రేవానదికి (నర్మదకు ) వృషభ రాశిలో 01-05-2024 తేదీన,  సరస్వతీనదికి మిథున రాశిలో 14-05-2025  తేదీన,

యమునానదికి  కర్కాట రాశిలో 01-06-2026తేదీన,  గోదావరినదికి  సింహ రాశిలో 26-06-2027 తేదీన,

కృష్ణా నదికి కన్యా రాశినందు  24-07-2028 తేదీన ,

కావేరీ నదికి తులారాశినందు 24-08-2029 తేదీన, భీమానదికి వృశ్చిక రాశిలో 23-09-2030 తేదీన,తపతి పుష్కరవాహినికి ధనస్సు రాశినందు 15-10-2031 తేదీన మరియు తుంగభద్రనదికి మకర రాశినందు 24-10-2032  తేదీన పుష్కరాలు ప్రారంభమౌతాయి..

బృహస్పతి మేషరాశిలో ప్రవేశించినప్పుడు గంగా పుష్కరం 22-04-2023 తేదీన  ప్రారంభమైబృహస్పతి పన్నెండో రాశిఅయిన మీనంలో ప్రవేశించినప్పుడు 03-05-2023 తేదీన ముగుస్తుంది. పుష్కరకాలము సాధారణముగా ఒక సంవత్సరము అనిచెప్పబడింది. పుష్కర కాలంలో  22-04-2023  నుండి మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరంఅని, చివరి పన్నెండు రోజులు 03-05-2023 వరకు అంత్య పుష్కరంగా వ్యవహరిస్తారు. సంవత్సరకాలంలో ఆది మరియు అంత్య పుష్కరాల పన్నెండు రోజులు ప్రత్యేకమైనవి. అంత్య పుష్కరాలకంటే ఆదిపుష్కరాలు పన్నెండురోజులు పవిత్రమైయనవి. బృహస్పతి మేషరాశిలో ప్రవేశించినప్పటి నుంచి 12 రోజుల పాటు గంగా నదికి పుష్కరుడు సకలదేవతలతో ఉంటాడని పన్నెండు రోజూలలో గంగానదిలో స్నానం చేయటంవలన సకల తీర్థాలలో స్నానంచేసిన ఫలితం దక్కుతుందని గంగానదిలో అనేకమంది భక్తులు స్నానాలుచేస్తారు.

హిందువులు గంగాదేవిని పాపములను తొలగించి శుద్ధిచేయు దేవతగా పూజిస్తారు. మొసలి వాహనధారి అయిన  గంగను అందమైన స్త్రీగా అభివర్ణిస్తారు. ఋగ్వేదంలో గంగ నదులలో పవిత్రమైనదిగా పేర్కొనబడింది. గంగాదేవి రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాల్లో ప్రముఖంగా ప్రస్తావించబడింది. రామాయణం ఆమె పర్వతరాజు హిమవంతుని ప్రధమ సంతానంగా పార్వతి సోదరిఅని తెలుపుతుంది. బ్రహ్మ హిమవంతున్ని సృష్టించి హిమాలయాలకు రాజును చేశాడు.  హిమవంతుడు మేరు అను పర్వతరాజు కుమార్తె మేనవతిని వివాహం చేసుకున్న చాలాకాలం పిమ్మట  వారికి కుమార్తె జన్మించగా ఆమెకు గంగఅని పేరుపెట్టారు. పిమ్మట వారికి సతీదేవి అవతారమైన పార్వతి కుమార్తెగా జన్మించింది. గంగ పెద్దయ్యాక, దేవతలు ఆమెను స్వర్గానికి తీసుకువెళ్లారు, ఆమె నది రూపంలో ప్రవహించింది. 

మహాభారతంలో గంగ కురువంశరాజైన శంతనుని భార్యగా భీష్మునితో ఎనిమిదిమంది వశువులకు తల్లిగా తెలుపబడింది. బ్రహ్మ గంగ మరియు శంతనులను భూలోకంలో జన్మించమని శాపంఇచ్చాడు. శంతనుడు గంగానది ఒడ్డున గంగాదేవిని కలుసుకుని తనను పెళ్లి చేసుకోమని కోరాడు. తన చర్యలను శంతనుడు ప్రశ్నించకూడదనే షరతుపై ఆమె ఆతని ప్రతిపాదనన అంగీకరించింది. శంతనుడు వారు వివాహంచేసుకొని కలిసి జీవించి వసువుల అవతారమైన ఎనిమిదిమంది కుమారులను పొందారు. శాపగ్రస్తులైన వారు భూమిపై జన్మించి నప్పుడు తమజీవితాన్ని ముగించమని గంగను కోరారు. వారి అభ్యర్థనప్రకారం శంతనుని ఎదురుగానే గంగ సంతానాన్ని గంగలో పారవేయడం ప్రారంభించింది. ఎనిమిదవ కుమారుడైన భీష్ముని గంగలో ముంచబోగా, శంతనుడు అడ్డుకున్నాడు.గంగ భీష్మునితో వెళ్లిపోయి అతనికి పదేళ్ల వయసులో శంతనునికి  తిరిగి అప్పగించి వెళ్లిపోయింది. 

భాగవత గ్రంధంలో విష్ణువు గంగకు మూలమని పేర్కొనబడింది. కధనంప్రకారం, వామన అవతారంలో విష్ణువు తన ఎడమపాదాన్ని విశ్వమంతా విస్తరించి బొటనవేలు గోరుతో ఒక రంధ్రం ఏర్పరచాడు. రంధ్రంద్వారా, సముద్రంనీరు స్వచ్ఛమైన గంగానదిగా భూమిపై ప్రవేశించింది. ఎర్రటి కుంకుమరంగు కల వామనుని పాదాలను కడిగిన తరువాత, గంగ గులాబీరంగు పొందింది. విశ్వంలోకి వచ్చేముందు గంగ విష్ణువు పాదాలను తాకింది కాబట్టి గంగను విష్ణుపది అనిపిలుస్తారు.భూమిపైకి దిగేముందు గంగ బ్రహ్మలోకంలో ఉండిపోయిందని నిర్ధారణ అయింది. ఆమె రాజర్షి భగీరథుని తపస్సువల్ల మరియు శివుని వరంప్రభావంతో భూమిపైకి దిగింది.

సాగరరాజు వంశస్థుడైన భగీరథుడి ప్రయత్నాలద్వారా గంగ భూమిపైకి వచ్చిన కథ రామాయణం, మహాభారతం మరియు వివిధ పురాణాల్లో వివరించబడింది.సాగర రాజు అశ్వమేధయాగం చేసి గుర్రాన్ని సంచరించడానికి వదిలి వేశాడు.యాగం విజయవంతం కాకుండా ఇంద్రుడు అశ్వాన్ని దొంగిలించాడు.గుర్రం అదృశ్యమైందని సాగరరాజు తన అరవైవేలమంది కొడుకులను గుర్రాన్ని వెతకడానికి పంపాడు. వారు పాతాల లోకంలో కపిలమహర్షి ఆశ్రమంలో గుర్రాన్ని కనుగొన్నారు. కపిలమహర్షి గుర్రాన్ని దొంగిలించాడని భావించి, ఆయన ధ్యానంలో ఉండగా వారు ధ్యానాన్ని ఆటంకపరచారు. కపిలమహర్షి కోపించి తనచూపులతో అరవై వేలమందినీ కాల్చి బూడిదచేసాడు.వారిఆత్మలకు విముక్తి కలిగించడానికి పరిహారం కపిలమహర్షినుండి తెలుసుకోడానికి సగరరాజు మనవడైన అంశుమాన్‌ని పంపాడు. స్వర్గంనుండి ప్రవహింఛు గంగ మాత్రమే వారిని విముక్తి చేయగలదని కపిలమహర్షి తెలిపాడు.

అంశుమాన్ మనుమడు భగీరథుడు తీవ్రమైన తపస్సుచేసి, బ్రహ్మ మరియు శివుని అనుగ్రహాన్ని పొందాడు. బ్రహ్మ గంగను భూమిపైకి దిగడానికి అనుమతించగా, శివుడు గంగ ఉధృతి తగ్గుటకు కేశములందు బంధించి ఒకపాయగా భూమిపై వదిలాడు. శివుని జటాఝూటం (కేశముల) నుండి గంగానది గంగోత్రివద్ద ఉద్భవించింది. గంగను భగీరథుడు సముద్రానికి అక్కడనుండి, పాతాళానికి ప్రవహింపచేశాడు. గంగానది భూమిపై ప్రవహించుప్పుడు జాను మహర్షి యొక్క ఆశ్రమంలో హోమాగ్ని ఆర్పివేసింది. మహర్షి  ఆగ్రహించి మొత్తం గంగను మ్రింగివేశాడు. భగీరథుని విజ్ఞప్తిపై, జాహ్నాఋషి ఆమెను తన ఎడమచేవినుండి వదలిపెట్టాడు. అందువలన గంగను జాహ్నవిఅని అంటారు. పిమ్మట గంగ పాతాళంలోని కపిలమహర్షి  ఆశ్రమానికి చేరుకొని, అక్కడ బూడిదగాఉన్నభగీరథుడి పూర్వీకులను శాప విముక్తులను చేసింది.

