13, సెప్టెంబర్ 2023, బుధవారం

ఖర్చు పెట్టిన కొద్దీ

 ಸುಭಾಷಿತ . 621 .


ಅಪೂರ್ವಃ ಕೋಪಿ ಕೋಶೋಯಂ ವಿದ್ಯತೇ ತವ ಭಾರತಿ | ವ್ಯಯತೋ ವೃದ್ಧಿಮಾಯಾತಿ ಕ್ಷಯಮಾಯಾತಿ ಸಂಚಯಾತ್ ||


ಅಮ್ಮಾ ಸರಸ್ವತೀದೇವಿ , ನಿನ್ನ ಈ ಜ್ಞಾನಭಂಡಾರ ಅಪೂರ್ವವಾದುದು . ಇದನ್ನು ವೆಚ್ಚಮಾಡಿದಷ್ಟೂ ಇದು ಬೆಳೆಯುತ್ತದೆ . ಕೂಡಿಟ್ಟಷ್ಟೂ ಕ್ಷಯಿಸುತ್ತದೆ . 


ಸುಭಾಷಿತರತ್ನಭಂಡಾರ .

అమ్మా భారతీ, నీ సంపద అపూర్వం. ఖర్చు పెట్టిన కొద్దీ పెరుగు తుంది. దాచి పెడితే నాశనం అవుతుంది.

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర -45🌹*

🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర -45🌹*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


*తిరుమల_ఏడుకొండల_పరమార్థం:*


*1. వృషాద్రి 2. వృషభాద్రి 3. గరుడాద్రి 4. అంజనాద్రి 5. శేషాద్రి 6. వేంకటాద్రి 7. నారాయణాద్రి.*


ఏడు చక్రాలు దాటితే ఆనందానుభూతి కలుగుతుంది. ఆనంద నిలయం ఎక్కడఉంటుంది. బ్రహ్మ స్థానంలో ఉంటుంది. అందుకనే ఆయన 7 కొండలు పైనఉంటాడు. ఈ 7 కొండలు ఎక్కడం కూడా ఒక రహస్యం ఉంటుంది. ఆ 7 కొండలు సాలగ్రామాలే. ఆ 7 కొండలూ మహర్షులే. అక్కడి చెట్లు,పుట్టలు, పక్షులు ఏవైనా మహర్షుల అంశలే. తిరుమలలో పుట్టింది ఏదీ సామాన్యమైనది కాదు. 


*అంజనాద్రి ర్వ్రుశాద్రిశ్చ శేషాద్రిర్గరుడాచలః |*

*తీర్థాద్రిః శ్రీనివాసాద్రి శ్చింతామణిగిరిస్తథా ||*

*వృషభాద్రి ర్వరాహాద్రిః జ్ణానాద్రిః కనకాచలః |*

*ఆనందాద్రిశ్చ నీలాద్రి స్సుమేరుశిఖరాచలః ||*

*వైకుంఠాద్రి: పుష్కరాద్రిః -- ఇతి నామాని వింశతిః*


ఈ 20 నామాలు పఠించటంవల్ల సర్వ పాప బంధాలు నుండీ విముక్తులు కాగలరు.


 *ఏడు కొండలు :*


 *శ్రీ శేషశైల గరుడాచల వేంకటాద్రి నారాయణాద్రి వ్రుషబాధ్రి* *వ్రుషాద్రి ముఖ్యాం ఆఖ్యం త్వదీయవసతే* *రనిశంవదంతి శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతం* 


ఏడుకొండల తిరుమల క్షేత్రం।

లక్ష్మీ దేవికి ఆవసమైనందున శ్రీశైలం.

ఆదిశేషుడు పర్వతంగా రూపొందినందువలన శేషశైలం లేదా శేషాచలం .

గరుత్మంతుడు వైకుంఠం నుండి తెచ్చినందున గరుడాద్రి.

వేం= సమస్త పాపాలను, కట=దహించునది కావున కావున వేంకటాద్రి. వేం= అమృతత్వాన్ని, కట= ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తున్నందువల్ల వేంకటాద్రి.

నారాయణుడనే మహర్షి శ్రీ మహావిష్ణు వు కోసం తపస్సు చేసిన స్థలం, తన పేరుతో ప్రసిద్ధి పొందాలని వరం పొందినందున అది నారాయణాద్రి.

వృషభుడనే శెవభక్తుడు కోరి, శబర వేషం లోవున్న శ్రీనివాసునితో యుద్ధం చేసి మరణిస్తూ తనముక్తికి గుర్తుగా ఆపర్వ తానికి తన పేరు పెట్టాలని కోరుకున్నాడని పురాణగాధ, అదే వృషబాధ్రి .

వృషమనగా ధర్మము ధర్మ దేవత తన అభివృద్ధికై ఈ పర్వతం పై తపస్సు చేసినందున వృషాద్రి అని పేరు కలిగింది.


పై ఏడు పేర్లతో ఈ యుగంలో ప్రసిద్ధి పొందినా, గడచిన యుగాలలో చింతా మణి, జ్ఞానాద్రి, ఆనందాద్రి, అజనాద్రి, నీలాద్రి, వరాహాద్రి, వైకుంఠాద్రి .....ఇలా అనేక నామాలను కలిగివుంది.

 

*1. వృషభాద్రి -* అంటే ఎద్దు : వృశాభానికి ఋగ్వేదంలో ఒక సంకేతం ఉంది. ఎద్దు మీద పరమశివుడు కూర్చుంటాడు. దానికి 4 కొమ్ములుంటాయి. 3 పాదాలు (భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు)

వాక్కు అంటే - శబ్దం

శబ్దం అంటే - వేదం

వేదం అంటే - ప్రమాణము

వేదమే ప్రమాణము. వేదము యొక్క ప్రమాణాన్ని అంగీకరించిన వాడు మొదటి కొండ ఎక్కుతాడు.

 కృతయుగంలో తిరుమలలోని తుంబురుతీర్థం వద్ద వృషభాసురుడు అనే రాక్షసుడు ప్రతిరోజూ తన తల నరికి శివుడికి నైవేద్యంగా పెట్టేవాడట. అలా నరికిన ప్రతిసారీ కొత్త శిరస్సు పుట్టుకొచ్చేది. అతని భక్తికి మెచ్చిన శివుడుఒకనాడు వృషభునికి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే ఆ మూఢభక్తుడు తనకు శివునితో ద్వంద్వ యుద్ధం చేయాలని ఉన్నదని చెప్పాడట. చాలాకాలంపాటు జరిగిన ఆ యుద్ధంలో వృషభాసురుడు ఓడిపోయాడు. ప్రాణాలు విడిచే ముందు తనకు అక్కడ ముక్తి లభించినందుకు గుర్తుగా అక్కడి పర్వతానికి తన పేరు పెట్టాలని కోరుకున్నాడనీ అదే వృషభాద్రి అనీ పురాణగాథ.

 

*2. వృషాద్రి -* అంటే ధర్మం :

ధర్మం అంటే - నువ్వు వేదాన్ని అనుసరించి చేయవలసిన పనులు. నీకు భగవంతుడు ఇచ్చిన వాటితో మంచివి వినడం, చూడడం, మంచి వాక్కు మొదలైనవి. దాని వల్ల ఇహంలోను, పరలోకంలోను సుఖాన్ని పొందుతాడు. అవి చెయ్యడమే వృషాద్రిని ఎక్కడం.

 

*3. గరుడాద్రి -* అంటే పక్షి -ఉపనిషత్తుల జ్ఞానాన్ని పొందడం.షడ్ - అంటే జీర్ణం కానిది. ఒక్క పరమాత్మ మాత్రమే జీర్ణంకానిది. పరమాత్మ ఒక్కడే ఉంటాడు. మిగిలిన వాటికి 6 వికారాలు ఉంటాయి. పుట్టినది, ఉన్నది, పెరిగినది, మార్పు చెందినది, తరిగినది, నశించినది. ఇవ్వన్నీ పుట్టిన వాడికి జరుగుతూనే ఉంటాయి. ఆ ఆరు లేని వాడు భగవానుడు.

భ == ఐశ్వర్య బలము, వీర్య తేజస్సు మరియు అంతా తానే బ్రహ్మాండము అయినవాడు.

అన్ == ఉన్నవాడు, కళ్యాణగుణ సహితుడు, హేయగుణ రహితుడు. అటువంటి భగవానుణ్ణి జ్ఞానం చేత తెలుసుకోవడమే గరుడాద్రి.

