4, మార్చి 2022, శుక్రవారం

ప్రశ్న పత్రం సంఖ్య: 42

 ప్రశ్న పత్రం సంఖ్య: 42 

కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

క్రింద ఇచ్చిన ప్రశ్నలకు 4 జవాబులు వున్నాయి ఒక జవాబు మాత్రం ఎంచుకోండి.

1) కార్బురేటర్ అన్నది  ఇందులో ఉంటుంది

i ) రైలు ఇంజనులో

 ii ) మోటారుసైకిలు లో   

iii ) సైకిలుతో 

 iv ) రేడియోలో 

2) పిడుగు అనునది ఒక

i ) విదుత్ఘాతం 

ii ) అధిక వాయు పీడనం

 iii ) అధిక వర్షకారణం

 iv ) భూమినుంచి ఉద్భవించేది 

3) భగవత్గీతలో మొదటి శ్లోకం ఎవరు చెప్పారు

i ) శ్రీ కృష్ణుడు 

ii ) అర్జనుడు 

iii ) దృతరాష్ట్రుడు

 iv ) సంజయుడు

4) రామాయణంలో రాయబారిగా ఈయనవున్నాడు 

i ) సుగ్రీవుడు

 ii ) అంగదుడు 

iii ) హనుమంతుడు 

iv ) లక్ష్మణుడు 

5) సంస్కృత భాషలో తెలుగు భాషలో లేని ఇది వున్నది

i ) ఏకవచనం 

ii ) ద్వివచనం  

iii ) బహువచనం

 iv )అన్య వచనం 

 6) ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి ____

i ) నదీం

 ii ) ఘటం

 iii ) సాగరం

 |iv ) జల మార్గ . 

7) మనదేశంలో కారు నడిపే వారు అమెరికాలో

i)అదేవిధంగా నడపగలరు 

 ii ) అక్కడి ట్రాఫిక్ సిస్టం వేరు కాబట్టి తెలుకుకొని నడపాలి 

 iii ) ప్రపంచం మొత్తంలో ట్రాఫిక్ పద్దతి ఒకే విధంగా ఉంటుంది

 iv ) అక్కడి కార్లకు స్టీరింగ్ కుడివైపు ఉంటుంది.

8) మొట్టమొదటి సంస్కృత కవి ఎవరు .

i ) కాళిదాసు

 ii ) పోతన 

iii ) వాల్మీకి

 iv ) వ్యాసుడు

9)గాలిపటం(Kite) పైకి ఎగరటానికి కారణం 

i ) గాలి పటం ఫై భాగం మీద గాలి పీడనం కన్నా క్రింది భాగం మీద పీడనం ఎక్కువగా ఉండేటట్లు దారాన్ని కడతారు కాబట్టి. ,  

 ii ) గాలి పటం క్రింది భాగం మీద గాలి పీడనం కన్నా ఫై భాగం మీద పీడనం ఎక్కువగా ఉండేటట్లు దారాన్ని కడతారు కాబట్టి.

.iii ) గాలి పటం ఫై భాగం మీద గాలి పీడనం క్రింది భాగం మీద పీడనం సమానంగా ఉండేటట్లు దారాన్ని కడతారు కాబట్టి. ,

iv ) గాలిపీడనంకు  గాలిపటానికి సంబంధం లేదు కాబట్టి 

10) ఆంధ్రప్రేదేశ్ లో సాగర తీరంలో వున్నపట్టణం

i ) విజయవాడ 

 ii ) బందర్  

iii ) గుంటూరు 

 iv ) అమరావతి 

11)ఇది ఒక ఉత్తర  భారతదేశక్షేత్రం

i ) తిరుమల

 ii ) సింహాచలం

 iii ) కాశి

 iv ) కన్యాకుమారి

 12) ప్రపంచంలో అతిపెద్ద పర్వతం ఏది

i ) తిరుమ పర్వతం

 ii ) పడమటి కనుమలు

 iii ) కనుమలు   

iv )ఎవరెస్టు

13) ఈ వివాహం ఇప్పుడు అమలులో లేదు  

i ) రిజిస్టరు వివాహం ii ) ప్రేమ వివాహం iii )రాక్షస వివాహం iv ) బ్రహ్మ వివాహం  

14) క్రింద వున్న లోకాలలో ఈ లోకం లేదు  

i ) అతలం 

 ii ) సులత   

 iii ) తలాతల  

iv ) తపోలోకం 

15) అష్టైశ్వర్యాలలో ఇది వున్నది

i ) గరిమ  

ii ) గృహము 

 iii ) తాంబూలము 

iv ) సంతానము

16) యత్ర నార్యస్తు పూజ్యంతె  

i ) రమంతె తత్ర మనుష్య

ii ) రమంతె తత్ర దేవతాః    

 iii ) రమంతె యత్ర దేవతాః 

iv )రమంతె తత్ర దానవ 

17) భగవత్గీత కన్నా ముందు ఈ గీత వుంది 

i ) అష్టావక్ర గీత

ii ) రాఘవ గీత  

 iii ) విశ్వామిత్ర గీత 

iv ) ఏ గీత లేదు 

18) కృష్ణ పక్షంలో మరియు శుక్ల  పక్షంలో చంద్రుకు ఈ తిధినాడు ఒకే పరిమాణంలో ఉంటాడు

i ) నవమి 

ii ) సప్తమి

iii ) ఏకాదశి 

 iv ) తదియ 

19) పిండి కొద్దీ

i ) దోశ 

 ii ) రొట్టె 

 iii ) గారే 

iv )   పూరి 

20)  సుమతి శతకము వ్రాసిన కవి ఎవరు

i ) వేమన 

ii ) శ్రీనాధుడు 

iii ) బద్దెన 

iv ) పెద్దన

శ్రీశనగన నరసింహస్వామి గారు

 భీమవరం

------------

శ్రీశనగన నరసింహస్వామి గారు

----------- ----------------------------

చైత్రవంద్యాదికృతుల నీక్ష్మాతలాన

సత్కవిగ,లయోలనుకళాశాలవెలుగు

శనగనస్వామివర్యులజనియు విద్య

సాగె భీమవరంబున మ్రోగెజగతి.


భువనవిజయాదులన్ పాత్రపోషణమును

సాహితీసౌరభమున ప్రజానురక్తి

బలు సమస్యాదినిర్వహణలనుపెంచి

పత్రికల, నృసింహస్వామి,వంద్యులయిరి.


రాయప్రోలు సీతారామశర్మ ,భీమవరం.

చల్లనినీళ్ళును

తెప్పోత్సవము (వ్యాకరణవిరోధమై,మాప్రాంత జన వ్యవహారంలోఉన్న పదం)

--------------------  ------------------------

చల్లనినీళ్ళును సౌఖ్యపు గాలులు

      లాహిరి లాహిరి లాలసనిడ ,

మంచిసుగంధపు మల్లెలమాలలు

      మారుని సేవల మనసునిడ,

తాపముపెంచెడు దీపపు కోటులు

      విడివడిమసలని ప్రేమమునిడ ,

పారవశ్యముగొల్పుబాణసంచాకాల్పు

      సోత్సహచైతన్య శోభలనిడ,


పార్వతీ పరమేశ్వరుల్ పర్వమమర

తెప్పలను నుత్సవంబుగ తిరుగబూన

త్రిదినముమహోత్సవమ్మది త్రిదివమట్లు

జరిగె శివరాత్రి మూన్నాళ్ళుశివముగాగ.


రాయప్రోలు సీతారామశర్మ ,భీమవరం .

స్ఫూర్తిగా విరాజిల్లే

 సకల జీవుల నిత్య సత్య చైతన్య స్ఫూర్తిగా విరాజిల్లే ప్రకృతి మహోన్నతం ! ప్రాతఃకాల కుక్కుట నాద స్వరంలో చరాచర జీవజగతికి సన్మత్రీ మేల్కొల్పు ! సువిశాల విశ్వ నిత్య జీవన గమనంలో నిరంతర తోడ్పాటు ! చక్కని రమణీయ, కమనీయ ఆలంబనతో తరతరాల సుహృద్భావ దృక్పథ దార్శనికత ! విశ్వ మానవాళికి మనోంతరంగ పరిశుద్ధికై అనునిత్యం, ప్రకృతి చేసెడి హెచ్చరిక వర్ణనాతీతం ! విశ్వ జగతి సుసంక్షేమమే మహత్తర ఆలంబనగా మున్ముందుకు సాగే సమైక్య దృక్పథ నేపథ్యం ! చక్కని జీవకారుణ్య ప్రేరణాత్మక భావుకత ఉట్టిపడే చరాచర జీవజగతికి సమున్నత వేదిక ! ప్రకృతి పరిరక్షణకై విశ్వ మానవాళి నిత్య నడవడికలో సుహృద్భావ జీవన దివ్య పథ నిర్దేశన స్ఫూర్తి ! పరిసరాల పరిశుభ్రతే అత్యంత ప్రధానాంశంగా, యావత్ విశ్వ సువికాస సంక్షేమ జీవన గమన చైతన్య దార్శనికత !                    ✍️గుళ్లపల్లి ఆంజనేయులు

విషయం యొక్క తీవ్రత

 నిదానంగా చదివి, విషయం యొక్క తీవ్రతను అర్థం చేసుకోండి. 


  ఒక "ముస్లిం" వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగం నుండి పదవీ విరమణ చేసి, అతని మరణానంతరం షరియా ప్రకారం 4 మంది భార్యలను కలిగి ఉంటే, అతనికి పెన్షన్ ఎలా మంజూరు చేయబడుతుంది? ఈ నిబంధనను ఏ ప్రభుత్వం అమలులోకి తెచ్చింది?

  సమాధానం: -

  నామినేషన్లు ఎవరికి ఎంత శాతం అనే అంశాలను పరిశీలిస్తారు. నమోదు కాకపోతే, నలుగురిలో 25% పంపిణీ చేయబడుతుంది.