భగీరధుని కృషి వలన భూమిపైకి వచ్చుటవలన భగీరధిగా పిలువబడు గంగానది భారతదేశంలో మతపరమైన ప్రాముఖ్యత కలిగిన అతిపెద్ద నది. గంగాదేవి స్వర్గం, భూలోకం మరియు పాతాళలోకాల్లో ప్రవహిస్తుంది. గంగానదికి జాహ్నవి, గంగ, శుభ్ర, సప్తేశ్వరి, నికిత, భాగీరథి, అలకనంద మరియు విష్ణుపది వంటి వివిధ నామాలు (పేర్లు) ఉన్నవి. పవిత్రమైన గంగానది దైవత్వం కలిగి స్నానంచేసినంత మాత్రాన సకల పాపములు హరిస్తుంది. మరణించినవారికి పిండప్రదానం చేస్తే వారికి ముక్తి కలిగించి స్వర్గలోక నివాసం ప్రసాదిస్తుంది. హిందూ మతంలో గంగాదేవిని మానవాళికి తల్లిగాతలచి యాత్రికులు తమ బంధువుల చితాభస్మం గంగానదిలో నిమజ్జనం చేయడంద్వారా వారిఆత్మలు శుద్ధి చేయబడి జనన మరణ చక్రంనుండి విముక్తికలిగి మోక్షం పొందుతాయని భావిస్తారు. గంగోత్రి, హరిద్వార్, ప్రయాగ్‌రాజ్, వారణాశి, కలకత్తాలోని కాళీ ఘాట్‌ మొదలైన గంగానది పరీవాహక ప్రదేశాల్లో గంగానదికి పండుగలు జరుపుతారు.

గంగా పుష్కరాలు అనగానే భక్తులు సాధారణంగా కాశీ లేదా వారణాశి వెళ్లడానికి ఉత్సాహం చూపుతారు. వారణాశిలో బస మరియు భోజన సౌకర్యాలు చాలా అభివుద్ధి చెందిఉన్నాయి. కానీ భద్రీనాధ్ వద్దఉద్భవించిన అలాకానంద దేవప్రాయాగ వచ్చుసరికి గొంగోత్రివద్ద ఉద్భవించిన భగీరధితో కలిసి గంగానదిగా ఋషీకేశ్, హరిద్వార్, వారణాసి ప్రవహించి ప్రయాగరాజ్ వద్ద యమున మరియు సరస్వతీనదులతో కలిసి ప్రవహిస్తుంది. గంగా పరీవాహక ప్రాంతంలో ఉన్న ప్రముఖ దివ్యప్రదేశాలు గంగోత్రి, దేవప్రయాగ, ఋషీకేశ్, హరిద్వార్, వారణాసి, ప్రయాగరాజ్, గర్ ముక్తేశ్వర్ (హాపూర్) మరియు గంగాసాగర్ గంగా పుష్కరాల సమయంలో పవిత్రస్నానాలకు మరియు మరణించినవార్కి పిండప్రదానం చేయుటద్వారా వారి ఆత్మలకు మోక్షం కలిగించే దివ్యప్రదేశాలు. ప్రతిక్షేత్రంలో స్నానఘట్టాలు, రవాణా, భోజన వసతి సదుపాయ వివరములు విడిగా తెలియజేస్తాం. 

గమనిక: పుష్కరాల సమయంలో కాశీ (వారణాశి) తోపాటు మిగిలిన క్షేత్రాల్లో                  నదీస్నానం మరియు పిండప్రధానం  చేయవచ్చు గంగోత్రి, దేవప్రయాగ,                                                                           ఋషీకేశ్, హరిద్వార్ ఛోటా చార్ ధామ్ యాత్రనందు భాగమై ఉన్నాయి.  కావున వీలుకొద్దీ వారియాత్ర ఎంచుకొన వలసినదిగా కావున వీలుకొద్దీ  వారియాత్ర ఎంచుకొన వలసినదిగా కోరుతున్నాం.

నేను ఎవడను

 .

                    *సుభాషితమ్*


*శ్లో𝕝𝕝 కుతోఽహమాగతః కోఽస్మి*  

*క్వ గమిష్యామి కస్య వా।*

*కస్మిన్ స్థితః క్వ భవితా* 

*కస్మాత్కిమనుశోచసి॥*

                              ( *మహా భారతం* )


తా𝕝𝕝 *"నేను ఎవడను.ఎక్కడినుండివచ్చాను? ఎక్కడికి పోతాను ?ఎవరితోనైనా నాకు ఉన్న సంబంధం ఏమిటి*? 


*ఏ ప్రదేశంలో ఉన్నాను? ఎక్కడ మళ్లీ జన్మిస్తాను?ఈ ప్రశ్నలకు సరైన సమాధానం మనకు తెలుసునా?* 

*ఇవి అన్నీ బాగా ఆలోచిస్తే ఇంకా దుఃఖించడం ఎందుకు?"*

అరాళ కుంతలా

 అరాళ కుంతలా .🌹

🌺

ఒక రోజు నేను శ్రీ కృష్ణ తులాభారం సినిమా చూస్తున్నప్పుడు అందులో ఎన్ టీ రామారావు, జమున కాళ్ళు పట్టుకుంటే ఆవిడ తన్నిన సన్నివేశం లో ఘంటసాల గారు ఒక పద్యం పాడారు.

నను భవదీయ దాసుని మనంబున నెయ్యపుకిన్‌కబూని తాచిన అది నాకు మన్ననయా

చెల్వగు నీ పద పల్లవంబు మత్తనుపులకాగ్ర కంటకవితానము తాకిన నొచ్చుననుచు నేనయిద

అల్క మానవు కదా ఇకనైన అరాళ కుంతలా ...........

పద్యం అంతా బానే అర్ధం అయ్యింది కానీ .... అరాళ కుంతలా ... అంటే ఏంటో అర్ధం కాలేదు. మా పితృ పాదుల వారు పక్కనే ఉన్నారు కదా అని ఆయన్ని అడిగాను. నేను చదువుకోకుండా సినిమా చూస్తున్నానన్న కోపం లో ఆయన పక్కనే ఎప్పుడూ రెడీ గా ఉంచుకునే కమండలం లో కాసిని నీళ్ళు తీసి "నీకు ఆ పదానికి అర్ధం తెలియకుండు గాక" అని శపించారు. యధా విధి గా నేను శాపవిమోచన మార్గం అడిగాను. అప్పుడు ఆయన "ఆ పదానికి అర్ధం వేరొకరి ద్వారా నువ్వు తెలుసుకుంటావు." అని సెలవిచ్చారు.

పితృపాదుల వారి శాపం కారణం గా నా అంతట నేను దానికి అర్ధం తెలుసుకోలేకపోయాను. సరే అప్పటినుండీ చాలమంది ని అడిగి చూసాను. ఎవరూ అంత స్పష్టమైన సమాధానం చెప్పలేదు. మా పవన్ గాడ్నీ అడిగాను. వాడు "సంస్కృతం లో అరాళా అంటే అరటిపళ్ళు, కుంతలా అంటే ఎంతకిస్తావు?" అని అర్ధం అన్నాడు. ఆహా "అజ్ఞానీ సుఖీ" అని ఎందుకు అన్నారో అర్ధం అయ్యింది.

పోనీ ఎవరైనా అమ్మాయిని అడిగితే (లేదా అలా పిలిస్తే) ఎమైనా తెలుస్తుందేమొ అని మా క్లాస్ మేట్ కన్నడ సూర్య ప్రభ కుట్టింగార్ దగ్గరకి వెళ్ళి "అరాళ కుంతలా" అని పిలిచాను.

"ఒహ్ మై గాడ్!!! నువ్వు మలయాళం ఎప్పుడు నేర్చుకున్నావ్? ఐ టూ లవ్ యూ." అని సిగ్గు పడుతూ చేప్పింది. నేను అవాక్కయ్యాను.

ఇలా లాభం లేదని పేపర్లొ ప్రకటన ఇచ్చాను. "అరాళ కుంతలా ఎవరికైనా తెలుసా? (మధ్యలో "అంటే" అన్న పదం ఆ పేపర్ వాడు ప్రింట్ చెయ్యలేదు) తెలిస్తే నాకు ఫోన్ చేసిన వారికి నా అర్ధ రాజ్యం తో పాటు కన్నడ సూర్య ప్రభ కుట్టింగార్ ని ఇచ్చి వివాహం చేస్తాను" అని ప్రకటించాను.

ఒకడు ఫోన్ చేసి " సార్!!!!! నాపేరే అరాళ కుంతలా. మాది ఒరిస్సా. అర్ధ రాజ్యానికి దస్తావేజులు ఎప్పుడు ఇస్తారు? పెళ్ళి మాత్రం గ్రాండ్ గా చెయ్యాలి" అన్నాడు. ఫోన్ తీసి నేలమీద కొట్టాను.

ఈ విషయం గురించే చాల రోజులు ఆలోచించాను. పోనీ ఎవరైనా తెలుగు మాస్టారు కి తెలుస్తుందేమో అని మా ఇంటి పక్కనే ఉన్న స్కూల్ కి వెళ్ళి ఒక పిల్లని ఆపి తెలుగు మాస్టారు కోసం అడిగాను. ఆ పిల్ల "తెలుగు????? మీన్స్ వాట్?" అంది. మన భాష కి పట్టిన దౌర్భాగ్యానికి ఆ రోజు నేను అన్నం తిన లేదు. ఆ మాట విన్నందుకు ప్రాయశ్చిత్తం ఏంటని మా పితృపాదుల వారిని అడిగాను. రెండు వారాలు ఉపవాసం చేస్తూ, చెట్టు కొమ్మకి తలకిందులు గా వ్రేళ్ళాడుతూ తపస్సు చేయమన్నారు. అది నావల్ల కాక, ఆల్రెడీ అలా తపస్సు చేసిన మా నాన్న గారిని ముట్టు కుని "మమ" అన్నాను.

ఎన్ని రోజులైనా నాకు ఆ పదానికి అర్ధం తెలియ లేదు. ఒక రోజు గుళ్ళో కి వెళ్ళి అష్టోత్రం చేయించుకుంటే పూర్వ జన్మలో చేసిన పాపం ఏదైనా ఉంటే అది నశించి నాకు అర్ధం తెలుస్తుందని పక్కనే ఉన్న అయ్యప్ప గుళ్ళో కి వెళ్ళాను. పూజారి గారు వచ్చి

"నీ పేరు" అన్నారు.

