5, జూన్ 2024, బుధవారం

*అర్ఘ్య ప్రధానం

 :


*అనంత ఫలదాయకం…


               *అర్ఘ్య ప్రధానం...!!*

                 ➖➖➖✍️


*మన తల్లిదండ్రులు, తాతముత్తాతలు మన చిన్నతనం నుండి ఉదయమే లేవటం మరియు సూర్యుడికి అర్ఘ్యం వదలటం వంటి ఆచారాలను నేర్పుతూ వొస్తున్నారు.* 


*నేటి సమాజంలో మనం వ్యవహరించే ఆచారాలు, విశ్వాసం మరియు నమ్మకం ఉన్న సూర్యుడికి నీరుని సమర్పించటం వంటివి నిజంగా మనకు సహాయపడుతున్నాయా లేదా కేవలం ఇది మరొక పురాణంలాగా వింటున్నామా!*


*సూర్యునికి దోసిలిలో నీరుని సమర్పించటానికి అనేక పరిశోధనలు మరియు అనేక శాస్త్రీయ కారణాలు ఉన్నాయి.*


*రెండు చేతులు దోసిలిగా పెట్టి,                          ఆ దోసిలిలో నీరు తీసుకుని రెండు చేతులను సూర్యదేవుని దిశగా పైకెత్తి పెట్టి, సన్నని ధారతో దోసిలిలోని నీరు వొదలాలి, మరియు   ఆ సమయంలో సూర్యుని నుండి వొచ్చే బలమైన కిరణాల వలన మనం సూర్యుని వైపు చూడలేము, మన పూర్వీకులు సూర్యభగవానుడికి ప్రాతఃకాలంలో విస్తృత అంచు కలిగి ఉన్న ఒక గిన్నెతో అర్ఘ్యం అందించేవారు.*


*వారు నీటిని రెండు చేతులను సూర్యభగవానుని దిశగా పైకి ఎత్తి నీరుని సమర్పించేటప్పుడు వారి కళ్ళ ముందు ఆ సన్నని నీటి ధార దేవుడి దిశగా వెళుతున్నట్లుగా అనుభూతి చెందేవారు మరియు మన పూర్వీకులు (ఋషులు, సాధువులు) ఆ ప్రవహిస్తున్న నీటి చిత్రం ద్వారా  సూర్యభగవానుని చూసేవారు.*


*సూర్యోదయ సమయంలో ఉదయిస్తున్న కిరణాలు(నీటి ప్రవాహం చిత్రం) వారి కళ్ళను మాత్రమే కాదు, వారి మొత్తం శరీరం మరియు ఆత్మను కూడా ఉత్తేజపరుస్తాయి.*


*శాస్త్రవేత్తలు ఉదయాన్నే సూర్యుని  కిరణాలు సోకటం మానవునికి మంచిదని చెబుతారు.* 


*మానవ శరీరమే ఒక అద్వితీయమైన శక్తితో కూడుకున్నది.   మానవ శరీరం ఐదు అంశాలతో చేయబడింది, గాలి(వాయు), నీరు (జల), భూమి(పృథ్వి) , అగ్ని(శక్తి) మరియు అంతరిక్షము(ఆకాశము) మరియు శరీరంలోని అన్ని రోగాల నివారణ ఈ ఐదు అంశాల వలన మాత్రమే సాధ్యమవుతుంది మరియు ఉదయిస్తున్న సూర్యుని కిరణాలలో ఈ అంశాలు ఉండటం ఒక విశేషం.*


*పలు వ్యాధులు సూర్యుని కిరణాలను ఉపయోగించి నయం చేయవచ్చు!    ఉదా:- గుండె జబ్బులు, కళ్ళు, కామెర్లు,  కుష్టు మరియు బలహీనమైన మెదడు.* 


*మనల్ని నిద్ర నుండి మేల్కొలిపేలా చేసేది సూర్యభగవానుడు అని ఋగ్వేదం చెపుతున్నది.*


*సూర్యుని కారణంగా అన్ని పనులు చురుగ్గా జరుగుతున్నాయి.*


*జీవకోటి సృష్టి అంతా సూర్యుడి మీద ఆధారపడి ఉన్నది. సూర్యుడు అనేక భౌతిక, మానసిక మరియు ఆధ్యాత్మిక బలహీనతలను తొలగిస్తాడు మరియు ఆరోగ్యకరమైన , దీర్ఘాయువును ఇస్తాడు.*


*సూర్యుడి ఏడు రంగులు ఆరోగ్యానికి చాలా మంచివి మరియు ముఖ్యమైనవి. ఎవరయితే ప్రాతః కాలాన్నే స్నానం ఆచరించి మరియు సూర్య దేవుడిని ప్రార్థించటం చేస్తారో మరియు వారి శరీరానికి సూర్యుని కిరణాలు తాకుతాయో, వారి శరీరం అన్ని రుగ్మతల నుండి విముక్తి పొందుతుంది మరియు వారి యొక్క మేధస్సు పెరుగు తుంది.*


*ప్రతీ రోజు సూర్యుడు ఉదయించక ముందే అంటే ఉదయం 5 నుండి 6 లోపున సూర్యునికి అర్ఘ్యం అంటే మన రెండు చేతులతో దోసెడు నీళ్ళు తీసుకుని…*


*”సిందూరవర్ణాయ సుమండలాయ సువర్ణవర్ణాభరణాయ తుభ్యమ్‌ |*

*పద్మాభనేత్రాయ సపంకజాయ బ్రహ్మేంద్రనారాయణకారణాయ ||*


*సురత్నపూర్ణం ససువర్ణతోయం సకుంకుమాద్యం సకుశం సపుష్పమ్‌I*

*ప్రదత్తమాదాయ సహేమపాత్రం ప్రశస్తమర్ఘ్యం భగవన్‌ ప్రసీద ||*


*అని నీళ్లను సూర్యుణ్ణి చూస్తూ విడిచి పెట్టాలి, కొద్దిసేపు సూర్యునికి నమస్కారం చేసుకుని,  పూజ గదిలో స్వామి వారి మూర్తికి దీపారాధన చేయటం ముఖ్యం, నమస్కారం చేస్తే చాలు సర్వ సౌఖ్యాలు ఇస్తాడు.*


*అటువంటిది మనం ఇంకా శ్రద్ధగా సూర్య దీక్ష చేస్తే మనకు వచ్చే ఫలితం ఎంతో ఉంటుంది! ఆలోచించండి.*


*దీక్షలో ప్రతీ ఆదివారం స్వామి వారికి ఆవుపాలతో చేయబడిన పాయసాన్ని నివేదన చేసి ఆదిత్య హృదయం చదువుకోవాలి.*✍️

.        *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                     🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏



*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

సంకల్పము

 *శుభోదయం*

*********

సంధ్యావందనం 

మరియు ఇతర 

పూజాకార్యక్రమాల 

సంకల్పము. 

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ.05.06.2024బుధ వారం (సౌమ్య వాసరే) 

********

గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం. దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో వచ్చును. 

__________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్నేయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ క్రోధి నామ సంవత్సరే ఉత్తరాయణే

వసంత ఋతౌ వైశాఖ మాసే కృష్ణ పక్షే చతుర్దశ్యాం

(సూర్యోదయానికి ఉన్న తిథే చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)

సౌమ్య వాసరే 

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.

ఇతర పూజలకు శ్రీ క్రోధి నామ సంవత్సరే ఉత్తరాయణే

వసంత ఋతౌ 

వైశాఖ మాసే కృష్ణ పక్షే చతుర్దశ్యాం

సౌమ్య వాసరే అని చెప్పుకోవాలి.

ఇతర ఉపయుక్త విషయాలు

సూ.ఉ.5.28

సూ.అ.6.27

శాలివాహనశకం 1946 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2081 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5125 వ సంవత్సరం. 

శ్రీ క్రోధి నామ సంవత్సరం 

ఉత్తరాయణ పుణ్యకాలం

వసంత ఋతువు

వైశాఖ మాసం 

కృష్ణ పక్షం

చతుర్దశి రా.7.18 వరకు. 

సౌమ్య వారం. 

నక్షత్రం కృత్తిక రా.9.08 వరకు.

అమృతం రా.6.50 ల 8.32 వరకు. 