 దాయాదులైన కద్రువ పుత్రుల (నాగులు) ను సంహరించిన గరుత్మంతుడు పాపపరిహారార్థం విష్ణువును గూర్చి తపస్సు చేశాడు. స్వామి ప్రత్యక్షమవగానే తనకు తిరిగి వైకుంఠం చేరే వరమివ్వమని ప్రార్థించాడు. దానికి స్వామి... తానే ఏడుకొండల మీద వెలియనున్నానని తెలిపి ఆ వైనతేయుణ్ని కూడా శైలరూపంలో అక్కడే ఉండమని ఆదేశించారట. అదే గరుడాచలం.

 

*4. అంజనాద్రి -* అంజనం అంటే కంటికి కాటుక. ఈ కంటితో చూడవలసినవి మాత్రమే చూసినపుడు. ఈ కంటితో చూసిన దాంట్లో అంతటా బ్రహ్మమే ఉందని తెలుసుకోవడం కంటికి కాటుక. ఇదంతా

పరమాత్మ సృష్టియే. అప్పుడు అంజనాద్రి దాటతాడు.

 

 వానరప్రముఖుడు కేసరిని వివాహం చేసుకున్న అంజనాదేవికి చాలాకాలం పాటు పిల్లలు పుట్టలేదట. దాంతో ఆమె ఆకాశగంగ అంచున ఉన్న కొండల మీద ఏళ్లతరబడి తపస్సు చేయగా వాయువు అంజనాదేవికి ఒక ఫలాన్నిప్రసాదించాడట. ఆ పండును భుజించిన ఫలితంగా హనుమంతుడు జన్మించాడనీ అంజనాదేవి తపస్సు చేసిన కారణంగా ఆ కొండకు అంజనాద్రి అని పేరు వచ్చిందనీ అంటారు.

 

*5. శేషాద్రి -* ప్రపంచం అంతా బ్రహ్మమే అని చూసాడనుకోండి వాడికి రాగద్వేషాలు ఉండవు. వాడికి క్రోధం ఉండదు. వాడికి శత్రుత్వం ఉండదు. భగవద్గీతలో గీతాచార్యుడు చెప్పాడు, తుల్య నిందా స్తుతిర్ మౌని (శ్లోకం చెప్పారు) తాను కాకుండా ఇంకోటి ఉంది అన్న వాడికి భయం. అంతా బ్రహ్మమే అనుకునేవాడికి భయం ఉండదు. ఎప్పుడూ ఒకేలా ఉండడమే బ్రహ్మం. ఆ స్థితికి ఎక్కితే శేషాద్రిని ఎక్కడం.


సప్తగిరుల్లో ప్రధానమైనది శేషాద్రి. విష్ణుమూర్తి వైకుంఠంలో కొలువై ఉన్న సమయంలో ఒకసారి వాయుదేవుడు స్వామిని దర్శించుకునేందుకు రాగా ఆదిశేషుడుఅడ్డగించాడట. కొంతసేపు వారిమధ్య వాదోపవాదాలు జరిగాయి. ఆ వాదన ఎటూ తెగకపోవడంతో స్వామివారే లేచి వచ్చి వారిద్దరిలో ఎవరు బలవంతులో తేల్చుకొనేందుకు ఓ మార్గం చెప్పారు. మేరు పర్వత భాగమైన ఆనందశిఖరాన్ని శేషువు చుట్టుకొని ఉండగా, ఆ పర్వతాన్ని వాయుదేవుడు కదిలించగలగాలి. పోటీప్రకారం ఆదిశేషుడు ఆనందశిఖరాన్ని చుట్టుకొని ఉండగా వాయుదేవుడు దాన్ని కదిలించేందుకు విశ్వప్రయత్నం చేశాడు. కొంతసేపటి తర్వాత వాయువు ఏంచేస్తున్నాడో చూడాలన్న కుతూహలంతో శేషువు పడగ ఎత్తి చూశాడు. ఇంకేం! పట్టుసడలింది. క్షణమాత్రకాలంలో వాయువు ఆనందశిఖరాన్ని కదిలించి స్వర్ణముఖీ నదీ తీరాన దించాడట. అదే శేషాచలమని భవిష్యోత్తర పురాణం చెబుతోంది.

 

*6. వేంకటాద్రి -* వేం : పాపం, కట : తీసేయడం. కాబట్టి పాపాలు పోతాయి. అంతా బ్రహ్మమే చేయిస్తున్నాడు, అందుకనే మనకి బ్రహ్మం తెలిసినవారు పిచ్చివాళ్ళలా కనవడుతారు. రామ కృష్ణ పరమహంస ఈ పిచ్చి నాకు ఎప్పుడు వస్తుందో అంటూ ఉండేవారు. అందుకే జ్ఞాని, పిచ్చివాడు ఒకలా ఉంటారు. ఆయనకే అర్పణం అనడం, అటువంటి స్థితిని పొందడం వెంకటాద్రి ఎక్కడం.

 కలియుగదైవం వెలసిన తిరుమల గిరి... అలవైకుంఠం నుంచి గరుడుడు ఇలకు తెచ్చిన స్వామివారి క్రీడాస్థలం క్రీడాద్రేనని భవిష్యోత్తర పురాణం చెప్తోంది. 'వేం' అంటే పాపాలు అని, 'కట' అంటే హరించడం అనీ అర్థం. అంటే స్వామి సమక్షంలో సర్వపాపాలు నశిస్తాయట. అందుకే ఆ పవిత్రగిరిని 'వేంకటాద్రి' అంటారని ప్రతీతి. దీనికి సంబంధించి జనబాహుళ్యంలో ఓ కథ విస్తృత ప్రచారంలో ఉంది. శ్రీకాళహస్తిలో నివసించే పురందర సోమయాజి అనే బ్రాహ్మణుడికి ఓ కొడుకు పుడతాడు. అతగాడికి మాధవుడు అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకుంటారా దంపతులు. మాధవుడు మాత్రం చెడుసావాసాలు పట్టి అన్నీ పాపాలే చేస్తాడు. ఒకరోజు అనుకోకుండా కొంతమంది యాత్రికుల బృందంతో కలిసిపోయి వారితోపాటు స్వామిదర్శనానికి వెళతాడు. దర్శనం కోసం స్వామి ఎదుట నుంచున్న మాధవుడికి ఒళ్లంతా మంటలు పుట్టడం మొదలవుతుంది. ఉపశమనం కోసం కేకలు పెడతాడు. క్రమంగా మంటలు తగ్గుతాయి. ఆ బాధాకరమైన అనుభవంతో అతన్ని అంటిపెట్టుకుని ఉన్న అన్ని పాపాలూ నశించాయట. ఆ తర్వాత మాధవుడు శ్రీవారి సేవకు పూర్తిగా అంకితమయ్యాడు. అతడే మరుజన్మలో తొండమాన్చక్రవర్తిగా పుట్టాడని, స్వామికి ఆలయం నిర్మించి చరిత్రకెక్కాడని భక్తుల నమ్మకం.

 

*7. నారాయణాద్రి* - అంటే తుల్యావస్థని కూడా దాటిపోయి, తానే బ్రహ్మముగా నిలబడిపోతాడు. అటువంటి స్థితిని పొందడం నారాయణాద్రి. వేంకటాచలంలో ఏడుకొండలు ఎక్కడం వెనకాల ఇంత నిక్షేపాలను ఉంచారు. ఈకారణాలు తెలుకుకోవడం ఏడు కొండలు ఎక్కడం

విష్ణుదర్శనం కోసం తపస్సు చేయ సంకల్పించిన నారాయణ మహర్షి తన తపానికి భంగం కలిగించని స్థలం ఎక్కడుందో చూపాల్సిందిగా బ్రహ్మదేవుణ్ని కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఒక ప్రదేశం చూపించాడట. అక్కడ స్వామి సాక్షాత్కారం పొందిన నారాయణమహర్షి తాను తపమాచరించిన పవిత్రస్థలాన్ని శాశ్వతంగా తన పేరుతో పిలిచేలా వరం ఇవ్వమన్నాడట. ఆ విధంగా నారాయణమహర్షి తపస్సు చేసిన కొండకు నారాయణాద్రి అనే పేరు స్థిరమైందని చెబుతారు.


 *అంజనాద్రీశా గోవిందా, గరుడాద్రి వాస గోవిందా,* 

 *శేషాద్రి నిలయ గోవిందా, శ్రీ వెంకటేశ గోవిందా;** 


 *గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా* *హరి గోవిందా, వేంకట రమణా గోవిందా;* 

 *గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా,*


*శ్రీ వేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.🙏*

*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹 

నవగ్రహా పురాణం🪐* . *24వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *24వ అధ్యాయం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*పురాణ పఠనం ప్రారంభం*

 

*చంద్రగ్రహ జననం - 6*


ఆశ్రమంలో ఒక్కసారిగా గాలి స్పందించింది. ఏదో అమోఘమైన కాంతి వ్యాపించింది. ఆ కాంతిలో త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యారు , చిరునవ్వులు చిందిస్తూ..