  భార్యలలో ఒకరు చనిపోతే, మిగిలిన ముగ్గురు 33.33% చెల్లించాలి.

  రెండవ భార్య చనిపోతే, మిగిలిన ఇద్దరికి 50%.

  మూడవ భార్య చనిపోతే, రెండో భార్య 100% పెన్షన్ పొందుతుంది.

  ఇప్పుడు దీనిని మొదటి భార్యకు వయస్సు 60 సంవత్సరాలు, రెండవ ఆమె కు 50 సంవత్సరాలు, మూడవ ఆమెకు 40 సంవత్సరాలు మరియు నాల్గవ ఆమెకు 30క సంవత్సరాలు వయస్సు అయితే వీరికి 70 వ సంవత్సర వయస్సు వరకు పెన్షన్ ఇచ్చే సంవత్సరాలుగా భావించండి - అప్పుడు 

  10 + 20 + 30 + 40 = 100 సంవత్సరాలు. అంటే ముస్లిం పురుషుడు ప్రభుత్వం నుండి 100 సంవత్సరాల వరకు పెన్షన్ పొందుతాడు, ఇతర మతానికి చెందిన భార్యకు(ఒకే భార్య ఉంటుంది కాబట్టి) గరిష్టంగా 10 లేదా 20 సంవత్సరాలు మాత్రమే!!

అంటే పదవీ విరమణకు ముందు జీవితాంతం ఉచిత పింఛను పొందేందుకు నాల్గవ భార్య ముస్లిం పెద్దలను పెళ్లాడుతోంది.

  ఇప్పుడు ముస్లిం లు షరియత్‌ను అడ్డం పెట్టుకుని  55 ఏళ్ల తర్వాత ఎంత మంది ముస్లింలు పెళ్లి చేసుకున్నారనేది సర్వే చేయాల్సిన అవసరం ఉందా? లేదా ? 

  ఈ శాతం ఎక్కువైతే ముస్లిం మహిళలకు ప్రభుత్వ ఖజానా నుండి డబ్బు సమకూర్చడం పెద్ద విషయం కాదా?

మనకు "కామన్ సివిల్ కోడ్" ఎందుకు ఉండకూడదు? హిందువులు ఏం అన్యాయం చేశారు ?

                    ----------

జీవితంలో



        జీవితంలో ఎప్పుడూ అనుకోని *సమస్యలే* ఎదురవుతూ ఉంటాయి వాటిని ఎలా *ఎదుర్కోవాలో* తెలుసుకోవడమే *జీవితం* దీనిలో *గెలువడాలు ఓడిపోవడాలు* ఉండవు *పాఠాలు* అనుభవాలు మాత్రమే ఉంటాయి , మనం *అవసరం* లేని వారి గురించి ఆలోచించి *ప్రయోజనం* లేదు వాళ్ళు *బంధువులైనా* సరే మన *విలువ* తెలియని వాళ్ళతో ఏం *మాట్లాడినా* వాళ్ళకు ఏం చేసినా మన *విలువ* తెలియదు .


        ముఖం పై *చేదుగా* మాట్లాడే వారు ఎప్పుడు *మోసం* చేయరు భయపడవలసింది *తియ్యగా* మాట్లాడే వారితోనే *మనసులౌ అసూయ* పెంచుకుంటారు *సమయం* వచ్చినప్పుడు మారిపోతారు *అద్దం* బలహీన మైనదే కానీ *నిజాన్ని* చూపడంలో ఎప్పుడూ *భయపడదు* విజయానికి కొన్ని సార్లు *శక్తి* కావాలి మరికొన్ని సార్లు *యుక్తి* ఉండాలి ఇంకొన్ని సార్లు *రెండు* వాడాలి *కానీ* చాలా సార్లు ఈ రెండిటికీ *అదృష్టం* తోడు కావాలి .


     జీవితంలో ఎదురు *దెబ్బలు* తగలడం మంచిదేనేమో *కాలికి* దెబ్బ తగిలితే *వెళ్లేదారిలో* ఎలా *నడవాలో* తెలుస్తుంది అదే *మనసుకు* తగలితే ఎటువంటి వారితో *ఎలా* ఉండాలో నేర్పిస్తుంది . జీవితంలో *డబ్బు* ఉంటేనే *బంధువులు ప్రేమ నమ్మకం* వస్తాయి డబ్బు లేకుంటే మన *సొంత* వారు కూడా *పరాయి* వారు అవుతారు *డబ్బుంటేనే* పరాయి వారు కూడా మన వారు అవుతారు *ఇది పచ్చి నిజం !*. 

        

       *మీ ... ప్రొద్దుటూరి. రవిందర్*

దేవుడి ప్రణాళిక

 Excellent msg I received in this year.

Must read 


దేవుడు 

v's

వీధులు ఊడ్చేవాడు

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$


  వీధులు ఊడ్చేవాడికి పని చేసి చేసి విసుగొచ్చింది.  

దేవుడితో మొరపెట్టుకున్నాడు.

 "రోజూ హాయిగా పూజలందుకుంటూ ఉంటావు.

 నా బతుకు చూడు. 

ఎంత కష్టమో.

 ఒక్క రోజు... ఒక్కటంటే ఒక్క రోజు నా పనిని నువ్వు చెయ్యి. నీ పనిని నేను చేస్తా," 

అని సవాలు విసిరాడు. 

 దేవుడు వినీ వినీ సరేనన్నాడు.  

"అయితే ఒక్క షరతు. నువ్వు ఎవరేమన్నా నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించకూడదు. 

నోరు మెదపకూడదు."

 అన్నాడు దేవుడు. 

"సరే" అన్నాడు మనోడు. 

 తెల్లారికి మనోడు దేవుడి స్థానంలో కూర్చున్నాడు. 

 కాసేపటికి ఓ ధనిక భక్తుడు వచ్చాడు. 

"దేవా ... నా కొత్త బిజినెస్ మొదలుపెడుతున్నాను. ఇబ్బడి ముబ్బడిగా లాభాల వర్షం కురిపించు" 

అంటూ ముందుకు వంగి దణ్ణం పెట్టాడు. 

ముందు జేబులోని పర్సు కింద పడిపోయింది. 

అతను చూడకుండా వెళ్లిపోయాడు. 

 మనోడు "ఒరేయ్... పర్సు వదిలేశావు చూసుకోరా..." అందామనుకున్నాడు.

 కానీ దేవుడు చెప్పింది గుర్తుకు తెచ్చుకుని మౌనంగా ఉండిపోయాడు.

 ఇంకాస్సేపటికి ఓ పేదవాడు వచ్చాడు.

 "దేవా... నా దగ్గర ఒక్క రూపాయి మాత్రమే ఉంది. అదినీకు సమర్పించుకుంటున్నాను. దయచూడు తండ్రీ" 

అంటూ మోకరిల్లాడు.

 కళ్లు తెరిచేసరికి డబ్బులతో నిండిన పర్సు కనిపించింది.

 "ఇలా దయ చూపించావా తండ్రీ" 

అని ఆ పర్సును తీసుకుని వెళ్లిపోయాడు.  

"ఒరేయ్ దొంగా.... " 

అని అరుద్దామనుకున్నాడు మనోడు. 

కానీ దేవుడు చెప్పింది గుర్తుకొచ్చి ఎలాగోలా తమాయించుకున్నాడు. 

ఆ తరువాత ఒక నావికుడు వచ్చాడు. 

 "దేవా రేపు సముద్ర ప్రయాణం ఉంది. నన్ను చల్లగా కాపాడు స్వామీ" 

అన్నాడు.  

అంతలోనే ధనిక భక్తుడు పోలీసులతో వచ్చాడు. 

"నా తరువాత వచ్చింది ఇతడే. కాబట్టి ఇతడే నా పర్సును దొంగిలించి ఉంటాడు. పట్టుకొండి" అన్నాడు.

 పోలీసులు అతడిని అరెస్టు చేశారు.

 ఈ అన్యాయాన్ని చూసి మనోడు ఉండబట్టలేకపోయాడు.

 "ఆగండ్రా... ఇతను నిర్దోషి. అసలు దొంగ ఇంకొకడు. వాడు పర్సును తీసుకెళ్లాడు." 

అని అరిచేశాడు. 

దేవుడే చెబుతుంటే ఇంకా సాక్ష్యాలెందుకని నావికుడిని వదిలేసి, పేదోడిని పట్టుకుని వెళ్లిపోయారు పోలీసులు.

 సాయంత్రానికి వీధులు ఉడ్చేవాడు దేవుడి డ్యూటీ నుంచి దిగేశాడు. 

దేవుడు వీధులు ఉడ్చే డ్యూటీ నుంచి తన అసలు డ్యూటీకి వచ్చేశాడు.  

"దేవా... ఇవాళ్ల ఎంత మంచి పని చేశానో తెలుసా... 

నేను ఒక నిర్దోషిని అరెస్టు కాకుండా కాపాడాను.

 ఒక దోషిని అరెస్టు చేయించాను." 

అన్నాడు మనోడు. 

దేవుడు "ఎంతపని చేశావోయ్. నిన్ను అసలు స్పందించొద్దన్నానా... ఎందుకలా చేశావు." 

అన్నాడు నిష్ఠూరంగా.

 "అదేమిటి? నువ్వు నన్ను మెచ్చుకుంటావనుకున్నాను."

 అన్నాడు వీధులు ఊడ్చేవాడు బాధగా....

 "ధనవంతుడు మహాపాపాత్ముడు. 

వాడు అందరినీ దోచుకుంటాడు. 

వాడి డబ్బు కొంత పేదోడికి అందితే వాడికి కొంచమైనా పుణ్యం వస్తుందని నేనే ఇదంతా చేయించాను. 