-అప్పారావు -

"గోత్రం"

-అరాళ కుంతల-

పూజారి నన్ను అదోలా చూసి "అయ్యా మీ స్వగ్రామం అండమాన్ దీవులా? అన్నారు.

నా జీవితం మీద నాకే విరక్తి వచ్చింది. ఇంక నావల్ల కాక ఆ పదం గురించి మర్చి పోయాను.

ఈ మధ్య మళ్ళీ ఆ శ్రీకృష్ణ తులాభారం సినిమా చూడటం అనుకోకుండా జరిగింది. మళ్ళీ చెద పురుగు బుర్ర తొలిచెయ్యటం మొదలు పెట్టింది. నా అవస్థ చూసి మా రూం మేట్ సీరియస్ గా "గూగుల్ ఇట్ మ్యాన్" అన్నాడు.

"వార్నీ!!!!!! ఇన్ని రోజులు గా ఈ పని చెయ్యలేదు కదా అని అనుకున్నాను. కానీ మా పితృపాదుల వారి శాపం నాకు ఆ ఆలోచన రాకుండా చేసిందని నా ప్రగాఢ విశ్వాసం. సరే అని గూగుల్ చేసా. ఒక్క పేజీ లో మూడు లింకులు వచ్చాయి. ఒక లింకు తెరవగా అందులో "అరాళ కుంతలా అంటే పొడవైన నల్లని జుట్టు కలది" అని ఉంది.

కళ్ళమంట నీళ్ళు వచ్చాయి. శాపవిమోచనం అయ్యింది. మా రూం మేట్ స్వయం గా అర్ధం చెప్పక పోయినా ఆ ఐడియా ఇచ్చింది తనే కనుక ఆ శాపం వర్క్ అవుట్ అయ్యిందనే చెప్పాలి. ఒక వేళ ఆ అర్ధం కనక తప్పు ఐతే దయాద్ర హృదయం కలిగిన మారాజులు కాని మారాణులు కాని నాకు చెప్పవలసింది గా నా

ఆర్ద్రత తో కూడిన ప్రార్ధన . (ఆర్ద్రత అంటే ఏంటి? తరవాతి చెదపురుగు)

 కొస మెరుపులు:

1. ఈ పరిశోధన వళ్ళ నాకు వెండ్రుక అనే అనే పదం తెలిసింది. ఇన్నాళ్లు వెంట్రుక అని మాత్రమే తెలుసు. నిఘంటువులో 'వెండ్రుక'కే అర్ధం ఇవ్వబడింది. వెంట్రుక కోసం వెతికేతే వెండ్రుకని చూడుము అంటుంది.

2. శ్రీ కృష్ణుడికి సత్యభామ కాలు తాకడం కేవలం నంది తిమ్మన గారి కల్పన మాత్రమేనట. ఆ కల్పన ఎందుకు చెయ్యవలసొచ్చిందనడానికి ఒక కత ఎక్కడో చదివినట్టు గుర్తు. ఒకానొక సందర్భంలో శ్రీ కృష్ణదేవరాయలు వారికి వారి భార్యామణి కాలు తగిలిందని ఆయన భార్యమీద కోపంతో మాట్లాడకుండా ఉన్నాడంట. విషయం తెలిసిన నంది తిమ్మన భార్య కాలు తాకడం తప్పుకాదు అని రాయలవారికి చెప్పడంకోసం ఈ కల్పన చేసాడంట.


😀😀😀😀😀😀😀😀😀😀😀😀

స్వ ధర్మో నిధనం శ్రేయః

 నేను మతం మారి మీకు సేవ చేస్తాను.....

ఒకసారి పరమాచార్య వారు తమినాడు లోని కరంబకుడి నుండి పట్టుకొట్టయ్ అనే గ్రామానికి మకాం మారుస్తున్నారు. ఆయన కోసం కరంబకుడి నివాసి అయిన ఒక ముస్లిం వృద్దుడు వెనక పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అది మంచి ఎండా కాలం. రొప్పుతూ వస్తున్న వృద్దున్ని చూసి స్వామి ఆగారు.వృద్దుడు పండ్లు, పూలు స్వామి కి సమర్పించి నమస్కరించి నిలుచున్నాడు.

స్వామి "మీరు నన్ను కరం బకుడి లో చూచారుగా. మరల ఇంత రొప్పుతూ ఎందుకు వచ్చారు."

ముస్లిం వృద్దుడు " నేను మిమ్మల్ని కరంబకుడి లో చూసాను. అయినా మిమ్మల్ని చూడకుండా ఉండలేననిపించి మరల వచ్చాను. మా మతం లో అల్లా కు రూపం లేదు ఉంటే మీలా ఉంటాడు. అని నా అభిప్రాయం అందుకే మిమ్మల్ని చూడాలనిపించింది. మీ మతం లోకి మారి మీరు కోరిన సేవ చేస్తాను. నన్ను మీ మతం లోకి చేర్చుకొని మీ సేవా భాగ్యం కలిగించండి. "కన్నీళ్లతో గద్గద స్వరంతో.

స్వామి కరుణ వర్షించే కళ్ళతో చూస్తూ "మీకు నన్ను చూడాలనిపించి నప్పుడు నన్ను తలుచుకోండి. మీ ఆలోచనలలోకి నేను వస్తాను. అప్పుడు నేను మీ దగ్గర ఉన్నట్లే. దానికోసం మతం మారకూడదు." అని అనునయంగా చెప్పి స్వామి ముందుకు సాగారు.స్వామి కనుమరుగయ్యే వరకు కన్నీళ్లతో స్వామి నే చూస్తూ వృద్దుడు ఆగిపోయాడు.

**** మతం మానవుడు ఏర్పరుచుకున్న

కొన్ని కట్టుబాట్లు సంప్రదాయాల, విశ్వాసాల హద్దు.స్వామి వారు ఎవరి హద్దులలో వారుండి గమ్యాన్ని చేరవలేనని విశ్వసిస్తారు . "స్వ ధర్మో నిధనం శ్రేయః "అనే గీతాచార్యుని అభిప్రాయమే స్వామి వారి అభిప్రాయం.

దైవ సన్నిధి

 దైవ సన్నిధి 

తిరుమల కొండమీద కాలుపెట్టినది మొదలు ఏదోతెలియని ఒక దివ్య మనోభావన నిజానికి మనం భూమిమీదనే వున్నా సాక్షాత్తు ఆ వైకుంఠానికి వచ్చినంతగా మనం  ఆనందపడతాము. అందుకేనేమో కలియుగ వైకుంఠంగా తిరుమల క్షేత్రాన్ని అభివర్ణించారు. అక్కడ మన ఊరువారు ఎవరైనాకనపడితే మీకు దర్శనం అయ్యిందా, లేదండి ఇందాకనే వచ్చాము ఇంకాదర్శనం కాలేదు,  మా టికెట్లు సాయంత్రం 3 గంటలకు మేము ముందే బుక్ చేసుకున్నాము. అని ఇలా అనేక విధాలుగా శ్రీ వెంకటేశ్వర స్వామి గూర్చే ముచ్చటిస్తూవుంటారు.  నిజం చెప్పాలంటే తిరుమల కొండమీద గడిపిన రెండు మూడు రోజులు ప్రతివారు వారి నిత్య సాధారణ జీవితాన్ని పూర్తిగా మరచి కేవలం స్వామి గూర్చి మాత్రమే ఆలోచిస్తారు. దర్శనం టికెట్ కొనలేనివారు, దొరకని వారు గంటలకొద్దీ క్యూ షెడ్లలో ఉండి మరి స్వామివారి దర్శనం చేసుకోవటం కోసం ఎదురుచూస్తారు. అయ్యో ఇంతసేపు నేను క్యూలో ఉండాలా అని ఏమాత్రం సంకోచించరు  గోవిందా, గోవిందా అని గోవిందనామ స్మరణతో తిరుమల అంతా మారుమోగుతోంది.  అక్కడ ఉన్నంతసేపు త్రాగమా, తిన్నామా అనే భావన కూడా కలుగదు అంటే ఆకలి దప్పులు వేయవన్నమాట. మనుషులంతా గుండు చేయించుకొని వీధులమీద దర్శనమ్ ఇస్తారు. జుట్టుతో వున్నవారు అతితక్కువ మంది కనపడాతారు. గుండు చేయించుకోలేదు అంటే వాళ్ళు అప్పుడే బస్సు దిగారని అర్ధం. ఇదంతా యెట్లా సాధ్యం అంటే అదంతా అదేవ దేవుడి లీల అని అంటారు. 