అత్రి , అనసూయలు మాటలు మరిచిపోయి , త్రిమూర్తులకు ప్రణామాలు చేశారు. అనసూయ పళ్ళేన్ని శ్రీమహావిష్ణువు ముందు పెట్టింది. ఆమె ఆలోచనను గ్రహించిన విష్ణువు పళ్ళెంలో నిలుచున్నాడు. అనసూయ నీళ్ళు పోస్తూ ఉంటే , అత్రి ఆయన పాదాలు కడిగాడు. అలాగే బ్రహ్మకూ , పరమేశ్వరుడికీ ఆ దంపతులు పాద పూజలు చేశారు. త్రిమూర్తుల పాద జలాన్ని శిరస్సుల మీద చల్లుకుని , తీర్థంగా పుచ్చుకొన్నారు. 


*“ఇంద్రా... ఎందుకు ఆహ్వానించావు మమ్మల్ని ?"* విష్ణుమూర్తి ప్రశ్నించాడు.


*"మీరు ముగ్గురూ శీలవతి విషయం స్వయంగా తనను అడగాలన్న నిబంధన విధించింది సాధ్వి అనసూయ...”* ఇంద్రుడు వివరించాడు వినయంగా. 


విష్ణువూ , బ్రహ్మా , శివుడూ ఒకేసారి చిరునవ్వులు నవ్వారు.


*“అంతే కదా !”* అన్నాడు శ్రీమహావిష్ణువు. 


*“దానికేం భాగ్యం !"* బ్రహ్మ తన వంతుగా అన్నాడు.


*"మేం ఆజ్ఞాపించడానికి సిద్ధమే , అభ్యర్ధించడానికీ సిద్ధమే !"* శివుడు నవ్వుతూ అన్నాడు.


*"అనసూయా ! శీలవతిని ఒప్పించి , శాపం ఉపసంహరించేలా చూడు !".* శ్రీమహావిష్ణువు అన్నాడు.


*"అవునమ్మా ! నా కోరికా అదే !"* బ్రహ్మ అందుకొన్నాడు. 


*"శీలవతిని సమ్మతింపజేసి , పొద్దుపొడిచేలా చేయి సాధ్వీ !"* పరమశివుడు వినయంగా అన్నాడు. 


అనసూయ చేతులు జోడించి , ముగ్గురికీ నమస్కరించింది. *"ఆజ్ఞ ! శీలవతికి నచ్చజెబుతాను. అందుకు నాకు ప్రతిఫలంగా మీరు ముగ్గురూ కోరిన వరాలు కరుణించాలి !"* అంది అనసూయ.


*"చూశారా ! పతివ్రత ఎవర్నైనా సరే , శాసిస్తుంది ! శీలవతి సూర్యుణ్ణి శాసించింది ! అనసూయ మనల్ని ముగ్గుర్నీ శాసిస్తోంది !"* విష్ణువు బ్రహ్మనూ , శివుణ్నీ చూస్తూ చిరునవ్వుతో అన్నాడు.


*"తథాస్తు ! అందాం !"* పరమశివుడు నవ్వుతూ అన్నాడు.


*“తథాస్తు !"* బ్రహ్మ చెయ్యెత్తి అన్నాడు. *"సాధ్వీ అనసూయా, అలాగే ! వెళ్ళిరా ! నువ్వు తిరిగి వచ్చే దాకా ఇక్కడే ఉంటాం !"* అన్నాడు విష్ణువు. త్రిమూర్తుల్ని తన లోగిలిలో కట్టిపడవేసిన ధర్మపత్నిని సగర్వంగా చూస్తున్నాడు అత్రి.


అనసూయ పిలుపు విని , శీలవతి కుటీరంలోంచి ఇవతలకి వచ్చింది. వయసులో తనకన్నా పెద్దదైన అనసూయ పాదాలను చేతుల్తో తాకుతూ నమస్కరించింది.


*“దీర్ఘసుమంగళీ భవ !”* అనసూయ దీవించింది.


*“శీలవతీ , నిన్నొకటి కోరడానికి వచ్చాను...”* అనసూయ ఉపోద్ఘాత రూపంలో అంది.


*"ఆజ్ఞాపించండి , మాతా !"* శీలవతి కంఠంలో వినయం శబ్దం చేసింది.


*"లోకహితం కోసం... నువ్వు సూర్యుడు ఉదయించేలా చేయాలి. అందుకు అడ్డుగా ఉన్న నీ శాపాన్ని ఉపసంహరించుకోవాలి !”*


*"సూర్యుడు ఉదయిస్తే , నా భర్త అస్తమిస్తాడు మాతా !"* శీలవతి కంఠం దుఃఖావేశంతో వణికింది.


*"ఇందాకా నిన్ను 'దీర్ఘసుమంగళీ భవ !' అంటూ దీవించాను శీలవతీ ! అనసూయ ఆశీస్సు వృధా కాదు తల్లీ !”*


*“అమ్మా !”*


*"అమ్మ కూతురి వైధవ్యాన్ని సహిస్తుందా ?"* అనసూయ కంఠంలో ఏదో నిర్ణయం గంటలాగా మోగింది.


అనసూయ మాట శీలవతి చెవుల్లో గింగిర్లు తిరుగుతోంది. *"అమ్మా... మీ మాట పాటిస్తాను !”* శీలవతి చేతులు జోడించింది.


శీలవతి తూర్పు వైపు తిరిగింది. కళ్ళు మూసుకొని చేతులు జోడించింది. *"నేను మహాపతివ్రతనే అయితే ఈ క్షణంలోనే సూర్యుడు ఉదయిస్తాడు గాక !”* శీలవతి మాట పరిసరాల్లో మారు మోగింది. తూర్పు దిక్కును కప్పిన నల్లటి తెరను ఏదో అదృశ్య హస్తం ఒక్కసారిగా తొలగించింది. తూర్పున సూర్యుడు ఉదయించాడు !


ఉదయభానుణ్ని ఒకసారి చూసి , శీలవతి ఆత్రుతగా కుటీరంలోకి పరుగెట్టింది. కుక్కిమంచం వైపు చూసి , ఒక్కసారిగా ఆగిపోయింది శీలవతి. కుక్కిమంచం మీద నిర్జీవంగా పడున్నాడు ఉగ్రశ్రవుడు.


*"స్వామీ !"* శీలవతి ఆర్తనాదం కుటీరంలో ప్రతిధ్వనించింది.


అనసూయ వినిపించుకోనట్లు వెనుదిరిగి వేగంగా తమ ఆశ్రమం వైపు నడవసాగింది...


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 37*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 37*


*అద్భుత గురువూ, అద్భుత శిష్యుడ:*


శిష్యునికి మానసిక విస్పష్టత గురువు ద్వారా కలిగితే, గురువు పరిపూర్ణత శిష్యుని మూలంగా అభివ్యక్తమవుతుంది. గురువు జీవితాన్ని వెల్లడి చేసి, ఆయన సందేశాన్ని వ్యాప్తిచేసే వ్యక్తే నిజమైన శిష్యుడు.


గురువు వాక్కులను అర్థం చేసుకొని వాటిని తు.చ. తప్పక పాటించే వాడు ఉత్తమ విద్యార్థి. కాని గురువు చెప్పబోయేది ముందుగానే గ్రహించి దానిని అట్లే ఆచరణలో చూపేవాడు శిష్యుడు. నిజంగా అలాంటి శిష్యుని కోసమే గురువు నిరీక్షిస్తుంటాడు. నిరీక్షించడమే కాదు, ప్రార్థిస్తాడు కూడా.


శ్రీరామకృష్ణులు అలా ప్రార్ధన చేశారు. తాము సముపార్జించిన ఆధ్యాత్మిక సంపత్తిని లోకమంతటా పంచిపెట్టే శిష్యులు రావాలని ఆయన విలపించారు.


భగవంతుణ్ణి సాక్షాత్కరించుకోవాలి. భగవదనుభూతి పొందాలి అని ఎందరో

మహాత్ములు విలపించారు. కాని భగవద్దర్శనంతో వారి విలాపం ఆగిపోయింది.  ఇక్కడో శ్రీరామకృష్ణులు ఒక్క మార్గంలో కాదు, అనేక మార్గాల ద్వారా భగవధానందాన్ని చవిచూశారు, భగవదానందంలో లయించిపోయారు. ఆయన ఆక్రందన అంతటితో ఆగిపోవాల్సిందే కాని ఆగలేదు - భగవంతుని కోసం విలపించడం మొదలుపెట్టారు!