పేదోడికి కష్టాలు తీరేవి. 

వాడు కొన్నాళ్లైనా ఆకలి దప్పులు లేకుండా ఉండేవారు. ఇక నావికుడు తెల్లారితే సముద్రయానం చేయబోతున్నాడు. 

దారిలో పెను తుఫాను వచ్చి వాడి పడవ మునిగి అందరూ చనిపోతారు. 

వీడు అరెస్టై జైల్లో ఉంటే బతికిపోయేవాడు.

 ఇప్పుడు చూడు... పేదోడు జైల్లో ఉన్నాడు. ధనికుడు పాపాలు చేస్తూనే ఉన్నాడు. నావికుడు చావబోతున్నాడు. ఎంత పని చేశావు నువ్వు...

 అన్నాడు దేవుడు. 


 దేవుడి ప్రణాళిక ఏమిటో ఎవరికీ తెలియదు. 

కష్టంలా కనిపించేది వాస్తవానికి మేలు చేయొచ్చు. 

తప్పులా కనిపించేంది నిజానికి ఒప్పై ఉండచ్చు. 

ఆయన ఆలోచనల లోతు, అవగాహన ఎత్తు అందుకోవడం ఎవరికీ సాధ్యం కాదు.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

యోగి కళ్ళలో నీళ్ళు

 నిన్న ఇండియా టీవీ ప్రోగ్రామ్ లో యోగి కళ్ళలో నీళ్ళు రావడమే కాదు చెల్లి పేదరికం చూసి ఒళ్ళు మరచి ఏడ్చాయి . అధికారంలో ఉన్న మిగిలిన నాయకులు తమ కుటుంబాలను కోట్లకు అధిపతులుగా చేసినప్పుడు మీ సోదరి ఇంకా ఎందుకు పేదరిక జీవితం గడుపుతోంది అని రజత్ శర్మ యోగిజీని అడిగినప్పుడు . యోగి సోదరి పని చేస్తున్న పోటో చూపించారు . స్టేజి మీద అక్క పేదరికం ఫోటో చూసి అయిన యోగి . కొన్ని క్షణాలు యోగి ఏడుస్తునే వున్నాడు . కానీ తనను తాను హ్యాండిల్ చేసుకుంటూ నేను యోగిని 25 కోట్ల మంది ఉత్తర ప్రదేశ్ ప్రజల తరుపున ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసానని... తన కుటుంబం గురించి ప్రమాణం చేయలేదు . ఇలా అంటుంటే యోగికి తన చెల్లి అంటే తనకు ప్రాణం , కానీ కుటుంబ పేదరికం చూసి ఏడ్చిన యోగి , ప్రభుత్వ ఖజానా నుండి ఒక్క రూపాయి ఇవ్వలేదు ఎందుకంటే యోగి చేసిన ప్రమాణస్వీకారం , నిస్వార్థ కార్య యోగం . ఒక పక్క అఖిలేష్ కుటుంబవాది మరో పక్క యోగి లాంటి నిస్వార్థ కార్మికుడు ఇద్దరిని ఎలా పోల్చగలం . UP కి నిస్వార్థ , కరుడుగట్టిన ధర్మవీరుడు యోగి లాంటి ముఖ్యమంత్రి దొరకడం నిజంగా అదృష్టం 🙏🙏

మహా అవతార్ బాబాజి

 మహా అవతార్ బాబాజి


అది 30 నవంబరు 203.వ సంవత్సరం, రోహిణి నక్షత్రం - ఫరంగిపేట గ్రామంలో ఒక నంబూద్రి బ్రాహ్మణుడైన అర్చకునికి మగ శిశువు జన్మించి నాడు. తల్లిదండ్రులు ఇతనికి నాగరాజు అని పేరు పెట్టినారు. ఇతనికి ఒక చెల్లెలుకుడా జన్మించినది ఆమెకు నాగలక్ష్మి అని పేరు పెట్టారు. 


నాగరాజునకు ఐదు సంవత్సరాల వయసులో ఆ దేవాలయంలో పెద్ద ఉత్సవం జరిగి ఆ ఉత్సవంలో ఒక వ్యక్తి నాగరాజును అపహరించి తీసుకువెళ్లి కలకత్తాలో ఒక ధనవంతుల ఇంట్లో బానిసగా అమ్మేసాడు. ఆ ఇంటి యజమానికి చాలా దైవభక్తి ఎప్పుడూ ఇంట్లో పూజలు జరుగుతూ ఉండేవి. ఇవన్నీ చూసిన నాగరాజునకు విచారణ, దైవభక్తి బాగా అలవడ్డవి.కొన్నాళ్ళకు బానిసతనం నుండి ఆ పిల్లవాడిని యజమాని విడిచిపెట్టినాడు. బయటి ప్రపంచానికి వెళ్ళిన నాగరాజుకు ఒక సాధువుల బృందం ఎదురుపడింది, వారితో నాగరాజు వెళ్ళి బ్రతుకుతూ వారికి సేవ చెయ్యడం ప్రారంభం చేసాడు.


వారు ఆ బాలుని సేవకి మెచ్చి సకల పురాణములను ఇతిహాసములను వివరించి గొప్ప పండితుణ్ణి చేసినారు. విద్యాగోష్టిలల్లో ఆరితేరినా ఆధ్యాత్మికా తృష్ణ తీరలేదు ..కేవలం పాండిత్యంతో భగవానుడు ప్రత్యక్షం కాడు, దివ్యజ్ఞానం మరియు సిద్ధి కలుగదు కదా అని విచారిస్తూ ఉన్నాడు.ఒకసారి సాధువులతో కాశి వెళ్ళాడు ...అక్కడి నుండి శ్రీలంక చేరుకున్నాడు. 


అక్కడ సుబ్రమణ్యస్వామి దేవాలయంలో 

స్వామివారు సుబ్రమణ్య యంత్రముగ పూజలు అందుకోవడం చూసాడు , ఈ క్షేత్రం 'కతిర్గామ'. ఇక్కడే సుబ్రమన్యుడు వల్లీదేవిని వివాహం చేసుకున్నాడు.ఈ దేవాలయం లో వటవృక్షం క్రింద భోగానాధుడు అనే సిద్ధపురుషుడు నాగరాజుకు సాక్షాత్కరించాడు.అక్కడే ఉండి నాగరాజు ఆరు నెలలు కదలకుండా ధ్యానం చేసాడు. దీర్ఘకాలం సమాధి స్థితిలో ఉండగా సుబ్రమణ్యస్వామి సాక్షాత్కారం జరిగింది. ఆయన తేజస్సు తనలోకి ప్రవేశించడం గమనించాడు నాగరాజు. ఆ పై మరల భోగనాధుడు ఇలా ఆదేశించాడు.


సాధన పరిపూర్ణము కావాలంటే ద్రవిడ దేశంలో కుర్తాలంలో అగస్త్యుడు ఉన్నాడు అతని అనుగ్రహం పొందాలి అప్పుడు సిద్ధి పొందగలవు అని ఆదేశించాడు. నాగరాజు బయలుదేరి కుర్తాలం వచ్చి, అగస్తుని గూర్చి తీవ్ర తపస్సు చేసాడు అన్నపానాలు మాని 47 రోజులు జపము ,ధ్యానము చెయ్యగా అగస్త్యుడు ప్రత్యక్షమై దివ్య ప్రసాదమును తన చేతులమీదుగా తినిపించి, యోగ రహస్యాలు తెలిపి సిద్ధిని అనుగ్రహించాడు అగస్త్యుని దివ్యానుగ్రహంతో నాగరాజు 'మహా అవతార్ బాబా' గా పరిణామం చెందాడు.


గమనించవలసిన సత్యం ఏమిటంటే ఇక్కడి నుండి బయలుదేరి బదిరికశ్రమం లో గురువులు ఉపదేశం మేరకు సాధనలు చేసి నిత్య యవ్వనునిగా, అమరునిగా మారినాడు మహా అవతార్ బాబాజి క్రీస్తు శకం 788 - 820 మధ్య జీవించిన ఆదిశంకరాచార్యకు సన్యాస దీక్ష ఇచ్చినవారు గోవింద భగవత్పాదులు కాగా యోగ దీక్ష ఇచ్చినది మహా అవతార్ బాబాజి. కేదార్నాథ్ పర్వత శిఖర ప్రాంతంలో ఉన్న సిద్దాశ్రమానికి శంకరులు వెళ్లాలని ప్రయత్నము చెయ్యగా వీలుకాకపోతే అప్పుడు మహావతార్ బాబా కొన్ని యోగ సాధనలు వారితో చేయించగా అప్పుడు శంకరులు వెళ్ళగలిగారు అని యోగులు, పెద్దలు చెప్తుంటారు. ఇట్లా సిద్ధాశ్రమ యోగులు కేదార్ ప్రాంతంలో అతి రహస్యంగా ఉంటూ మానవ జాతికి అవసరమైన శుభాలు చేస్తూ ఉంటారు.ఉత్తమ సంస్కారం కలిగిన విశిష్ట వ్యక్తులల్లో ప్రవేశించి మానవాళికి మంచి చేస్తూ ఉంటారు. సిద్ధాశ్రమయోగులే రమణ మహర్షి, అరవింద యోగి, కావ్యకంట గణపతి ముని అని ధ్యాన యోగులు చెప్తున్నారు. 