దాదాపు తిరుమల దర్శించుకున్న భక్తులు అందరు తలనీలాలు సమర్పించటం అంటే గుండు చేయించుకోవటం ఆనవాయితీ. పిల్లలు ఎవరైనా నేను గుండు చేయించుకొని అంటే తప్పు అట్లా అనకూడదు కళ్ళు పోతాయి అని తల్లిదండ్రులు పిల్లలకు బలవంతంగా మరి గుండు చేయించటం మనం చూస్తూ ఉంటాం. కొంతమంది స్త్రీలు కూడా శిరోముండనం చేయించుకోవటం మనమెరుగుదము. ఇప్పుడు స్త్రీల నిమిత్తం నారి క్షురకులని దేవస్థానం ఏర్పాటు చేసిన విషయం మనకు తెలిసిందే. ముందుగా గుండు చేయించుకొని అటు పిమ్మటే స్వామి దర్శనం.  కొంతమంది ఆన్లైనులో ఇంటివద్దనే పూర్తీ కార్య క్రమాన్ని (ప్రోగ్రాం) నిర్ణయించుకొని తిరుపతికి రావటం మనమెరుగుదము.  మనిషికి దేహవ్యామోహాన్ని కలుగచేసేది ముఖము అందునా సుందరమైన కేశాలు దేహసౌందర్యాన్ని ఇనుమిడింప చేస్తాయి. అంటే ఒక మనిషి తాను అందంగా వున్నాను అనుకోవటానికి మూల కారణం  కేశాలు. కేశాలు నిర్ములిస్తే దేహ సౌందర్యం పూర్తిగా పోతుంది.  అందుకేనేమో ఈ ముండనవిధి.  శరీరం అందంగా .లేదని ఎప్పుడైతే మనిషి తెలుసుకుంటాడో అప్పుడు దేహవ్యామోహం వదిలి మనస్సు దైవం వైపు మళ్లుతుంది. మన ధర్మంలో సన్యాసులు ముండనం చేసుకొని ఉండటం చూస్తున్నాము. ఏతావాతా తేలేది ఏమిటంటే మనం దేహవ్యామోహం వదిలి దైవ చింతన చేయాలని.మాత్రమే  

సముద్రమట్టానికి ఎగువకు వెళుతున్నకొద్దీ అంటే సముద్రమట్టానికన్నా ఎక్కువ ఎత్తుకు వెళితే మనకు వాతావరణ పరిస్థితుల్లో ఎన్నో మార్పులు వస్తాయి అవి వాతావరణ పీడనం, గురుత్వాకర్షణ శక్తిలో తేడా, అంతే కాకుండా గాలిలో ఆక్సిజన్ శాతంలో మార్పు ఇలా అనేకమైన తేడాలు కలుగుతాయి. అందుకే మనకు భూమికన్నా ఎంతో ఎత్తుమీద విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు ఆనందంగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎత్తయిన ప్రదేశాలలో మనిషి మనస్సు ప్రశాంతముగా,  సంతోషంగా,ఆనందంగా ఉంటుంది అన్నది నిజం. ఈ సత్యాన్ని  మన మహర్షులు ఎప్పుడో తెలుసుకున్నారు. ఆ మానసిక స్థితే మనిషిలో ఆత్యాత్మికతను మేల్కొలుపుతుంది. అందుకే  ఎత్తైన గుట్టలమీద, కొండలమీద దేవాలయాలు నిర్మించారు.  ఎప్పుడో నిర్మించిన దేవాలయాలు ఇప్పటికి పుణ్యక్షేత్రాలుగా విలసిల్లుతూవున్నాయి. ఆయా దేవాలయాల్లో నెలకొన్న దేవుళ్ళు  భక్తుల కోరికలు నెరవేరుస్తున్నారు. హిందుత్వంలో ప్రతిదీ శాస్త్రేయత కలిగి ఉంటుంది.  అంతరార్ధం తెలుసుకోలేని మూర్ఖులకు అది అర్ధం కాదు. 

తిరుమల కొండమీద రోజు కొన్ని లక్షలమంది వస్తున్నారంటే దానికి కారణం కేవలం శ్రీ వెంకటేశ్వర స్వామి మాత్రమే కానీ మరొకటి కాదు. ఏడుకొండలు వున్నాయి కానీ ఇతర కొండలమీదికి ఒక్కరు కూడా వెళ్ళరు. ప్రతి భక్తుడు తిరుమలలో వున్నన్ని రోజులు తాను పూర్తిగా దైవ సన్నిధిలో ఉన్నట్లు భావిస్తాడు.  అంతే కాదు ఒక్కొక్క భక్తునికి ఒక్కొక్క రీతిలో స్వామి అనుగ్రహించినట్లు చెప్పుకుంటారు. ఒక్కసారి తిరుమలకు వచ్చిన భక్తుడు ఇంటికి వెళ్లిన తరువాత కొన్నిరోజుల వరకు తిరుమల విశేషాలు చేర్చించుకుంటూ ఆనందిస్తాడు.  ఒక్క మాటలో చెప్పాలంటే తిరుమల యాత్ర ఒక ఆనందానుభూతితో కూడిన అనుభవం.  ఈ అనుభవం ఈ వ్యాసం చదువుతున్న వారందరు పొంది వుంటారు అంటే అతిశయోక్తి కాదేమో. 

తిరుమల వెళ్లకుండానే నీకు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే, నీకు తిరుమల కొండమీద వున్నప్పుడు కలిగే దైవ సన్నిధి అనే ఆనందభావన నీ ఇంట్లోనే కలిగితే యెట్లా ఉంటుంది.  ఆలోచించటానికి చాలా  బాగుంటుంది. కానీ అది యెట్లా సాధ్యం ఎట్టి పరిస్థితిలోకూడా సాధ్యం కాదు ఆలా అని ప్రతివారు అంటారు.  మన ధర్మంలో వున్న గొప్పతనం ఏమిటంటే ఒక నోము, వ్రతము, యజ్ఞ యాగాది క్రతువులు, దేవాలయాలలో దైవ దర్శనం ఇలా కొన్ని సత్ కర్మలు చేయటం వలన మానసికోల్లాసము కలిగి దివ్యమైన ఆనందానుభూతులు పొందుతాము.  తత్ద్వారా  ఏ లక్ష్యంతో ఆ య  సత్కర్మలు ఆచరించారో  ఆ యా లక్ష్య సిద్ది అంటే కోరికలు ఈడేరుతాయి ఒక్కమాటలో చెప్పాలంటే మునకు మన మీద మనకు తెలియకుండా పనిచేసే దైవ శక్తి ప్రేరితం అయ్యి ఆ ఫలితాలను ఇస్తుంది. 

తిరుమలలో ఉన్నంత కాలం ప్రతి భక్తుడు స్వామి సన్నిధిలోనే అంటే ఆయన రాజ్యంలోనే వున్నాడని తనను ఆ శ్రీ వెంకటేశ్వర స్వామే కాపాడుతాడనే ప్రఘాఢ విస్వాసంతో  ఉంటాడు. నిజానికి భక్తుని విశ్వాసమే భగవంతుడు, కాబట్టి తప్పకుండ భగవంతుడు కాపాడుతాడు. "మన ఏవ మనుష్యాణాం కారణం బంధ మోక్షయోః" అని అన్నారు కదా కాబట్టి ఎప్పుడైతే మనిషి మనస్సు పరిశుద్ధంగా దైవస్మరణతో ఉంటుందో అప్పుడు అది తేజోమయంగా, శుద్ధంగా ఉండి ధనాత్మకపు ఆలోచనలు  వస్తాయి. దాని పర్యవసానమే ఆ సత్కర్మ ఫలితాలుగా మనం పేర్కొనవచ్చు.  అందుకే తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని మొక్కుకుంటే కోరుకున్న కోరికలు తీరుతాయి. సాధకుడు ఒక భక్తుడు తిరుమల కొండమీద పొందిన ఆనందానుభూతి తన ఇంట్లో, లేక ఏ చెట్టుకిందనో, నది వడ్డునో, కూడా పొందగలడు అది ఎట్లాగో చూద్దాం. 

చిన్న పిల్లవానికి సైకిలు త్రొక్కటం రాదు అప్పుడు వాడి తండ్రిగారో లేక అన్నగారో సైకిలు పట్టుకొని కొంత సమయం ఊతం ఇచ్చి నేర్పితే అప్పుడు బాలుడు స్వతంత్రంగా సైకిలు  త్రొక్కగలడు. అదేవిధంగా మనలో ఉన్న దైవశక్తిని తెలుసుకోలేక పోవటంచేత మనం కూడా సైకిలు నేర్చుకునే బాలుడు తన తండ్రిగారి మీద ఆధార పడినట్లు మనం భగవంతుని మీద బాహ్యంగా ఆధార పడాలి దానికోసమే తీర్ధాలు,  క్షేత్రాలు. నిజానికి తీర్థక్షేత్ర దర్శనం కేవలం మనలోని దైవాన్ని తెలుసుకోవటం కోసం తీసుకునే శిక్షణ  మాత్రమే. కానీ ఒక సాధకుడు భగవంతుని దర్శించటం కేవలం తనలోనే అనే విషయం తెలుసుకోవాలి. 

భార్గవ శర్మ చెప్పేది ఏమిటంటే మనిషి ఎప్పుడైతే అంతర్ముఖుడు అవుతాడో అప్పుడు తనకు తెలుస్తుంది భగవంతుడు బయట కాదు అంతరంగంలో వున్నాడని అప్పటినుంచి అసలైన వెతుకులాట మొదలవుతుంది అదే సాధనకు నాంది పలుకుతుంది. అప్పుడు సాధకుడు తిరుమల కొండమీద చేసినవే జీవితాంతం చేసి మోక్షాన్ని పొందుతాడు.  కొండమీద ఏమిచేసాడు అని ఆలోచిస్తే ముందుగా కొండ ఎక్కగానే గుండు చేయించుకున్నాడు అలానే తాను మోక్షాన్ని పొందాలనుకునే సాధకుడు దేహవ్యామోహాన్ని తొలగించుకోవటానికి సదా ముండనం చేసుకొని ఉంటాడు.  కొండమీద ఏరకంగా అయితే నిరంతర భగవత్ సంకీర్తనం చేస్తూ ఉంటాడో అలాగే సాధకుడు కూడా నిత్యం ఆ భగవంతునే స్మరిస్తూ భగవంతునిలోనే లీనమై వుంటూ నిరంతర సాధన చేస్తూ ఆత్మలోనే లయం అయి ఉంటాడు.  తత్ ద్వారా జీవన్ముక్తి పొందుతాడు.  సాధన ఎలా చేయాలి ఏ ఏ నియమాలు పాటించాలి అనేవి ఒక సత్ గురువు ద్వారా శిక్షణ పొంది ఆత్మా జ్ఞ్యానాన్ని పొందాలి.

ఓం తత్సత్ 

 ఓం శాంతి శాంతి శాంతిః 

మీ 

భార్గవ శర్మ

 



పంచకర్మ పద్ధతి

 ఆయుర్వేదం నందలి పంచకర్మ పద్ధతి - సంపూర్ణ వివరణ . 