దుర్ముహూర్తం ఉ.11.30 ల 12.23 వరకు. 

వర్జ్యం ఉ.9.37 ల 11.09 వరకు. 

యోగం సుకన్య ఉ.5.58 వరకు. 

కరణం భద్ర ఉ.8.11 వరకు. 

సూర్యోదయము ఉ.6.00 గంటలకు అయితే

రాహు కాలం సా.12.00 ల 1.30 వరకు. 

గుళిక కాలం మ.10.30 ల 12.00 వరకు. 

యమగండ కాలం ఉ.7.30 ల 9.00 వరకు. 

***********   

పుణ్యతిధి వైశాఖ బహుళ చతుర్దశి. 

********

Note:-

శ్రీ పద్మావతి శ్రీనివాస వివాహ సమాచార సంస్థ

*(రి.జి.నెం.556/2013) *

*వనస్థలిపురం,హైదరాబాద్* - 500070

వధూవరుల వివరాలకై సంప్రదించండి.

98487 51577 / 80195 66579.

****************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.


ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి.

🙏🙏🙏

'శ్రేయాంసి బహు. విఘ్నాని

ఆస్తిక మహాశయులారా 

గత కొద్దీ కాలంనుండి మనం ఈ బ్లాగులో అనేకమైన ధార్మిక విషయాలను గురించి సమాచారాన్ని పొందుపరుస్తూ వున్నాము. ఒక రకంగా చెప్పాలంటే హిందూ ధర్మ ప్రచారమే ద్యేయమగా ఈ బ్లాగు నడుపుతున్నాము. దీనికి దేశ విదేశాలనుండి అనేకమంది ప్రేక్షకులు చూస్తున్నారని అందరి ఆధరణే ఈ బ్లాగుకు శ్రీరామరక్ష అనే భావనతో మనం ముందుకు పోతున్నాము. తరచుగా మన బ్లాగును తిలకించే ప్రేక్షకులకు కూడా ఈ బ్లాగులో భాగస్వామ్యం కలిపించాలని భావించి మీరు బ్లాగులో ప్రచురించదలచిన విషయం అది ఏదైనా కానీయండి మన హిందూ ధర్మానికి చెందినది, లేక లోక శ్రేయస్సుకు చెందినది కానీయండి లేక ఆస్తికజనాకర్షకమైనది అయితే ఇక్కడ అందరి ఉపయోగార్ధము ప్రచురించ సంకల్పించాము.  కానీ ఈ సరికి ఒక్కరు కూడా స్పందించక పోవటం విచారకరం. అంతే  కాకుండా ఈ బ్లాగుని ఇంకా మంచిగా తీర్చి దిద్దటానికి మీ వంతు సహాయం చేయమని కోరటం జరిగింది. కానీ ఇంతవరకు ఒక్కరు కూడా స్పందించకపోవటం కడా జరిగింది. మిత్రులకు తెలియచేయునది ఏమిటంటే మీరు ఈ బ్లాగు చూసి మీకు నచ్చిన విషయాలమీద మీ స్పందనను సవిమర్శనాత్మకంగా తెలియచేయండి. మూర్ఖపు కామెంటులను దయచేసి పెట్టకండి. ఇది ధార్మికమైన బ్లాగు అని మరువ వద్దు. 

 'శ్రేయాంసి బహు. విఘ్నాని" అన్నట్టు ఈ రోజుల్లో నీచ విమర్శలు చేసే వారు అనేకులు సమాజ శ్రేయస్సుకోసం చేసే ప్రతి కార్యాన్ని భగ్నపరచ ప్రయత్నిస్తున్నారు. అంతా కలి మహత్యం అని మనం ఊరుకోలేము కదా.  మనవంతు భాద్యతగా అటువంటి వారిని త్రిప్పికొడితేనే కానీ మన ధర్మం నిలపడదు. 

సమాజంలో హిందుత్వంలో పుట్టిన అనేకులు ఇతర మతాల ప్రభావం వలన నాస్తికులుగా మరియు హిందూ ధర్మ విమర్శకులుగా మారుతున్నారు. వారి నందరను చేరదీసి మన ధర్మం గొప్పదనాన్ని తెలియచేసి వారిని మన ధర్మం వైపు నడిపించవలసిన అవసరము ఎంతైనా వుంది.  ఈ కార్యానికి హిందువు ఐన ప్రతి ఆస్తికవాది నడుము కట్టాలి. 

ధర్మ ప్రచారంలో భాగంగా మనం మన బ్లాగులో అనేక హిందూ ధార్మిక విషయాలను పొందుపరుస్తూ ముందుకు వెళుతున్నాము. ఇది కేవలము నిష్ఫలాపేక్ష కార్యాక్రమం అయినప్పటికీ మనకు డబ్బు యొక్క అవసరము వున్నది కదా. ఈ రోజుల్లో అడుగుతీసి అడుగు వేయాలన్నా డబ్బుతోటె పని  పడుతున్నది. కాబట్టి ఆస్తిక మహాశయులను వారి శక్తానుసారంగా విరాళాలు ఇచ్చి ఈ బ్లాగును ముందుకు తీసుకొని వెళ్ళుటకు తమ వంతు సాయం అందించవలసిందిగా పలుమార్లు  కొరతమైనది. కానీ ఇంతవరకు ఎవ్వరు ఆర్థిక సాయము చేయుటకు ముందుకు రాలేదు.  వీక్షక మిత్రులను కోరేది ఏమిటంటే బ్లాగును నడుపుటకు మీవంతు సాయంగా 

 1) బ్లాగులో ప్రచురించుటకు విషయాలను అంటే మీ రచనలను తెలుగు, ఇంగ్లిష్ లేక హిందీ భాషలలో  పంపగలరు. , భక్తి వేదాంత పరమైనవి హిందుత్వ వికాసానికి తోడ్పడే వాటికి ప్రాధాన్యత ఇచ్చి ప్రచురించగలము. అంతేకాక మీ సొంత రచనలు, కథలు, కథానికలు, వ్యాసాలు, కవితలు, పద్యాలను కూడా పంపవచ్చు. మీరు తీసిని అందమైన ప్రక్రుతి ఫోటోలను కూడా పంపవచ్చును. మీరు బ్లాగులో ప్రచురించదలచిన విషయాలను "బ్లాగులో ప్రచురణార్ధం" అని కాప్షన్ వ్రాసి 9848647145 కు వాత్సపు చేయగలరు  

2) బ్లాగుకు మీ వంతు సహాయంగా ద్రవ్యాన్ని కూడా పంపవచ్చు. మీరు పంపే ద్రవ్యాన్ని9848647145 కు ఏదైనా UPI యాపు ద్వారా  పంపవచ్చు. మీ సహాయ సహకారాలను అపేక్షిస్తూ ఉంటాము.

సదా హిందూధర్మ ప్రచారంలో 

మీ 

బ్లాగరు.

ఐశ్వర్యం అంటే

 ఐశ్వర్యం అంటే


1. తల్లి, తండ్రులను రోజూ చూడటం


2. భార్య,భర్తలు అనుకూలంగా ఉండటం


3. చెప్పిన మాట వినే సంతానం ఉండటం


4. ఋణాలు లేక పోవటం


5. మన అవసరానికి తగ్గ ధనము ఉండటం


6. ఏదైనా తిని అరిగించుకొనే శక్తి ఉండటం


7.మనలను చూసి కుళ్లుకునె వారు లేక పోవటం

8. నిత్యం భగవంతుని తలిచె మనస్సు వుండటం. 

9. సమాజంలొ ప్రతివారు గౌరవించటం. 

10 కష్టాలలొ తోడుగా వుండె భార్య వుండటం. 

11 తన మాటకు విలువనిచ్హె మంచి కుటుంబం వుండటం. 

ఇవన్నీ వున్నవాడె ప్రపంచంలొ ఐస్వర్యవంతుడు. 

7. మనకోసం కన్నీరు కార్చే మిత్రులుండటం


8. పది మందిలో గౌరవించబడటం.


9. ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉండటం

 10. 