 తాము సముపార్జించిన దివ్యానుభవాలనూ, చవిచూసిన దివ్యానందాన్నీ ఇతరులతో పాలుపంచుకోవాలనీ ఆ దివ్యానందమయ జీవితం వారు కూడా పొందాలనీ ఆయన విలపించారు. " మరణం ఆసన్న మయే ముందు ఆ దివ్యానందాన్ని చవిచూడడానికి లోకులారా రండి!" అని ఒక ముని' లోకాన్నే ఆహ్వానించారే, అదే విధంగా శ్రీరామకృష్ణులు ఎలుగెత్తి పిలిచారు. వెంటనే ఎవరూ రానందున ఆయన ఉత్సుకత వ్యాకులతగా పరిణమించి, ఆక్రందనగా రూపుదాల్చింది. "ఆలయాలలో సంధ్యాహారతుల గంటలు మ్రోగుతాయి. ‘ఆహా, మరో రోజు కూడా నిరర్థకంగా గడిచిపోయింది! 

 

నా బిడ్డలు ఎవరూ రాలేదే! అంటూ నా మనస్సు తల్లడిల్లింది; తడిబట్టను మెలిపెట్టి పిండినట్లు భరించరాని బాధ కలిగేది. అతిథి గృహం మేడ మీద నిలబడి, 'నా బిడ్డలారా, ఎక్కడున్నారు? వెంటనే రండి' అంటూ అరిచేవాణ్ణి" అని కాలాంతరంలో శ్రీరామకృష్ణులు చెప్పడం కద్దు. ఇలాంటి అద్భుతమైన గురువును లోకం కనీవినీ ఎరుగదు.🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

Web Design

 *Web Design*


👉Web Design all kinds


👉 Print on demand website 


👉 News website ( Auto blogging)


👉Ecommerce Web Site


👉Membership Web site


👉Matrimony Web Site


👉 Real estate website


👉 Online learning management website


👉 Just Dial type website



*Contact us for above services*


*Ramanakumar Palakodeti*


*Cell.No.86881 34897*

రామాయణమ్ 323

 రామాయణమ్ 323

...

జాంబవంతునకు ,అంగదునకు నమస్కరించి "చూశాను సీతమ్మను" అని పలికెను.

.

అప్పుడు అంగదుడు తనచేతిలో చేయి వేసుకొని తీసుకొని వెళ్ళి హనుమను ఒక రమణీయమైన ప్రదేశమున కూర్చుండబెట్టెను.

.

చూశాను సీతమ్మను ,     స్నాన సంధ్యాదులు లేక మలిన వస్త్రముతో తైలసంస్కారములు లేని కేశపాశములతో ఏకవేణియై రామదర్శనముకొరకు తహతహలాడు సీతమ్మను చూశాను .

.

ఘోర రక్కసుల కావలిలో 

చిక్కిశల్యమైన సీతమ్మను చూశాను.

.

చూశాను అని చెప్పగానే కొందరు వానరులు సింహనాదములు చేశారు ,మరికొందరు కిచకిచలాడారు ,

మరికొందరుచకచక ప్రతిగర్జనలు చేశారు.

.

మరికొందరు దగ్గరగా వచ్చిపర్వతాకారుడైన పావని శరీరాన్ని స్పృశించారు.

.

అప్పుడు జాంబవంతుడు వివరముగా చెప్పమని కోరగా జరిగిన విషయములన్నీ పూసగుచ్చినట్లు వివరించాడు మారుతి ...ఒక్క విషయము తప్ప ...అది రామునకు సీతమ్మ పంపిన సందేశము...

.

తాతా ! 

ఇటనుండి పయనమై వెళ్ళు నాకు మైనాకుడు కనపడి కాసేపు సేదతీరి వెళ్ళమన్నాడు ! ఆతని కోరిక మన్నింపక ముందుకు సాగుతున్న నన్ను ...

నాగమాత సురస 

నాగమనాన్ని అడ్డుకొని విధాత ఇచ్చిన విందుభోజనము నీవు! నిన్ను మింగుతాను! అని ముందుకు రాగా ఉపాయముతో తప్పించుకొని ఆమెను మెప్పించి ముందుకు వెళుతుండగా !...

.

పట్టి లాగింది సింహిక, దానిని చంపి వేసి లంక కోట మీద అడుగుపెట్టిన నాకు లంకిణి అడ్డు వచ్చినది....దాని పీచమణచి లంకలో ప్రవేశించి లంక మొత్తము జల్లెడ పట్టినా ఫలితము లేకపోయె!

.

అప్పుడు ఇక మిగిలిన అశోకమునందు గాలించవలెనని అనుకొని అటు వెడలి చూడగా అట కనుగొంటినయ్యా తల్లి సీతను !

.

ఇంతలో రాక్షశేశ్వరుడు వచ్చి ఆమెతో పరుషముగా మాటలాడి రెండుమాసములు గడువొసంగినాడు....అని హనుమ జాంబవదాదులకు చెప్పసాగెను

.

వూటుకూరు జానకిరామారావు

నీsరు మట్టి కలిసి

 శ్లోకం:☝️

*సుఖమధ్యే స్థితం దుఃఖం*

  *దుఃఖమధ్యే స్థితం సుఖమ్ |*

*ద్వయమన్యోన్యసంయుక్తం*

  *ప్రోచ్యతే జల పంకవత్ ||*


భావం: సుఖాల మధ్యలో అకస్మాత్తుగా కొంత దుఃఖం కలగడం, అలాగే కష్టాల మధ్యలో కాస్త సుఖం కలగడం, ఈ రెండు పరిస్థితులు ఒకదాని తరువాత ఒకటి వస్తూ పోతూ ఉంటాయి - నీsరు మట్టి కలిసి బురదైనట్టు!

పంచాంగం 13.09.2023 Wednesday

 ఈ రోజు పంచాంగం 13.09.2023 Wednesday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు నిజ శ్రావణ మాస కృష్ణ పక్ష: చతుర్థశి తిధి సౌమ్య వాసర: మఘా నక్షత్రం సిద్ధ యోగ: భద్ర  తదుపరి శకుని కరణం ఇది ఈరోజు పంచాంగం. 


చతుర్థశి  రేపు తెల్లవారుఝామున  04:48 వరకు.

మఘ రాత్రి 02:00 వరకు.

సూర్యోదయం : 06:07

సూర్యాస్తమయం : 06:16

వర్జ్యం : మధ్యాహ్నం 12:30 నుండి 02:18 వరకు.

దుర్ముహూర్తం : పగలు 11:47 నుండి మధ్యాహ్నం  12:36 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 12:00 నుండి 01:30  వరకు.


యమగండం : ఉదయం 07:30 నుండి 09:00 వరకు.  

 


శుభోదయ:, నమస్కార:

సర్వేశ్వర శతకం-

 


"ఒక పుష్పంబు భవత్పదద్వయముపై

 నొప్పంగ సద్భక్తి రం

 జకుడైపెట్టిన,పుణ్యమూర్తికి పునర్జన్మంబులేదన్న, బా

యక కాలత్రితయోపచారముల నిన్నర్చించుచున్ పెద్ద  నై

 ష్ఠికుడై యుండెడువాడు,నీవగుట తా

 చిత్రంబె? సర్వేశ్వరా!


సర్వేశ్వర శతకం-చిమ్మపూడి అమరేశ్వరుడు.


భావం: ఓసర్వేశ్వరా!నీపాదాలపై భక్తితో ఒకపువ్వుంచి

ప్రార్ధించినవాడికి పునర్జన్మమేలేదని పురాణాలుప్రవచిస్తున్నాయ్.అలాంటిది ముక్కాలములయందూ మూడుసంధ్యలా ,మహానిష్ఠతో నిన్నర్చించేవాడు నీలోసమైక్యమైతే యిక నాశ్చర్యపడవలసినదేమున్నది?అనిభావం.


          ఈశ్వరార్చనకు ఫలితం జన్మరాహిత్యమేనని,ఈశ్వరసాయుజ్యమేనని చెప్పే యీపద్యం.కాకతిరాజులకు

సమకాలికుడైన చిమ్మపూడి రచించుట విశేషం.🙏🙏🙏🙏🌷🌷

సత్యప్రవర్తనే

 🕉️  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🕉️

 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 


𝕝𝕝శ్లో𝕝𝕝 

*సత్యమేవ పరం మిత్రం స్వీకృతే సతి మానవే।*

*సత్యమేవ పరం శత్రుః ధిక్కృతే సతి మానవే॥*


𝕝𝕝తా𝕝𝕝

మన సత్యప్రవర్తనే మనలను మిత్రుడై కాపాడుతుంది, మనం సత్యాన్ని ధిక్కరిస్తే... అనగా సత్యాన్ని కాపాడకపోతే అదే మనకు శత్రువవుతుంది.

