14, మార్చి 2023, మంగళవారం

పరివేదన చెందనవసరములేదు.

 జగద్గురు శ్రీశ్రీశ్రీ ఆది శంకరాచార్య - వైరాగ్య డిండిమ 👍


1. మాతా నాస్తి, పితా నాస్తి, 

నాస్తి బంధు సహోదరః| 

అర్థం నాస్తి, గృహం నాస్తి, 

తస్మాత్ జాగ్రత  జాగ్రత|| 


తా:- తల్లి, తండ్రి, బంధువులు, అన్నదమ్ములు, ధనము, ఇల్లు ఇవి అన్నియు మిధ్యయే. ఇవి ఏవియు నిజముగా లేవు.  కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 


2. జన్మ దుఃఖం, జరా దుఃఖం, 

జాయా దుఃఖం పునః పునః| 

సంసార సాగరం దుఃఖం 

తస్మాత్ జాగ్రత  జాగ్రత|| 


తా:- ఈ జన్మ, వృద్ధాప్యము, భార్య, సంసారము ఇవన్నియు దుఃఖ భరితములు. తిరిగి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి.  కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 


3. కామః  క్రోధశ్చ, లోభశ్చ 

దేహే తిష్ఠతి తస్కరాః| 

జ్ఞాన రత్నాపహారాయ 

తస్మాత్ జాగ్రత  జాగ్రత|| 


తా :-  కామము, క్రోధము, లోభము మొదలైన అరిషడ్వర్గములు మనలోని జ్ఞానమనెడు  విలువైన రత్నములను దొంగిలించుటకై మన దేహమునందు దాగియున్నదొంగలు. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 


4. ఆశయా బధ్యతే జంతుః 

కర్మణా బహు చింతయా| 

ఆయుక్షీణం న జానాతి 

తస్మాత్ జాగ్రత  జాగ్రత|| 


తా:- ఈ మనుష్యులు ఎల్లప్పుడూ ఏదో ఆశకు, కర్మకు కట్టుబడి ఏవేవో ఆలోచనలతో,  జీవితాలు గడుపుతుంటారు. ఆయుర్ధాయం తరిగిపోతుందన్న విషయాన్ని గమనించరు. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 


5. సంపదః స్వప్న సంకాశాః 

యౌవనం కుసుమోపమ్| 

విధుఛ్చచంచల ఆయుషం 

తస్మాత్ జాగ్రత  జాగ్రత|| 


తా:- మన సంపదలన్నియు ఒక కలవంటివి, అంటే అశాశ్వతాలు.  యౌవనం పూవుతో సమానం అంటే ఎపుడు వాడి నశిస్తుందో తెలియదు. ఆయుష్షు మెరుపుతీగవలె చంచలమైనది.  కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 


6. క్షణం విత్తం, క్షణం చిత్తం, 

క్షణం జీవితమావయోః| 

యమస్య కరుణా నాస్తి 

తస్మాత్ జాగ్రత  జాగ్రత|| 


తా:- ధనము, బుద్ధి, జీవితము ఇవన్నియు క్షణభంగురములు. మన ప్రాణములను హరించుటకై వేచియున్న యముడు ఏ మాత్రము దయ జూపడు. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 


7. యావత్ కాలం భవేత్ కర్మ 

తావత్ తిష్ఠతి జంతవః| 

తస్మిన్ క్షీణే వినశ్యంతి 

తత్ర కా పరివేదన|| 


తా:- ప్రపంచంలో తమ కర్మబంధము ఎంతవరకు ఉంటుందో,  అంతవరకే ప్రాణులు జీవిస్తాయి. ఆ కర్మబంధం వీడిపోగానే మరణిస్తారు. జననమరణాలు జీవుని ధర్మము. దానికి బాధపడటం ఎందుకు. 


8. ఋణానుబంధ రూపేణ 

పశుపత్నిసుతాలయః| 

ఋణక్షయే క్షయం యాంతి 

తత్ర కా పరివేదన|| 


తా:- గత జన్మ ఋణానుబంధము ఉన్నంతవరకే భార్య, సంతానం, ఇల్లు, పశువులు ఉంటాయి. ఆ బంధం తీరగానే ఇవన్నీ నశించిపోతాయి. అందుకు వ్యథ చెందడ మెందుకు. 


9. పక్వాని తరుపర్ణాని 

పతంతి క్రమశో యథా| 

తథైవ జంతవః కాలే 

తత్ర కా పరివేదన|| 


తా:-  పండిన ఆకులు చెట్టునుండి ఆకులు ఏ విధముగా రాలిపోవునో అదే విధముగా ఆయువు తీరిన వారు మరణింతురు. దానికై దుఃఖించుట ఎందులకు? 


10. ఏక వృక్ష సమారూఢ 

నానాజాతి విహంగమాః| 

ప్రభతే క్రమశో యాంతి 

తత్ర కా పరివేదన|| 


తా:-  చీకటి పడగానే అనేక జాతులు పక్షులు ఒకే వృక్షం ఆశ్రయించి విశ్రమిస్తాయి. తెల్లవారగానే ఆ పక్షులు అన్నీ చెట్టును విడచి తమతమ ఆహార సంపాదనకు వెళ్ళిపోతాయి. అదే విధంగాబంధువులతో కూడిన మానవుడు కాలమాసన్నమైనపుడు తన శరీరాన్ని ఇంటిని వదలి వెళ్ళిపోతాడు. అందుకు బాధపడ నవసరములేదు. 


11. ఇదం కాష్టం ఇదం కాష్టం 

నధ్యం వహతి సంగతః| 

సంయోగాశ్చ వియోగాశ్చ 

కా తత్ర పరివేదన|| 


తా - ప్రవహించే నదిలో రెండు కట్టెలు దగ్గరకు చేరతాయి. కొంతదూరం కలిసి పయనిస్తాయి తరువాత విడిపోతాయి. అదేవిధంగా మానవుడు ఈ ప్రపంచ ప్రవాహంలో కొంతకాలం సంయోగసుఖమును, మరికొంతకాలం వియోగదుఃఖమును అనుభవిస్తాడు. దానికి పరివేదన చెందనవసరములేదు.

స్థిరముగా ఉండవు

 .


          _*సుభాషితమ్*_


 𝕝𝕝శ్లో𝕝𝕝  

*అభ్రచ్ఛాయా ఖలప్రీతిః* 

*సిద్ధమన్నఞ్చ యోషితః*।

*కిఞ్చిత్కాలోపభోగ్యాని* 

*యౌవనాని ధనాని చ॥*


తా𝕝𝕝 " *మేఘముల నీడ, దుర్జనులతోడి మైత్రి, వండిన అన్నం, స్త్రీలు, యౌవనం, ధనం - ఇవన్నీ స్వల్పకాల భోగ్యాలు... స్థిరముగా ఉండవు*...

దేహిమే ముక్తి శివా

 వయసైపోయిన ఒక భిక్షువు శివాలయం దగ్గర బిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తూండేది...


ఒక రోజు ఓ యోగిపుంగవుడు శివదర్శనం చేసుకుని వెడుతూంటే, ఆ వృద్ధురాలు ఆయన పాదలమీద పడి " అయ్యా ! నా జీవితం అంతా ఇలానే సాగిపోతోంది, నాకేదైనా మంత్రమో, పద్యమో చెప్పండి.


బతికి ఉన్న నాలుగురోజులు మీరు చెప్పినదే మనస్సులోనే అనుకుంటూ బతుకుతాను " అని ప్రాధేయపడింది...


 ఆ యోగి అప్పుడామెకు ఇలా చెప్పాడు:~

”తవ పాదే మమ శిర: ధారయతాం ! దేహిమే ముక్తి శివా ! " అని ముమ్మారు చెప్పి వెళ్ళాడు...

ఆమె అది విని ఆనంద పడి అదే ధ్యానం చేసుకుంటూ తృప్తిగా గడుపుతోంది...

 

అలా కొన్ని ఏళ్ళు గడిచాయి. ఈమె పండు వృద్ధురాలయింది. 

అలాగే ఆ శివాలయం దగ్గర బిక్షాటన చేస్తూ గడుపుతోంది.

 

తిరిగి ఆ యోగి పుంగవుడు శివ దర్శనం చేసుకుని, ఈమెను గుర్తుపట్టి, " ఏమి అవ్వా! నేను చెప్పినది జ్ఞాపకం ఉన్నదా ? "అనడిగాడు.


 ఆమె ఆయనకు నమస్కరించి " అయ్యా ! అదీ మరువలేదు. తమరిని మరువలేదు " అన్నది...

 

”ఏదీ చెప్పిన పాఠం అప్పజెప్పు " అని నవ్వుతూ అడిగాడు.