హనుమజ్జయంతి ప్రత్యేకం - 5/11

 ॐ       హనుమజ్జయంతి ప్రత్యేకం -  5/11 

         (ఈ నెల 1వతేదీ హనుమజ్జయంతి) 

         

. హనుమ - ఆచార్యుడు 


   "భగవంతుని పొందాలి"  అనే ఆర్తి జీవునిలో కలిగినపుడు, భగవానుడే ఆచార్యుని ఎంచి, జీవుని వద్దకు పంపుతాడు. 

    ఆచార్యుడు వేద సంపన్నుడు, భగవదనుభవము పొందినవాడు కావలెను. 

   "శ్రోత్రియమ్ బ్రహ్మనిష్ఠమ్" అని ఆచార్యుని అర్హతగా చెబుతుంది శ్రుతి. 


అ) శ్రోత్రియుడు (వేద సంపన్నుడు) 

    వేద పండితుడవడానికి సరియైన శిక్షణ - ధారణ - ప్రయోగము అనేవి ప్రధానం. 


    హనుమ మొదటగా రామలక్ష్మణులను కలసి మాటలాడినప్పుడు శ్రీరాముడు లక్ష్మణునితో హనుమను గూర్చి ప్రశంసించిన విషయం అతిగొప్పది. 

    హనుమ ఋగ్వేద, యజుర్వేద, సామవేదములను అధ్యయనము చేసిన పరిపూర్ణుడని, 

    మూడు వేదాలకి సంబంధించి వరుసగా "వినీతః, ధారిణః, విదుషః" అనే మూడు విశేషణాలతో పొగడబడ్డాడు. 


(i) వినీతః 


    ఋగ్వేదమున ప్రతివర్ణానికీ స్వరముంటుంది. గురువు వద్ద ఎంతో శిక్షణ పొందినగానీ దానిని సరిగా చదువలేరు. అందుకని హనుమను "ఋగ్వేద వినీతుడు" అన్నాడు రాముడు. 

   'వినీతుడు' అంటే 'శిక్షితుడు" (Trained). 


(ii) ధారిణః 


    యజుర్వేదంలో ఒక అనువాకంలో వాక్యము మరొక అనువాకంలో కనబడుతూంటుంది. అవి కలియకుండ ధారణ అవుసరం. 

    అందుచే "యజుర్వేద ధారిణః" అన్నాడు. 

   "ధారణ" అంటే జ్ఞాపకశక్తి (Memory). 


(iii) విదుషః 


    సామవేదము గాన ప్రధానము. 

    గానములో మార్పులు చేయు జ్ఞానము "విదుషత్వము". 

    అది కలవాడని హనుమను శ్రీరాముడు "సామవేద విదుషః" అని గుర్తించాడు. 

   "విదుషిత్వము" అంటే సరియైన ప్రయోగము (Proper practical application). 


    కాబట్టి హనుమ త్రయీ అని, మూడుగా నున్న వేదాలకు సంబంధించి, 


*శిక్షణ పొందినవాడు,  

*జ్ఞప్తియందుంచుకొనేవాడు,  

*ప్రయోగించువాడు అని 

      మెచ్చుకోబడి శ్రోత్రియుడయ్యాడు. 


ఆ) బ్రహ్మనిష్ఠుడు (భగవదనుభవము పొందినవాడు) 


    వేదాధ్యయన జ్ఞానముతో అభ్యాసము చేయుచూ, భగవత్తత్త్వము అనుభవించుట బ్రహ్మనిష్ఠ. 


    రామలక్ష్మణులను తన భుజస్కంధాలపై ఆసీనులను చేసి, సుగ్రీవుని వద్దకు తీసుకు వెళ్ళాడు హనుమ. 

    తద్వారా, పరమాత్మతో ప్రత్యక్ష అనుభూతి పొందినవాడై, బ్రహ్మనిష్ఠుడయ్యాడు. 


    పరమాత్మ 

  - వేదజ్ఞానపరాయణుడైన హనుమను గుర్తించి, 

  - తాను హనుమకు పరమాత్మానుభూతి కూడా కలిగించి ఆచార్యుని చేశాడు. 


ఆచార్యుడు - జీవుడు 


   "లంక" అనే దేహంలో, 

   "సీత" అనే జీవుని, 

   "రావణుడు" అనే ఇంద్రియాలు బంధించి యుంచితే, 

    ఆ "సీత" అనే జీవుడు 

        "రాముడు" అనే పరమాత్మను పొందాలని ధ్యానిస్తున్నప్పుడు, 

   "హనుమ" అనే ఆచార్యునితో అక్కడకు, 

  

   "అంగుళీయకము"తోపాటు తన సందేశాన్ని భగవంతుడైన శ్రీరాముడు పంపాడు. 


మనకి మార్గదర్శకం 


    మనం కూడా ఆ సందేశం పొందాలి. 


    సరియైన విషయమై 

  - శిక్షణ(Training), 

  - జ్ఞప్తి(Memory), 

  - జీవితంలో ఆచరణ (Application/Interpretation), అనే మూడిటితో శ్రోత్రియునిగా తయారుచేసి, తద్వారా, 

      సాధనలో అనుభూతితో బ్రహ్మనిష్ఠునిగానూ చేసి, 

      మనలను తావలెనే మార్చి అనుగ్రహిస్తాడు హనుమ. 


               జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 


          జై హనుమాన్ జై జై హనుమాన్  


                           కొనసాగింపు .... 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

             భద్రాచలం 

        (86399 68383)

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - వసంత ఋతువు - వైశాఖ మాసం - కృష్ణ పక్షం  -‌ చతుర్ధశి  - కృత్తిక -‌‌  సౌమ్య వాసరే* (05.06.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

మీరు భాగస్వాములు కండి

 మీరు భాగస్వాములు కండి 

ఈ బ్లాగును ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలోని తెలుగువారు చూస్తున్నారు.  మనలో ఎంతోమంది, కవులు, పండితులు, ఫొటోగ్రాఫరులు ఇంకా ఇతర కళాకారులు ఉండి వుంటారు. వారందరికీ ఇదే మా సాదర ఆహ్వానం. మీరు మీ రచనని లేదా మీరు ఈ బ్లాగులో ప్రచురించదలచిన అంశం ఏదైనా కానీ అందరకు ఉపయోగపడుతుందని తలుస్తే దాని మీద "తెలుగు పండిత కవులలో ప్రచురణార్ధం" అని వ్రాసి మీ పేరు, చిరునామా, ఫోను నెంబరు పేర్కొంటూ +91 9848647145 కు వాట్సాప్ చేయండి.  దానిని మేము మన బ్లాగులో ప్రచురిస్తాము. మీరు పంపిన అంశాలు (content ) ప్రపంచమంతా చూస్తారు. 

ఈ బ్లాగును మరింత సుందరంగా తీర్చి దిద్దే దిశలో మీ వంతు భాగస్వామ్యంగా విరాళాలు+91 9848647145 ఫోను నెంబరుకు ఇవ్వగలరు   

ఇట్లు 

మీ బ్లాగరు


అశ్వగంధ చూర్ణం

 అశ్వగంధ చూర్ణం దాని యొక్క ఉపయోగాలు - 


 *  చాలా మందికి సరిగ్గా మరియు సరైన నిద్ర ఉండదు . అటువంటి వారు సాదారణంగా మత్తు కలిగించే ట్యాబ్లేట్స్ వాడుతుంటారు. అవి క్రమక్రమంగా ఆరోగ్యం పైన తీవ్రంగా ప్రభావం చూపిస్తాయి. నిద్రలేమి సమస్య తో బాధపడే వారు ఈ అశ్వగంధ చూర్ణం వాడటం వలన మంచి ఫలితాలు పొందగలరు .


 *  దీనిని తెలుగులో పెన్నేరు అని కూడా అంటారు.దీని వేరు భాగంలో "samniferin " అనే రసాయనం ఉంది . ఇది మంచి నిద్ర కలిగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.


 *  ఇది శరీరంలో వేడిని , వాతాన్ని తగ్గించును 


 *  జీర్ణక్రియ మీద దీని ప్రభావము ఉంటుంది. జీర్ణశక్తిని పెంచును. 


 *  పేగుల్లో మృదుత్వాన్ని తగ్గించును . 


 *  విరేచనం సాఫీగా అయ్యేలా చేయును . 