అతనొక సాధారణ రైల్వే ఉద్యోగి. ట్రైనింగ్ లో ఉండగా తీరిక వేళల్లో సరదాగా ఒక కొండ ప్రాంతం చూడటానికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతనికి అకస్మాత్తుగా ఒక యోగి పుంగవుని రూపం దర్శనం జరిగింది. " నాతో రా " అని ఆదేశించాడు ఆ యోగి తీస్కుని వెళ్లి ఒకగుహ యొక్క మొదటి భాగంలో ఉన్న దర్భాసనం, జపమాల చూపి ..." ఇవ్వి నీవు పూర్వజన్మలో సాధన చేసిన ఆసనము మరియు జపమాల.." అని చూపాడు. హస్త మస్తిష్క స్పర్శతో పూర్వజన్మ మొత్తం ఆ ఉద్యోగికి జ్ఞప్తికి వచ్చింది.ఆ యోగి పూర్వజన్మలో తన సద్గురువుగా గుర్తించి పాదములపై బడి శరణు పొందాడు. గురువు గారి అనుగ్రహంతో క్రియయోగమును నేర్చుకుని సిద్ధ పురుషుడైనాడు. అతనే లాహిరిమహశయుడు.

ఆ సద్గురువే 'మహా అవతార్ బాబాజి ' లాహిరి మహాశయునికి ఎంతో మంది శిష్యులు ఉన్నారు. 


ఎంతోమందికి క్రియయోగమును ఆయన నేర్పారు.

క్రియయోగము తొలుత శ్రీ కృష్ణుడు అర్జునునికి నేర్పాడు, తర్వాతి కాలం లో 'మహా అవతార్ బాబాజి' మరియు లాహిరిమహశయులు బాగా ప్రాచుర్యంలోకి తెచ్చారు. లాహిరి శిష్యులల్లో అతిముఖ్యుడు "యుక్తేశ్వరగిరి మహారాజ్"ఈ 'యుక్తేశ్వర గిరి మహారాజ్ ' శిష్యులల్లో అతి ముఖ్యమైన ఒక శిష్యుణ్ణి పాశ్చాత్య దేశములల్లో క్రియయోగ ప్రచారానికి పంపారు అతనే 'పరమహంస యోగానంద', ఇతనే 'ఒక యోగి ఆత్మకధ ' అనే పుస్తకమును రచించారు. 


#YoguluAvadhutalu 

#యోగులుఅవధూతలు

3, మార్చి 2022, గురువారం

ప్రశ్న పత్రం సంఖ్య: 44 జవాబులు

 

 ప్రశ్న పత్రం సంఖ్య: 44 జవాబులు

కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

క్రింద ఇచ్చిన ప్రశ్నలకు 4 జవాబులు వున్నాయి ఒక జవాబు మాత్రం ఎంచుకోండి.

1) క్రిందిది పంచభూతాలలో లేదు

i ) నీరు 

ii ) గాలి 

iii ) పొగ 

v ) అగ్ని 

2) చందమామ రావే జాబిల్లి రావే వ్రాసింది

i ) దాశరధి రంగాచార్య

 ii ) త్యాగరాజు 

iii ) పెద్దన 

iv ) శ్రీ తాళ్ళపాక ఆన్నమాచార్య

3) భగవత్గీత వీటి సారం అంటారు 

i )పురాణాల 

 ii ) ఉపనిషతుల

 iii ) వేదాల   

iv ) సాంప్రదాయాల

4)  ఇంట గెలిచి ___ ;గెలవాలి అంటారు

i ) గచ్

ఛ ii ) ఊళ్ళో

 iii ) రచ్చ  

iv ) రచ్చబండ 

5) కావ్యేషు ---------  రమ్యం

i ) బూటకం 

ii ) ప్రబంధం  

iii )నవల  

iv ) నాటకం 

6)  180 డిగ్రీలు వున్నదానికే ________ అని పేరు

i ) లంబరేఖ 

ii ) సరళరేఖ 

iii ) ముళరేఖ 

|iv ) ఈ మూడు 

7) మనదేశంలో గృహావసరాలకు సరఫరా చేసె విద్యుత్

i )110V  ఉంటుంది 

ii ) 220V  ఉంటుంది 

 iii ) 250V  ఉంటుంది 

iv ) 300V  ఉంటుంది

8) ఇది పురాణం కాదు

i ) మార్కండేయ పురాణం 

ii ) అగ్నిపురాణం

 iii ) వరుణ పురాణం 

iv ) వాయు పురాణం 

9) అన్నదమ్ముల ఆస్తి పంపకాల వివాదాలను ఈ కోర్టు పరిష్కరిస్తుంది 

i ) సివిల్ కోర్టు ,  

 ii ) క్రిమినల్ కోర్టు 

.iii ) కన్స్యూమర్ కోర్ట్ ,

iv ) ఫామిలీ కోర్టు 

10) వడ్లు ఈ రకము భూమిలో పండుతాయి

i ) మెట్ట భూమి ii ) మాగాణి భూమి iii ) బంజరు భూమి iv ) ఇసుకనేలా 

11) సహధర్మచారిణి అంటే

i ) ధర్మ,అర్ధ,కామాలనే మూడు ధర్మాలను సమంగా పంచుకునేదని 

 ii ) ధర్మ,అర్ధ,కామ మోక్షాలనే  ధర్మాలను సమంగా పంచుకునేదని

iii ) అధర్మ కార్యాలను పాలుపంచుకునేది అని 

 iv ) ఆస్తిలో వాటా కోరునది అని

 12) పాలపుంత అనునది

i ) గ్రామాలలో పాల కుండను వుంచు ఉట్టి 

 ii ) గ్రామాలలో పాల కుండను వుంచు గూడు

 iii ) నక్షత్ర మండలము

iv ) రాసి చక్రము 

13) వటపత్ర సాయి అనగా

i ) మర్రి ఆకుమీద పవళించిన వాడు 

ii ) తమలపాకు మీద పవళించిన వాడు

iii ) తామర ఆకుమీద పవళించిన వాడు

iv ) జామ ఆకుమీద పవళించిన వాడు

14) జనక మహారాజు ఒక 

i ) ఆత్మవేరు పరమాత్మ వేరని నమ్మిన వాడు 

 ii ) స్థితప్రజ్ఞుడు 

 iii ) మనుషులంతా ఒకటేనని నమ్మినవాడు 

iv ) సన్యాసం ఒకటే దేముడిని చేరు మార్గమని తెలుసుకున్నవాడు 

15) జాతక చక్రంలో _____గదులు ఉంటాయి 

i ) తొమ్మిది 

 ii )  పది 

 iii ) పన్నెండు 

 iv ) పదహారు

16) తమలపాకులు వీటికోసం వాడరు

i ) తాంబూలంలో

 ii ) పూజలలో   

 iii ) తోరణాలలో

 iv ) పేరంటంలో

17) "దేహశుద్ది" అనునది దీనికి ఉపయోగిస్తాము   

i ) ఇతరులను కొట్టటం 

 ii ) మంచినీటితో దేహాన్నిశుద్ధి చేయటం  

 iii ) పన్నీరుతో స్నానం చేయటం

 iv ) చెరువులో స్నానం చేయటం 

18) పూర్వాకాలంలో ఇలా అనేవారు  "  కాశీకి పోయినవారు _____పోయినట్లే"

i ) కాటికి 

 ii ) ఏటికి  

iii ) హిమాలయాలకు 

iv ) ద్రాక్షారామానికి 

19)" సరళీ స్వరాలు" అనునవి

i ) సరళ పాడే స్వరాలూ 

 ii ) సంగీతంకు సంబందించినది 

 iii ) సాహిత్యానికి సంబందించినది 

 iv )  సంగీతము ఇష్టమైనది మరియు స్పష్టమైనది 

20)  లాయర్లకు మరియు డాక్టర్లకు వత్యాసం 

i ) కోటురంగు ii ) బూటు రంగు iii ) చొక్కారంగు iv ) అన్నీకూడా

 

 

శాస్త్రములకు అంతము లేదు

 శ్లోకం:☝️

*అనంతశాస్త్రం*

      *బహు వేదితవ్యం*

*స్వల్పశ్చ కాలో*

      *బహవశ్చ విఘ్నాః |*

*యత్సారభూతం*

      *తదుపాసితవ్యం*

*హంసో యథా*

      *క్షీరమివాంబుమిశ్రం ||*


భావం: శాస్త్రములకు అంతము లేదు. అంతా చదువుటకు కాలం చాలదు. జీవితము స్వల్పము, అందులో అనేక ప్రతిబంధములు. కావున, క్షీరనీరములు కలిసియుండినను నీరమును విడిచి క్షీరమును మాత్రమే గ్రహించు హంస వలే, సారమైన విషయమును మహాత్ములనుండి గ్రహించి అనుష్టించుట శ్రేష్టము.🙏

లక్షల కాపీలు

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

*లక్షల కాపీలు అమ్ముడుపోయిన "The Sky Gets Dark Slowly" అన్న పుస్తకం గురించి యండమూరి వీరేంద్రనాథ్ వివరణ.* 

                  🌷🌷🌷

ఈ పుస్తకం నేను చదవలేదు కానీ గూగుల్ లో దీని సారంశం చదివాను. డబ్బు సంపాదన గురించి నా పుస్తకం (ఏప్రిల్ విడుదల) "ఇంటి పెరట్లో లక్ష్మి చెట్టు" లో 'వృద్ధాప్యం లో డబ్బు అవసరం' గురించి ప్రస్తావిస్తూ ఆ సారాoశాన్ని ప్రస్తావించాను.

నువ్వు వెల్లకిలా పడుకొని ఆకాశం వైపు చూస్తూ ఉంటావు. గగనంలో నక్షత్రాలు ఒక్కొక్కటిగా మాయమైపోతూ ఉంటాయి. నిన్ను ‘అరే, ఒరేయ్’ అని పిలిచే స్నేహితులొక్కొక్కరూ రాలిపోతూ ఉంటారు.

నీ ముందు నిక్కర్లేసుకుని తిరిగిన పిల్లలందరూ ఇప్పుడు యుక్త వయస్సులోకి వచ్చి నీ చుట్టూ చాలా హడావిడిగా తిరుగుతూ ఉంటారు. నీతో మాట్లాడే సమయం కూడా వారికి ఉండదు.