 ఆమె తడబడుతూ తను ధ్యానిస్తున్న ఆ యోగి చెప్పినది అప్పజెప్పింది.

 

”అవ్వా ! తప్పు చదువుతున్నావు ! నేను స్వామి పాదాల మీద నీ శిరసు పెట్టమంటే, నువ్వు స్వామి శిరసు మీద నీ పాదాలు పెట్టావు ! నీ ఇన్నేళ్ళ ధ్యానం వ్యర్ధం అయ్యింది "అని కోపంతో వెళ్ళిపోయాడు...


 ఆ వృద్ధురాలు చేసిన పొరపాటు ఈ " తవ, మమ " అనే పదాలు అటూ ఇటూ చేసి చదువుతోంది.

 

ఆమె కంటిమింటికి ఏకధారగా ఏడుస్తూ, అన్నాహారాలు మాని తన ఇన్నేళ్ళ శ్రమ వ్యర్ధం అయ్యింది అని రోజుల తరబడి బాధపడసాగింది.


 ఓ  రాత్రి మన స్వామి ఆ యోగిపుంగవుని కలలో కనబడి " ఏం పని చేశావయ్యా ! నా భక్తురాలు అన్నాహారాలు లేక బాధపడుతోంది. 

నేను శ్రద్ధాభక్తులకు వశుడను కానీ, భాషకు కాదయ్యా ! ముందు ఆమె బాధపోగొట్టి, ఆమె అహారం తీసుకునేలా చెయ్యి"అని ఆయనను హెచ్చరిక చేశాడు...


 ఆ యోగి పుంగవుడు ఉలిక్కిపడి లేచి, శివాలయం దగ్గరకు పరుగుపరుగున వెళ్ళి, ఆ వృద్ధురాలి పాదముల మీద పడి “అమ్మా ! నువ్వు చేసే పూజే స్వామి కి నచ్చింది,  నన్ను క్షమించి ఆహారం స్వీకరించు" అని ఆమెను తృప్తిపరచి తన ఆశ్రమానికి తిరిగి వెళ్ళాడు...


 కాబట్టి మనం తెలుసుకోవలసింది, స్వామి మన శ్రద్ధాభక్తులకు ప్రాధాన్యం ఇస్తాడు కానీ,భాషకు కాదని తెలుసుకోవాలి...


 మనం ఎన్నో సహస్రాలు చదువుతూ ఉంటాము. పొరపాట్లు దొర్లుతూ ఉంటాయి. 

పూజల్లో దోషాలు వస్తుంటాయి. అవ్వన్నీ స్వామి పట్టించుకోడు. కావలసింది శ్రద్ధా, భక్తి మాత్రమే.

నిజమైన, భక్తి

 నిజమైన, పరిపూర్ణమైన భక్తి అంటే ఇది కదా అనిపించింది. 


ఎంత ఆరాధనా భావం, ఎంత ఉన్నతమైన మనసు, అన్నిటినీ మించి సనాతన భారతీయ గురుపరంపర పట్ల వారికున్న గౌరవభావం నన్ను ముగ్ధుడిని చేసాయి.


నిన్న (12.03.2023) సాయంత్రం రాజమహేంద్రవరంలోని హోటల్ షెల్టన్ లో జరిగిన డాక్టర్ కంభంపాటి స్వయంప్రకాష్ గారి జయంతి కార్యక్రమంలో పాల్గొని, రాత్రి సుమారుగా 9.30 గంటల సమయంలో కారులో విజయవాడకు తిరుగుప్రయాణమయ్యాను. 


కొవ్వూరు వంతెన దాటి, కొంతదూరం వచ్చాక, దారి ఎడమవైపునకు తిరుగుతుంది. అది చాలా పెద్ద కూడలి. అక్కడో ఫ్లైఓవర్ కూడా ఉంది. నాకు ఆ దారిమీద పూర్తి అవగాహన లేదు. అందువల్ల కచ్చితంగా అది ఏ ప్రాంతమో చెప్పలేను.  


అలా... కారు ఎడమవైపునకు మలుపు తీసుకుంటున్న సమయంలో, పెద్ద ఫొటో కనబడింది. అది కంచి స్వామివారు... జగద్గురువులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి వారిది. మామూలుగా అయితే, స్వామికి నమస్కారం చేసుకుని, ఆగకుండానే ప్రయాణం చేసేవాడిని. కానీ, అక్కడి సన్నివేశం నన్ను ఎంతో ఆకట్టుకోవడంతో కారు వెనక్కుతిప్పమని డ్రైవర్ కు చెప్పాను.


మీరు ఫొటోలో చూస్తున్నదే ఆ సన్నివేశం. అందులో ప్రత్యేకత ఏమిటంటే...


స్వామివారి ఫొటో కింద ఓ వ్యక్తి పూలు అమ్ముకుంటున్నాడు. అది అతడి వృత్తి. రోజూ అక్కడే పూలు అమ్ముతుంటాడు. రోజూ తాను అమ్మకానికి తెచ్చుకున్న పూలలో కొన్ని స్వామి వారి ఫొటోకి వేసి, నమస్కారం చేసుకుని, ఆ తర్వాత అమ్మకం ప్రారంభిస్తాడు. మంగళవారం, శనివారం స్వామికి ప్రత్యేకంగా అలంకారం కూడా చేస్తాడు.


నిజానికి అది అతను పెట్టుకున్న ఫొటో కాదు. స్వామివారు కొద్దికాలం క్రితం రాజమహేంద్రవరం వచ్చినప్పుడు ఓ సంస్థ ఏర్పాటుచేసిన స్వాగత ప్రకటన అది. ఆ ఫొటోకే అతడు నిత్యం పూలదండలు సమర్పిస్తాడు.


సాధారణంగా అందరూ వారి ఇష్టదైవాల ఫొటోలు పెట్టకుంటారు. కానీ, ఇతడు మాత్రం స్వామి వారి ఫొటోకే దండలు వేసి, ఆరాధిస్తున్నాడు. అతడు వ్యాపారం చేస్తున్న ప్రాంతాన్ని పూర్తిగా పరిశీలించాను. ఏ దేవుడి ఫొటో అక్కడ లేదు. కేవలం స్వామి వారి ఫొటోకే దండలు వేసి ఉన్నాయి. 


కారు దిగి, అతడిని అడిగి ఈ వివరాలు తెలుసుకున్నా. స్వామివారు చాలా గొప్పవారని, ఆయన దేవుడితో సమానమని చెప్పాడతడు అతడి యాసలో.  


నేను కొంత సొమ్ము ఇచ్చి, తీసుకోమంటే... వద్దంటే వద్దన్నాడు. నా దేవుడికి పూలు నేను వేసుకోగలను అన్నాడు. అనేకవిధాలుగా బతిమాలినా ఒప్పుకోలేదు. చివరకు ఆ సొమ్ముకు తగిన పూలు రేపటి రోజున స్వామికి సమర్పించమని చెబితే, సరేనంటూ అంగీకరించాడు. 


ఇది కదా నిజమైన, పరిపూర్ణమైన భక్తి అనిపించింది.  


ఆ పెద్ద మనసు ముందు నేనెంత చిన్నవాడినో తెలిసింది. 


ఇంతటి గొప్ప సన్నివేశాన్ని చూసిన ఆనందంలో ఆ వ్యక్తి పేరు కనుక్కోవడం మర్చిపోయాను. 


అయినా... అంతటి గొప్ప మనసుకి పేరుతో పనేముంది.


కప్ఫగంతు రామకృష్ణ గారు

13, మార్చి 2023, సోమవారం

కర్మలకు నేనే కర్తను " అని భావించును.

 🙏💐🌹🙌Establishment of Supreme Court bench in AP for South India is our main aim🙌🌹💐👍


🌹భగవద్గీత🌹

               

మూడవ అధ్యాయము కర్మయోగము నుంచి 27 శ్లోకము. పదచ్ఛేద , టీకా , తాత్పర్య సహితముగా.