 *  విరేచనాలు అతిగా అవ్వకుండా చూస్తూ ప్రేగులకు హాని కలగకుండా కాపాడును.


 *  రక్తస్రావ సంబందించిన సమస్యలతో ఇబ్బందిపడేవారు మరియు రక్తపోటు సమస్యతో ఇబ్బందిపడేవారు వారు వాడుతున్న మందులతో పాటు ఈ అశ్వగంధ వాడుతున్నట్లైతే తొందరగా ఫలితాలు వస్తాయి 


 *  వీర్యదోషాలకు కూడా మంచి మందుగా పనిచేయును . 


 *  శరీరంలో వేడిని మాత్రమే కాదు .జ్వరాన్ని కూడా తగ్గించును . 


 *  శరీరానికి అద్భుతమైన టానిక్ గా పనిచేయును . 


 *  వాతం , కీళ్లనొప్పులు , నడుమునొప్పి గలవారు వారు తీసుకునే మందులతో పాటు ఈ అశ్వగంధని వాడుకోవడం వలన శీఘ్రగతిన ఫలితాలు వస్తాయి. 


 *  థైరోయిడ్ గ్రంధి , గజ్జల్లో వచ్చే బిళ్లలు దాన్ని లింఫ్ గ్రంధుల వాపు వీటిపైన అశ్వగంధ బాగా పనిచేస్తుంది .


 *  మెదడు వ్యాధులు , నరాల జబ్బులు , వణుకుడు , మూర్చలు మొదలయిన జబ్బులతో బాధపడే వారు వైద్యుని సలహా మేరకు ఈ అశ్వగంధ వాడుకోవచ్చు . 


 *  తలతిరుగుడు , ఒళ్ళు తూలుడు , మగతగా ఉండటం , నిద్రపట్టక పోవడం , ఇవన్ని వాత సంబంధ సమస్యలు వీటికి అద్బుత ఔషదం ఈ అశ్వగంధ .


 *  గుండె జబ్బులు ఉన్నవారు , గుండె ఆపరేషన్ చేయిచుకున్న వారు , గుండెపోటు వచ్చి తగ్గి మందులు వాడుకుంటున్నవారు తెల్ల మద్ది చెక్క చూర్ణం , అశ్వగంధ చూర్ణం సమానంగా తీసుకుని ఆ చూర్ణాన్ని తేనెతో కలిపి తీసుకొనిన మంచి ఫలితాలు వస్తాయి .


 *  స్త్రీల కుసుమ వ్యాదులు, తెల్లబట్ట , అతి రక్తస్రావం వంటి సమస్యల్లో స్త్రీలకు అశ్వగంధ చాలా ఉపయోగకరంగా ఉండును.


 *  చర్మవ్యాధుల్లో కూడా మంచి ఔషధంగా పనిచేయును . 


 *  క్షయవ్యాధి , పోలియో వ్యాధికి కూడా ఔషదాలతో పాటు ఇది వాడుకోవచ్చు . 


         పైన చెప్పినటువంటి యోగాలు మాత్రమే కాక మరెన్నో రోగములకు ఈ అశ్వగంధ చూర్ణం అత్యద్భుతంగా పనిచేయును. బయట షాపుల్లో దొరికే అశ్వగంధ చూర్ణం శుద్ధిచేయబడి ఉండదు. శుద్ధిచేయబడని చూర్ణం వాడటం వలన ఫలితాలు అంత తొందరగా రావు. ఫలితాలు త్వరగా రావలెను అనిన శుద్ధి చేయబడిన అశ్వగంధ చూర్ణాన్ని వాడవలెను. 


                మేలైన అశ్వగంధ గడ్డలను తీసుకొని వచ్చి శుభ్రముగా కడిగి బాగుగా ఎండించి స్వచ్ఛమైన దేశివాళి ఆవుపాలయందు ఉడికించి బాగుగా ఎండించవలెను. మరలా ఉడికించి ఎండించవలెను . ఇలా 11 సార్లు ఉడికించి ఎండించి ఆ తరువాత మెత్తటి చూర్ణం చేయవలెను . 


          పైన చెప్పిన పద్ధతిలో తయారు చేసినటువంటి అశ్వగంధ చూర్ణం సంపూర్ణమైన ఫలితాలు అతి త్వరగా ఇచ్చును.  


       అవసరం ఉన్నవారికి మాత్రం చేసి ఇవ్వబడును.  మీకు ఈ చూర్ణం కావలెను అనినచో నన్ను సంప్రదించగలరు.  నా నెంబర్ 9885030034 కి ఫోన్ చేయగలరు. 


    ఈ అశ్వగంధ చూర్ణం 40 రకాల రోగాల మీద పనిచేయును . HIV సమస్యతో ఇబ్బంది పడుతున్న రోగులకు ఇది ఇచ్చినప్పుడు CD4 కౌంట్ పెరగడం జరిగింది . వారి శరీరం నందు వ్యాధి నిరోధక శక్తి పెరగడమే కాకుండా నీరసం , నిస్సత్తువ తగ్గాయి . ఈ చూర్ణముతో చాలా మందికి చికిత్స చేశాను . 


    కాళహస్తి వేంకటేశ్వరరావు 


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

ఈ బ్లాగు మనందరిది

  ఈ బ్లాగు మనందరిది దీని అభివ్రుద్దికి మీ వంతుగా మీకు తొచిన ద్రవ్యం ఈ మొబైలు నంబర్కు 9848647145 డొనేటు చేయండి. 

వర్జ్యం అంటే

 *వర్జ్యం అంటే !*

                  

(చాలామందికి తెలుసు, చాలామందికి తెలియదు.)


*జ్యోతిష్యంలో వర్జ్య కాలమును నక్షత్రాన్ని బట్టి నిర్ణయిస్తారు.*


ప్రతి నక్షత్ర సమయంలో వర్జ్య కాలం ఉంటుంది .                 


వర్జ్య కాలం అంటే విడువ తగిన కాలం. అశుభ సమయం.


శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు.


ప్రతి నక్షత్రానికి వర్జ్యం 4 ఘడియలు లేదా 96 నిమిషాలు ఉంటుంది. జన్మ జాతకంలో లగ్నం స్ఫుటం గాని, చంద్రస్ఫుటం గాని, ఇతర గ్రహాలు గాని వర్జ్య కాలంలో ఉన్నట్లయితే ఆ గ్రహం యొక్క దశ, అంతర్దశలలో ఇబ్బందులు ఏర్పడతాయి.


భారతీయులు…..నూతనంగా ఏ శుభకార్యాన్ని ప్రారంభించాలనుకున్నా, మంచి ముహూర్తం చూసుకుని ఆయా శుభకార్యాలకి శ్రీకారం చుడుతుంటారు. 

అటు దైవకార్యాలకి ఇటు శుభకార్యాలకి మంచి ముహూర్తం చూడటమనేది ప్రాచీనాకాలం నుంచి వస్తోంది. 


ముహూర్తం ఏ మాత్రం కాస్త అటుఇటు అయినా ఆ శుభకార్యానికి ఆటంకాలు ఏర్పడతాయేమోననే బలమైన విశ్వాసం వుండటం వలన, అందరూ ముహూర్తాల విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ వుంటారు.


ఈ నేపథ్యంలోనే ‘వర్జ్యం’ అనే పేరు ఎక్కువగా వినిపిస్తూ వుంటుంది. 


‘వర్జ్యం’ అంటేనే విడువదగినది అని అర్థం. అంటే వర్జ్యం వున్న సమయాన్ని విడిచిపెట్టాలని శాస్త్రం చెబుతోంది. 


”ఇప్పుడు వర్జ్యం వుంది తరువాత బయలుదేరుతాం” … 

”కాసేపాగితే వర్జ్యం వచ్చేస్తుంది … త్వరగా బయలుదేరండి” అనే మాటలు మనం తరచూ వింటూ వుంటాం. 


వర్జ్యంలో ఎలాంటి శుభకార్యాలు ప్రారంభించడంగానీ, శుభకార్యాలకి బయలుదేరడం కాని చేయకూడదు. 

ఈ కారణంగానే పెద్దలు ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ వుంటారు.