నీ మీద స్పాట్‌లైట్ ప్రసరించటం మానేసి చాలా కాలం అయిపోయి ఉంటుంది. నీ జీవితంలో నువ్వు ఎన్నో సాధించి ఉండవచ్చు గాక. నీ కీర్తి నాలుగు దిక్కులా ప్రసరించి ఉండొచ్చు గాక. కానీ ప్రస్తుతం దాన్ని ఎవరూ గుర్తించరు. ఈ సొసైటీ నీ గురించి పట్టించుకోవటం మానేసి చాలా కాలం అయివుంటుంది.

దాహంతో దూరంగా ఎక్కడో ఒక కాకి అరుస్తూ ఉంటుంది. నీ లాంటి వృద్ధుడు ఎవరో నీకు అప్పుడప్పుడు ఫోన్ చేసి ఇంట్లో తన అవస్థ చెప్పుకుంటూ ఉంటాడు. నీ అమూల్య అభిప్రాయాల్ని చెప్పటానికి ఒక శ్రోత ఈ ప్రపంచంలో దొరికిన సంతోషం నిన్ను తబ్బిబ్బు చేస్తుంది.

యవ్వనంలో హెల్త్ ఇన్సూరెన్స్ మానేసి ఆ డబ్బు పిల్లల కాలేజీ ఫీజు కట్టావు. మధ్య వయసులో సంపాదించినది పిల్లల్ని అమెరికా పంపించడానికి ఖర్చు పెట్టావు. అందరితో ‘నా కొడుకు అమెరికాలో, కూతురు ఆస్ట్రేలియాలో ఉన్నది’ అని గర్వంగా చెప్తూ ఉంటావు. ఎన్నాళ్ళకొక ఒకసారి వాళ్ళు నిన్ను చూడటానికి వచ్చారన్నది మాత్రం చెప్పవు.

అమెరికా నుంచి నీ కొడుకు సెల్ ఫోన్ లో నీ పుట్టినరోజు తేదీ చూసి ఫోన్ చేస్తుంది. నీకు నీ మనవడితో మాట్లాడాలని ఉంటుంది. వాడు చా….లా బిజీ. అర్ధరాత్రి ఏ నొప్పితోనో నీకు మెలకువ వస్తుంది. పక్కగదిలోని వారికి నిద్రాభంగం చేయాలా వద్దా అన్న ఆలోచనతోనే తెల్లవారుతుంది. పక్క మీద గంటల, రోజుల తరబడీ పడుకొని ఉండటం దినచర్య అవుతుంది. పుట్టిన కొత్తలో పక్క మీద శిశువు నెలల తరబడి కదలకుండా ఎలా ఉంటుందో తిరిగి అదే స్థితి సంభవిస్తుంది. ఒకటే తేడా ఏమిటంటే చిన్నప్పుడు ఆలనాపాలనా చూసుకోవటానికి తల్లి ఉంది. ఇప్పుడెవరూ లేరు. అప్పుడప్పుడూ వచ్చి పలకరించే కూతురూ, తప్పదన్నట్టు సేవలు చేసే కోడలూ. నీ అదృష్టం బాగా లేకపోతే అనాథాశ్రమంలో వారు కూడా ఉండరు.

నువ్వు కొద్దిగా ఎక్కువ తిన్నా, అసలు తినకపోయినా మెడిసిన్ చదివిన డాక్టర్లలాగా నీ పిల్లలు నీకు సలహాలు ఇస్తూ ఉంటారు. ఒళ్ళు వెచ్చబడితే చలిలో తిరిగావనీ, జలుబు చేస్తే చన్నీళ్ళ స్నానం చేశావనీ, కాళ్ళు నొప్పులు పెడితే గుడికి ఎందుకు వెళ్ళావనీ నిన్ను మందలిస్తూ ఉంటారు. ప్రొద్దున్న లేచేసరికి అకస్మాత్తుగా ఏ జలుబో, కీళ్ళ నొప్పులో ప్రారంభం అవుతాయి. బాత్‌రూంలో పడటం, కాళ్ళు విరగటం, జ్ఞాపకశక్తి నశించటం, ఆసుపత్రికి వెళ్ళినప్పుడు డాక్టర్ చాలా క్యాజువల్‌గా ‘నీకు కాన్సర్’ అని చెప్పటం మొదలైనవి అన్నీ నీ జీవితంలో భాగమైపోతాయి.

నీది మరీ మధ్యతరగతి కుటుంబం అయితే, నువ్వు సంపాదించిన డబ్బు నీ ఆసుపత్రి ఖర్చుల కోసం ఖర్చు పెట్టాలా, చూసీ చూడనట్టు నీ మరణం కోసం వేచి ఉండాలా అన్న ఆలోచనతో నీ పక్క గదిలో నీ వాళ్ళు చర్చిస్తూ ఉంటారు.

మరేం చెయ్యాలి?

THE SKY GETS DARK SLOWLY అనే పుస్తకంలో రచయిత “ప్రస్తుత జీవన విధానం మార్చుకుంటే. పై సమస్యల్లో ‘కనీసం కొన్ని’ తగ్గించుకోవచ్చు” అంటాడు. “ఆకాశo క్రమక్రమంగా నల్లబారుతోందనీ, ఒక్కొక్క దీపమే ఆరిపోతుందనీ గ్రహించిన వ్యక్తి జీవితపు ఆఖరి స్టేజి కోసం ఆరోగ్యవంతంగా ప్రిపేర్ అవ్వాలంటే అయిదు సూత్రాలు గుర్తుంచుకోవాలి” అంటాడు.

ఆకాశం పూర్తిగా నల్లబడక ముందే నీ దారి పొడుగునా లైట్లు వెలిగించి శక్తి ఉన్నంతవరకూ పని చేస్తూ ఉండు. నీకన్నా అశక్తులకీ, అనాథలకీ సహాయం చేస్తూ ఉండు.

ఏకాంతం స్థానే శూన్యత ప్రవేశించినప్పుడు అది అతి తొందరలో ఒంటరితనం గా మారుతుందన్న విషయాన్ని నువ్వు ఎంత తొందరగా తెలుసుకుంటే అంత బాగుంటుంది.

ప్రతి మనిషి చుట్టూ ఒక ‘తావి’ ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ అది సుగంధ సౌరభ పరిమళంగానో, దుర్గంధ పూరితoగానో మారుతుంది. ఎలా మారుతుందనేది హుందాతనాల / నీ చాదస్త ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది.

పిల్లలు పుట్టగానే లావు అవటం సహజం అనుకోకు. జిహ్వ చాపల్యం తగ్గించు. ఒక వయసు వచ్చాక తిండి ఆనందం కాదు. అవసరం. వయసు పెరిగే కొద్దీ శరీరం ఇచ్చే సంకేతాలు గమనించు. పెగ్గులు, సిగరెట్లు తగ్గించు. ఆంధ్ర తెలంగాణాల్లో లక్షకి ఐదువేల మంది స్త్రీలు థైరాయిడ్ సమస్యతో బాధ పడుతున్నారని అంచనా.

వయసు వల్ల వచ్చిన అధికారంతో నీ చుట్టూ ఉన్నవాళ్ళని శాసించకు. వీలైనంత వరకూ వారి చర్యలపై నీ అమూల్యాభిప్రాయాన్ని వెల్లడి చేయకు. నీ బోధనలు ఆపి ఒక్కడివే ఉండటం ఎలాగో నేర్చుకో. లేకపోతే నీ ఇంటివారు నిన్ను మరింత దూరం పెడతారు.

ఒంటరిగా కూర్చొని పుస్తకాలు చదువు. ఏకాంతంలో సంగీతాన్ని విను. ఓపికుంటే మొక్కల్ని పరిరక్షించు. చిన్న పిల్లలతో కొద్ది సేపు వారికి ఇంటరెస్టు ఉన్న టాపిక్స్ కబుర్లు చెప్పు. అఫెక్షన్ బ్యాంక్ లో ఆప్యాయతని క్రెడిట్ చేసుకుంటూ వెళ్ళు.

“ఎప్పుడైతే నువ్వు మానసికంగా ఇలా ప్రిపేర్ అయ్యావో నీ వృద్ధాప్యాన్ని ఓ పది సంవత్సరాలు వాయిదా వెయ్యగలవు” అంటాడు 'The sky gets dark slowly' అన్న పుస్తకంలో రచయిత. ఈ పుస్తకం కొన్ని లక్షల కాపీలు అమ్ముడుపోయింది.

                 🌷🌷🌷

ఆయుర్వేదం - విభాగాలు .

 ఆయుర్వేదం - విభాగాలు .


  ఆయుర్వేదం అనగా చాలామంది దృష్టిలో చెట్లు , వాటి చూర్ణాలు అనే దృష్టి ఉంది. కాని చాలామందికి దానిలో అనేక రకాల వైద్యవిధానాలు ఉన్నాయి అనే విషయం తెలియదు. వాటిగురించి మీకు ఈ పోస్టులో వివరిస్తాను. 


       మనకి తెలిసిన ఆయుర్వేద ప్రముఖుల్లో చరకుడు , శుశ్రుతుడు అందరికి తెలుసు. కాని ఇంకో ప్రముఖ వ్యక్తి ఉన్నారు. అతని పేరు వాగ్బాటాచార్యుడు . ఈయన రాసిన " అష్టాంగహృదయం " అనే గ్రంధం చాలా ప్రముఖమైనది. దీనిలో అనేక భాగాలు కలవు. ఒక భాగంలో కేరళ రాష్ట్రంలో ప్రాచుర్యంలో ఉన్న " మర్మకళ" గురించి చాలా వివరంగా ఉన్నది. మనిషి శరీరంలో ఉన్నటువంటి మర్మస్థానాల గురించి , దానిపైన ఒత్తిడి కలిగించినప్పుడు కలిగే సమస్యల గురించి చాలా చక్కగా వివరించారు. ఆయన రాసిన                  "అష్టాంగసంగ్రహం" అను గ్రంథం కూడా ప్రముఖమైనది. 