     ఆయుర్వేదము నందు పంచకర్మ చికిత్సకు విశిష్ట స్థానం కలదు . ఈ పంచకర్మ చికిత్సను మొట్టమొదటగా తెలియచేసినవారు చరక మహర్షి . ముందుగా అసలు ఆయుర్వేదము నందు కర్మ అను పదానికి అర్థం తెలుసుకుందాం . 


       విషమదోషములను హరింపచేసి , ధాతువులను పరిశుద్ధముగా చేయు ఒక ప్రత్యేక వ్యాపారం ( Special operation ) నకే కర్మయని పేరు . ఈ కర్మలు 5 విధములుగా శాస్త్రము నందు గ్రహింపబడెను . వీటిలో నస్యకర్మ , వమనకర్మ , విరేచనకర్మ , నిరూహ వస్తి అను 4 కర్మలు శోధనములు (Eliminations ) . అందుచేతనే ఇవి లంకణ చికిత్స యందు ఇమిడి ఉన్నవి . వాతదోషములను హరింపచేసి , వాతదోషము శరీరముకు సంక్రమించకుండా అనువాసవ వస్తికర్మ శమించునదిగా ( Soothing Treatment ) చెప్పబడెను . 


       ఇప్పుడు మీకు పంచకర్మల గురించి సంపూర్ణముగా వివరిస్తాను . 


 *  నస్యకర్మ  - 


        దీనికి శిరోవిరేచన కర్మ అని పిలుస్తారు . ద్రవరూపముగా గాని లేక చూర్ణ ( Powder ) రూపముగా గాని ఉన్న ఔషధములను నాసారంధ్రముల ద్వారా లోనికి పంపుటకే నస్యకర్మ అని పేరు . నాసామార్గములను శుభ్రపరచి , శిరస్సు నందు పేరుకుపోయిన శ్లేష్మమును హరించుట కొరకు ఈ నస్యకర్మ ను ఉపయోగించవచ్చు . 


 *  వమనకర్మ  - 


       వాంతి కలిగించు ఔషధాలను లోపలికి పంపి వాంతి చేపించి ఉదరము నందు గల వ్యర్ధములను బయటకి వెడలించు పద్దతి . 


 *  విరేచనకర్మ - 


       విరేచనములు కలిగించు ఔషధములను లోపలికి ఇచ్చి ప్రేగులు , మలాశయము మొదలగు వాని యందలి వ్యర్థములను విరేచనం ద్వారా బయటకి వెడలించుట. 


 *  నిరూహవస్తి - 


        ఈ ప్రక్రియ నందు ప్రేగులను శుభ్రపరచుటకు కొన్ని ద్రవ్యముల యొక్క కషాయములను గుదమార్గము ( మలద్వారం ) ద్వారా లొపలికి పంపుటకు నిరుహవస్తి అని పేరు . విషమమైన   ఉదావర్తము ( Irregular peristalsis ) చే జనించు ఆంత్రశూల ( Intestinal colic ) యందు మలబద్దకం నందు ఈ నిరుహవస్తి ఉపయోగించవలెను . 


 *  అనువాసనవ వస్తి - 


      దీనినే స్నేహవస్తి అని కూడా చెప్పెదరు . ప్రేగులను శుభ్రపరుచటే కాక , వాతదోషము వలన కలుగు వికారములను ఉపశమిపచేయుటకై ఓషధద్రవ్యములచే తయారుచేయబడిన తైలమును గుదమార్గముగా లోనికి పంపుటనే  అనువాసనవ వస్తి అని పేరు ఇది వాతమును హరించుటలో శ్రేష్టమైనది . 


        ఏయే సమస్యలకు ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి మరియు రోగములకు చేయవల్సిన చికిత్సలలో అత్యంత సులభమైనవి అన్నింటిని నేను రచించిన గ్రంథాలలో సంపూర్ణముగా ఇవ్వడం జరిగింది. వాటిని పరిశీలించగలరు.


   

 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      కాళహస్తి వేంకటేశ్వరరావు 

 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


          ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

            9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .

27, జనవరి 2023, శుక్రవారం

సుబ్బరామయ్య మాష్టర్

 🙏 *ఓం నారాయణ- ఆది నారాయణ* 🙏


*గ్రంథం:* సర్వసమర్థుడు , భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామివారి దివ్య లీలలు

*రచన:* శ్రీ పెసల సుబ్బరామయ్య మాష్టర్ 


*శ్రీ సాయి, శ్రీ స్వామివారు ఒక్కరే!*


*భగవంతుడు ఒక్కడే. కాలానుగుణముగా అనేకమంది మహనీయుల రూపాలలో అవతరించి భక్త రక్షణ చేస్తుంటారు.* ఈ మహనీయుల అందరి మధ్య ఐక్యతేకానీ, సామాన్య మానవులకు వలె విరోధ భావం ఉండదు. శ్రీ సాయినాధుని భక్తురాలికి, శ్రీ వెంకయ్య స్వామివారు భౌతిక దర్శనం ప్రసాదించి, వారి భిక్షను స్వీకరించడం ద్వారా, మహనీయుల మధ్య మనకుండే భేదభావం నశింపజేసుకోమని బోధిస్తున్నారు.


అనంతలక్ష్మి సత్యవతి, నెం.46, 3వ అవెన్యూ DAE టౌన్ షిప్, కల్పాకం - 603 102, తమిళనాడు,


 1997 లో "సాయినాథా! నాకు మంచి క్వార్టరు చూపిస్తే నీ పేరుతో అన్నానికి లేని అభాగ్యునికి అన్నం పెడతానని మొక్కుకున్నారు. తనకు మంచి ఇల్లు దొరికింది. కాని అన్నాని లేని అభాగ్యునికి అన్నం పెడతానన్నమాట చెల్లించలేక ఎవరో ఒక ఆయాకు భోజనానికిగాను డబ్బిచ్చారు. తన తప్పు గ్రహించి నిరుపేదయైన మరొకరికి అన్నం పెట్టాలనుకున్నారు. కానీ 25 రోజుల వరకు ఎవ్వరూ దొరకలేదు. 25 వ రోజున, నేను నా మాట చెల్లించుకోలేకున్నాను బాబా, అన్నానికి లేని నిరుపేదను చూపండి అని చెప్పుకున్నది.


 నాడు మధ్యాహ్నం 11:30 గంటలకు - ఎముకల గూడు వలెనున్న ముసలాయన, భిక్షగాళ్ళెవరూ రాని మా మూడవ అంతస్తు మేడ మెట్లెక్కి వచ్చి, అన్నం అడిగారు. రాత్రి వండిన అన్నం చాలా ఉంది. అది పెట్టాలనుకున్నాను. వెంటనే ఆ తాత "వేడన్నం ఉందా? పెడతావా? అడిగారు. ఆహా! సాయి నా ప్రార్ధన మన్నించి వచ్చాడని వేడన్నం పార్శిలు కట్టి ఇచ్చాను. ఈ లోగా మా ఎదురింటామె కాఫీ ఇచ్చింది. ఆ మెట్ల మీద కూర్చొని తాగారు. ఒక్క నిమిషంలో అన్ని మెట్లు దిగి ఎలా వెళ్ళారో అర్ధం కాలేదు. వచ్చినది సాయినాధుడే అనుకున్నాను. ఆ తర్వాత మా ఇంట్లో సత్సంగం జరిగింది.


*స్మృతి మాత్ర ప్రసన్నాయ నమః* అనే పుస్తకంలోని శ్రీ వెంకయ్య స్వామి బొమ్మచూచాను. ఆనాడు మా యింటికి వచ్చి అన్నం తీసుకవెళ్ళిన మహనీయుడు వీరేనని స్పష్టంగా గుర్తించాను. సాయినాధుని భక్తురాలనైన మా యింటికి నా పిలుపు లేకుండానే భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు వచ్చి భిక్ష గ్రహించారంటే *మహనీయులందరికీ రూపంలో భేదం తప్ప తత్వంలో ఎలాంటి భేదము లేదని బోధిస్తున్నారు*.


🙏 *ఓం నారాయణ -ఆది నారాయణ*🙏

🌹🌹🌹🌹🌹🌹🌹🌹

"ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః"

     'శ్రీ సాయి లీలామృతం, శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర. నిత్య పారాయణ గ్రంథం. రచన పూజ శ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ్ మహారాజ్.'

      "18 వ అధ్యాయం"

     -:శిరిడీలో ఉత్సవాలు:-

    -:పల్లకి - చావడి ఉత్సవం:-

    ఒకరోజు పెద్ద వర్షం వచ్చి మసీదు అంతా తడిసిపోయి బాబాకు కూర్చునేందుకు చోటు కూడా లేకపోయింది. భక్తులు ఆయన నాటి రాత్రికి చావడిలో ఉండమన్నారు. ఆయన అంగీకరించకపోయేసరికి పట్టుబట్టి ఆయనను అక్కడికి తీసుకుపోయారు. ఆ రాత్రి ఆయన అక్కడ విశ్రమించారు. నాటి నుండి ఆయన ఒక రాత్రి మసీదులోనూ ఒక రాత్రి చావడిలోనూ నిద్రించేవారు. వారిని భక్తులు మసీదు నుండి చావడికి వేడుకలతో తీసుకెళ్లడం, క్రమంగా డిసెంబరు 10  1909 నాటికి అది గొప్ప చావడి ఉత్సవంగా రూపొంది, నేటికీ ఇది గురువారం రాత్రి పల్లకి ఉత్సవంగా జరుగుతున్నది.