వర్జ్యంలో దైవకార్యాలు గానీ, శుభకార్యాలుగాని చేయకూడదని అంటూ వుంటారు కాబట్టి, ఆ సమయంలో ఏం చేస్తే బావుంటుందనే సందేహం చాలా మందిలో తలెత్తుతూ వుంటుంది. 


ఆ సమయంలో దైవారాధనకి సంబంధించిన అన్ని పనులతో పాటు, శక్తి కొద్ది దానం కూడా చేయవచ్చని శాస్త్రం చెబుతోంది.


ఈ సమయంలో దానాలు చేయడం వలన అనేక దోషాలు తొలగిపోతాయని అంటారు.


వర్జ్యం వున్నప్పుడు దైవనామస్మరణ .. పారాయణం .. స్తోత్ర పఠనం .. సంకీర్తన .. భజనలు మొదలైనవి చేయవచ్చని శాస్త్రం చెబుతోంది. 


అంతే కాకుండా దేవుడి సేవకి సంబంధించిన వివిధ రకాల ఏర్పాట్లను చేసుకోవచ్చని అంటోంది. 


ఈ విధంగా చేయడం వలన వర్జ్యం కారణంగా కలిగే దోషాలు ఏమైనా వుంటే అవి తొలగిపోతాయనే విషయాన్ని స్పష్టం చేస్తోంది.

              *సేకరించి* 

*భాగస్వామ్యం చేయబడింది*


___*న్యాయపతి నరసింహారావు*__

బ్రతికి ఉన్నప్పుడు

 పక్షి బ్రతికి ఉన్నప్పుడు చీమల్ని తింటుంది. అదే పక్షి చనిపోయినప్పుడు చీమలే ఆ పక్షులను తినేస్తాయి. కాలము పరిస్థితులు ఎప్పుడైనా మారవచ్చు. అందుకే జీవితంలో ఎవరిని కించపరచవద్దు, బాధించవద్దు.

ఈరోజు నువ్వు శక్తివంతుడవు అవవచ్చును. కానీ గుర్తుంచుకో కాలం నీ కంటే శక్తివంతమైనది.

శుభోదయం 🌹🌹🌹Goodmorning

వైశాఖ పురాణం🚩*_ _*27

 🪷 *బుధవారం  - జూన్ 5, 2024*🪷

  _*🚩వైశాఖ పురాణం🚩*_   

     _*27 వ అధ్యాయము*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*కలిధర్మములు - పితృముక్తి*


☘☘☘☘☘☘☘☘☘

నారదమహర్షి అంబరీష మహారాజునకు వైశాఖమహిమనిట్లు వివరించుచున్నాడు. శ్రుతదేవుని మాటలను విన్న శ్రుతకీర్తి, మహామునీ ! ఈ వైశాఖమాసముననుత్తములగు తిధులేవి ? దానములలో నుత్తమ దానములేవి ? వీనిని నెవరు లోకమున వ్యాపింపజేసిరి ? దయయుంచి నాకు వివరముగ జెప్పగోరుదునని యడిగెను.


అప్పుడు శ్రుతదేవుడు శ్రుతకీర్తిమహారాజా ! సూర్యుడు మేషరాశియందుండగా వైశాఖమాసమున వచ్చు ముప్పది తిధులును ఉత్తమములే. కాని ఏకాదశినాడు చేసిన పుణ్యకార్యము కోట్లకొలది రెట్టింపుల పుణ్యమునిచ్చును. అన్ని దానములందును పుణ్యప్రదమైన దానమును చేయుటవలన ఫలితము , అన్ని తీర్థములయందును స్నానమాడుటవలన వచ్చు పుణ్యము వీనినన్నిటిని వైశాఖ ఏకాదశినాడు స్నానము చేయుటవలన పొందుచున్నాడు. ఆనాడు చేసిన స్నానము , దానము , తపము , హోమము , దేవతార్చన , సత్ర్కియలు , హరికథాశ్రవణము ఇవన్నియును సద్యోముక్తి దాయకములు సుమా. రోగము దరిద్రము వీనికి లోబడి స్నానాదికమును చేయలేనివాడు శ్రీహరి కథను వినిన సర్వపుణ్య కార్యములను చేసినంత ఫలమునందును.


పవిత్రమగు వైశాఖమందలి దినములను జలాశయములు దగ్గరగానుండి శరీరము బాగున్నను స్నానాదికము చేయక గడపినవారు , గోహత్య , కృతఘ్నత , తల్లిదండ్రులకు ద్రోహము చేయుట , తనకు తానే అపకారము చేసికొనుట , మున్నగు వానిని చేసినంత పాపమునందును. శరీరారోగ్యము సరిగలేనిచో శ్రీహరిని మనసున తలవవలెను. వైశాఖమాస కాలము సద్గుణాకరము , సర్వపుణ్యఫలప్రదము. సజ్జనులును దయావంతులు , ఇట్టి పవిత్ర కాలమున శ్రీహరిని సేవింపవారెవరుందురు ? ఎవరునుండరని భావము.


దరిద్రులు , ధనవంతులు కుంటివారు , గ్రుడ్డివారు , నపుంసకులు , విధవలు , విధురులు(భార్యలేనివారు), స్త్రీలు , పురుషులు , బాలురు , యువకులు , వృద్ధులు , రోగిష్ఠివారు వీరందరును యధాశక్తిగ నాచరించి తరింపదగిన పుణ్యకాలము వైశాఖ మాసకాలము. సర్వధర్మకార్యఫలప్రాప్తికిని మూలమైన వైశాఖమాసమున ధర్మకార్యములను స్నానదానాదులను చేయగోరువారు , చేయువారును సర్వోత్తములు. ఇట్లు మిక్కిలి సులభములగు వైశాఖమాస ధర్మముల నాచరింపనివారు సులభముగ నరకలోకములను పాపాత్ములై చేరుదురు సందేహములేదు. పాలను తరచి సారభూతముగ వెన్నను తీసినట్లుగ సర్వపాపములను హరించి సర్వపుణ్యములనిచ్చు తిథిని చెప్పుదును వినుము.


మేషరాశియందు సూర్యుడుండగా పాపముల నివారించుచు పితృదేవతలకు మిక్కిలి ప్రీతిని కలిగించు తిథిని చెప్పుదును. ఆ తిథినాడు పితృదేవతలకు తర్పణాది శ్రాద్ధమును చేసిన గయలో కోటిమార్లు పిండప్రదానము చేసిన పుణ్యఫలము కల్గును. ఈ విషయమున సావర్ణిమనువు భూమిని పరిపాలించుచుండగా నరకలోకమున పితృదేవతలకు చెందిన కథయొకటి పెద్దలు చెప్పినది కలదు వినుము.


ముప్పది కలియుగములు గడచిన తరువాత సర్వధర్మవిహీనమగు ఆ నర్తదేశమున ధర్మవర్ణుడను బ్రాహ్మణుడు ఉండెను. ముప్పదియొకటవ కలియుగమున ప్రధమపాదమున ప్రజలందరును వర్ణధర్మములను విడిచి పాపకార్యముల యందాసక్తులైయుండిరి. ఇట్టి పాపపంకిలమగు దేశమును విడిచి ధర్మవర్ణుడు పుష్కరక్షేత్రమున మౌనవ్రతముతో మునులు సత్రయాగమును చేయుచుండగా చూడబోయెను. కొందరు మునులు కూర్చుని పుణ్యకథా ప్రసంగములను చేయుచుండగా ధర్మవర్ణుడచటికి చేరెను.


అచటనున్న మునులు కర్మలయందాసక్తి కలవారై యుగమును మెచ్చుచు నిట్లనిరి. కృతయుగమున సంవత్సరకాలమున నియమనిష్ఠలతో భక్తిశ్రద్దలతో చేసిన వచ్చునంతటి పుణ్యము త్రేతాయుగమున నొకమాసము చేసిన వచ్చును. ద్వాపర యుగమున ఒక పక్షము చేసిననంతటి పుణ్యము వచ్చును. కాని దానికి పదిరెట్ల పుణ్యము కలియుగమున శ్రీమహావిష్ణువును స్మరించిన వచ్చును. కావున కలియుగమున చేసిన పుణ్యము కోటిగుణితము దయాపుణ్యములు , దానధర్మములులేని ఈ కలియుగమున శ్రీహరిని ఒక్కమారు స్మరించి దానమును చేసినచో కరువు కాలమున అన్నదానమును చేసిన వానివలె పుణ్యలోకములకు పోవుదురు అనియను కొనుచుండిరి.