ప్రకృతేః క్రియమాణాని  

గుణైః కర్మాణి సర్వశః ౹

అహంకారవిమూఢాత్మా

కర్తాఽహమితి మన్యతే ౹౹(27)


ప్రకృతేః , క్రియమాణాని ,

గుణైః , కర్మాణి , సర్వశః ౹

అహంకారవిమూఢాత్మా ,

కర్తా , అహమ్ , ఇతి , మన్యతే ౹౹(27)


కర్మాణి = కర్మలన్నియును ;

సర్వశః = అన్నివిధముల ;

ప్రకృతేః గుణైః = ప్రకృతిగుణముల ద్వారా ;

క్రియామాణాని = చేయబడు చుండును ;

అహంకారవిమూఢాత్మా = అంతఃకరణము నందు అహంకార మోహితుడైన అజ్ఞాని ;

అహం , కర్త , ఇతి = "నేనే కర్తను" అని ;

మన్యతే = తలంచును


తాత్పర్యము :- వాస్తవముగా కర్మలన్నియును అన్ని విధముల ప్రకృతిగుణముల ద్వారానే చేయబడు చుండును. అహంకార విముఢాత్ముడు (అహంకారముచే మోహితమైన అంతఃకరణము గల అజ్ఞాని) " ఈ కర్మలకు నేనే కర్తను " అని భావించును. (27)

   

      ఆత్మీయులందరికి శుభ శుభోదయం 

               Yours Welwisher 

Yennapusa Bhagya Lakshmi Reddy 

Advocate AP High Court Amaravathi

పరమోన్నతం

 " సృష్టిలో పరమోన్నతం, అత్యుత్తమం, సకల జీవ ప్రశాంత జీవన దృక్పథం "                                                   భగవత్కృపతో లభించిన జన్మకు సాకారం, అత్యంత శ్రేష్ఠమైన మానవతా దృక్పథ నిత్య జీవకారుణ్యతా జీవన మార్గం ! సువిశాల విశ్వ చక్రభ్రమణంలో మానవాళికి భగవంతుడు ఒసగిన మహత్తర సుహృద్భావ సముచిత జీవన దివ్య వీక్షణం ! చరాచర జీవజాతి సుసంక్షేమాత్మక జీవన నిత్య గమనంలో మానవాళి పాత్ర మహోన్నతం ! మానవాళి తమ నిత్య సంచారంలో, తమ తోటి వారి ప్రశాంత జీవన గమన దృక్కోణ సురక్షామార్గాన నడవాలన్నదే ప్రధానాంశం !                                                     " సహనావవతు ! సహనౌ భునక్తు ! సహవీర్యం కరవావహే ! తేజశ్వినావధీతమస్తు ! మా విద్విషావహై ! "                                 ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః !                                               ✍️గుళ్లపల్లి ఆంజనేయులు

మూత్రపిండములలో రాళ్లు

: మూత్రపిండములలో రాళ్లు కరిగించు గొప్ప ఔషధ యోగములు  - 


 *  కానుగ గింజలలోని పప్పు మూడు గ్రాములు తీసుకుని పొడిచేసి 60 మిల్లీలీటర్ల ఆవుపాలలో కలిపి లోపలికి తీసుకొనుచుండిన మూత్రపిండాలలోని రాళ్లు పడిపోవును .


 *  యవాక్షరం , బెల్లం సమాన భాగాలుగా కలిపి రెండు గ్రాముల చొప్పున రోజుకొకసారి ఒక వారం నుంచి పదిరోజులపాటు తినిన రాళ్లు కరిగి పడిపోవును . దీనితో పాటు బూడిదగుమ్మడికాయ రసం కూడా వాడిన ఫలితం తొందరగా కనిపించును.


 *  వేపాకు నీడలో ఎండించి కాల్చి భస్మం చేసి పూటకు ఒకటిన్నర గ్రాము చొప్పున ఒకరోజు నిలువ ఉంచిన నీళ్లతో కలిపి తీసుకొనుచున్న మూత్రపిండాలలో రాయి కరిగిపోవును . రెండుపూటలా తీసికొనవలెను .


 *  రణపాల ఆకు రసము 6 గ్రాములు కాచిన వెన్న 13 గ్రాములు కలిపి ప్రతినిత్యము తాగుచున్న రాళ్లు కరుగును.


 *  పల్లేరు చూర్ణం ఒక స్పూన్ , కొండపిండి చూర్ణం ఒక స్పూన్ ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించి ఉదయం మరియు సాయంత్రం తీసుకొనుచున్న మూత్రపిండాలలో రాళ్లు నివారణ అగును.


 *  పొద్దుతిరుగుడు పువ్వు చెట్టు వేర్లు పొడి 25 గ్రాములు తీసుకుని ఒక లీటర్ తియ్యటి మజ్జిగతో కలిపి తీసుకొనుచున్న రాళ్లు కరుగును.


 *  పూటకు రెండు వెల్లుల్లి రేకల గుజ్జు తినుచున్న మూత్రాశయపు రాళ్లు కరుగును. అలా అప్పుడప్పుడు తినుచున్న రాళ్లు పుట్టవు .


  మూత్రపిండాలలో రాళ్లు ఉన్నవారు పాటించవలసిన ఆహారనియమాలు  -


 తినవలసిన ఆహారపదార్దాలు  -


  పాతబియ్యపు అన్నం , యవలు , గోధుమలు , ఉలవలు , పెసలు , మజ్జిగ , ఆవునెయ్యి , ఆవుపాలు , పెసరకట్టు , ఉలవకట్టు , అల్లం , తియ్యని కల్లు , చక్కెర , ముదురు గుమ్మడికాయ , బూడిద గుమ్మడికాయ , పొట్లకాయ , కొండపిండికూర , పల్లేరుకూర , చిర్రికూర , పెరుగుతోటకూర , ఖర్జురము , వెదురుమొలకలు , కొబ్బరికాయ , తాటిముంజలు , నక్కదోసకాయ , మేకమాంసం .


 తినకూడని ఆహార పదార్ధాలు  -


    మలబద్ధకర ఆహారాలు , చద్ది అన్నం , బిరుసుఅన్నం , తాంబూలం , ఎక్కువ ఉప్పు గల ఆహారపదార్థాలు , ఎక్కువ నూనె , పిండివంటలు , నువ్వులపిండి , పులుసు , ఇంగువ , నువ్వులు , ఆవాలు , మినుములు , మామిడికాయ , వెల్లుల్లి మొదలగు వేడివస్తువులు , మలబద్దకాన్ని కలిగించు వస్తువులు , కోడిమాంసం , పందిమాంసం , చేపలు , మద్యం , మైథునం , అతిశ్రమ , మూత్రము , వీర్యము నిరోధము చేయరాదు . 


         పైన చెప్పిన ఆహారపదార్ధాలు పాటిస్తూ ఔషధాలను వాడగలరు .


          మరిన్ని సులభ ఆయుర్వేద చిట్కాలు మరియు ఆయుర్వేద ఔషధాల వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 


  : శరీరంలో నీరసం , నిస్సత్తువ హరించుటకు సులభయోగాలు  -


 *  వేసవికాలంలో మంచిరకం మరియు తియ్యటి మామిడిపండ్లు పూటకు ఒకటిచొప్పున రోజూ తినుచున్న త్వరలో శరీరంలో నీరసం పోవును .


 *  రోజుకో కొబ్బరిబోండం తాగుచూ అందులోని లేతకొబ్బరి తినుచున్న నీరసం పోయి బలం కలుగును.


 *  అప్పుడప్పుడు కొంచం దాల్చిన చెక్క బుగ్గన పెట్టుకుని దాని రసం మింగుచున్నా శరీరం లొని నీరసం తగ్గును.


 *  రోజుకొకసారి నేలవేము సమూల కషాయాన్ని పావుకప్పు చొప్పున ప్రతినిత్యం తాగుచున్న నీరసం , నిస్సత్తువ హరించును . జబ్బు వలన శరీరం నీరసపడినవారు దీనిని వాడటం వలన మంచి ఫలితాలు వస్తాయి.


 *  రాత్రి సమయంలో నాలుగు ఎండు ఖర్జూరాలు ఒక రాగిచెంబులో నానబెట్టి ఉదయాన్నే విత్తనాలు తీసివేసి ఆ ఖర్జూరాలు తిని ఆ రాగిచెంబులోని నీరు తాగుచున్న శరీరము నందలి నిస్సత్తువ హరించును .


 *  తుమ్మజిగురు ఉశిరికాయ అంత తీసుకుని ఒక కప్పు నీటిలో వేసి కొంచం పంచదార చేర్చి ప్రతినిత్యం తాగుచున్న నీరసం పోయి బలం కలుగును.


 *  ప్రతినిత్యం పులవకుండా తియ్యగా ఉన్న తాటికల్లు ఒక గ్లాసు చొప్పున తీసుకొనుచున్న శరీరానికి మంచి పుష్టి కలుగును.


         పైన చెప్పిన వైద్య యోగాలలో మీకు సులభమైన యోగాన్ని ఎన్నుకుని దానిని పాటించండి.


  

          మరిన్ని సులభ ఆయుర్వేద చిట్కాలు మరియు ఆయుర్వేద ఔషధాల వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 


  

 ఆయుర్వేద వైద్యంలో పేరుగాంచిన గొప్ప ఔషధం 

  -


       మొమ్మాయి అనే ఈ ఔషధానికి ఆయుర్వేదంలో చాలా గొప్ప పేరు ఉంది. ఈ ఔషదానికి మరొక పేరు "గోమూత్ర శిలజిత్"  మార్కెట్ లో పచారీషాపుల్లో అమ్ముతుంటారు కాని అది అంత స్వచ్ఛమైనది కాదు. ఇది అసలైనది తెప్పించి నేను ప్రయోగించాను . చాలా జబ్బులలో మంచి ఫలితాలు ఇచ్చినది. మనకి దొరికిన మొమ్మాయి అసలైనదా కాదా అని తెలుసుకొవడానికి ఒక చిన్న పరీక్ష ఉన్నది.