     వాగ్బాటాచార్యుడు ఆయుర్వేదంని ౮ విభాగాలుగా విభజించాడు.   అవి 


 *  శల్యతంత్రము .


 *  శాలాఖ్య తంత్రము .


 *  కాయచికిత్స . 


 *  భూతవిద్య .


 *  కౌమారభృత్యము .


 *  అగధాతంత్రము .


 *  రసాయన తంత్రము.


 *  వాజీకరణ తంత్రము .


      ఒక్కొక్కదాని గురించి మీకు క్లుప్తంగా వివరిస్తాను.


 * శల్య తంత్రము - 


     మేకులు , రాళ్లు , ధూళి , ఇనుపమేకులు , మట్టిపెళ్లలు , ఎముకలు , గోళ్లు మొదలైనవి శరీర అంతర్భాగమున చొరబడినచో వానిని బయటకి తీయు ఉపాయములు , యంత్రములు, శస్తములు , క్షారములు మరియు అగ్నిని ప్రయోగించు విధానముని తెలియజేయునది శల్యతంత్రము .


 *  శాలాఖ్య తంత్రము  - 


    కంఠమునకు పైభాగమున చెవులు , కన్నులు , కంఠబిలం , నాసిక మొదలగు వాటియందు కలుగు వ్యాధుల నివారణార్ధం ఏర్పడినది శాలాఖ్య తంత్రము. 


 *  కాయచికిత్స - 


     సమస్త అవయములును అనుసరించి జ్వరం , అతిసారం, రక్తపిత్తము , శోష , ఉన్మాదము , అపస్మారము , కుష్ఠము, మేహము మొదలగు వ్యాధులను నివారించుటకు నిర్ణయింపబడిన చికిత్సా విధానమును కాయ చికిత్స అందురు.


 *  కౌమారభృత్యము - 


     శిశువుల పోషణా విధానము , పాలు ఇచ్చే విధానం , పాలల్లో దోషములు శోధించుట , దుష్టపు పాలు త్రాగుట చేత , దుష్ట గ్రహంబులు చేత కలిగిన వ్యాధుల నివర్తి చేయుటకు తగు విధానములు భోధించునది "కౌమారభృత్యము ".


 *  అగధ తంత్రము - 


     పలు రకాల సర్పాలు , కీటకములు , సాలెపురుగులు , తేళ్లు , ఎలుకలు మొదలగు విషజంతువులు కరుచుట చేతను కలిగిన విషమును తెలుసుకొనుటకు , విషముల్లో రకాలు అయిన స్థావర, జంగమ విషములు గురించి వాటి ఉపశమనాల గురించి ఎర్పడినది అగధ తంత్రము.


 *  రసాయన తంత్రము - 


     యవ్వనమును స్థిరముగా చేయుటకు , ఆయువుని , బలమును , బుద్ధిని కలుగచేయుటకు , వ్యాధుల నివర్తించుటకు సమర్ధంబు అయినది రసాయన తంత్రము .


 *  వాజీకరణ తంత్రము - 


      క్షీణించిన రేతస్సును అధికంగా చేయుటకు , దుష్టమగు రేతస్సుని శుభ్రముగా చేయునది , సంభోగము నందు అధిక శక్తిని , కామవాంఛ కలుగ చేయునది వాజీకరణ తంత్రము . 


    

    ఈ విధముగా ఆయుర్వేదము 8 అంగాలుగా విభజించబడినది. ఆయా సమస్యలకు సరియైన చికిత్సా విధానములు అనుసరించి చికిత్సని అందించవలెను . 


     

     ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  గమనిక  -


           నేను రచించిన నా మూడొవ గ్రంథం అయిన " సర్వమూలికా చింతామణి " యందు అనేక రకాల మొక్కల గురించి అత్యంత విపులముగా , వివరణాత్మకంగా ఇవ్వడం జరిగింది . మా వంశపారంపర్య రహస్యయోగాలు మాత్రమే కాకుండా అత్యంత పురాతన , అరుదైన గ్రంథాలు మరియు కొన్ని తాళపత్రాల నుంచి తీసుకోబడిన ఎన్నొ విలువైన యోగాలు అన్ని ఎంతో పరిశోధించి మీకు ఇవ్వడం జరిగింది . ఒకటి మాత్రం ఖచ్చితముగా చెప్పగలను . ఈ గ్రంథములో లభ్యమయ్యే సంపూర్ణ సమాచారం మరియు అత్యంత సులభయోగాలు మరే గ్రంథములో మీకు దొరకవు . ఈ ఒక్క గ్రంథం రచించుటకు సుమారు సంవత్సన్నర సమయం కేటాయించడం జరిగింది . 50 రకాల మొక్కల గురించి ఈ ప్రథమ భాగములో ఇవ్వడం జరిగింది . కేవలం మొక్కల గురించియే కాకుండా యే వ్యాధికి ఏమి పథ్యం చేయవలెనో కూడ వివరణాత్మకంగా ఇవ్వడం జరిగింది . 


        ఈ గ్రంథం ఎక్కువ కాలం మన్నికగా ఉండుటకు కుట్టించి ఇవ్వడంతోపాటు 90gsm పేపర్ వాడటం జరిగింది . మొక్కల యొక్క రంగుల ఫొటోస్ తో పాటు సంపూర్ణ సమాచారం ఇందులో మీకు లభ్యం అగును . దీని ఖరీదు  550 రూపాయలు ( ఆంధ్ర మరియు తెలంగాణ ) మరియు వేరే రాష్ట్రమునకు పంపుటకు మరొక్క 50 రూపాయలు అదనంగా ఖర్చు అగును . 


      ఈ గ్రంథము కావలసిన వారు 9885030034 నంబర్ కి phoneపే , google pay or paytm చేసి ఇదే నంబర్ కి whatsup నందు screenshot పెట్టి మీ Adreass  pincode and landmark తో సహా ఇవ్వగలరు . 


             కాళహస్తి వేంకటేశ్వరరావు . 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                    9885030034

2, మార్చి 2022, బుధవారం

క్షీర సాగర మథనము.

 MAAGHA PURANAM -- 29


29 అధ్యాయము 


మాఘమాసమందు ఏకాదశీ మహాత్మ్యము – క్షీర సాగర మథనము.


మాఘమాసమునందు నదీస్నానము చేసి, మాఘమాస వ్రతము ఆచరించిన వారికి అశ్వమేథ యాగము చేసిన ఫలము కలుగుతుంది. ఈ మాఘమాసములో ఏకాదశీ వ్రతము చేసి ఉపవాసము ఉన్నవారు వైకుంఠప్రాప్తి పొందగలరు. మాఘమాసమందు ఏకాదశీ వ్రతము చేసి సత్ఫలితము పొందిన దేవతలకథలు వినండి. 

పూర్వకాలమందు దేవతలు, రాక్షసులు క్షీర సాగరమును మధించి అమృతమును పొందవలెనని అభిప్రాయమ కలిగి మంధర పర్వతమును కవ్వముగా, వాసుకి అను సర్పమును త్రాడుగా చేసుకొని క్షీరసాగరమును  మధించసాగారు. తలవైపు రాక్షసులు, తోక వైపు దేవతలు ఉండి మధిస్తు ఉండగా మొదట పుట్టిన లక్ష్మీదేవిని  విష్ణుమూర్తి భార్యగా స్వీకరించాడు.  తరవాత ఉచ్చైశ్రవము అనే గుఱ్ఱము, కామధేనువు, కల్పవృక్షము ఉద్భవించగా  వాటిని విష్ణుమూర్తి ఆదేశముపై దేవేంద్రుడు భద్రపరిచాడు. మరల పాలసముద్రమును మధించగా లోకభీకరమై ఘనమైనతేజస్సుతో ఉండే అగ్ని తుల్యమైన హాలాహలము పుట్టింది. ఆ హాలాహల విష జ్వాలలతో సమస్త లోకములు కాలిపోతున్నాయి. దేవతలు, రాక్షసులు భయపడి పారిపోయి సర్వేశ్వరుని శరణుకోరగా  భోళాశంకరుడగు సాంబశివుడు వారిని కరుణించి వెంటనే ఆ కాలకూట విషమును తన కంఠమునందు బంధించాడు. కాలకూట విషమును పానము చేసినందువల్లనే శివుని కంఠము నీలముగా మారి ఆనాటినుండి నీలకంఠుడని పేరు వచ్చింది. మళ్ళీ దేవ దానవులు అమృతం కోసం పాలసముద్రమును మధించగా అమృతము పుట్టింది. ఆ అమృతము కొరకు వారిరువురు తగవులాడుకొన సాగారు. శ్రీమహావిష్ణువు మాయామోహిని అవతారము ధరించి వారి తగవును పరిష్కరించాలి అనుకున్నాడు. 