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼


𝕝𝕝శ్లో𝕝𝕝

*శరీరస్య గుణానాశ్చ దూరమన్త్య అంతరం౹*

*శరీరం క్షణం విధ్వంసి కల్పాంత స్థాయినో గుణాః॥*


𝕝𝕝తా𝕝𝕝 

మానవ శరీరానికి మరియు దాని లక్షణాలకు చాలా తేడా ఉంది. అదేమిటంటే...  మానవ శరీరం తక్కువ కాలం జీవిస్తుంది, అయితే గుణాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

మాయ మాటలు

 ప్రభుత్వ  నిధులతో చర్చ్ లు -


చంద్రబాబు చర్చ్ లకు డబ్బులు ఇస్తాం అన్నారు .. ఇచ్చారు


2002 నుండీ లక్ష రూపాయలు చర్చ్ కట్టుకునేదానికి ఇస్తాం అంటూ చట్టం చేసారు. జీవో దీని మీద మొట్టమొదట విడుదల చేసింది చంద్రబాబు గారు.


మధ్యలో ఉన్న పాలనా కాలములో కాంగ్రెస్ వాళ్ళు ( అంటే మన రాజన్న ) దీని ఎంత వాడుకుని రాష్ట్రం ని చర్చ్ ల మయం చేసారో అది మాత్రం అడక్కూడదు.. ఆ ఊసెత్తకండి.


2016 లో చంద్రబాబు చర్చ్ కు మూడు లక్షల చొప్పున ఇస్తామని అంటూ ఆయన చట్టం చేసారు.


2018 లో చంద్ర బాబు చర్చ్ కు మూడు లక్షల నుండి అయిదు లక్షల చొప్పున ఇస్తామన్నారు.


అరే అయన అపుడు ఇచ్చి ఇపుడు మేమీయక పోతే బాగోదు కదా - అందుకే ఇస్తున్నాం అంటూ ఇపుడు వైకాపా వాళ్ళ వీరంగం. నిజమే ఇలా దారుణాలు చేయబట్టే వాళ్లకు మడత కుర్చీ వేశారు మొన్న ఎన్నికల్లో . 


ఇంకా మీరు కూడా మాకూ అదే కావాలి అంటూ చెబుతున్నారా ? సరి సరి


మా రాష్ట్రములో హిందువు అని చెప్పుకునేవారు వీరి మాయ మాటలు నమ్ముతూనే ఉంటారు కాబట్టి .. వారి వారి వ్యక్తిగత స్వార్థాలకు వీరికి వోట్ వేస్తూనే ఉంటారు, మా కులం వాడు , మావాడు.. మాకు లాభం ఉంది ఇతని ద్వారా అంటూనే ఉంటారు .. అంత వరకూ వీళ్ళ భద్రతకేమీ లోటు ఉండదులెండి

వక్ఫ్ బోర్డు

 వక్ఫ్ బోర్డు  ఇప్పుడు సుప్రీంకోర్టు 23/06/2023 శుక్రవారం ~  స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది  1947కి ముందు బదిలీ చేయబడిన ఏదైనా ఆస్తిపై వక్ఫ్ బోర్డుకు ఎలాంటి హక్కు ఉండదు, ఎందుకంటే దాని పత్రాలు చెల్లవు.  ఇది కాకుండా... 1947 తర్వాత కూడా వక్ఫ్ బోర్డు హక్కులు పొందుతున్న ఆస్తులు.. ఆ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో కాగితాలు చూపించాల్సి ఉంటుంది?  వక్ఫ్ బోర్డు తన ఆస్తిలో ఏదైనా సరైన కాగితాన్ని చూపించలేకపోతే, 23/06/2023 శుక్రవారం నాడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో, ఆ భూమి/ఆస్తి దాని అసలు యజమానికి తిరిగి ఇవ్వబడుతుంది.  మరియు, 1962, 1965 & 1971లో జరిగిన యుద్ధాల్లో పాకీస్థాన్‌కు మద్దతు ఇచ్చారనే ఆరోపణ కారణంగా భూమి/ఆస్తి యొక్క అసలు యజమాని దేశ విభజన తర్వాత దేశం విడిచి వెళ్లినా లేదా పారిపోయినా.  కాబట్టి, ఆ సందర్భంలో ఆ ఆస్తి "ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ 2017" ప్రకారం ప్రభుత్వానికి చెందుతుంది.  ఇప్పుడు ఇందులో మేము మరియు మీరు చేయాల్సిందల్లా మీ చుట్టూ వక్ఫ్ బోర్డ్‌కు చెందని ఆస్తి/భూమి ఏదైనా ఉంటే, మీరు సుప్రీం నిర్ణయాన్ని ఉటంకిస్తూ సంబంధిత ప్రభుత్వానికి లేదా కోర్టుకు తెలియజేయాలి. ఈ విషయంలో కోర్టు  మరియు, సుప్రీం కోర్టు ఆదేశానుసారం

దాల్మియా



 డాల్డా Hindustan Lever దేశంలోని మొట్టమొదటి కూరగాయల నెయ్యి, ఆ రోజుల్లో స్వతంత్ర భారతదేశంలో చాలా ధనవంతుడైన సేథ్ రామకృష్ణ దాల్మియా యాజమాన్యంలో ఉంది, టాటా బిర్లా, దాల్మియా అనే మూడు పేర్లు చిన్నప్పటి నుంచి వింటున్నాం.


దాల్మియా కుటుంబం ఇప్పుడు వ్యాపారంలో ఎక్కడా కనిపించదు పేరు వినిపించదు, నెహ్రూ టైంలో కూడా లక్ష కోట్లకు యజమాని అయిన దాల్మియాను కుట్రల్లో ఇరికించి నెహ్రూ ఎలా నాశనం చేశాడో చదవాలి. 


దాల్మియా జీ, స్వామి కర్పాత్రి జీ మహారాజ్‌తో కలిసి గోహత్య నిషేధం, హిందూ కోడ్ బిల్లు విషయంలో నెహ్రూతో గట్టి పోరాటం చేశారు. కానీ నెహ్రూ, హిందువుల మనోభావాలను అణచివేసి, గోహత్యను నిషేధించలేదు హిందూ కోడ్ బిల్లును కూడా ఆమోదించాడు

ప్రతీకారంగా, అతను హిందువుల సేథ్ దాల్మియాను జైలులో పెట్టాడు.  అతని పరిశ్రమలను నాశనం చేశాడు.


నెహ్రూ ముందు తల ఎత్తిన వ్యక్తిని నెహ్రూ మట్టికరిపించాడనేది చరిత్ర సాక్షి. 


మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్  సుభాష్ బాబుల పట్ల ఆయన నిర్దయగా ప్రవర్తించిన తీరు దేశప్రజలకు తెలుసు, కానీ చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు కానీ ఆయన మొండితనం కారణంగా ఆ కాలంలో దేశంలోనే అతిపెద్ద పారిశ్రామికవేత్త సేఠ్‌ రామకృష్ణ దాల్మియాపై క్రూరంగా కేసులు పెట్టారని చాలా తక్కువ మందికి తెలుసు, అతన్ని చాలా సంవత్సరాలు జైలులో మగ్గించడమే కాకుండా ప్రతి పైసాపై ఆధారపడేలా చేశాడు. 


దాల్మియా కలకత్తా లో బులియన్ మార్కెట్‌లో సేల్స్‌మెన్‌గా తన వ్యాపార జీవితాన్ని ప్రారంభించాడు, పారిశ్రామిక సామ్రాజ్యం దేశవ్యాప్తంగా విస్తరించింది వార్తాపత్రికలు, బ్యాంకులు, బీమా కంపెనీలు, విమానయాన సంస్థలు, సిమెంట్, వస్త్ర పరిశ్రమలు, ఆహార వస్తువులు వందలాది పరిశ్రమలను కలిగి ఉండేది, దాల్మియా సేథ్‌కు దేశంలోని పెద్ద నాయకులందరితో స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి అతను వారికి ముక్తకంఠంతో ఆర్థిక సహాయం చేసేవాడు.