ఆ సమయమున నారదుడచటకు వచ్చెను. అతడు ఆ మునుల మాటలను విని ఒక చేతితో శిశ్నమును మరోక చేతితో నాలుకను పట్టుకొని నవ్వుచు నాట్యము చేయసాగెను. అచటనున్న మునులు ఇట్లేల చేయుచున్నావని యడుగగా నారదుడిట్లనెను. మీరిప్పుడు చెప్పిన మాటలను బట్టి కలియుగము వచ్చినదని తెలిసి యానందమును పట్టలేక నాట్యమాడుచు నవ్వుచున్నాను. మనము అదృష్టవంతులము. స్వల్పప్రయాసతో అధికపుణ్యమునిచ్చు గొప్ప యుగము కలియుగము. ఈ కలియుగమున స్మరణము చేతనే సంతోషించి కేశవుడు క్లేశముల నశింపజేయు వనిన సంతోషము నాపుకొనలేకపోతిని. మీకొక విషయమును చెప్పుచున్నాను. వినుడు శిశ్నమును నిగ్రహించుట కష్టము అనగా సంభోగాభిలాషనుని గ్రహించుకొనుట కష్టము. నాలుకను రుచిజూచుటను నిగ్రహించుట కష్టము అనగా తిండిపై ధ్యాసను తగ్గించుకొనుట కష్టము. కలియుగమున భోగాభిలాష తిండిధ్యాస వీనిని నిగ్రహించుకొనుట మిక్కిలి కష్టము. కావున నేను శిశ్నమును , నాలుకను పట్టుకొంటి అని నారదుడు వివరించెను మరియు నిట్లనెను. శిశ్నమును , జిహ్వను నిగ్రహించుకొన్నచో పరమాత్మయగు శ్రీహరి దయ ఈ యుగమున సులభసాధ్యము. కలియుగమున భారతదేశము వేదధర్మములను విడిచి ఆచారవ్యవహార శూన్యమయినది. కావున మీరీదేశమును విడిచి యెచటకైన వెళ్లుడు. నారదుని మాటలను విని యజ్ఞాంతమున వారందరును తమకిష్టమైన ప్రదేశములకు వెళ్లిరి.


ధర్మవర్ణుడును భూమిని విడిచి యరియొకచోట నుండెను. కొంతకాలమైన తరువాత వానికి భూలోకమెట్లున్నదో చూడవలెననియనిపించెను. తేజశ్శాలియు వ్రత మహితుడును అగు నతడు దండకమండలములను , జటావల్కలములను ధరించి కలియుగ విచిత్రములను చూడదలచి భూలోకమునకు వచ్చెను.


భూలోకమున జనులు వేదబాహ్యమైన ప్రవర్తన కలిగి పాపముల నాచరించుచు దుష్టులై యుండిరి. బ్రాహ్మణులు వేదధర్మములను విడిచిరి. శూద్రులు సన్యాసులైరి. భార్య భర్తను , శిష్యుడు గురువును , సేవకుడు యజమానిని , పుత్రుడు తండ్రిని ద్వేషించుచుండిరి. బ్రాహ్మణులందరును శూద్రులవలెనైరి. ధేనువులు మేకలైనవి. వేదములు కథాప్రాయములైనవి. శుభక్రియలు సామాన్యక్రియలైనవి. భూతప్రేత పిశాచాదులనే పూజించుచుండిరి. అందరును సంభోగాభిలాష కలిగి అందులకై జీవితములను గూడ విడుచువారై యుండిరి. తప్పుడు సాక్ష్యములను చెప్పువారు మోసగించు స్వభావము కలవారగునుగను ఉండిరి. మనసునందొకటి మాటయందు మరొకటి పనియందు ఇంకొకటి అగురీతిలో నుండిరి. విద్యాభ్యాసము పారమార్థికముకాక హేతు ప్రధానముగ భావింపబడెను. అట్టి విద్య రాజపూజితమై యుండెను. సంగీతము మున్నగు వానిని రాజులు ప్రజలు ఆదరించుచుండిరి. అధములు , గుణహీనులు పూజ్యులైరి. ఉత్తములనెవరును గౌరవించుటలేదు. ఆచారవంతులగు బ్రాహ్మణులు దరిద్రులై యుండిరి. విష్ణుభక్తిజనులలో కంపించుటలేదు. పుణ్యక్షేత్రములు వేదధర్మవిహీనములై యుండెను. శూద్రులు , ధర్మప్రవక్తలు , జటాధారులు , సన్యాసులనైరి. మానవులు అల్పాయుష్కులై యుండిరి. మరియు జనులు దుష్టులు దయాహీనులుగానుండిరి. అందరును ధర్మమును చెప్పువారే. అందరు దానమును స్వీకరించువారే. సూర్య గ్రహణాది సమయములనుత్సవముగ దలచువారే. ఇతరులను నిందించుచు అసూయపడుచు అందరును తమ పూజనమునే కోరుచుండిరి. అభివృద్దిలోనున్నవారిని జూచి అసూయపడుచుండిరి. సోదరుడు సోదరిని , తండ్రికుమార్తెను తక్కువజాతివారిని కోరుచుండిరి పొందుచుండిరి. అందరును వేశ్యాసక్తులై యుండిరి. సజ్జనులు నవమానించుచుండిరి. పాపాత్ములను గౌరవించుచుండిరి. మంచివారిలోనున్న కొద్దిపాటి దోషమును పెద్దదిగ ప్రచారము చేయుచుండిరి. పాపాత్ముల దోషములను , గుణములని చెప్పుచుండిరి. దోషమునే గుణముగ జనులు స్వీకరించిరి.


జలగస్తనముపై వ్రాలి పాలను త్రాగదు. రక్తమునే త్రాగును. అట్లే దుష్టులు గుణములను కాక దోషములనే స్వీకరింతురు. ఓషధులు సారహీనములయ్యెను. ఋతువులు వరుసలు తప్పెను అనగా ధర్మములని విడిచినవి. అంతట కరవువుండెను. కన్యలు గర్భవతులగుచుండిరి. స్త్రీలు తగిన వయసున ప్రసవించుటలేదు. నటులు , నర్తకులు వీరియందు ప్రజలు ప్రేమనంది యుండిరి. వేదవేదాంత శాస్త్రాదులయందు పండితులను సేవకులనుగా , ధనవంతులు చూచుచుండిరి. విద్యావంతులగు బ్రాహ్మణులు , ధర్మహీనులను సేవించి యాశీర్వదించుచుండిరి. అవమానించిన ధనమదాంధులను , నీచులును ఆశీర్వదించిన దానికి ఫలముండదు కదా ! వేదములయందు చెప్పిన క్రియలను , శ్రాద్దములను శ్రీహరినామములను అందరు విడిచిరి. శృంగారమున నాసక్తి కలవారై అట్టి శృంగార కథలనే చదువుచుండిరి. విష్ణుసేవ , శాస్త్రచర్చ , యాగ దీక్ష , కొద్దిపాటి వివేకము , తీర్థయాత్ర దానధర్మములు కలియుగమున నెచటను లేవు. ఇది మిక్కిలి చిత్రముగనుండెను.


ధర్మవర్ణుడు భూలోకముననున్న కలియుగ విధానమును చూచి మిక్కిలి భయపడెను. పాపమును చేయుట వలన వంశనాశమును గమనించి మరియొక ద్వీపమునకు పోయెను. అన్ని ద్వీపములను చూచి పితృలోకమును జూడబోయెను. అచటనున్న వారు కష్టతరములగు పనులను చేయుచు మిక్కిలి శ్రమపడుచుండిరి. క్రిందపడి యేడ్చుచుండిరి. చీకటి గల నూలిలో పడి గడ్డిపరకను పట్టుకొని నూతిలో పడకుండ వ్రేలాడుచుండిరి. వారికి క్రింద భయంకరమగు చీకటియుండెను. ఇంతకన్న భయంకర విషయమును చూచెను. ఒక ఎలుక పితృదేవతలు పట్టుకొని వ్రేలాడుచున్న గడ్డిపరకను మూడువంతులు కొరికి వేసెను. గడ్డిపరకను పట్టుకొని వ్రేలాడు పితృదేవతలు క్రిందనున్న భయంకరమగు అగాధమును చూచి పైన ఎలుక గడ్డిని కొరికివేయుటను చూచి దీనులై దుఃఖించుచుండిరి.