మాయామోహిని అందచందాలలో మేటి. ఆమె అందమునకు సరితూగు స్త్రీలు ఎవరూ లేరు. జగన్మోహిని యైన ఆమె అతిలోక సౌందర్యవతి. తన మాయా మోహన రూపంతో అందరినీ ఆకర్షించగల అద్భుత సౌందర్యరాశి. ఆమె వారిరువురి మధ్యకు వచ్చి అమృతమును ఇరువురికీ సమానముగా పంచెదను. ఎందుకీ తెగని తగవులాట? మీరందరూ ఒక వరుస క్రమంలో నిలబడితే అందరికీ అమృతము  పంచుతాను మీకు ఇష్టమేనా? అన్నది. దేవదానవులు అంగీకరించారు. ఆమె అద్భుత సౌందర్యమునకు పరవశించి రాక్షసులు కూడా మారు మాట్లాడలేదు. దేవతలందరూ ఒక వరుసలోనూ, రాక్షసులందరూ మరొక వరుసలోనూ నిలబడ్డారు. జగన్మోహిని రెండు భాండములను తీసుకొని ఒక భాండమునందు సురను, మరొక దానియందు అమృతమును నింపి నర్తిస్తూ, మురిపిస్తూ, మైమరపిస్తూ, తన వయ్యారపు నడకలతో చిరునవ్వులు చిందిస్తూ రాక్షసులను ఊరిస్తూ వారికి తెలియకుండా సురను రాక్షసులకు, అమృతమును దేవతలకు పోయసాగింది. మందభాగ్యులైన రాక్షసులు ఇదేమీ గమనించకుండా ఆమె అద్భుత సౌందర్యమునకు మురిసిపోతూ పరవశింప సాగారు. ఈవిధంగా రాక్షసులను తన వలపు వయ్యారములతో ఊరిస్తూ సురను మాత్రమే పోస్తోంది. ఈ విషయము గమనించిన రాహుకేతువులు మాయాదేవతలుగా మారి దేవతల పంక్తిలో కూర్చొని అమృతాన్ని పానం చేశారు. రాహుకేతువులు చేసిన ఆగడాన్ని కనిపెట్టిన జగన్మోహిని రూపములో ఉన్న శ్రీమహావిష్ణువు కోపించి తన చక్రాయుధంతో వారి తలను నరికివేసాడు.  మిగిలిన అమృతము దేవేంద్రుడికి ఇచ్చాడు. త్రిమూర్తులు అదృశ్యమయ్యారు. దేవేంద్రుడు అమృత భాండమును  భద్రపరుస్తూ ఉండగా రెండు చుక్కలు విధివశాత్తూ నేలరాలాయి. అవి పడిన చోట రెండు దివ్యమైన మొక్కలు పెరిగాయి. అవే పారిజాత, తులసి మొక్కలు. సత్రాజిత్తు అనే మహారాజు వాటికి నీరుపోసి పెంచసాగాడు. కొంత కాలమునకు పారిజాత వృక్షము పుష్పించి అద్భుతమైన సువాసనలను వెదజల్లసాగింది. ఒకనాడు దేవేంద్రుడు అటువైపుగా వెళ్తూ పారిజాత పుష్ప వాసనకు పరవశించి ఒక పువ్వును కోసుకొని తన భార్యయైన శచీదేవికి ఇచ్చాడు. మిగిలిన దేవతలు కోరగా మళ్ళీ వచ్చి రహస్యముగా పువ్వులను కోయాలని  తోటలో ప్రవేశించాడు. అప్పటికే తన తోటలోని పువ్వులను ఎవరో అపహరిస్తున్నారని అనుమానము వచ్చిన సత్రాజిత్తు శ్రీ మహావిష్ణువుకు పూజ చేసి మంత్రించిన అక్షతలను పువ్వులపైన, వనమంతా చల్లాడు. దేవేంద్రుడు పారజాత పువ్వును తుంచబోడగా అక్షతల ప్రభావం వల్లనో, విష్ణు మహిమ వల్లనో మూర్ఛపోయాడు. ఈవార్త తెలిసిన దేవతలందరూ నారదుణ్ణి బ్రతిమలాడగా నారదుడు కృష్ణుని వద్దకు పోయి విషయము వివరించాడు. కృష్ణుడు తన మామగారైన సత్రాజిత్తు వద్దకు బయలుదేరాడు. అమోఘమైన శక్తి కల సత్రాజిత్తు మిక్కిలి భగవద్భక్తి పరాయణుడు. భగవంతుడైన శ్రీకృష్ణుడు అతనికి శ్రీ మహావిష్ణువు రూపమున కనిపించాడు. సత్రాజిత్తుకి చెప్పి అమృత తుల్యమగు పారిజాత వృక్షమును దానికి అర్హుడైన దేవేంద్రునికి ఇప్పించి తులసిని తన సన్నిధిలో ఉండమని చెప్పాడు. ఆనాటి నుంచి తులసి శ్రీమహావిష్ణువు సాన్నిధ్యములో ఆయనతో సమానముగా పూజలు అందుకుంటున్నది. అందుచేత తులసిని పూజించిన సకల సౌభాగ్యములు సిద్ధిస్తాయి. 


ఫలశ్రుతి: 


సూతమహర్షి శౌనకాది మునులతో మహర్షులారా! వశిష్ఠుల వారు దిలీపునకు తెలియచేసిన మాఘమాస మహత్యము, మాఘస్నాన మహిమ మీకు వివరించాను. మీరు తలపెట్టిన పుష్కర యజ్ఞం కూడా పూర్తి కావచ్చింది.  అందరు మాఘమాస వ్రతమును, నదీ స్నానమును నియమ నిష్ఠలతో చేసి ఆ శ్రీహరి కృప పొందగలరని దీవించాడు. మాఘమాసంలో సూర్యుడు మకర రాశియందుండగా సూర్యోదయము అయిన తర్వాత నదిలో స్నానము చేయాలి. ఆదిత్యుని పూజించి విష్ణ్వాలయమును దర్శించి శ్రీమన్నారాయణునకు పూజలు చేయాలి. మాఘమాసం ముప్పది రోజులు క్రమం తప్పక మిక్కిలి భక్తి శ్రద్ధలతోనూ, ఏకాగ్రతతోనూ, చిత్తశుద్ధితోనూ శ్రీమహావిష్ణువును మనసారా పూజించిన సకలైశ్వర్య ప్రాప్తి, పుత్రపౌత్రాభివృద్ధి, వైకుంఠప్రాప్తి పొందుతారు. 


సర్వేజనాః సుఖినోభవన్తు!!


మాఘపురాణము సంపూర్ణమ్ !!

గొప్ప సందేశం

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

*రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఒక్కొక్క అక్షరం వదలకుండా చదవ వలసిన అతి గొప్ప సందేశం*


*ఉక్రెయిన్ ఉదంతం ప్రపంచ ప్రజలకో గుణపాఠం*


ఉక్రెయిన్ పై రష్యా స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ జరుపుతోంది. ఒళ్ళు గగుర్పొడిచే భయానక దృశ్యాలు మనకు కనబడుతున్నాయ్. కేవలం 48 గంటల్లోనే ప్రశాంతంగా ఉండే ఉక్రెయిన్ దేశం చిన్నాభిన్నమైపోయింది. ఆ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీ ఎక్కడో బంకర్లో తలదాచుకుని ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి. దేశాధ్యక్షుల పరిస్థితి దేవుడెరుగు. సాధారణ జనజీవనం మాత్రం అల్లకల్లోలమైపోయింది. జనం ప్రాణభయంతో పరాయి దేశాలకు చేరుకుంటున్నారు. 


ఇంతటి విధ్వంసానికి, వినాశనానికి, జన హననానికి ముమ్మాటికీ ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీయే కారణం. ఇంతటి నష్టం జరుగుతుందని ఒక దేశాధ్యక్షుడిగా జెలెన్ స్కీకి తెలీదా? తన శక్తి సామర్ధ్యాలేవిటో, తాను కయ్యానికి కాలు దువ్వుతున్న రష్యా శక్తిసామర్థ్యాలేవిటో ఆయనకు తెలీదా? తనపై తనకు అతి విశ్వాసమా? నాటో దేశాల మద్దతు లభిస్తుందన్న అత్యాశా? ఏది ఆయనను యుద్ధం దిశగా నడిపించి ఉంటుంది?


*నిజానికి ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీ మొదట రాజకీయవేత్త కాదు, ఆయనకు నటనలోనే అనుభవం ఉంది. అది జనజీవన స్రవంతిలో ఎందుకూ పనికి రాదు. అది ఒక రంగుల ప్రపంచము. వ్యాపార సరళి అందులో నటులది చాలా చిన్న పాత్ర అదే నటన. ఆ నటన వలన మహా అయితే వ్యాపార పరంగా మహా అయితే కొన్ని వందలమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపయోగం. మిగతా లోకంలో అందరికి కధ, టైం పాస్ మాత్రమే. ఆయన ఒక సినిమా నటుడు. అత్యంత ప్రజాదరణ కలిగిన ఒక కమెడియన్. ఒక దేశాన్ని పాలించడం అంటే సినిమాల్లో కామెడీ చేసినట్టు కాదు కదా? రాజకీయాలలో, దేశ పాలనలో, ప్రపంచ పరిస్థితుల్లో ఎన్నో విషయాలను అనుక్షణం గమనిస్తూ, బేరీజు వేసుకుంటూ, గతాన్ని పరిశీలించుకుంటూ, వర్తమానాన్ని విశ్లేషించుకుంటూ, భవిష్యత్తును అంచనా వేసుకుంటూ ముందుకు సాగాల్సి ఉంటుంది*. ఎందరితోనో, ఎన్నో విధాలుగా డీల్ చేయాల్సి ఉంటుంది. అవగానా రాహిత్యమో, అతి విశ్వాసమో, వారిపై వల్లమాలిన అభిమానమో తెలీదుగానీ *ఏమాత్రం పాలనానుభావం లేని సినీ పరిశ్రమకు చెందిన వారినే ఆయన తన సలహాదారులుగా, మంత్రివర్గ సభ్యులుగా పెట్టుకున్నారు*.ఇది మరీ ప్రపంచ విడ్డురం కదా.అందరూ నటులతో ప్రజా పాలన కూడా ఒక నటనే అవుతుంది. *కుంకుడు గింజలను భూమిలో నాటి, నాకు బంగిన పల్లి మామిడి పళ్లు కావాలంటే వస్తాయా, చచ్చినా రావు అనేది నిర్వివాదాంశం. ఇకనైనా కళ్ళు తెచ్చుకోండి.* 


అందునా ఉక్రెయిన్, శక్తిమంతమైన ఈయూ, రష్యాల మధ్యన ఉన్నది. ఇరు పక్షాలతోనూ సయోధ్యతో మెలగడమే సరియైన విదేశాంగ విధానం. ఏ ఒక్క పక్షాన చేరినా రెండవ పక్షానికి విరోధులవుతాం కదా? ఇద్దరు బలవంతుల మధ్య ఒక బలహీనుడు ఇద్దరితో అణకువగా మసలుకుంటేనే కదా? లేకపోతే ఏదో ఒకనాడు ఎవరో ఒకరి చేతిలో తన్నులు తినక తప్పదు కదా? ఇది సహజమైన జీవన నియమమే కదా? మరి అంతటి దేశాధ్యక్షుడు ఇంత చిన్న లాజిక్ మిస్సయితే ఎలా?