దాల్మియా దృఢమైన సనాతన హిందువు అని  అతను ప్రసిద్ధ హిందూ సన్యాసి స్వామి కర్పాత్రి జీ మహారాజ్‌తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడని చెబుతారు. కర్పాత్రి జీ మహారాజ్ 1948లో 'రామరాజ్య పరిషత్' అనే రాజకీయ పార్టీని స్థాపించారు. 1952 ఎన్నికలలో ఆ పార్టీ లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించి 18 సీట్లు గెలుచుకుంది. హిందూ కోడ్ బిల్లు, గోహత్య నిషేధంపై నెహ్రూ దాల్మియాతో గొడవపడ్డారు. నెహ్రూ హిందూ కోడ్ బిల్లును ఆమోదించాలని కోరుకున్నారు, అయితే స్వామి కర్పాత్రి జీ మహారాజ్  దాల్మియా సేథ్ వ్యతిరేకించారు.


స్వామి కర్పాత్రీజీ మహారాజ్ హిందూ కోడ్ బిల్లు  గోహత్యను నిషేధించాలని దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ప్రారంభించారు, దీనికి దాల్మియా జీ గట్టిగా మద్దతునిచ్చి ఆర్థిక సహాయాన్ని అందించారు. నెహ్రూ ఒత్తిడి మేరకు లోక్‌సభలో హిందూ కోడ్ బిల్లు ఆమోదం పొంది హిందూ మహిళలకు విడాకులు ఇవ్వడానికి అవకాశం కల్పించింది. దేశ తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ హిందూ కోడ్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారని, అందుకే ఆయన దానిని ఆమోదించడానికి నిరాకరించారని చెబుతున్నారు. 


మొండి పట్టుదలగల నెహ్రూ దీనిని అవమానంగా భావించి, పార్లమెంటు ఉభయ సభల ద్వారా ఈ బిల్లును మళ్లీ ఆమోదించి రాష్ట్రపతికి పంపారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం రాష్ట్రపతి ఆమోదించాల్సి ఉంటుంది. ఈ సంఘటన నెహ్రూ దాల్మియాకు బద్ధ శత్రువుగా మారింది. నెహ్రూ తన ప్రత్యర్థి అయిన సేఠ్ రామకృష్ణ దాల్మియాను పారద్రోలేందుకు పథకం పన్నినట్లు చెబుతున్నారు. నెహ్రూ పిలుపు మేరకు దాల్మియాపై కార్పొరేట్ కుంభకోణాల ఆరోపణలు లోక్‌సభలో తీవ్రంగా లేవనెత్తారు. 


ఈ ఆరోపణలపై విచారణకు వివిన్‌ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. తర్వాత ఈ కేసు దర్యాప్తు కోసం స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ (నేడు సీబీఐ)కి అప్పగించబడింది. నెహ్రూ తన మొత్తం ప్రభుత్వాన్ని దాల్మియాకు వ్యతిరేకంగా మోహరించారు.ప్రధానమంత్రి పిలుపుతో ప్రతి ప్రభుత్వ శాఖలోనూ వేధింపులు మొదలయ్యాయి. 


అతను అనేక నిరాధారమైన కేసుల్లో చిక్కుకున్నాడు. నెహ్రూ ఆగ్రహం రూ.లక్ష కోట్ల యజమాని దాల్మియాను దివాళా తీసింది, అతను టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందుస్థాన్ లివర్ అనేక ఇతర పరిశ్రమలను చౌకగా విక్రయించాల్సి వచ్చింది. కోర్టులో విచారణ జరిగింది దాల్మియాకు మూడేళ్ల జైలు శిక్ష విధించబడింది. 


నెహ్రూ వంకర దృష్టి కారణంగా నాశనమైన వ్యక్తి ఆటైంలో అత్యంత ధనవంతుడు దాల్మియా జైలు గదిలో రోజుల తరబడి గడపవలసి వచ్చింది.వ్యక్తిగత జీవితంలో, దాల్మియా చాలా మతపరమైన స్వభావం గల వ్యక్తి. 


మంచి సమయంలో అతను మత  సామాజిక కార్యక్రమాలకు కోట్లాది రూపాయలను విరాళంగా ఇచ్చాడు. అంతే కాకుండా దేశంలో గోహత్యను నిషేధించే వరకు తాను ఆహారం తీసుకోనని ప్రతిజ్ఞ కూడా చేశారు. తన చివరి శ్వాస వరకు ఈ తీర్మానాన్ని కొనసాగించారు. గోహత్యకు వ్యతిరేకంగా 1978లో ప్రాణత్యాగం చేశాడు.😎

వేదవ్యాసుల సంస్కృత మహాభాగవతం



*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*తృతీయస్కంధము-ముప్పది మూడవ అధ్యాయము*


*దేవహూతికి తత్త్వజ్ఞానము, మోక్షము ప్రాప్తించుట*


*ఓం నమో భగవతే వాసుదేవాయ*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*మైత్రేయ ఉవాచ*


*33.1 (ప్రథమ శ్లోకము)*


*ఏవం నిశమ్య కపిలస్య వచో జనిత్రీ సా కర్దమస్య దయితా కిల దేవహూతిః|*


*విప్రస్త మోహపటలా తమభిప్రణమ్య తుష్టావ తత్త్వవిషయాంకితసిద్ధిభూమిన్॥2576॥*


*మైత్రేయుడు పలికెను*-విదురా! కర్దమమహర్షియొక్క ధర్మపత్నియు, కపిలభగవానునకు తల్లియు ఐన దేవహూతి కపిలుని మాటలను విన్నంతనే ఆమెలోని మోహము పూర్తిగా తొలగిపోయెను. ప్రకృతి, పురుష, పరమేశ్వరులకు సంబంధించిన సాంఖ్యశాస్త్రమునకు ప్రవర్తకుడైన కపిలునకు ప్రణమిల్లి, ఆ మహాత్ముని ఇట్లు స్తుతింపసాగెను.



*దేవహూతిరువాచ*


*33.2 (రెండవ శ్లోకము)*


*అథాప్యజోఽంతస్సలిలే శయానం భూతేంద్రియార్థాత్మమయం వపుస్తే|*


*గుణప్రవాహం సదశేషబీజం దధ్యౌ స్వయం యజ్ఞఠరాబ్జజాతః॥2577॥*


*దేవహూతి ఇట్లు పలికెను*- భగవన్ ప్రళయజలమధ్యముస శేషతల్పశాయియై విలసిల్లునట్టి శ్రీమన్నారాయణుడవు నీవే. పంచమహాభూతములకును, శబ్ధాది తన్మాత్రలకును, దశేంద్రియములకును, మనస్సునకును నీ శ్రీవిగ్రహమే ఆధారము.త్రిగుణములు అన్నియు నీ నుండియే వెలువడినవి. వాటికి కార్యరూపమైన ఈ జగత్తునకు కారణభూతుడవును నీవే. నీ నాభికమలమునుండి ఉత్పన్నమైన బ్రహ్మదేవుడు సృష్టినిర్మాణజ్ఞానమును పొందుటకు నిన్నే ధ్యానించెను.


*33.3 (మూడవ శ్లోకము)*


*స ఏవ విశ్వస్య భవాన్ విధత్తే గుణప్రవాహేణ విభక్త వీర్యః|*


*సర్గాద్యనీహోఽవితథాభిసంధిః ఆత్మేశ్వరోఽతర్క్య సహస్రశక్తిః॥2578॥*


పూజ్యుడా! నీవు నిష్క్రియుడవు, సత్యసంకల్ఫుడవు. అకర్తవైనను గుణప్రవాహములకు కారణము నీవే. ఏకైక పరమాత్మవైన నీవు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల రూపములలో ఈ విశ్వముయొక్క సృష్టి, స్థితి, సంహార లీలలను నెరపుదువు. నీవు సర్వేశ్వరుడవు, సకలప్రాణులకు ఆత్మవు. నీ శక్తులు అనంతములు, అచింత్యములు.


*33.4 (నాలుగవ శ్లోకము)*


*స త్వం భృతో మే జఠరేణ నాథ కథం ను యస్యోదర ఏతదాసీత్|*


*విశ్వం యుగాంతే వటపత్ర ఏకః శేతే స్మ మాయాశిశురంఘ్రిపానః॥2579॥*


జగన్నాథా! ప్రళయకాలమునందు ఈ విశ్వమంతయును నీలో లీనమై ఉండును. అప్పుడు నీవు లీలా శిశువుగా, వటపత్రశాయివై నీ వదనారవిందమున పాదారవిందముయొక్క  అంగుష్టమును చేర్చుకొని, దానిని త్రాగుచు (చప్పరించుచు) శైశవలీలలను నెరపుచుందువు. అట్తి అద్భుతమూర్తివైన నీవు నా గర్భమున చేరుట మిగుల ఆశ్చర్యకరముగదా!


*కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం|*


*వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి॥*


*33.5 (ఐదవ శ్లోకము)*


*త్వం దేహతంత్రః ప్రశమాయ పాప్మనాం నిదేశభాజాం చ విభో విభూతయే|*


*యథావతారాస్తవ సూకరాదయః తథాయమప్యాత్మపథోపలబ్ధయే॥2580॥*


ప్రభూ! నీవు పాపాత్ములను శిక్షించుటకును, నీ ఆజ్ఞానువర్తులగు భక్తులకుఅభ్యుదయములను ప్రసాదించుటకును స్వేచ్ఛగా దేహధారణ గావించుచుందువు. లోకకళ్యాణార్థము వరహాది అవతారములను దాల్చినరీతిగనే ఈ కపిలావతారమును గూడ ముముక్షువులకు ఆత్మజ్ఞానమార్గమును చూపుటకై స్వీకరించితివి.


*33.6 (ఆరవ శ్లోకము)*


*యన్నామధేయశ్రవణానుకీర్తనాత్ యత్ప్రహ్వణాద్యత్స్మరణాదపి క్వచిత్|*


*శ్వాదోఽపి సద్యః సవనార కల్పతే కుతః పునస్తే భగవన్ను దర్శనాత్॥2581॥*


మహాత్మా! నీ దివ్యగుణనామములను వినుటవలనను, కీర్తించుటచేతను ఎప్పుడైనను నీ పాదపద్మములకు ప్రణమిల్లుటవలనను, నిన్ను స్మరించుట వలనను, చండాలుడు సైతము సోమయాజియైన బ్రాహ్మణునివలె వెంటనే పూజ్యుడగును. ఇంక నిన్ను దర్శించు మానవుడు కృతార్థుడు అగుననుటలో ఆశ్చర్యము ఏమున్నది?


*33.7 (ఏడవ శ్లోకము)*


*అహో ఐత శ్వపచోఽతో గరీయాన్ యజ్జిహ్వాగ్రే వర్తతే నామ తుభ్యమ్|*


*తేపుస్తపస్తే జుహువుః సస్నురాద్యాః బ్రహ్మానూచర్నామ గృణంతి యే తే॥2582॥*


మహానుభావా! నీ నామమును తన  జిహ్వాగ్రమున భక్తితో నిలుపుకొనినచో, చండాలుడు సైతము సర్వశ్రేష్ఠుడగును. కేవలము నీ నామమును కీర్తించినవారలు, తపస్సులను, యజ్ఞములును, తీర్థస్నానములును, వేదాధ్యయనమును, సదాచారమును - ఇంతేగాక, సర్వమునూ చేసినవారలు అగుదురు. 


*మైత్రేయ ఉవాచ*


*33.8 (ఎనిమిదవ శ్లోకము)*


*తం త్వామహం బ్రహ్మ పరం పుమాంసం ప్రత్యక్ స్రోతస్యాత్మని  సంవిభావ్యమ్|*


*స్వతేజసా ధ్వస్తగుణప్రవాహం వందే విష్ణుం కపిలం వేదగర్భమ్॥2583॥*


కపిలదేవా! నీవు పరమపురుషుడవు, మనోవృత్తులను అంతర్ముఖమొనర్చి, అంతఃకరణమునందు (మనోనిగ్రహముతో) ధ్యానింపదగినవాడవు. నీవు నీ దివ్యతేజస్సుద్వారా మాయాకార్యమైన త్రిగుణాత్మక ప్రవాహమును (సంసార బంధములను) ఉపశమింప జేయుదువు. నీ యుదరమునందే వేదతత్త్వములు అన్నియును నిహితములైయున్నవి. వేయేల, సాక్షాత్తు నీవు పరబ్రహ్మవు. కపిలమహర్షిగా అవతరించిన శ్రీమహావిష్ణుడవైన నీకు నమస్కారము.


*మైత్రేయ ఉవాచ*


*33.9 (తొమ్మిదవ శ్లోకము)*


*ఈడితో భగవానేవం కపిలాఖ్యః పరః పుమాన్|*


*వాచాఽవిక్లబయేత్యాహ మాతరం మాతృవత్సలః॥2584॥*


*మైత్రేయుడు వచించెను*- విదురా! పరమపురుషుడు, పరాత్పరుడు ఐన పూజ్యకపిలభగవానుని దేవహూతి ఇట్లు ప్రస్తుతించెను. పిదప, మాతృభక్తితత్పరుడైన కపిలభగవానుడు ప్రేమపూరితగద్గదమైన వాక్కుతో తల్లితో ఇట్లనెను.


*కపిల ఉవాచ*


*33.10 (పదియవ శ్లోకము)*


*మార్గేణానేన మాతస్తే సుసేవ్యేనోదితేన మే|*


*అస్థితేన పరాం కాష్ఠామచిరాదవరోత్స్యసి॥2585॥*


*కపిలుడిట్లనెను* - తల్లీ! నేను చెప్పిన జ్ఞానమార్గము సులభమైనది. ఆచరణయోగ్యమైనది. దీనిని అవలంబించుటవలన నీవు పరమపదమునకు శీఘ్రముగ పొందగలవు.


*33.11 (పదకొండవ శ్లోకము)*


*శ్రద్ధత్స్వైతన్మతం  మహ్యం జుష్ఠం యద్భ్రహ్మవాదిభిః|*


*యేన మానుభవం యాయా మృత్యుమృచ్ఛంత్యతద్విదః॥2586॥*


నా ఈ ఉపదేశమును మనస్ఫూర్తిగా ఆచరింపుము. బ్రహ్మవాదులు ఈ మార్గమును అవలంబించి, తరించిరి. నీవును నా ద్వారా జన్మరహితుడనైన నన్ను పొందగలవు. ఈ మార్గము పై విశ్వాసమును ఉంచనివారు జననమరణచక్రములో పరిభ్రమించుచుందురు.


*మైత్రేయ ఉపాచ*


*33.12 (పండ్రెండవ శ్లోకము)*


*ఇతి ప్రదర్శ్య భగవాన్ సతీం తామాత్మనో గతిమ్|*


*స్వమాత్రా బ్రహ్మవాదిన్యా కపిలోఽనీమతో యయౌ॥2587॥*


*మైత్రేయుడు వచించెను*- విదురా! కపిలభగవానుడు ఈ విధముగా తన తల్లియగు దేవహూతికి ఆత్మజ్ఞానమును బోధించెను. పిమ్మట ఆత్మతత్త్వజ్ఞానమును బాగుగా అవగతము చేసికొనిన తన తల్లికడ అనుమతిని తీసికొని అతడు అచటినుండి వెళ్ళిపోయెను.


*33.13 (పదమూడవ శ్లోకము)*


*సా చాపి తనయోక్తేన యోగాదేశేన యోగయుక్|*


*తస్మిన్నాశ్రమ ఆపీడే సరస్వత్యాః సమాహితా॥2588॥*


పిదప, దేవహూతియు తన తనయుడైన కపిలమహర్షి చేసిన ఉపదేశమును అనుసరించి, సరస్వతీ నదీ తీరమునగల తన ఆశ్రమమున యోగసాధస చేసెను. ఆ ఆశ్రమము సరస్వతీ నదీ తీరమునందు మకుటాయమానముగా వెలుగొందు చుండెను. యోగాభ్యాసముద్వారా ఆమె సమాధిస్థితికి చేరెను.


*33.14 (పదునాలుగవ శ్లోకము)*


*అభీక్ష్ణావగాహకపిశాన్ జటిలాన్ కుటిలాలకాన్|*


*ఆత్మానం చోగ్రతపసా భిబ్రతీ చీరిణం కృశమ్॥2589॥*


త్రికాలములయందు స్నానమాచరించుటవలన ఆమెయొక్క ఉంగరాల ముంగురులు జడలుగట్టి, బూడిదరంగునకు మారెను. నారచీరలను ధరించిన ఆమె శరీరము ఉగ్రమైన తపస్సాధనవలన కృశించెను.


*33.15 (పదునైదవ శ్లోకము)*


*ప్రజాపతేః కర్దమస్య తపోయోగవిజృంభితమ్|*


*స్వగార్హస్థ్యమనౌపమ్యం ప్రార్థ్యం వైమానికైరపి*2590॥*


కర్దమప్రజాపతి యొక్క తపస్సుచే, యోగబలముచే ప్రాప్తించిన నిరుపమానమైన గార్హస్థ్య సుఖమును (భోగానుభవములను) త్యజించెను. అట్టి అలౌకిక సుఖములకై దేవతలుగూడ తహతహలాడుచుందురు.


