25, జనవరి 2023, బుధవారం

Advocate in Telangana

 Respected Advocate,


Pls check your COP status by entering your Enrolment number. If the particulars are with empty space it infers that you have to submit COP, which you can submit by 31-1-2023. Pls also inform to your colleague advocates.


Advocates enrolled after June 2010 upto December 2017 and who have not submitted the COP, should submit Form A ( COP application) on or before 31-01-2023.


Advocates enrolled from 2018 onwards have to submit declaration form without fail.


If required download the COP forms from Bar Council website.



http://www.telanganabarcouncil.org/cop-details/


A Ananthasen Reddy

Bar Council Member, TS

సుభాషితమ్

 *సుభాషితమ్* 


శ్లో𝕝𝕝 కుతోఽహమాగతః కోఽస్మి  క్వ గమిష్యామి కస్య వా।

కస్మిన్ స్థితః క్వ భవితా కస్మాత్కిమనుశోచసి॥


తా𝕝𝕝  "నేను ఎవడను? ఎక్కడినుండి వచ్చాను? ఎక్కడికి పోతాను? ఎవరితోనైనా నాకు ఉన్న సంబంధం ఏమిటి? ఏ ప్రదేశంలో ఉన్నాను? ఎక్కడ మళ్లీ జన్మిస్తాను? ఈ ప్రశ్నలకు సరైన సమాధానం మనకు తెలుసునా? ఇవి అన్నీ బాగా ఆలోచిస్తే ఇంకా దుఃఖించడం ఎందుకు?".


*సేకరణ*

సన్యాసి - సమాధి

 సన్యాసి - సమాధి


1986లో తిరుచిరాపల్లిలోని ఆంగరై నుండి కొంతమంది భక్తులు పరమాచార్య స్వామివారి దర్శనానికి వచ్చారు. స్వామివారు వారితో చాలా విషయాలు మాట్లాడిన తరువాత కావేరీ తీరంలో ఉన్న సంధ్యావందన ఘాట్ గురించి వారిని అడిగారు.


అక్కడే దగ్గర్లో నిలబడి మహాస్వామివారి భిక్షా కైంకర్యం పర్యవేక్షిస్తున్న ఆంగరై శ్రీకంఠన్ ను చూపిస్తూ, “నేను ఎప్పుడు ఆంగరై గురించి అడిగినా, ఇతను తనకు ఏమి తెలియదని సమాధానం చెబుతాడు” అని అన్నారు.


అందుకు శ్రీకంఠన్ స్వామివారితో, “నేను ఆంగరై వదిలి నలభై సంవత్సరాలు అయ్యింది. కాబట్టి నాకు అక్కడి విషయాలు ఏమి తెలియవు” అని సమాధానం చెప్పాడు.


“ఎవరో కొంతమంది ఆ సంధ్యావందన ఘాట్ ని ఆక్రమించుకుని గుడిసెలు వేసుకున్నారు. ఇప్పుడు అక్కడ కేవలం కొంత స్థలం మాత్రమే మిగిలిఉంది” అని దర్శనానికి వచ్చిన భక్తులు చెప్పారు.


“వారంతా పేదవారు. వారిని మీరు అక్కడినుండి పంపించాల్సిన పని లేదు. ఆ మిగిలిన స్థలానికి ఒక ప్రహరీ కట్టి, రెండు మారేడు చెట్లు తులసి చెట్టు నాటి వాటిని పోషించండి” అని స్వామివారు ఆదేశించారు.


పరమాచార్య స్వామివారి ఆదేశానుసారం చేస్తామని వారు స్వామివారితో విన్నవించుకున్నారు.


2003వ సంవత్సరంలో శ్రీకంఠన్ సన్యాసం స్వీకరించారు. వారు తిరువానైకోవిల్(జంబుకేశ్వరం) లోని శ్రీమఠం శాఖలో ఉంటూ అక్కడే సిద్ధి పొందారు. అక్కడి శ్రీమఠం తోటలోనే వారిని శరీరాన్ని ఉంచాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఎందుకంటే తిరువానైకోవిల్ శ్రీమఠం దేవాలయ పంచ ప్రాకారాలలోనే ఉండటం వల్ల ఇక్కడ ఖననం చెయ్యడం సరికాదని కొంతమంది ఈ నిర్ణయాన్ని ఆక్షేపించారు.