               మొమ్మాయిని ఒక కందిగింజ అంత ఒక చిన్నగ్లాస్ నీటిలో వేయాలి . అప్పుడు నీరు ఎర్రగా మారుతుంది. అందులో ఒక పొడవాటి గుడ్డముక్కని వేసి నానబెట్టి ఒక కోడి కాలు విరగగొట్టి విరిగిన కాలుకు దీనిని చుట్టవలెను . కేవలం 15 నిమిషాలలో కాలు అతుక్కొని అది పరిగెత్తును . ఈ విధంగా పరీక్షించిన తరువాత మాత్రమే మొమ్మాయిని ఔషధంగా వాడవలెను .


           ఒకసారి ఈ మొమ్మాయిని వాడితే అది శరీరంలో 44 సంవత్సరాలపాటు నిలిచి ఉంటుంది. ఇది ఎక్కువుగా ఇరాన్ దేశములోని కొండలలో దొరుకుతుంది. శిలాజిత్ కీలువలే నల్లగా కాంతి వలే మైనము వలే కొంచం ఎర్రగా ఉంటుంది . ఇది శరీరంలో అత్యంత త్వరితముగా వ్యాపించి తన ప్రభావాన్ని చూపును . దీని మోతాదు ఒక వడ్లగింజ నుంచి రెండు వడ్లగింజల ఎత్తువరకు వాడవచ్చు . శిలాజిత్ చూర్ణములలో కలుపవలసి వచ్చినపుడు పన్నీటితో ఎండబెట్టి కలుపుకొనవలెను. లేహ్యములలో కలుపవలసివచ్చినప్పుడు ఆవునేతితో శిలజిత్ ని కలిపి కాచి చల్లార్చి కలుపవలెను గాని ప్రత్యేకంగా కలుపకూడదు.


  మొమ్మాయి ఉపయోగాలు  -


 *  హృదయానికి బలమును ఇస్తుంది.


 *  మనస్సుకు సంతోషాన్ని ఇస్తుంది.


 *  పొట్ట, జీర్ణకోశం , రక్తం తదితర వాటిని శుభ్రపరచును .


 *  శరీరంలోని సమస్త అవయవాలకు , నరాలకు బలాన్ని ఇస్తుంది.


 *  శ్లేష్మాన్ని హరించును .


 *  విరిగిన ఎముకలను , కీళ్ళని బాగుచేయును .


 *  గాయములను మాన్పును .


 *  వ్రణాలను నయంచేయును .


 *  ఎక్కిళ్లు , కడుపులో మంట, గుండెల్లో దడ నివారించును.


 *  అజీర్ణం , పరిణామశూల మొదలగు శూలలను తగ్గించును .


 *  కీళ్లనొప్పులు హరించును .


 *  అన్నిరకాల జ్వరాలను తగ్గించును .


 *  పక్షఘాతము , పక్షవాతము , సర్వాంగవాతములను హరించును .


 *  అతిమూత్రవ్యాది మరియు సమస్త మూత్రవ్యాధులను హరించును .


 *  ఉబ్బు , శ్వాస సంబంధ సమస్యలు , మతిచాంచల్యం , మూర్చ, ముక్కుకి వాసన తెలియకపోవడం , ముక్కులోపల పుట్టెడు వ్రణం నివారించును.


 *  జీర్ణకోశమును అంటి ఉండే పేగు గట్టిపడు రోగం కూడా తగ్గును.


 * ఒక చెయ్యి , ఒక కాలి యొక్క కీలులో పుట్టి అలా నిలిచి ఎంతకీ తగ్గని నొప్పిని కూడా తగ్గించును .


 *  స్త్రీల గర్భాశయం నందు జనించెడి పురుగులను చంపును.


 *  సుఖరోగాలను , చర్మవ్యాధులను నయం చేయును .


 *  బోధకాలు వ్యాధి , నాలిక మందం అయ్యే సమస్య , గొంతుకవ్యాధులను నయం చేయును .


 *  దవడనొప్పి , నాలుకలో నొప్పి సమస్యలకు వడ్లగింజ అంత మొమ్మాయి నీళ్లతో కలిపి ఆయా స్థలముల యందు పట్టువేసిన బాగు అగును.


 *  పిచ్చితనం ప్రారంభదశలో ఉండగా వడ్లగింజ ఎత్తు మొమ్మాయి గాడిదపాలతో కలిపి అరగదీసి లోపలికి ఇచ్చిన పిచ్చి తగ్గును.


 *  కొండనాలుక వాపుకు కాని గొంతుక వాపుకు మొమ్మాయి ఇప్పపువ్వు సారాయి తో కలిపి అంగిట పట్టించిన పై సమస్యలు తగ్గును. ఇప్పపువ్వు సారాయి దొరకనప్పుడు పెసరపప్పు కషాయం వాడవచ్చు .


         పైనచెప్పినవే కాకుండా మరెన్నో రోగములకు ఈ మొమ్మాయి అమృతం వలే పనిచేయును . ఈ మొమ్మాయి వాడే సమయమున బెండకాయ కూర, ఆవాలు వాడకూడదు. అదే విధముగా మొమ్మాయి అవునేయ్యితో కలిపి ఇచ్చేప్పుడు స్వచ్చమైన దేశవాళీ ఆవునెయ్యిని మాత్రమే వాడవలెను. మార్కెట్లో దొరికే మొమ్మాయిని పరీక్షించి మాత్రమే వాడవలెను. నకిలీలు చాలా ఉన్నాయి .


         మరిన్ని సులభ ఆయుర్వేద చిట్కాలు మరియు ఆయుర్వేద ఔషధాల వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 


  

పూర్వం హిందువులు రైళ్ల పేర్లు.

 పూర్వం హిందువులు రైళ్ల పేర్లు.

నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్..

పేద నవాజ్.

హజ్రత్‌గంజ్..


 ఇప్పుడు జరగండి...

*రామాయణ ఎక్స్‌ప్రెస్*...

*వందే భారత్ ఎక్స్‌ప్రెస్*

*మహాకాల్ ఎక్స్‌ప్రెస్*.....

తేడా స్పష్టంగా ఉంది

అర్థం చేసుకునే వారికి


కేవలం శివరాత్రి కారణంగా

రేపు కాశీ నుండి...

ఒక రైలు

ప్రారంభోత్సవ గౌరవనీయులు

ప్రధాని చేశారు

దీని పేరు *మహాకల్ 🚩 ఎక్స్‌ప్రెస్*,

ఈ రైలులో

శివునికి కోచ్..

B 4లో 64 బెర్త్ రిజర్వ్ చేయబడింది...


సీటుపై శివాలయం నిర్మించారు

మూడు జ్యోతిర్లింగాలకు

కనెక్ట్ చేస్తోంది

కాశీ-మహాకాల్ ఎక్స్‌ప్రెస్..


ఈ మూడు మతపరమైన ప్రదేశాలు

జోడిస్తుంది-

వారణాసిలో కాశీ విశ్వనాథుడు

ఉజ్జయినిలోని మహాకాళేశ్వరుడు

మరియు

 *ఇండోర్ సమీపంలోని ఓంకారేశ్వర్*


ఇప్పుడు మోడీకి

ప్రతిదీ సరిపోదని అర్థం చేసుకోవడం

  

మోడీ చాలా కష్టపడాల్సి వస్తుంది

మోడీ కూడా కష్టపడతారు.

కానీ ఈ దేశ ప్రజలు

ముఖ్యంగా హిందువులకు

మోదీకి అండగా నిలవాలి.


ఎందుకంటే మోడీ ఈ యుద్ధాన్ని తనపైకి తీసుకోలేదు, కానీ

భావి తరాలకు మరియు భారతదేశ ఉజ్వల భవిష్యత్తు కోసం.

కోసం ఆటపట్టించారు.


*భారతదేశంలోని హిందువులు 01-05-2023న వీధుల్లోకి వచ్చి హిందూ దేశాన్ని కోరాలని హిందువులు మోడీ కోరుకుంటున్నారు*


*మొదటి సారిగా హిందువులు మత పోరాట పతాకాన్ని ఎగురవేశారు, ప్రపంచం మొత్తం చూపులు 01-05-2023న జరిగే భారత్ బంద్ విజయవంతమై ఉన్నాయి.హిందువులకు ఒకే ఒక కల ఉంది, భారతదేశం హిందువుగా ఉండాలి. దేశం, భారత్ బంద్‌ను అన్ని మత సంస్థలు ప్రకటించాయి, సనాతన ధర్మ సోదర సోదరీమణుల పూర్తి సహకారం ఉంటుంది, ఒక రోజు బంద్ హిందువుల భవిష్యత్తును నిర్ణయిస్తుంది.