*33.16 (పదునారవ శ్లోకము)*


*పయః ఫేననిభాశ్శయ్యాః దాంతారుక్మపరిచ్ఛదాః|*


*ఆసనాని చ హైమాని సుస్పర్శాస్తరణాని చ॥2591॥*


కర్దమమహర్షియొక్క తపఃప్రభావమున? లభించిన ఆ భవనమునందలి శయ్యలు పాలనురుగువలె స్వచ్ఛములై విలసిల్లుచుండెను. అందలి మంచములు దంతములతో నిర్మితములు. అచటి సువర్ణపాత్రలు, బంగారు ఆసనములు మిగుల మనోహరములు. కంబళ్ళు, పరుపులు సుఖస్పర్శను ఇచ్చుచు హాయిని గొలుపుచుండెను.


*33.17 (పదునేడవ శ్లోకము)*


*స్వచ్ఛస్ఫటికకుడ్యేషు మహామారకతేషు చ|*


*రత్నప్రదీపా ఆభాంతి లలనారత్నసంయుతాః॥2592॥*


ఆ భవనమునందలి గోడలు స్వచ్ఛమైన స్ఫటికమణులతో నిర్మింపబడి, మరకతములతో చెక్కబడియుండెను. ఆ గోడలపై లలనా రత్న శిల్పములతో గూడిన రత్న దీపకాంతులు ప్రతిఫలించు చుండెను.


*33.18 (పదునెనిమిదవ శ్లోకము)*


*గృహోద్యానం కునుమితైః రమ్యం బహ్వమరద్రుమైః|*


*కూజద్విహంగమిథునం గాయన్మత్తమధువ్రతమ్॥2593॥*


ఆ భవనమునకు సంబంధించిన ఉద్యానవనమునందు పెక్కు దివ్యవృక్షములు గలవు. అవి అన్నియును బాగుగా వికసించి పూవులతో చూడముచ్చట గొల్పుచుండెను. ఆ వృక్షములపైగల పక్షుల జంట కిలకిలారావములు వినసొంపుగా నుండెను. పుష్పములపై వ్రాలియున్న గండుతుమ్మెదల ఝంకారములు అత్యంత మనోజ్ఞములు. 

 

(తృతీయ స్కంధము లోని ముప్పది మూడవ అధ్యాయము ఇంకను కొనసాగుతుంది)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

⚜ శ్రీ నీరాయ్ మాతా ఆలయం.

 🕉 మన గుడి : నెం 176




⚜ ఛత్తీస్‌గఢ్ : గారియాబంద్


⚜ శ్రీ నీరాయ్ మాతా ఆలయం.



💠 భారతదేశం ఎన్నో ప్రసిద్ధ ఆలయాలకు నిలయం అని చెప్పవచ్చు.

ఈ ఆలయాలలో ఉండే రహస్యాల కారణంగా ఈ దేవాలయాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. అలాంటి ఒక దేవాలయం గురించి ఈ రోజు మనం మీకు చెప్పబోతున్నాం. విశేషమేమిటంటే, ఈ ఆలయం సంవత్సరంలో ఐదు గంటలు మాత్రమే తెరుస్తుంది. 

దీంతో పాటు ఇక్కడి మహిళలకు కూడా పలు ప్రత్యేక నిబంధనలు రూపొందించారు. 

ఇలాంటి ఆలయాలను దర్శించడానికి ఇతర దేశాల నుంచి పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు.


💠 ఇప్పటికీ కొన్ని ఆలయాలలో దాగి ఉన్న రహస్యాలు ఎవరికీ అంతుచిక్కడం లేదు.

ఇలాంటి కోవకు చెందినదే ఈ  దుర్గామాత ఆలయం.


💠 సాధారణంగా దేవాలయాలలో, రోజంతా దేవతలు మరియు దేవతలను పూజిస్తారు, నిరాయ్ మాత ఆలయంలో, కేవలం 5 గంటలు అంటే ఉదయం 4 నుండి 9 గంటల వరకు మాత్రమే దర్శనమిస్తుంది.  

మిగిలిన రోజుల్లో ఇక్కడికి రావడం నిషేధం.  

ఈ ఆలయం తెరిచినప్పుడల్లా అమ్మవారి దర్శనం కోసం వేలాది మంది ఇక్కడికి వస్తుంటారు

ఇంతకీ ఆలయం ఎక్కడ ఉంది? 

ఆలయ విశేషాలు ఏమిటి ఇక్కడ తెలుసుకుందాం.


💠 ఛత్తీస్‌గఢ్ ప్రకృతి అందాలకు మాత్రమే కాదు, పురాతన దేవాలయాలకు కూడా ప్రసిద్ధి చెందింది.  

ఛత్తీస్‌గఢ్‌లో ప్రజలను ఆశ్చర్యపరిచే ఇలాంటి దేవాలయాలు చాలా ఉన్నాయి.  

అందుకే సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఆలయాలను దర్శించుకుంటున్నారు.


💠 ఛత్తీస్ ఘర్ రాష్ట్రంలోని గ్రియా బంద్ జిల్లాకు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండలపై ప్రసిద్ధి చెందిన నీరాయ్ మాతా దేవాలయం ఉంది.


💠 నిరాయ్ మాత నిరాకారమని కూడా అంటారు.

 ఆమెకు స్థిరమైన  ఆకారం, విగ్రహం మొదలైనవి లేవు మరియు ఆమెను అడవి మధ్యలో కొండపై ఒక నిర్జన ప్రదేశంలో స్థాపించారు. అందుకే ఆమె పేరు నిరాయ్ మాత.


💠 ఈ ఆలయంలోని అమ్మవారు సంవత్సరంలో కేవలం ఐదు గంటలు మాత్రమే భక్తులకు దర్శనం కల్పిస్తుంటారు.

నిరై మాత ఆలయం చైత్రమాసంలో ఒక రోజు మాత్రమే ఉదయం 4 నుండి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది.

ఈ సమయంలో గ్రామంలోని ప్రధాన పూజారి పూజలు చేసిన తర్వాత ఆలయం మళ్లీ సంవత్సరం మొత్తం మూసివేయబడుతుంది.


💠 అదే విధంగా ఈ ఆలయంలోకి మహిళల ప్రవేశం లేదు. ఈ ఆలయంలో స్త్రీలు ప్రసాదం తినడం కూడా నిషేధించబడింది. 

ఆలయంలోని ప్రసాదాన్ని మహిళలు తింటే వారికి ఏదైనా అపచారం జరుగుతుందని చెబుతారు.


💠 అంతే కాకుండా ఈ ఆలయంలో అమ్మవారికి గులాబీలు, కుంకుమ, తాయత్తులు  లాంటివి ఉపయోగించరు.

ఇక్కడ కేవలం కొబ్బరికాయ, అగర్బత్తిలను మాత్రమే ఉపయోగించి అమ్మవారికి పూజలు నిర్వహిస్తారు.


💠 అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రతి సంవత్సరం చైత్ర నవరాత్రి సమయంలో  మాత ఆలయంలో మండే

జ్వాల నూనె లేకుండా 9 రోజుల పాటు మండుతూనే ఉంటుంది.


💠 ప్రతి సంవత్సరం చైత్ర నవరాత్రులలో నిరై మాత ఆలయంలో దీపం దానంతటదే వెలుగుతుందని చెబుతారు.

ఈ అద్భుతం ఎలా జరిగిందనేది నేటికీ ఒక రహస్యంగా మిగిలిపోయింది.


💠 నూనె లేకుండా తొమ్మిది రోజుల పాటు దీపం వెలిగడం  కేవలం అమ్మ వారి మహిమ అని భక్తులు విశ్వసిస్తుంటారు.


💠 నీరాయ్ మాతా ఆలయంలోకి మహిళలకు ప్రవేశం లేదు.అసలు అమ్మవారి ఆలయంలోకి మహిళల ప్రవేశం ఎందుకు లేదనే విషయం ఇప్పటికీ ఎవరికీ తెలియదు.

కేవలం అమ్మవారి దర్శనం మాత్రమే కాకుండా ఈ అమ్మ వారి ప్రసాదం కూడా మహిళలు తీసుకోరు. ఇది ప్రపంచంలో ఎక్కడ లేని విడ్డురం కావచ్చు.


💠 రజిమ్. నిరాయ్ మాత ఆలయం ఛత్తీస్‌గఢ్‌లోని ధర్మనగరి రాజిమ్‌కు 40 కి.మీ దూరంలో రాజిమ్ చివరిలో పారి నది ఒడ్డున ఉన్న కొండపై ఉంది.


💠 ఈ ఆలయం ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్ జిల్లా ప్రధాన కార్యాలయం నుండి 12 కిలోమీటర్ల దూరంలో కొండపై ఉంది.