ధర్మవర్ణుడును దీనులై , యున్నవారిని జూచి జాలిపడి మీరీనూతియందు యెట్లు పడిరి. యెట్టి కర్మను చేయుటచే మీకిట్టి పరిస్థితి కలిగెను ? మీరే వంశము వారు ? మీకు విముక్తి కలుగు మార్గమేమయిన నున్నదా నాకు చెప్పుడు. చేతనగు సాయమును చేయుదును అని అడిగెను. అప్పుడు వారు ఓయీ ! మేము శ్రీవత్సగోత్రీయులము. భూలోకమున మా వంశమున సంతానము లేదు. అందువలన పిండములు , శ్రాద్దములును లేక దీనులమై బాధపడుచున్నాము. మేము చేసిన పాపములచే మా వంశము సంతానము లేక యున్నది. మాకు పిండము నిచ్చువారులేరు. వంశము క్షీణించినది. ఇట్టి దురదృష్టవంతులమైన మాకు ఈ చీకటికూపమున పడక తప్పదు. మా వంశమున ధర్మవర్ణుడను కీర్తిశాలి యొకడే కలడు. అతడు విరక్తిచే వివాహమును చేసికొనక ఒంటరిగ దిరుగుచున్నాడు. ఈ మిగిలిన గడ్డిపరకను చూచితివా ? మా వంశమున నతడొక్కడే మిగులుట వలన నిచటను ఇది యొకటే మిగిలినది. మేమును దీనిని బట్టుకొని వ్రేలాడుచున్నాము. మా వంశమువాడైన ధర్మవర్ణుడొక్కడే మిగిలెను. దానికి ప్రతీకగా పితృలోకముననున్న మాకును ఈ గడ్డిపరక యొక్కటే మిగిలినది. అతడు వివాహము చేసికొనక పోవుటచే సంతానము లేకపోవుటవలన ఈ గడ్డికి అంకురములులేవు. ఈ ఎలుక ఈ గడ్డిని ప్రతిదినము తినుచున్నది. ఆ ధర్మవర్ణుడు మరణించినను తరువాత నీ ఎలుక మిగిలిన ఈ గడ్డిముక్కను తినివేయును. అప్పుడు మేము అగాధము భయంకరమునగు కూపమున పడుదుము. ఆ కూపము దాటరానిది , చీకటితో నిండినది.


కావున నాయనా ! భూలోకమునకు పోయి మా ధర్మవర్ణునివద్దకు పోయి మా దైన్యమును వివరింపుము. మేము వాని దయకెదురు చూచు చున్నామని చెప్పి వివాహమాడుట కంగీకరింప జేయుము. నీ పితృదేవతలు నరకమున చీకటి కూపమున పడియున్నారు. బలవంతమైన ఎలుక మిగిలిన ఒక గడ్డిపరకను కొరుకుచున్నది. ఆ ఎలుకయే కాలము. ఇప్పటికి ఈ గడ్డిలో మూడువంతులు పోయినవి. ఒకవంతు మిగిలినది. ఆ మిగిలినది నీవే. నీ ఆయువును గతించుచున్నది. నీవుపేక్షించినచో మావలెనే నీవును మరణించిన తరువాత నిట్లే మాతో బాటు ఇందుపడగలవు. కావున గృహస్థ జీవితము నవలంబించి సంతతిని పొంది వంశవృద్దిని చేసి మమ్ము నూతిలోపడకుండ రక్షింపుమని చెప్పుము. పుత్రులెక్కువమందిని పొందవలెను. వారిలో నొకడైనను గయకు పోయి పిండప్రదానము చేయును. అశ్వమేధయాగమును చేయవచ్చును. ఆయా మాసవ్రత విధానమున మాకు దానము , శ్రాద్దము మున్నగునవి చేయవచ్చును. ఇందువలన మాకు నరకవిముక్తియు పుణ్యలోక ప్రాప్తియు కలుగునవకాశమున్నది. మా వంశమువారిలో నెవడైన పాపనాశినియగు విష్ణుకథను విన్నను చెప్పినను మాకు ఉత్తమగతులు కలుగవచ్చును.


తండ్రి పాపియైనను పుత్రుడుత్తముడు భక్తుడునైనచో వాని తండ్రియు తరించును. దయాధర్మవిహీనులగు పుత్రులెక్కువ మంది యున్న ప్రయోజనమేమి ? శ్రీహరిని అర్చింపని పుత్రులెంతమంది యున్ననేమి ? పుత్రహీనుడగువానికి ఉత్తమ గతులు కలుగవు. కావున సద్గుణశాలియగు పుత్రునిల పొందవలెను. మాయీ బాధను ఈ మాటలను వానికి వరముగ జెప్పుము. గృహస్థ జీవితము స్వీకరింపుమని చెప్పుము. మంచి సంతానమును పొందుమనుము అని వారు పలికిరి.


ధర్మవర్ణుడును పితృదేవతల మాటలను విని ఆశ్చర్యమును దుఃఖమును పొందిన వాడై ఇట్లు పలికెను. మీ వంశమున చెందిన ధర్మవర్ణుడను నేనే. వివాహము చేసి కొనరాదను పనికి మాలిన పట్టుదల కలిగి మిమ్మిట్లు బాధపడునట్లు చేసినవాడను నేనే. పూర్వము సత్రయాగము జరిగినప్పుడు నారదమహర్షి మానవులకు కలియుగమున గుహ్యావయవము , నాలుక అదుపులోనుండవు. విష్ణుభక్తీయుండదని చెప్పిన మాటలను బట్టి నేను గుహ్యావయవము అదుపులో నుండుటకై వివాహమును మానితిని. కలియుగమున పాపభూయిష్ఠులగు జనుల సాంగత్యము ఇష్టము లేక ద్వీపాంతరమున వసించుచుంటిని. ఇప్పటికి కలియుగము మూడు పాదములు గడచినవి. నాలుగవ పాదమున గూడ చాల వరకు గడచినది. నేను మీ బాధనెరుగను. మిమ్మిట్లు బాధలకు గురిచేసిన నా జన్మ వ్యర్థము. మీ కులమున పుట్టి మీకు తీర్చవలసిన ఋణమును తీర్చలేకపోతిని. విష్ణువును , పితృదేవతలను , ఋషులను పూజింపనివాని జన్మ వ్యర్థము. వానియునికి భూమికే భారము. నేను మీ యాజ్ఞను పాటించి వివాహమాడుదును. కలిబాధకలుగకుండ సంసారబాధలు లేకుండ మీ పుత్రుడనై నేను మీకు చేయవలసిన కార్యముల నాజ్ఞాపింపుడని ప్రార్థించెను.