సరే పోనీ... ఎవరి బలాన్నో నమ్ముకుని ఈయన హద్దులు మరచి రంకెలు వేశాడనుకుందాం.... మరి వారెవరైనా ప్రత్యక్షంగా రంగంలోకి దిగారా? అండగా నిలిచి ఆదుకున్నారా? ఒక బలమైన వాడితో ప్రత్యక్ష వైరం పెట్టుకోవాలంటే అవతలి వాడు కూడాఎంతటి శక్తిమంతుడైనా ఎంతో కొంత ఆలోచిస్తాడు కదా? 


నిజానికి రష్యా వంటి శక్తివంతమైన దేశాన్ని ఢీకొట్టే స్థితిలో ప్రస్తుతం అమెరికా కూడా లేనట్టే. అమెరికా కూడా పైపైన పటాటోపం ప్రదర్శించడం మినహా ఎప్పుడూ ఎక్కడా తన శక్తి సామర్థ్యాలను ప్రదర్శించిన పాపాన పోలేదు.  సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్ వంటి వారి ఆచూకీ తెలుసుకుని వారిని మట్టుబెట్టడానికే అమెరికా ఎంతో సమయాన్ని, శక్తిసామర్ధ్యాలను, ధనాన్ని వెచ్చించవలసి వచ్చింది. వియత్నాం, సిరియా, లిబియా, ఇరాక్ లలో పరిస్థితులు చక్కబెడతానంటూ వెళ్లి మరింత సంక్లిష్టం చేసొచ్చింది. ఇక ఆఫ్ఘనిస్థాన్లో అమెరికా చేసిన నిర్వాకం మనందరికీ తెలిసిందే. ఏడు సముద్రాలు ఈది ఏటి కాలువలో మునిగిన చందాన దశాబ్దాలపాటు ఆఫ్ఘనిస్థాన్లో తిష్ట వేసుకు కూర్చుని చివరికి ఆ తాలిబన్ల చేతికే ఆఫ్ఘన్ ను అప్పగించి వచ్చిన ఘన చరిత్ర అమెరికాది. అమెరికా ఇప్పుడు ఆర్థికంగా కూడా రష్యాను ఢీకొట్టే స్థితిలో లేదు. మరి అలాంటి అమెరికా తనకు యుద్ధంలో తోడుగా నిలుస్తుందని జెలెన్ స్కీ ఆశలు పెట్టుకుని ఉంటే... అంతకంటే అమాయకత్వం మరొకటి లేదనే చెప్పాలి. ఇప్పుడు అమెరికా అయుధాలందిస్తానన్నా *ఉక్రెయిన్ అందుకునే స్థితిలో లేదే? అందుకోడానికి ఉక్రెయిన్ చేతిలో సైనికులే లేరే? . దాన్ని నడిపే వారు అందరూ నటీనటులే కావటం ఇందుకు ప్రధమ కారణం.*


ఉక్రెయిన్ ను నాటో దేశాల సరసన కూర్చుండబెడితే రష్యా దూకుడుగా స్పందిస్తుందని ఫ్రాన్స్, జర్మనీలతో సహా ఐక్యరాజ్యసమితిలోని దేశాలన్నీ ఆది నుంచి అమెరికాను హెచ్చరిస్తూనే ఉన్నాయ్. అయినా ఆ హెచ్చరికలన్నిటినీ తోసిరాజని అమెరికా ఉక్రెయిన్ ను నాటో అక్కున చేర్చే ప్రయత్నం చేసింది. అదే ఇప్పుడు ఇంతటి విధ్వంసానికి కారణం అయ్యింది.


ఉదాహరణకు చైనా తన మిలిటరీ బేస్ ను అమెరికా పొరుగునున్న కెనడాలోనో, మెక్సికోలోనో పెడతానంటే అమెరికా సైతం ఆ దేశాలపైకి యుద్ధానికి వెళ్లకుండా ఉంటుందా?  ఏ దేశానికైనా తమ దేశ భవిష్యత్తు, భద్రత, సంక్షేమమే కదా ప్రధానం? ఇప్పుడు రష్యా కూడా సరిగ్గా అదే చేసింది. తనకు గిట్టని దేశాలతో స్నేహం కొనసాగిస్తూ తనకు పక్కలో బల్లెంలా మారిన ఉక్రెయిన్ పై ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేస్తోంది.


అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీ వ్యవహరించిన తీరే అత్యంత అవగాహనా రహితమైనది, బాధ్యతారహితమైనది, విచారకరమైనది. జెలెన్ స్కీ తలచుకుంటే.... యుద్ధం జరుగకుండా ఆపే అవకాశం ఆయనకు చివరి క్షణం వరకూ ఉండింది. చర్చలు జరిపే అవకాశం ఉండింది. కానీ ఆయన ఆ దిశగా ప్రయత్నమే చెయ్యలేదు. *సినిమాల్లోలాగా హీరోయిజం ప్రదర్శించాలని, ప్రజలలో తనకున్న జనాకర్షణను మరింతగా ఇనుమడింపజేసుకోవాలని భావించాడో ఏమిటో తెలీదు. ఇంత చేస్తాం, అంత చేస్తాం, అంతు చూస్తాం అంటూ ప్రగల్భాలు పలికాడు*. ఇప్పుడు రష్యాను ఏదో విధంగా చర్చలకు ఒప్పించాల్సిందిగా అందరినీ ప్రాధేయపడుతున్నాడు. ఈ జ్ఞానమేదో మొదటే ఉండుంటే ఇంత అనర్థం జరుగకపోను కదా? అది కూడా ఓసారి చర్చలకు సిద్దమనీ, మరోసారి కాదనీ ఇలా పూటకోమాట మాట్లాడుతున్నారు. 


తెలివైన రాజకీయవేత్త ఎవరూ ఇలా ప్రవర్తించరు. ఈయూలోనో, రష్యాలోనో చేరే విషయమై మేం మరో పదేళ్ళ తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పి సమస్యను ఓ దశాబ్దం పాటు వాయిదా వేసుండేవారు. అసలు విషయం ఏంటంటే..... ఇంతకముందు ఉన్న అధ్యక్షుడితో ఈ విషయంలోనే విభేదించి, ఈయూలో కలుద్దామనుకుంటున్న ప్రజల అభీష్టానికి విరుద్ధంగా అధ్యక్షుడు వ్యవహరిస్తున్నాడంటూ ప్రజలను రెచ్చగొట్టి, తాను వారి కలలను నిజం చేస్తానంటూ ఓ పిచ్చి హామీ ఇచ్చి ఈయన అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు ఆ హామీలను నిలబెట్టుకునే వెఱ్ఱి ప్రయత్నంలో ఇలా దేశాన్ని కష్టాల కొలిమిలోకి నెట్టేశాడు. ఇది ఆయన అపరిపక్వతకు నిదర్శనం.

 

అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో ఉక్రెయిన్ దేశ ప్రజలతో పాటుగా, ప్రపంచ దేశాల ప్రజలందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే.... దేశాన్ని నడిపించే నాయకులకు కావాల్సింది గ్లామరో, గ్రామరో, హ్యూమరో కాదు. తన దేశం పట్ల అపారమైన ప్రేమ, తన దేశ ప్రయోజనాల పట్ల రాజీ లేని తత్వం, ప్రపంచ పరిస్థితుల పట్ల అవగాహన. ఎవరితో ఎలా మెలిగితే తన దేశానికి ప్రయోజనమో తెలిసిన నేర్పు, ఓర్పు, పట్టువిడుపు ఉన్నవాడు, పరిస్థితులకు తగ్గట్టుగా జనాన్ని కన్విన్స్ చెయ్యగలిగినవాడే నిజమైన నాయకుడు అవగలుగుతాడు. వ్యక్తిగతమైన భేషజానికో, ప్రతిష్ఠకో ప్రాకులాడి దేశ రక్షణను, ప్రయోజనాలను ఫణంగా పెట్టేవాడు కాదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సంయమనం కోల్పోకుండా తన దేశ హితమే పరమార్థంగా పనిచేసేవాడు, ఎక్కడ నెగ్గాలో.... ఎక్కడ తగ్గాలో తెలిసిన నాయకుడు (ఇది కూడా తెలుగు సినిమా డైలాగే)  మాత్రమే ఏ దేశాన్నైనా ప్రగతి పథంలో నడుపగలుగుతాడు. 


*ప్రజలు కూడా సినీ, క్రీడా గ్లామర్ కో, కులానికో, వర్గానికో, ప్రాంతానికో, భాషకో, మతానికో ప్రాధాన్యం ఇవ్వక దేశ హితమే పరమ లక్ష్యంగా భావించి, ఆలోచించి తమ నేతను ఎన్నుకున్నప్పుడే ప్రజాస్వామ్యం సఫలమవుతుంది*. పునరాలోచించించండి మహాశయా.