      ఒకప్పుడు  హార్ధ  నుండి భక్తులు బాబాకోక పల్లకి పార్సిల్ చేసి పంపారు. బాబా దానిని మసీదు ముంగిట పెట్టించి మూడు మాసాలు దానిని తెరవనివ్వలేదు. ఒకరోజు రఘువీరపురంధరే చనువుగా, "బాబా ఈరోజు పల్లకి బయటకు తీసి, పూలతో అలంకరించి, అందులో మిమ్మల్ని చావడికి తీసుకుపోతామన్నాడు."  సాయి ఆ పార్సెల్ ఇప్పడానికే ఒప్పుకోలేదు. అయినా అతడు పంతంగా విప్పుతుంటే బాబా గద్దించి, పట్టరాని కోపంతో సట్కా తీసుకొని చంపేస్తానని అతని మీదకు పరిగెత్తారు. భక్తులు భయంతో పారిపోయారు. పురందరే అదేమీ పట్టించుకోకుండా నెమ్మదిగా పార్సిల్ విప్పి పల్లకిని పూలతో అలంకరించాడు. ఇక బాబా మౌనంగా ఉండిపోయారు. అది చూసిన పురందరే పంతంగా ఇకనుంచి మిమ్మల్ని పల్లకిలో ఊరేగింపుతో చావడికి తీసుకెళ్తాము!  అన్నాడు  అలా మాత్రం ఎన్నటికీ జరగనివ్వను అన్నారు బాబా  అతడు అయితే పల్లకి ఖాళీగా మూసుకుపోతాము ఏమి అన్నాడు   "సాయి ఉగ్రలై నీవు ముందు బయటికి పోతావా లేదా" అని చెడ్డగా తిడుతూ సట్కా తో బెదిరించారు  అతడు త్వరగా ఆ పని పూర్తి చేసి స్వగ్రామం వెళ్ళిపోయాడు. అతడు అనుమతి కోరినప్పుడు బాబా ఏమీ మాట్లాడకుండా ఊది ఇచ్చారు  తర్వాత చావడికి వెళ్ళవలసిన రోజు సాయంత్రం అయ్యేసరికి భక్తులందరూ మొట్టమొదటి పల్లకి ఉత్సవానికి మసీదు వద్ద చేరారు. బాబా మాత్రం పల్లకి ఎక్కనని భీష్మించారు. ఊరి నుంచి అప్పుడేవచ్చినపురందరే తాను సిద్ధం చేసిన పల్లకి లేకుంటే తాను ఉత్సవానికి రానన్నాడు. భక్తులు ఎంత బ్రతిమాలిన బాబా తమ పట్టు విడవలేదు. చివరకు పల్లకీ లో వారి పాదుకలు ఊరేగించాలని, సాయి పాదచారి ఐ ఊరేగింపుతో వెళ్లాలని, రాజీ కుదిరింది. "బాబా పల్లకి నేను కూడా మోసేదా" అన్నాడు పురందరే.  వద్దు నీవు 125 వత్తుల దివిటి పట్టుకో అన్నారు బాబా. అలా దివిటీల ఊరేగింపుతో పల్లకి చావడి చేరింది.

    నాటి ఉత్సవమయ్యాక సాయి పల్లకిని మసీదులో పెట్టనివ్వలేదు. కనుక మూడు నాలుగు రోజులు అది చావడిలోనే ఉన్నది. చివరికి ఎలాగో ఒక రాత్రి మాత్రం మసీదు ముంగిట ఉంచనిచ్చారు. రెండు వెండి సినిమాలు దొంగలు ఎత్తుకెళ్లారు. కనుక దానికి ఒక షెడ్డును నిర్మించ ఆరంభించాడు పురందరే. బాబా లెండి నుండి గబగబ వచ్చి ఏమిటి చేస్తున్నావ్? అని గద్దిస్తే, అతడు నవ్వుతూ చెప్పాడు.! ఆయన ఉ(గ్గు లై నువ్విక్కడినుంచి పోతావా లేక నీ తల పగలగొట్టనా? అని మీదకెళ్లారు. అతడాయనకాళ్ళ వేళ్ళ పడి బ్రతిమాలాడు. ఆయన మరింత గట్టిగా నాకు నువ్వు వద్దు, పల్లకి షెడ్డు అసలే వద్దు; నన్ను విసిగించకు పో... అని అరిచారు. కానీ అతడు చేస్తున్న పనిలో మాత్రం జోక్యం చేసుకోలేదు.

      మధ్యాహ్నం హారతయ్యాక భక్తులందరూ భోజనాలు చేసి తిరిగి మసీదు చేరిన పురందరే మాత్రం వెళ్లకుండా పనిచేస్తూనే ఉన్నాడు  సాయి కొన్నిసార్లు అతని కి నెమ్మదిగా చెప్పారు, మందలించారు, గద్దించారు, భోజనానికి వెళ్లకుంటే కొడతానని బెదిరించారు. అయినా అతడు వినిపించుకోలేదు. పట్టరాని కోపంతో పలక్కుండా పదేపదే అతనికేసి చూస్తారు. చేత్తో పోట్ట తడుముకుంటారు,"ఆపనికిమాలిన వాడు భోజనానికి కూడా పోకుండా నా ప్రాణం తీస్తున్నాడు, నువ్వైనా పిలుచుకుపో!" అని కాక సాహెబ్ తో చెప్పారు  అతడు సెలవు పెట్టాడు  అధయ్యేలోగా పని పూర్తి చేయాలని చేస్తున్నాడు. అతనిని భోజనానికి పిలుచుకెళ్ళనా? అన్నాడు కాక. "వాడు రాడు, ఆ మూర్ఖుడు నేను చెప్పిన వినలేదు! అన్నారాయన. వెంటనే పురందరే వారి పాదాలపై పడి... పసిపిల్ల వానిలా ఏడుస్తుంటే! "ఎందుకు ఏడుస్తావ్? ఊరుకో! అన్నారు బాబా.అతడుకళ్ళుతుడుచుకొని "పొద్దటి నుండి నన్ను ఇంతలా తిడుతున్నారు. కొడతాను, చంపుతాను; అని బెదిరిస్తున్నారు, కానీ నేను ఒక్క పూట భోజనం చేయకపోతే అంత తల్లఢిల్లీ పోతున్నారే! నాపై మీకెందుకు దయ? మమ్మీoతలాపట్టించుకునేదేవరు? అన్నాడు. "నోరు ముయ్! వెళ్లిభోంచెయ్:కడుపుమండిపోతుంది!" అన్నాడు బాబా. అతడు రెండు అడుగులు వేసి, చటుక్కున వెనుక తిరిగి, నేను వెళితే మీరంతా పీకేస్తారు అన్నాడు. బాబా ప్రసన్నులై "నేనేమన్నా రాక్షసుడు నా!!!? నేను అలా ఏమి చేయనులే!" అన్నారు.

        "18 వ అధ్యాయం మొదటి భాగం సంపూర్ణం"

          'శుభం భవతు'

             🙏🙏🙏

కుష్టు రోగము గురించి సంపూర్ణ వివరణ - 1.

: కుష్టు రోగము గురించి సంపూర్ణ వివరణ - 1.


       కుష్టు రోగము మొత్తము 20 రకాలుగా ఉండును. ఇప్పుడు వాటిలోని రకాల గురించి వివరిస్తాను. అవి 


 * పుండరీక కుష్ఠము . 

 

 * విస్ఫోటక కుష్ఠము . 


 * పామాకుష్ఠము . 


 * గజచర్మ కుష్టము . 


 * కాకణ కుష్టము . 


 * కచ్చక కుష్టము . 


 * రుశ్యజిహ్వక కుష్టము . 


 * గళ కుష్టము . 


       పైన చెప్పిన ఎనిమిది మహాకుష్టు రోగములు .  


 * కపాల కుష్ఠు.


 * ఉదుంబర కుష్టు . 


 * మండల కుష్టు . 


 * విచర్చిక కుష్టు . 


 * వైపాదిక కుష్ఠు . 


 * కిట్టిబ కుష్టు . 


 * చర్మదద్రు కుష్టు . 


 * సిద్మ కుష్టు . 


 * శీతరుష్య కుష్టు . 


 * శ్విత్ర కుష్టు . 


 * విసర్ప కుష్టు .  


           పైన చెప్పిన 12 రకాలు మరియు మహా కుష్టులు 8 రకాలు కలిపి మొత్తం 20 రకాల కుష్టు వ్యాధులు ఉండును. 


           ఇప్పుడు మీకు ఒక్కోదాని గురించి సంపూర్ణంగా వివరిస్తాను. 


 * పుండరీక కుష్టు లక్షణము - 


         శరీరంపైన తామరరేకుల వలే మచ్చలు కలుగుట. రక్తం వ్యాపించు వరకు తెలుపుగా దట్టముగా ఉండటం , బరువుగా ఉండటం, నీరుకారుట , దురద కలిగి ఉండటం , మచ్చ మధ్యమున రక్తవర్ణం కలిగి ఉండటం ఈ లక్షణాలను బట్టి ఇది పుండరీక కుష్టు అని తెలుసుకొనవలెను . ఇది శరీరం నందు కఫాధిక్యత వలన కలుగును. ఇది మహా కుష్టు వ్యాధి . 


 * విస్పోటక కుష్టు లక్షణము -  


        స్ఫోటకము , దురద , తీవ్రదాహము కలుగుట , మచ్చలు ఎర్రగా ఉండటం , మెరియుచుండుట , పాండువర్ణం కలిగి ఉండటం , చేతులు , కడుపు యందలి మంట , నొప్పి కలిగి ఉండటం . ఈ లక్షణాలను బట్టి ఇది విస్పోటక కుష్టు అని తెలుసుకొనవలెను . ఇది మహా కుష్టు . 


 * పామాకుష్టు -  


       సూక్ష్మమైన కురుపులు గుంపులుగా వచ్చి ఆ కురుపులు నుండి తెల్లని పులినీరు కారును. తాపము , దురద కలుగును. ఈ లక్షణాలని బట్టి ఇది పామాకుష్టు అని తెలుసుకొనవలెను. ఇది మహాకుష్టుము. 