గుడి బద్దలైతే ఎవరూ మాట్లాడరు

*ఆవు చంపబడింది, ఎవరూ మాట్లాడరు*

హిందూ తల్లులు మరియు సోదరీమణుల గౌరవం సురక్షితం కాదు, ఎవరూ మాట్లాడరు.

*హిందువులు మారారు, ఎవరూ మాట్లాడరు*

*అయితే వీటన్నింటిని అక్కడక్కడా రక్షించడానికి హిందువులెవరైనా ముందుకు వస్తే, ప్రపంచమంతా అల్లకల్లోలం అవుతుంది*

ఎక్కడో ఇస్లాం పేరుతో, ఎక్కడో క్రైస్తవం పేరుతో, ఎక్కడో మరికొందరి పేరుతో,

*అన్నింటికంటే, మీరు ఎప్పుడైనా దాని వెనుక ఆలోచించడానికి ప్రయత్నించారా, మేము పూర్తి దూకుడుతో వాటన్నింటినీ రక్షించడానికి దృఢ సంకల్పంతో పని చేసి ఉంటే, అప్పుడు మేము ఎప్పుడూ రక్షణలో ఉండాల్సిన అవసరం లేదు.*

* అంతెందుకు ఈ దేశంలో హిందువుల విధ్వంసానికి కారణాలు ఏమిటో, ఆ కారణాలను, పరిష్కారాలను హిందువులు ఆలోచించాలి. *


*భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా ప్రకటించడానికి, భారతదేశం మొత్తం 01-05-2023న మూసివేయబడుతుంది*



*ఈ సందేశాన్ని కనీసం 5 గ్రూపులకు పంపాలి*

*కొందరు పంపరు*

*అయితే మీరు తప్పకుండా పంపుతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను*


🙏🙏🙏🙏🙏

సుభాషితమ్

 .


           _*సుభాషితమ్*_


 𝕝𝕝శ్లో𝕝𝕝  

*ఆదిత్య చంద్రా వనిలోనలశ్చ*

*ద్యౌర్భూమిరాపో హృదయం యమశ్చ|*

*అహశ్చ రాత్రిశ్చ ఉభే చ సంధ్యే*

*ధర్మో హి జానాతి నరస్య వృత్తమ్||*


తాత్పర్యము:

*సూర్యుడు, చంద్రుడు, గాలి, నిప్పు, ఆకాశము, భూమి, నీరు, తన హృదయము* (మనసు), *యముడు, పగలు రాత్రి, ఉభయ సంధ్యలు, మరియు ధర్మము మానవుని ప్రవర్తనకు (చేయు పనులకు) సాక్షీ భూతములు*.....

 _*సుభాషితమ్*_


 𝕝𝕝శ్లో𝕝𝕝  

*జకారో జన్మవిచ్చేదః* 

*పకారః పాపనాశకః |*

*తస్మాజ్జప ఇతి ప్రోక్తో*

*జన్మ పాపవినాశకః ||*


తా𝕝𝕝

*“జ”కారము జన్మ కలుగకుండ జేయును....ప” కారము పాపమును నశింప జేయును*.... *జన్మము, పాపము రెంటిని నాశము చేయునది కావున “జప” మందురు*.... *పరమాత్ముని నామము లన్నింటిలో మూగవాడు కూడ పలుకదగిన నామము "ఓమ్" అనునది శ్రేష్ఠమైనది*.....

జ్ఞానాదేవతు కైవల్యం."

 .


*ధ్యానాది సాధనలు చేసినవారంతా ఎందుకు మహర్షులు కాలేకపోతున్నారు? ముక్తులు కాలేకపోతున్నారు?*


శ్లో॥

మీనః స్నానపరః ఫణీ పవనభుజ్మే మేషోస్తి పర్ణాశనః

నీరాశీ ఖలు చాతకః ప్రతిదినం శైలే బిలే మూషికః

భష్మోద్దూళిత విగ్రహస్తు శునకో ధ్యానాధిరూఢో బకః

ఏతేషాం ఫలమస్తి కిం నహి నహి జ్ఞానం పరం కారణమ్||


గంగయందే పుట్టిపెరిగిన జలచరములన్నియు, నిత్యమూ గంగా స్నానమే చేసియు, అందే నివసించి వున్ననూ, సర్పము వాయుభక్షణమును చేసినను, మేక ఆకులను తినినను, చాతకపక్షులుకు జలమే ఆహారమైనను,

ఎలుకలు సదా గుహలలో వున్ననూ, కుక్క బూడిద పూసుకున్ననూ, కొంగ మౌనమును శీలించినను, వీటియన్నిటికిని ఎలాంటి విశేషఫలమును ఉండదు. ఎందుకంటే వీటన్నిటికీ బాహ్యాచారమే కానీ, అంతరంగనిష్ఠ ఏమాత్రమూ ఉండదు. 


పై వాటి వలె కాసేపు ధ్యానం, ఆహారనియమాలు, ప్రార్ధనలు, శాస్త్రపఠనాలు, ప్రవచనాలు వినడం... ఇత్యాది సాధనలు బాహ్యంగా ఆచరించినంత మాత్రమున ఫలితముండదు. అంతరంగనిష్ఠ ఉండాలి. సాధకునికి శ్రద్ధ, విశ్వాసం ఉండాలి. ఎటువంటి అవరోధాలు కల్గినను, పట్టుదలతో, అనన్య దైవభక్తితో, సాగిపోవాలి, ఆత్మసాక్షత్కారం, ముక్తి లాంటి అత్యున్నత స్థితులను చేరుకోవాలంటే, హృదయ పరిశుద్ధత అత్యవసరం. అందుకు ఎంతో సాధన అవసరం..."!! "జ్ఞానాదేవతు కైవల్యం."

లోకం గురించి

 *లోకం గురించి పరశురాముని ఆలోచన!* 

                     ‌‌‌‌‌        

నిశ్శబ్ద.


 ఒక రోజు పరశురాముడు దత్తాత్రేయుని సందర్శించడానికి బయలుదేరి, మార్గమధ్యలో లోకవ్యవహారం గురించి ఆలోచిస్తూ ఇలా అనుకొన్నాడు…


 “అయ్యో! నేను ఇంతవరకు దేనిని గురించి ఆలోచించాలో ఆ ముఖ్యవిషయం గురించి ఆలోచించలేదు. ప్రవాహంలో పడి కొట్టుకొనిపోతున్నవాడిలా - ఎలా వెళుతున్నానో, ఎందుకు వెళ్ళుతున్నానో తెలియకుండానే అందరితోపాటు నేను కూడా వ్యవహారం చేస్తున్నాను. గ్రుడ్డివాని వెంట వెళ్ళే గ్రుడ్డివారివలె ప్రజలందరూ ఒకరిని చూసి మరొకరుగా వ్యవహారములలో మునిగిపోతున్నారు. తాము చేస్తున్న పనికి పర్యవసానం ఎలా ఉంటుందో తెలుసుకోకుండానే ప్రజలు వ్యవహరిస్తున్నారు. 


ఎవనికైనా ఒకనికి ఏదో కొంచెం ఫలం దైవికంగా సంభవించడం చూసి, తమకు కూడా అటువంటి ఫలమే అంతకన్నా అధికంగా లభిస్తుందనే పేరాశతో, శక్తికి మించిన పనులను పూనుకొని ఆపదలను కూడా పొందుతున్నారు. ఇదంతా - 'ఎరను చూసి దానికొరకు గాలములో చిక్కుకొంటున్న చేపలాగా' ఉంది. అలాగాక *ఈ దిక్కుమాలిన సంసారంలో సుఖం ఏముంది?*


 దేవతల నుండి క్రిమికీటకముల వరకు అందరూ సుఖం పొందాలనే మిక్కిలి ఆరాటంతో వ్యవహరిస్తున్నారు. నాలుక వలన కలిగే రుచి, మైధునం వలన సుఖం క్రిమికీటకములతో సమానంగానే త్రిలోకాధిపతికీ కలుగుతున్నది. భౌతికమైన ఈ దేహం కొరకే సర్వం కోరబడుతున్నది. ఇది మల మూత్ర మాంసం మొదలైనవాటితో పూర్ణమై, కుత్సితమై, దుఃఖమూలమై ఉంది. దీని మూలంగానే పుత్ర-మిత్ర-కళత్ర రూపమైన సంసారం ఏర్పడుతున్నది. ఇటువంటి దేహమునే తననుగా భావిస్తూ దీనికోసమే పామరుడు, పండితుడు కూడా నింద్యకృత్యములకు పాల్పడుతున్నారు. 