ధర్మవర్ణుని పితృదేవతలు వాని మాటలను విని కొంత యూరటను పొంది నాయనా ! నీ పితృదేవతల పరిస్థితిని జూచితివి కదా ! సంతానము లేకపోవుటచే గడ్డిపరకను పట్టుకొని ఎట్లు వ్రేలాడుచున్నామో చూచితివి కదా ! విష్ణుకథలయందనురక్తి , స్మరణము , సదాచారసంపన్నత కలవారిని కలిపీడింపడు. శ్రీహరి స్వరూపమగు సాలగ్రామశిలగాని , భారతము గాని ఇంటియందున్నచో కలి వారిని బాధింపడు. వైశాఖవ్రతము, మాఘస్నాన వ్రతము , కార్తీకదీపదానము పాటించువారిని కలి విడుచును. ప్రతి దినము పాపహరము ముక్తిప్రదమునగు శ్రీహరి కథను విన్నచో కలివారిని పీడింపడు. వైశ్వదేవము , తులసి , గోవు ఉన్నఇంటిని కలి బాధింపడు. ఇట్టివి లేనిచోట నుండకుము. నాయనా త్వరగా భూలోకమునకు పొమ్ము. ప్రస్తుతము వైశాఖమాసము గడచుచున్నది. సూర్యుడు అందరికిని ఉపకారము చేయవలెనని మేషరాశి యందున్నాడు. ఈ నెలలోని ముప్పది తిధులును పుణ్యప్రదములే. ప్రతి తిధియందు చేసిన పుణ్యము అత్యధిక ఫలము నిచ్చును. చైత్ర బహుళ అమావాస్య మానవులకు ముక్తి నిచ్చునది. పితృదేవతలకు ప్రియమైనది. విముక్తిని ఇచ్చునది. ఆనాడు పితృదేవతలకు శ్రాద్దము చేయవలయును. జలపూర్ణమగు కలశము నిచ్చి పిండప్రదానము చేసినచో గయాక్షేత్రమున చేసిన దానికి కోటిరెట్లు ఫలితము నిచ్చును. చైత్ర అమావాస్యనాడు శక్తిలేనిచో కూరతోనైన శ్రాద్దము చేయవచ్చును. ఆనాడు సుగంధ పానకము గల కలశమును దానమీయనివాడు పితృహత్య చేసినవాడు. ఆనాడు చల్లని పానీయము నిచ్చి శ్రాద్దము చేసినచో పితృదేవతలపై అమృతవర్షము కురియును. ఆనాడు కలశదానము అన్నాదులతో శ్రాద్దము ప్రశస్తము. కావున నీవు త్వరగ వెళ్లి ఉదకుంభదానమును , శ్రాద్దమును పిండ ప్రదానము చేయుము. వివాహమాడి యుత్తమ సంతానమునంది పురుషార్థములనంది అందరును సంతోషపెట్టి మునివై నీవు కోరినట్లు ద్వీప సంచారము చేయుము, అని వారు చెప్పిరి.


ధర్మవర్ణుడును త్వరగా భూలోకమును చేరెను. చైత్ర బహుళ అమావాస్యనాడు ప్రాతః కాలస్నానము పితృదేవతలు చెప్పినట్లు జలకలశదానము శ్రాద్దము మున్నగు వానిని చేసెను. వివాహము చేసికొని యుత్తమ సంతానమునందెను. చైత్ర బహుళ అమావాస్య ప్రశస్తిని వ్యాపింపజేసెను. తుదకు తపమాచరించుటకై గంధమాదన పర్వతమునకు పోయెను. అని శ్రుతదేవుడు శ్రుతకీర్తికి వివరించెను. ఈ విషయమును నారదుడు అంబరీషునకు చెప్పెను.


_*వైశాఖ పురాణం ఇరవై ఏడవ అధ్యాయం సంపూర్ణం*_ 


         🌷 *సేకరణ*🌷

      🌹🌷🪷🪷🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

🙏🪷🌷🪷🌷🪷🌷🪷🙏

కుటుంబంలో ఇచ్చి

 శ్లోకం:☝️

 *సుకులే యోజనేత్కన్యాం*

*పుత్రం విద్యాసు యోజనేత్ l*

 *వ్యసనే యోజనేచ్ఛత్రుం*

*మిత్రం ధర్మే నియోజయేత్॥*

 - చాణక్యనీతిః । 3.3॥


భావం: కూతురిని మంచి కుటుంబంలో ఇచ్చి పెళ్లి చేయాలి. కొడుకును బాగా చదివించాలి. శత్రువు ఎప్పుడూ ఇబ్బందులలో ఉండేలా చేయాలి - వాడు ఖాళీగా ఉంటే మనల్ని ఇబ్బందుల పాలు చేస్తాడు కాబట్టి.  స్నేహితుడిని ధర్మకార్యాలలో నియోగించాలి.

నిర్వాణ షడ్కమ్*

 *


*నిర్వాణ షడ్కమ్*


_శివోహమ్ శివోహమ్ శివోహమ్....._


జగద్గురువు ఆది శంకరాచార్యుల వారు ఒకసారి హిమాలయ ప్రాంతంలో సరియైన గురువు కోసం అన్వేషిస్తుండగా ఒక సన్యాసి ఎదురొచ్చి, "నువ్వు ఎవరివి..?" అని ప్రశ్నించారు. దానికి సమాధానంగా శ్రీ ఆది శంకరులవారు మొత్తం అద్వైత వేదాంతాన్ని ఆరు శ్లోకాల రూపంలో "నిర్వాణ షట్కము" గా పలికారట.


ఇది తను (అహం) అనుకునే ఆత్మ వివరణ కనుక దీనినే "ఆత్మ షట్కము" అని కూడా అంటారు. నిర్వాణం అంటే సంపూర్ణ సమదృష్టి, ప్రశాంతత, స్వేచ్చ, ఆనందము (సత్+చిత్+ఆనందం = సచ్చిదానందం) మిళితమైన ఒక అచేతన స్థితి. అదే సచ్చిదానందం.


శివోహమ్ శివోహమ్ శివోహమ్...


మనో బుద్ధ్యహంకార చిత్తాని నాహమ్

న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణ నేత్రే

న చ వ్యోమ భూమిర్ న తేజో న వాయుః

చిదానంద రూపః శివోహమ్ శివోహమ్ 

శివోహమ్ శివోహమ్ శివోహమ్


న చ ప్రాణ సంజ్ఞో న వై పంచ వాయుః

న వా సప్త ధాతుర్ న వా పంచ కోశః

న వాక్ పాణి పాదం న చోపస్థ పాయు

చిదానంద రూపః శివోహమ్ శివోహమ్ 

శివోహమ్ శివోహమ్ శివోహమ్


న మే ద్వేష రాగౌ న మే లోభ మోహౌ

మదో నైవ మే నైవ మాత్సర్య భావః

న ధర్మో న చార్థో న కామో న మోక్షః

చిదానంద రూపః శివోహమ్ శివోహమ్ 

శివోహమ్ శివోహమ్ శివోహమ్


న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఖఃమ్ 

న మంత్రో న తీర్థ న వేదా న యజ్ఞః 

అహమ్ భోజనమ్ నైవ భొజ్యమ్ న భోక్త

చిదానంద రూపః శివోహమ్ శివోహమ్ 

శివోహమ్ శివోహమ్ శివోహమ్


న మే మృత్యు శంకా న మే జాతి భేదః

పితా నైవ మే నైవ మాతా న జన్మః

న బంధుర్ న మిత్రం గురుర్ నైవ శిష్యః

చిదానంద రూపః శివోహమ్ శివోహమ్ 

శివోహమ్ శివోహమ్ శివోహమ్


అహం నిర్వికల్పో నిరాకార రూపో

విభుత్వాచ సర్వత్ర సర్వేంద్రియాణాం

న చాసంగత నైవ ముక్తిర్ న మేయః

చిదానంద రూపః శివోహమ్ శివోహమ్ 

శివోహమ్ శివోహమ్ శివోహమ్...


|| ఓం నమః శివాయ ||


ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు శ్రీ చొప్పకట్ల సత్యనారాయణ గారి సౌజన్యముతో....  వారి ముఖపుస్తకమునుండి...* 👇


శ్రీమన్నారాయణ మూర్తి

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


శ్లో𝕝𝕝   *దద్యా ద్దయానుపవనో ద్రవిణాంబుధారాం*

        *అస్మిన్న కించన విహంగశిశౌ విషణ్ణే*

        *దుష్కర్మ ఘర్మ మపనీయ చిరాయ దూరం*

        *నారాయణ ప్రణయినీ సయనాంబువాహః* (08)


               { _/  *కనకధారా స్తవం* _/ } 


తాత్పర్యం: చాతకపక్షిపిల్ల ఎండవేడిమికి తాళలేక తల్లడిల్లగా వాయుప్రేరితమై మేఘం వర్షించి ఆ పక్షికూన తాపంబాపి, వాన చినుకులచే దప్పికదీర్చి, తృప్తి కల్గించిన విధంగా, శ్రీమన్నారాయణ మూర్తి ప్రియురాలైన ఇందిరాదేవి యొక్క కటాక్షమనే కారుమబ్బు కారుణ్యమనే గాలిచే ప్రేరితమై బహుకాలార్జితమైన *దుష్కర్మ అనే తాపాన్ని దవ్వులకు తరిమి, ధనమనే వానగురిసి నేను అనే చాతక శిశువుకు సంతృప్తి కల్గించుగాక*!