 * గజచర్మ కుష్టు -  


       చెమట పట్టకుండుట , మిక్కుటంగా ఉండటం. ఉదరము పెరుగును . శరీరం పైన మత్స్యపు తునకల వలే ఉండును. ఏనుగుచర్మం వలే నల్లగా ఉండును . ఈ లక్షణము కలిగినది గజచర్మ కుష్టుమని తెలుసుకొనవలెను . ఇది వాతాశ్లేష్మధిక్యం వలన జనించవలెను. ఇది మహాకుష్టుము . 


 * కాకకుష్టు లక్షణము - 


      కాకిముక్కుతో సమానమైన వర్ణం కలదిగా ఉండును. తీవ్రవేదన కలుగును. ఈ లక్షణం కాకకుష్టు లక్షణము. ఇది అసాధ్యము . 


 * కచ్చత్వక్కు ష్టు లక్షణము - 


       శరీరం ఎర్రనై మెరియుచుండును. నల్లటి రంగులో ఉండును. బాగా దురద ఉండును. తొడలు , చంక , మొల భాగము ల యందు జనించును. 


 * రుష్య జిహ్వ కుష్టు లక్షణము - 


       శరీరం కఠినంగా ఉండును. మచ్చల చుట్టు ఎర్రగా ఉండును. మధ్యలో నల్లగా ఉండును. వేదనతో కూడి ఉండును. దుప్పినాలుక వలే నల్లగా ఉండును. ఈ లక్షణాలు కలిగినది ఋష్య జిహ్వ కుష్టు లక్షణము. 


         తరవాతి పోస్టుల్లో మిగిలిన కుష్టువ్యాధుల లక్షణాల గురించి మరియు కుష్ఠు వ్యాధి రావటానికి గల కారణాల గురించి కూడా సంపూర్ణంగా వివరిస్తాను. 


 

       ఏయే సమస్యలకు ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి మరియు రోగములకు చేయవల్సిన చికిత్సలలో అత్యంత సులభమైనవి అన్నింటిని నేను రచించిన గ్రంథాలలో సంపూర్ణముగా ఇవ్వడం జరిగింది. వాటిని పరిశీలించగలరు.


   

 గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      కాళహస్తి వేంకటేశ్వరరావు 

 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


          ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్ 

                   

            9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .

[24/01, 9:18 pm] +91 98850 30034: కుష్ఠు రోగము గురించి సంపూర్ణ వివరణ - 2 . 


 * గళ కుష్టు లక్షణము - 


      నాలుక నల్లగా ఉండుట . కాళ్ళ యందు తాపము కలుగుట . మూడంగుళాల మచ్చలు కలిగి ఉండుట . ముక్కు నుంచి రక్తం కారును . స్వరము చెడును. ఇలాంటి లక్షణాలు కలిగినదా గళ కుష్టు అని తెలుసుకొనవలెను. ఇది త్రిదోషముల వలన జనించును. ఇది వచ్చిన మూడు మాసములలో నిశ్చయంగా చంపును. 


 * కపాల కుష్టు లక్షణము - 


     నల్లని మచ్చలు , ఎర్రని మచ్చలు కలుగును. దురద కలిగి ఉండును. సూదులతో పొడుస్తున్నట్టు వేదన ఉండును. ఈ లక్షణాలు కలిగినది కపాల కుష్టు అనబడును. ఇది అసాధ్యము . ఈ కుష్టు వాతాధిక్యత కలుగును. 


 * ఔదుంబర కుష్టు లక్షణము - 


      నొప్పి , మంట , ఎరుపు వర్ణం కలిగి ఉండి దూరదతో శరీరం అంతా వ్యాపించి ఉండును. వెంట్రుకలు ఎర్రని రంగుతో ఉండును. శరీరం మేడిపండు రంగుతో ఉండును. ఇటువంటి లక్షణములు కలిగినది ఔదంబర కుష్టు . ఇది శరీరం నందు పిత్తం పెరగటం వలన జనియించును . 


 * మండల కుష్టు లక్షణము - 


      తెల్లగా , ఎర్రగా , కఠినముగా , దట్టముగా , స్నిగ్ధముగా , మండలాకారముగా ఉండు మచ్చలు శరీరం అంతా వ్యాపించి ఉండును. ఇది కష్టసాధ్యము . కఫాధిక్యత వలన జనియించును . 


 * ప్రసూతి కుష్టు లక్షణము - 


     అంగములలో సూదులతో పొడుస్తున్నట్లు వేదన ఉండును . శరీరము నందు స్పర్శజ్ఞానం లేకుండా ఉండును. ఈ లక్షణాలు బట్టి ప్రసూతి కుష్టు అనబడును. కొందరు దీనిని మహా కుష్టు అంటారు. ఇది వాతపిత్త ప్రకోపం వలన జనియించును . 


 * విచ్చరిక కుష్టు లక్షణము - 


      దట్టమైన మచ్చలు కలిగి తెల్లగా , ఎర్రగా ఉండును. నీరు కారుచుండును. దురద , మంట కలుగును. ఈ లక్షణాలు కలిగినది విచ్చరిక కుష్టు అని తెలుసుకొనవలెను . ఇది తరచుగా వాతాపిత్తాధిక్యత వలన కలుగును. 


 * వైపాదిక కుష్టు లక్షణము - 


      శరీరం పగిలి ఉండును. తీవ్రమైన వేదన కలిగి ఉండును. చేతులు , కాళ్ళు ఉష్ణంగా ఉండి ఎర్రగా ఉండును. ఈ లక్షణాలు కలిగినది వైపాదిక కుష్టుగా పరిగణించవలెను. ఇది వాతాశ్లేష్మధిక్యత వలన వచ్చును. 


 * కిట్టిబ కుష్టు లక్షణము - 


      శరీరం పైన మచ్చలు నీలవర్ణంగా ఉండును. బిరుసుగా ఉండును. దురదగా ఉండును. మచ్చలు మందంగా ఉండును. ఈ లక్షణములు కలిగినది కిట్టిబ కుష్టు అని తెలుసుకొనవలెను. ఇది వాత, శ్లేష్మధిక్యత వలన కలుగును. 


 * చర్మ దళ కుష్టు లక్షణము - 


     ఎర్రని మచ్చలు కలిగి ఉండును. నొప్పితో కూడుకుని ఉండును. మచ్చలు బిరుసుగా ఉండును. దురద కలిగి ఉండును. మచ్చల నుండి నీరుకారును. శరీరం అంతా బొబ్బలు లేచును . శరీరం పగులును. తాకిన నొప్పి కలగదు . మచ్చలు దట్టముగా ఉండును. మచ్చలు మెరియును . ఇటువంటి లక్షణములు కలిగినది చర్మ దళ కుష్టు అని తెలిసుకొనవలెను . ఇది మహాకుష్టు . 


 * దద్రు కుష్టు లక్షణము - 


       శరీరం అంతా వ్రణాలు లేచును . వ్రణములు దురదతో కూడి ఉండి ఎర్రగా ఉండును. వ్రణములు తెల్లగా ఉండును. ఇటువంటి లక్షణములు కలిగినది దద్రు కుష్టు అని తెలుసుకొనవలెను. ఇది కఫపిత్త ప్రకోపం వలన జనియించును . 


 * సిధ్మ కుష్టు లక్షణము - 


      ఎరుపు , తెలుపు కలిగిన మచ్చలు కలుగుట. మచ్చల నుంచి తెల్లటి పిండి వలే రాలును. ఇది ఎక్కువుగా రొమ్ముల మధ్యభాగం , మోచేతులు , మోకాలి కింద భాగము నందు జనియించును . దీనిని సోరియాసిస్ అని ఆంగ్లము నందు పిలుస్తారు . ఇది వాతాశ్లేష్మాదిక్యత వలన కలుగును. 


 * శతారుష్య కుష్టు లక్షణము - 


      మచ్చలు ఎరుపుగా , నలుపుగా , దట్టముగా ఉండును. మచ్చల నుండి నీరు కారుచుండును. మచ్చలు మెరియుచుండును . దురద , శూల , మంటతో కూడుకుని అనేక వ్రణములు శరీరంపైన కలుగును. ఇది పిత్తశ్లేష్మధిక్యత వలన కలుగును. 


 * శ్విత్ర కుష్టు లక్షణము - 


       ఇది శంఖవర్ణము కలిగినదై సర్వాంగముల యందు వ్యాపించి ఉండిన ఇది అసాధ్యము . శరీరం అంతా వ్యాపించి ఉండి శరీరం కృశించి ఉండిన కష్టసాధ్యం . మర్మభాగముల యందు , అరచేతి యందు జనియించి అగ్నివలె మండుచుండిన అసాధ్యము అని తెలియవలెను . మరియు ఎక్కువకాలం నుండి ఉండిన ఎప్పటికి నయం కాదు. దీనిని బొల్లి అని పిలుస్తారు . ఇది వాతాధిక్యత వలన జనియించును . 


             కుష్టు వ్యాధులలోని రకాల గురించి మీకు వివరించాను . తరవాతి పోస్టు నందు కుష్టు వ్యాధి రావడానికి గల కారణాల గురించి సంపూర్ణంగా వివరిస్తాను. 


  

  

       ఏయే సమస్యలకు ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి మరియు రోగములకు చేయవల్సిన చికిత్సలలో అత్యంత సులభమైనవి అన్నింటిని నేను రచించిన గ్రంథాలలో సంపూర్ణముగా ఇవ్వడం జరిగింది. వాటిని పరిశీలించగలరు.


   

 గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      కాళహస్తి వేంకటేశ్వరరావు 

 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


          ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్ 

                   

            9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .

[26/01, 4:23 am] +91 98850 30034: కుష్ఠురోగము గురించి సంపూర్ణ వివరణ - 3 . 