దేహం రోగగ్రస్తమై ముసలితనంలో కృశించి హేయమవడం ఇతరులలో చూస్తున్న ప్రతివ్యక్తి, నా శరీరం మాత్రం అటువంటి బాధలకు లోను కాదు అన్నట్లు వ్యవహరిస్తున్నాడు. ఈ కుత్సితమైన శరీరమునందే స్త్రీలు, పురుషులు సౌందర్యమును భావిస్తూ భోగలంపటులు అవుతున్నారు. నాలుకయొక్క రుచికి, మైధున సుఖమునకు లోబడి మానవులు ఎల్లపుడూ అతి సమీపంలోనే ఉండే మృత్యువును గమనించడం లేదు.


 తమ జీవితం ఎంత అల్పమైందో గుర్తించని ఈ మానవులు దీర్ఘ కాలంలో, ఎప్పటికో లభించు ఫలములను కోరి నిరంతరం పాటుపడుతున్నారు. స్వార్థం కోసం వీరు ఇతరులను చంపడానికి కూడా వెనుకాడరు. ఇలా కామక్రోధ పరాయణులై వీరు పొందే సుఖం ఏమిటి? అల్పసుఖంకోసం వీరు అధిక దుఃఖమునే పొందుతున్నారు. వీరి ఆశలకు అంతం ఎక్కడ? ఆశ ఉన్నంతవరకు సుఖం ఎక్కడ? 


 మనస్సు కామానికి లొంగడమే మహాదుఃఖము. సర్వసంపదలతో సామ్రాజ్యం లభించినవానికైనా సుఖం ఎక్కడిది? వాటిని ఇంకా అభివృద్ధి చేయాలనే ఆశ వలన, శత్రువులు వచ్చి చంపుతారేమో అనే భయం వలన రాజులకు, ధనవంతులకు కూడా ఎల్లపుడూ దుఃఖమే కలుగుతోంది.


 ఎంతో కష్టపడి మనుష్యులు సంపదలను పొందుతున్నారు. వాటికొరకే మిత్రులు శత్రువులు అవుతున్నారు. పుత్రులు తండ్రులపై తిరగబడుతున్నారు. ప్రియురాలు ప్రియునికి ద్రోహం చేస్తున్నది. భార్యాపుత్రులు కూడా ధనవంతునకు మృత్యువును కోరుతున్నారు. అలా మృత్యువుతో సమానమైన ధనమును కోరుతూ మానవులు కుటుంబమును తమచుట్టూ గూడువలె అల్లుకొని, అందులో చిక్కుపడి బయటకు రాలేక తన్నుకొంటున్నారు. 


 ఎవడు ఏ కుటుంబంతో ఎటువంటి సంబంధమును, ఎంతకాలం కలిగి ఉన్నా ఒకప్పటికి వియోగం పొందక తప్పదు. కానీ, భార్యా పుత్రులతో సంబంధం అత్యంత స్థిరమైనట్లుగా స్నేహమును పెంపొందించుకొని, మనుష్యులు చివరకు మహాదుఃఖమును పొందుతున్నారు. ధనములు, జనములు మొదలుగా సర్వము అత్యంత బలిష్ఠమైన మృత్యువుచేత ఆక్రమింపబడి ఉంది. కావున మనశ్శాంతిని కోరే బుద్ధిమంతుడు ఎవడూ వాటిమీద ఆసక్తి చెందకూడదు. ఏది ప్రాప్తిస్తే భయమే ఉండదో, అటువంటి పదమునే బుద్ధిమంతుడు కోరుకోవాలి. కాబట్టి అభయమును కలిగించే విజ్ఞానం కోసం నేను మహనీయుడైన దత్తాత్రేయుని ఆశ్రయిస్తాను అనుకున్నాడు పరశురాముడు.

11, మార్చి 2023, శనివారం

సనాతన ధర్మాన్ని

: ప్రజ్ఞ ఉన్నవాడు మాత్రమే ప్రపంచ యథార్థ స్థితిని గ్రహించగలడు. అప్పుడే కాలాన్నీ, కోర్కెల్నీ, ఇంద్రియ వాంఛల్నీ, ప్రపంచాన్నీ, చివరకు తనను తాను జయించుకోగలడు.


మల్ల దేశ రాజధాని కుశీ నగరం సమీపంలో ఒక ఆరామం ఉంది. వినయధరుడు అనే పెద్ద భిక్షువు ఆ ఆరామంలో ఆచార్యుడు. పదిమంది చిన్న భిక్షువులు ఆయన దగ్గర విద్య నేర్చుకుంటున్నారు. ఆయన వారికి ధర్మ విద్యలు చాలా నేర్పాడు. తనకు తెలిసిందంతా ఉపదేశించాడు. ‘మీరు ఇక నాతో సరిసమానులే!’ అని మెచ్చుకున్నాడు. ఆ మెచ్చుకోలు కొందరిలో అహాన్ని పెంచింది. ‘ఇక మనం కూడా గురువుగారితో సమానులమే!’ అని అనుకున్నారు.

.

ఒక రోజున గురువు ఒక రేగు చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. ఈ అహంకార శిష్యులు అక్కడికి వెళ్ళి, రేగు చెట్టు కాండాన్ని గీకుతూ ‘‘ఇక ఈ చెట్టు సారం అయిపోయింది!’’ అంటూ గురువుగారిని ఉద్దేశించి హేళనగా మాట్లాడారు. ఈ విషయం గమనించిన గురువు తన శిష్యుల్ని దారికి తీసుకురావాలనుకున్నాడు.

.

వారిని దగ్గరకు పిలిచి ‘‘భిక్షువులారా! మీరు ఎంతో జ్ఞానాన్ని పొందారు. మంచిది. మీ జ్ఞానం ఏపాటిదో తెలుసుకోవాలని ఉంది. నాది ఒక ప్రశ్న. దానికి సమాధానం ఇవ్వగలరా?’’ అని అడిగాడు. ‘‘ఓ! భంతే! తప్పకుండా’’ అన్నారు వారు ధైర్యంగా, గర్వంగా. ‘‘మంచిది. సంతోషం. నా ప్రశ్న జాగ్రత్తగా వినండి. కాలం అనేది సర్వ భూతాల్నీ తింటుంది. చివరకు తనను తాను కూడా తింటుంది. మరి, ఈ కాలాన్ని కాల్చుకు తినే నిప్పు ఒకటుంది. అది ఏది? ఆ నిప్పును కూడా దిగమింగే అగ్ని ఒకటుంది. ఆ అగ్ని ఏది?’’ అని అడిగాడు. శిష్యులు తలలు పట్టుకున్నారు. వారికి సరైన సమాధానం తోచలేదు.

.

‘‘నాయనా! తొందరలేదు. ఇప్పటికిప్పుడే చెప్పనవసరం లేదు. మీకు ఏడు రోజులు గడువు ఇస్తున్నా. వెళ్ళండి. ఆలోచించండి. వచ్చి చెప్పండి అని గురువు వారిని పంపాడు. శిష్యులు సిగ్గుతో తలవాల్చి, ఆలోచిస్తూ వెళ్ళిపోయారు. వారం రోజుల తరువాత తిరిగి వచ్చి- ‘‘భంతే! మమ్మల్ని క్షమించండి. మా అజ్ఞానాన్ని మన్నించండి’’ అని నమస్కరించి నిలబడ్డారు. ‘‘సరే! సమాధానం చెప్పడానికి ఒక దారి చూపిస్తాను. వినండి. ప్రతి ఒక్కరికీ ఒక మెడ ఉంటుంది. ఆ మెడ మీద ఒక తల ఉంటుంది. ఆ తలలో ఎన్నో అవయవాలు ఉంటాయి. తలమీద వెంట్రుకలు ఉంటాయి. కానీ తలకు విలువను తెచ్చేవి అవేవీ కావు. తలకు విలువ తెచ్చేది ఏది? అసలు తలలో ఉండాల్సింది ఏది?’’ అని అడిగాడు. శిష్యులు నిలువు కాళ్ల మీద నిలబడి, నిలువు గుడ్లు వేసుకొని చూస్తూ ఉండిపోయారు. నోరు మెదపలేదు. తెలియదన్నట్టు తల అడ్డంగా ఊపారు.

.

‘‘మీకు లేనిది అదే! అది ఉంటే అహం ఉండదు. అదే ప్రజ్ఞ. ప్రజ్ఞ ఉంటేనే తలకు విలువ!’’


‘‘మరి ప్రజ్ఞకూ, కాలానికీ సంబంధం?’’

.

‘‘కాలాన్ని కూడా కాల్చుకు తినే నిప్పురవ్వ మనలోని కోరిక లేదా తృష్ణ. తృష్ణను కాల్చే అగ్ని ప్రజ్ఞ మాత్రమే! ప్రజ్ఞ ఉన్నవాడికే తృష్ణాక్షయం కలుగుతుంది. ప్రజ్ఞ ఉన్నవాడు వివేచనతో కోరికల్ని జయించగలడు. అతడే జితేంద్రియుడవుతాడు. జితేంద్రియుణ్ణి ఏ కోరికా తాకలేదు. సర్వ భూతాల్నీ- అంటే సమస్త భౌతిక ప్రపంచాన్నీ భక్షించే కాలం కూడా చివరకు తనను తాను భక్షించుకుంటుంది. గతాన్ని భక్షించి వర్తమానంగా, వర్తమానాన్ని భక్షించి భవిష్యత్తుగా మారిపోతూ ఉంటుంది. ప్రజ్ఞ ఉన్నవాడు మాత్రమే ప్రపంచ యథార్థ స్థితిని గ్రహించగలడు. అప్పుడే కాలాన్నీ, కోర్కెల్నీ, ఇంద్రియ వాంఛల్నీ, ప్రపంచాన్నీ, చివరకు తనను తాను జయించుకోగలడు. కాబట్టి మీరు జ్ఞానులుగా కదు, ప్రాజ్ఞులుగా మారండి. అహంకారంతో, స్వాతిశయంతో మూర్ఖులు కాకండి. శీలవంతమైన జ్ఞానమే ప్రజ్ఞ అని తెలుసుకోండి. అలా నడుచుకోండి’’ అని చెప్పాడు.


శిష్యులు వంగి, మోకాళ్ళ మీద కూర్చొని, మన్నించమని ప్రార్థించారు. అణకువగా మెలిగి, అనతికాలంలోనే ప్రాజ్ఞులు కాగలిగారు...


సనాతన ధర్మాన్ని 

నిష్ఠగా పాటించే ప్రతి మానవుడూ  

మొదట ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన 

పిదప అత్మ సాక్షాత్కారాన్ని అనుభవించి మరణ సమయానికి  గతానుగతికమైన పాపరాశి మిగిలి ఉంటే దాన్ని తగ్గించుకోవడానికి వీలైన ఉత్తమజన్మనీ పాపరాశి శూన్యస్థితికి చేరుకుంటే ఇంక జన్మ లేని మోక్షస్థితిని అందుకుంటాడు - 


అది తను యే భగవానుడి నుండి విడివడి జన్మపరంపరలోకి వచ్చాడో ఆ భగవంతుడిలో లీనమైపోవటం అవుతుంది!

మొదట తెలుసుకోగానే  అసాధ్యం అనిపించే ఇంతటి సంక్లిష్టమైన లక్ష్యాన్ని కూడా చాలా సులభంగా సాధించగలిగేటట్లు మానవాత్మలను సిద్ధపర్చటం కోసం ప్రాచీన భారతీయ ఋషులు ఎంతగానో శ్రమించి ఎన్నో మార్గాలను ఏర్పరచారు,

ఎన్నో ఉపాయాలను చూపించారు,శ్రమ తెలియకుండా ఉండేటందుకు ఎన్నో ఆనందాలను సమకూర్చారు - శ్రద్ధ ఒకటి ఉంటే చాలును ఈ ధర్మానుష్ఠానం ద్వారా సాధన పూర్తయ్యాకనే కాదు సాధన మొదలు పెట్టగానే ఆనందం, పరమానందం, బ్రహ్మానందం అనే స్థాయిల్లో ఏదో ఒకదాన్ని పొందవచ్చును!

సనాతన ధర్మానికి ఆద్యంతాలు లేవు.సృష్టి స్థితి లయ విభూతు లన్నింటా ఇమిడిపోయి వాటిని నడిపిస్తూ ఉంటుంది.ప్రళయంలో సైతం నశించదు - బీజ రూపంలో నిద్రాణమై ఉండి సృష్టి మొదలైనప్పుడు చైతన్యవంతమై సకల భూతాళికీ రక్షణ నిచ్చే మనోగతమైన సంస్కారాల్నీ  క్రమబద్ధమైన జీవన విధానాల్నీ ప్రసాధించి శాసించేది సనాతన ధర్మమే!..


తత్వమసి'  

తత్‌+ త్వం +అసి 

తత్‌.. అంటే అది, త్వం అంటే నీవై, అసి అంటే ఉన్నావు, 'అది నీవై ఉన్నావు'...


" ఏకం సత్, విప్ర బహుదా వదంతి "

అనగా " ఉన్నది ఒక్కటే , పలు నామములతో  పిలువబడుచున్నది 

లేదా చూడబడుచున్నది"   

అని ఋగ్వేద వాక్యం.....

.సేకరణ:

 ఉపనిషత్తులు అంటే ఏమిటి.....!!


1. జన్మరాహిత్యానికి లేక మోక్ష ప్రాప్తికి ఉపయోగించే మంత్రవాక్య సముదాయాన్ని ఉపనిషత్తులంటారు.


2. ఆత్మ జ్ఞానము అని మరొక అర్థము.


3. ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించే గురువునకు సమీపముగా ఉండుట అని ఇంకొక అర్థము.


అడవులలో గురుశిష్యుల మధ్యన జరిగిన చర్చలనే ‘ఉపనిషత్తులు’ అంటారు. ఈ ఉపనిషత్తులు వేదంలోని భాగంలో ఒకటిగా చెబుతారు. 


వేధంలోని ఈ ఉపనిషత్తులు తత్త్వ జ్ఞానం గురించి, దానికి సంబంధించి మహర్షులు అనుభవాల గురించి క్షుణ్ణంగా మనకు విశదపరుస్తాయి. 


వేదసారం-ఉపనిషత్తులు మొత్తం 108 ఉపనిషత్తులు ఉన్నప్పటికీ వాటిలో పది మాత్రమే ప్రధానమైనవి. 


అవి : 1.ఈశోపనిషత్తు 2. కఠోపనిషత్తు 3. ముండకోపనిషత్తు 4. కేనోపనిషత్తు.5 ప్రశ్నోపనిశషత్తు 6.మాండూక్యోపనిషత్తు 7.తైత్తరీయోపనిషత్తు 8. ఐతరీయోపనిషత్తు 9. బృహదారణ్యకోపనిషత్తు. 10. చాందోగ్యోపనిషత్తు. 


ఉపనిషత్తులకు ఉన్న ఇంకొక పేరేమిటి?


సామాన్యంగా ఉపనిషత్తులు వేదాలకు చివరి భాగాలలో ఉంటాయి. అందుచేత ఉపనిషత్తులకు వేదాంతములు అని ఇంకొక పేరు ఉంది.


ఉపనిషత్తులను 'రహస్యం' అని ఎందుకు పిలుస్తారు?


'ఉపనిషత్' శబ్దానికి చెప్పిన అనేక అర్థాలలో ఒకటి 'రహస్యము' అను అర్థం. రహస్యము అనగా తెలియడం కష్టమైనా ప్రయత్న పూర్వకంగా తెలిసికొన దగినది. ఎక్కడనో సుదూర దేశంలో ఉన్న వస్తువు కూడా తెలియనిదే. కాని దాని 'రహస్యం' అని అనం. ఏది మనకు దగ్గరనే ఉంటూ మనకు తెలియదో అది పరమ రహస్యం. ఇలాంటి పరమ రహస్యం ఆత్మతత్వం. 


ఆత్మా అనేది 'నేను, నేను' అను అనుభవంలో అందరికీ గోచరమైనదే. అయినా కూడా దాని తత్వం, యథార్థ స్వరూపం ఏమో ఎవరికీ తెలియదు. అందుచేతనే ఇది పరమ రహస్యం, ఉపనిషత్తు. ఈ పరమ రహస్యానికే కాకుండా, దీనిని బోధించే గ్రంధానికి కూడా ఉపనిషత్తు అని పేరు.


ఉపనిషత్తు అనే పదానికి ఉన్న మరి కొన్ని అర్థాలను వ్రాయండి?


1. జీవులలో ఉండే అవిద్య అను సంసార భీజమును నాశనము చేయునది అని ఒక అర్థం.


2. మోక్షాన్ని ఆకాంక్షించే వారిని పరమాత్మ దగ్గరకు జేర్చెది అని ఒక అర్ధం.


3. జన్మ, వార్ధక్యము మొదలైన ఉపద్రవాలను శిథిలము చేయునది అని ఒక అర్థం.


4. అధ్యయనం చేసేవారికి ఉపనిషత్తు అంటే "గ్రంథం" అని ఒక అర్థం, ఆ గ్రంథం ద్వారా అందించ బడిన "విద్య" అని ఇంకొక అర్థం - ఇంకా ఎన్నెన్నో అర్థాలు ఉన్నాయి.