   అంతకు ముందు పోస్టులలో మీకు కుష్టు వ్యాధి గురించి మీకు వివరించాను. ఇప్పుడు మీకు అసలు కుష్టువ్యాధి రావడానికి గల కారణాలు గురించి వివరిస్తాను. 


 కుష్టువ్యాధి రావడానికి గల కారణాలు - 


  * మత్స్యము , పాలు మరియు పాలపదార్ధాలు కలిపి సేవించటం . 


 * ద్రవరూపం , గట్టిగా ఉన్న అన్నపానాలు సేవించడం . 


 * వాంతి మరియు మలమూత్రాల వేగాన్ని బలవంతంగా ఆపడం . 


 * భుజించిన వెంటనే అతిగా వ్యాయామం చేయుట . 


 * అతిగా ఎండలో తిరుగుట. 


 * శీతల మరియు వేడి పదార్ధాలను వెంటవెంటనే సేవించుట . 


 * వేడిమి , భయము , శ్రమ ఉన్నప్పుడు శీతోదకము ( చల్లని నీరు ) అతిగా సేవించుట . 


 * సరిగ్గా ఉడకని అన్నము మరియు ఆహారపదార్ధాలు సేవించుట . 


 * ఉపవాస విరుద్ద ఆహారాన్ని సేవించుట . 


 * ఒకసారి ఆహారాన్ని తీసుకున్న తరువాత పూర్తిగా అరగక ముందే మరలా ఆహారాన్ని తీసుకోవడం . 


 * కొత్తబియ్యపు అన్నం , పెరుగు , చేపలు , మినుములు , ఉప్పు , పులుసు , ముల్లంగి , గట్టిపడిన అన్నం తినడం , నువ్వులు , పాలు , బెల్లము ఎక్కువుగా సేవించటం . 


 * భుజించిన వెంటనే సంభోగక్రియ జరపడం , పగటి యందు నిద్రించుట , పాపకర్మలు చేయుట . 


        పైన చెప్పిన విధముగా విరుద్ద ఆహారాలను సేవించుట మూలముగా శరీరం నందు వాతాది దోషములు ప్రకోపించి దుష్టత్వాన్ని పొంది కుష్టురోగము కలుగచేయును . ఇలా దోషమును పొందుట వలన మనుష్యునికి 18 రకాల కుష్టులు సంప్రాప్తిస్తున్నవి. అందు మహాకుష్టులు 7 రకములు , క్షుద్ర కుష్టువులు 11 రకాలు . 


 కుష్టు రోగము రావడానికి ముందు కనిపించు లక్షణములు - 


 * కుష్టు రోగము రాబోయే ముందు ఆ స్థలము నందు తాకిన మిక్కిలి నున్నగా గాని లేక గరుకుగా ఉండును. 


 * మచ్చస్థానము నందు చెమట పట్టుట లేక ఎండినట్లు ఉండుట . 


 * మిగిలిన శరీరపు రంగు కంటే ఆ స్థలము నందు రంగు మారి ఉండుట . 


 * దురద కలిగి ఉండటం. 


 * చర్మము స్పర్శజ్ఞానము లేకుండా ఉండటం . 


 * ఆ స్థలము నందు పొడిచినట్లు అనిపించుట. 


 * కందిరీగ కరిచినట్లు దద్దుర్లు లేచుట . 


 * శ్రమ చేయకనే ఆయాసం కలుగుట . 


 * శరీరంపైన వ్రణములు లేచి అందునుండి పోట్లు కలుగుట. 


 * అతిత్వరగా వ్రణం ఏర్పడి పెద్దగా మారి చిరకాలం ఉండటం. 


 * పుట్టిన వ్రణం గట్టిగా ఉండును. 


 * రక్తం నల్లగా ఉండటం , వెంట్రుకల కుదుళ్ళు నొప్పితో కూడుకుని ఉండటం.  


       పైన చెప్పిన లక్షణములు అన్నియు శరీరం నందు కుష్టు ఏర్పడటానికి ముందు కనిపించు లక్షణములు. వాటిని అత్యంత జాగ్రత్తగా గమనిస్తూ త్వరితగతిన చికిత్స తీసికొనవలెను. 


 కుష్టు రోగము నందు ఆహార నియమాలు - 


 ఆచరించవలసినవి - 


 * పాతబియ్యపు అన్నం . 


 * యవలు . 


 * గోధుమలు పాతవి. 


 * చామలు . 


 * కొర్రలు . 


 * పచ్చపెసలు . 


 * కందికట్టు . 


 * చేదు గల కూరలు . 


 * పొట్లకాయ . 


 * చండ్ర . 


 * వేపపువ్వు . 


 * కస్తూరి , చందనం . 


 * కుంకుమపువ్వు , ఇంగువ . 


  ఆచరించకూడనివి - 


 * పులుసు పదార్దాలు . 


 * అతి ఉప్పు , అతి కారపు పదార్దాలు . 


 * పెరుగు , మినుములు , పాలపదార్ధాలు . 


 * బెల్లము , పప్పు , నువ్వులు . 


 * చేపలు , మాంసపదార్ధాలు , కోడిగుడ్డు . 


 * నిలువ పచ్చళ్లు , చల్లటినీరు , టీ , కాఫీ . 


 * నూనె వేపుళ్ళు , బేకరీ పదార్దాలు నిషిద్దం. 


        పైన చెప్పినటువంటి ఆహారనియమాలు పాటిస్తూ సరైన వైద్యుని పర్యవేక్షణలో చికిత్స తీసికొనవలెను. వ్యాధి పూర్తిగా నయమైన తరువాత కూడా ఒక సంవత్సరం పాటు పథ్యం చేయుచున్న శరీరం నందలి ఏదన్నా దోషం ఉన్నను అంతరించిపోవును. 


                  సమాప్తం 


         ఏయే సమస్యలకు ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి మరియు రోగములకు చేయవల్సిన చికిత్సలలో అత్యంత సులభమైనవి అన్నింటిని నేను రచించిన గ్రంథాలలో సంపూర్ణముగా ఇవ్వడం జరిగింది. వాటిని పరిశీలించగలరు.


   

 గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      కాళహస్తి వేంకటేశ్వరరావు 

 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


          ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్ 

                   

            9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .

[27/01, 1:12 pm] +91 98850 30034: దగ్గులు హరించుటకు సులభ యోగం - 


  వెల్లుల్లిపాయలు , మిరియాలు ఒక్కోటి 10 గ్రాములు బెల్లం 20 గ్రాములు మూడింటిని మెత్తగా మర్దించి కుంకుడు గింజలు అంత మాత్రలుగా చేసి పూటకి ఒక్క మాత్ర చొప్పున బుగ్గన పెట్టుకొని రసం మింగుతున్న అన్ని రకాల దగ్గులు హరించును . పిల్లలకు కందిగింజ అంత మోతాదు చనుబాలతో కలిపి ఇవ్వాలి .


       ఏయే సమస్యలకు ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి మరియు రోగములకు చేయవల్సిన చికిత్సలలో అత్యంత సులభమైనవి అన్నింటిని నేను రచించిన గ్రంథాలలో సంపూర్ణముగా ఇవ్వడం జరిగింది. వాటిని పరిశీలించగలరు.


   

 గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      కాళహస్తి వేంకటేశ్వరరావు 

 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


          ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్ 

                   

            9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .

ముందున్న కర్తవ్యం

 *సాయి ఇన్‌స్పైర్స్ - జనవరి 26, 2023*


_ధనికుడైనా, పేదవాడైనా, ప్రతి మనిషి ధర్మం ఏమిటి? భగవాన్ ఈ రోజు మనకు స్పష్టంగా మరియు ప్రేమగా గుర్తు చేస్తున్నారు._


*కోట్ల రూపాయలు వెచ్చించి దానధర్మాలు చేయడంలో గొప్పతనం ఉండదు. మీ ఆలోచనలు, మాటలు మరియు పనులు ప్రేమతో నిండి ఉండాలి. మీ తోటివారి బాధలను తగ్గించే ప్రయత్నం చేయండి. నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లే అందరినీ ప్రేమించు. ఇదే నీ ధర్మం.*


*ధర్మం అంటే దానధర్మాలు చేయడం మాత్రమే కాదు. మీరు మీ హృదయాన్ని ధర్మబద్ధమైన భావాలతో నింపుకోవాలి మరియు స్వార్థం మరియు దురాశలను విడిచిపెట్టాలి. ఎల్లప్పుడూ సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకోండి. మీ తోటివారిని 'ఇతరులు'గా పరిగణించవద్దు. మీ ప్రేమను అందరితో పంచుకోండి; స్నేహపూర్వకంగా జీవించండి మరియు ఐక్యతను పెంపొందించుకోండి. ప్రేమ ద్వారా మాత్రమే మీరు ఇతరుల హృదయాలను గెలుచుకోగలరు మరియు వారిని మార్చగలరు. అందుకే, ప్రేమను పెంపొందించుకోవడం మరియు ఇతరులతో పంచుకోవడం ఈ కాలపు అవసరం. దేవుని పట్ల ప్రేమను మరియు మీ కంటే తక్కువ అదృష్టవంతుల పట్ల కరుణను పెంపొందించుకోండి! ఇది విద్య యొక్క సారాంశం.*


*మీ తల్లిదండ్రులకు సేవ చేయండి మరియు వారిని సంతోషపెట్టండి. ఇంట్లో మీ అమ్మ పడుతున్న బాధల గురించి మీరు పట్టించుకోనప్పుడు మీ ప్రేమను ఇతరులతో పంచుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటి? మీ తల్లిదండ్రులను ప్రేమించడం మరియు వారికి సేవ చేయడం మీ ముందున్న కర్తవ్యం. అప్పుడు మీరు మీ ప్రేమను ఇతరులతో పంచుకోవచ్చు!*


- డివైన్ డిస్కోర్స్, అక్టోబర్ 23, 2004.