"ఓం శాంతిః శాంతిః శాంతిః" అనే శాంతి పాఠానికి అర్థం ఏమిటి?


ప్రతి మనిషిని మూడు రకాల దుఃఖాలు బాధించడానికి అవకాశం ఉంది. వాటిని ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక దుఃఖాలు లేక తాపాలు అంటారు.


శరీరంలో ఉద్రేకాల వలన కలిగే రోగాలు, సోమరితనం, కపటం మొదలైన దుర్గుణాల వలన కలిగే ఉపద్రవాలను ఆధ్యాత్మిక దుఃఖాలు అంటారు.


పంచమహా భూతాల నుండి (ఆకాశం, వాయువు, అగ్ని, జాలం, పృథ్వి), శత్రు, చోర, మృగ, కీటకాదుల వలన కలిగే ఉపద్రవాలను ఆదిభౌతిక దుఃఖాలు అంటారు.


అతివృష్టి, అనావృష్టి, పిడుగు పాటు, గ్రహ బాధలు మొదలగు వాటి మూలంగా కలిగే ఉపద్రవాలను ఆది దైవిక దుఃఖాలు అంటారు.


పరమాత్మ చింతనము ఈ పై మూడు రకాల దుఃఖములను శాంతింప జేయు గాక అని ఈ శాంతి పాఠము బోధిస్తోంది.


పది ఉపనిషత్తులను గుర్తించే శ్లోకం ఏది?

శ్లో॥

*ఈశ కేన కఠ ప్రశ్న ముండ మాండూక్య తిత్తిరాః౹*

*ఛాందోగ్యమైతరేయం చ బృహదారణ్యకం తథా॥*


శంకర భగవత్పాదులు ఎక్కువ పర్యాయములు ఉదాహరించిన ఇంకొక ఉపనిషత్తు ఏది?


శ్వేతాశ్వతరోపనిషత్తు


నాలుగు వేదాలకు చెందిన మహా వాక్యాలేమిటి? అవి ఏ ఉపనిషత్తులలో ఉన్నాయి?


ఋగ్వేదం - ప్రజ్ఞానం బ్రహ్మ - ఐతరేయోపనిషత్తు

యజుర్వేదం - అహంబ్రహ్మాస్మి - బృహదారణ్యకోపనిషత్తు

సామవేదం - తత్వమసి - చాందోగ్యోపనిషత్తు

అథర్వణవేదం - అయమాత్మాబ్రహ్మ - మాండూక్యోపనిషత్తు.........

10, మార్చి 2023, శుక్రవారం

లక్ష్మీనివాసం

 *లక్ష్మీనివాసం*

                  


*లక్షీదేవి ఒకసారి ఒక వ్యక్తి పై  అలిగి “నేను వెళ్లి పోతున్నాను. మీ ఇంటికి ఇక దరిద్ర దేవత రాబోతున్నది. కాకపోతే నీకో వరం ఇవ్వదలచుకొన్నాను. అడుగు!”అని అంటుంది.*


*అప్పుడు ఆ వ్యక్తి లక్ష్మీదేవి తో  ఇలా అంటాడు… “అమ్మా నీవు వెళ్లుతుంటే ఆపే శక్తి నాకు లేదు. అలాగే దరిద్రదేవత వస్తుంటే ఆపే శక్తి అంతకన్నా లేదు. మీలో ఒకరు వున్నచోట ఒకరు వుండరు. కాబట్టి దరిద్ర దేవత వచ్చిన వేళ మా ఇంటిలో ఇప్పుడు ఒకరిపట్ల ఒకరికున్న ప్రేమాభిమానాలు అలాగే వుండేటట్లు వరం ఇవ్వమ”ని అంటాడు.*


*లక్ష్మీదేవి ‘తథాస్తు!’ అని వెళ్లిపోతుంది.*

             *


*కొన్నిరోజుల తర్వాత ఇంటిలో  వంట చేస్తున్న ఆ వ్యక్తి భార్య కూరలో ఉప్పు కారం సమపాళ్ళలో  వేయమని కోడళ్లకు చెప్పి గుడికి పోతుంది.*


*కొంతసేపటికి చిన్న కోడలు ఉప్పు కారం కూరలో వేసి ఏదో పనిలో నిమగ్నమై పోతుంది.*


*ఇంకొంతసేపటికి పెద్దకోడలు వచ్చి కూరలో ఉప్పు వేశారో లేదో అని అనుమానం వచ్చి తనుకూడ ఆ కూరకు తగినంత ఉప్పు వేసి వేరేపనిలో పడిపోతుంది.*


*ఇంతలో అత్తగారు వచ్చి కోడళ్లు ఇద్దరు తమ పనిలోపడి ఉప్పు వేశారో లేదో అని తనూ కొంత వేస్తుంది.*


*మధ్యాహ్నం భోజనానికి   ఆవ్యక్తి  తను తినే సమయంలో కూరలో ఉప్పు ఎక్కువ అయినది గ్రహించి దరిద్ర దేవత ఇంటిలోకి  ప్రవేశించింది అని తెలుసుకుంటాడు. ఏమి అనకుండా తిని లేస్తాడు.*


*కొంత సేపటికి ఆ వ్యక్తి పెద్దకొడుకు కూడ భోజన సమయంలో ఉప్పు ఎక్కువ అయినది అని గ్రహించి ‘నాన్న గారు తిన్నారా?’ అని భార్యను అడుగుతాడు.*


*’తిన్నారు!’  అని చెబుతుంది.*


*దానితో   ‘నాన్న ఏమీ అనకుండ తిన్నాడు. నేనెందుకు అనాలి?’   అని ఏమి మాట్లాడకుండ తిని లేస్తాడు.*


*ఇలా ఇంటి వాళ్లంతా తిని వంట గురించి మాటలాడకుండ వుంటారు.*


*ఆరోజు సాయంత్రం దరిద్ర దేవత ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి   ‘నేను వెళ్లిపోతున్నాను. ఉప్పు కసిం  అయిన వంట తిని కూడ మీ మధ్య ఏ స్పర్ధలు రాలేదు. మీరు ప్రేమగా ఐక్యమత్యంగా ఉన్నారు. ఇటు వంటి చోట నేనుండను!’ అని వెళ్లిపోతుంది.*


*దరిద్ర దేవత వెళ్లిపోవటంతో ఆ ఇంట మళ్లీ లక్ష్మీదేవి నివాసం ఏర్పరచుకొంటుంది.*


*ఏ ఇంటిలో  ‘ప్రేమ,అప్యాయతలు మరియు శాంతి’ వుంటాయో ఆ ఇల్లు    ‘లక్ష్మీ నివాసం’ అయ్యి వుంటుంది.*

ఐశ్వర్యం

 .


               _*సుభాషితమ్*_


శ్లో𝕝𝕝 

*అభిభూతోఽప్యవజ్ఞాతో*

*యో రాజ్ఞాం ద్వారి తిష్ఠతి।*

*న తు రాజ్ఞాం శ్రియం భుఙ్క్తే*

*నాభిమానీ కదాచన॥*


తా𝕝𝕝 *తిరస్కరించబడినా, అవమానించబడినా రాజుల ద్వారం విడవకుండా ఉండేవాళ్లు ఐశ్వర్యం అనుభవించ గలుగుతారు*..... కానీ? *ఆత్మాభిమానం కలవారు ఎన్నడూ అనుభవించలేరు*......


               _*సుభాషితమ్*_


 𝕝𝕝శ్లో𝕝𝕝 

*నాస్తి జాత్యా రిపుర్నామ*

*మిత్రం వాపి న విద్యతే*|

*సామర్థ్య యోగాజ్జాయన్తే*

*మిత్రాణి రిపవ స్తథా||*


తా𝕝𝕝

*పుట్టుకతో ఎవ్వడూ శత్రువు కాదు*... 

*ఎవ్వడూ మిత్రుడూ కాదు*.... 

*సామర్థ్య వినియోగాన్ని బట్టియే మిత్రులయినా శత్రువులైనా ఏర్పడుదురు*

"....శ్లోకం:☝️

*రక్షితవ్యా హి సంబంధా*

 *యాథార్థేణ న యే స్థితాః |*

*యాథార్థేణ చ సంబంధా*

 *ధేనుర్వత్సకయోరివ ||*


భావం: తుమ్మితే ఊడిపోయే సంబంధాలు, అనుక్షణం రక్షించుకోవలసిన సంబంధాలు ఎప్పటికీ నిజం కావు. అటువంటి అవసరం లేని ఆవు-దూడ వంటి సంబంధాలు మాత్రమే నిజమైనవి, నిలకడైనవి.