వారికి ఏమి చెయ్యాలో అర్థం కాక ఆంగరైలో ప్రహరీ నిర్మిచిన వ్యక్తీ సూచన మేరకు, పెద్దస్వామి ఆదేశానుసారం వారి పార్థివ దేహాన్ని అక్కడకు తీసుకుని వెళ్లి సన్యాస సంపరదాయం ప్రకారం సమాధి చేశారు.


2003లో దేహత్యాగం చేసే తన సన్యాస శిష్యుని కోసం 1986లోనే స్థలాన్ని సిద్ధం చేసి ఉంచారు పరమాచార్య స్వామివారు. ఇది కేవలం కాకతాళీయమా? లేక పరమాచార్య స్వామివారి దిర్ఘదృష్టికి నిదర్శనమా?


--- మహాపెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 3


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

పరమాచార్య వారి హాస్య చతురత....

 పరమాచార్య వారి హాస్య చతురత....

ఒకసారి స్వామి వారి దర్శనానికి ఒక వృద్దుడు వచ్చాడు.

వృద్దుడు "స్వామి. నాకు మూడు రోజులుగా జ్వరం తగులుతున్నది. దాని వల్ల ఏ పని చేయలేక పోతున్నాను. తమరు దయతో నాకు ఈ బాధ నుండి విముక్తి ఇవ్వండి."

స్వామి నవ్వుతూ "సరిపోయింది. నాకూ మూడు రోజులుగా జ్వరం. ఎవరికీ చెప్పుకోలేక చూస్తున్నాను. అలా కూర్చోండి. మీకోసంగతి చెప్పాలి.ఒక ఊర్లో ఒక పూజారి ఉండేవాడు. అతనికి వాక్ శుద్ధి ఉన్నది. అతను జరగబోయేది ఖచ్చితంగా చెప్పేవాడు. అతనికి ఆ ఊరి పోలీస్ మంచి మిత్రుడు.

ఒకరోజు గుడి తలుపులు తీసేసరికి ఆభరణాలు మాయమయినట్లు గుర్తించాడు. వెంటనే తన పోలీస్ మిత్రుడికి ఫిర్యాదు చేయడానికి బయలుదేరాడు.అదే సమయంలో పోలీస్ కూడా పూజారిని వెతుక్కుంటూ గుడివైపు వస్తున్నాడు."ఆడబోయిన తీర్ధం ఎదురైందని "పూజారిని చూసి పోలీస్ అనుకుంటే,"వేదకబోయిన తీగ కాలికి తగిలిందని "పోలీస్ ను చూచిన పూజారి అనుకున్నాడు.

పూజారి "నువ్వెందుకు పరిగెత్తుకొని వస్తున్నావ్ "

పోలీస్ "నా సైకిల్ ఎవరో ఎత్తుకొని పోయారు. నువ్వు భవిష్యవాణి చెబుతావని వస్తున్నా "

పూజారి "అరె రామ. గుడిలో పూజ సామాగ్రి పోయిందని నీకు ఫిర్యాదు చేద్దామని వస్తున్నా."

ఇలా ఉంది మన పరిస్థితి

నువ్వు జ్వరం తగ్గాలని నా దగ్గరకు వచ్చావు. నాకూ మూడు రోజులుగా జ్వరం నేనెవరికీ చెప్పుకోవాలి."

అంటూ స్వామి నవ్వితే వృద్దుడూ శృతి కలిపాడు.

***జ్వరం సంగతి పక్కన పెడితే స్వామి వారి చతురత, సమయస్ఫూర్తి కి భక్తులు ఆనందించారు.

నేతాజీ జయంతి

 ॐ నేతాజీ జయంతి శుభాకాంక్షలు. 


    జై హింద్ నినాదంతోనూ, 

   "ఆజాద్ హింద్ ఫౌజ్" అనే భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేసీ, 

    భారత స్వాతంత్ర సమరంలో ఎంతో ఉత్తేజ పరచిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ నుంచి జాతి ఇప్పటికీ ఎంతో నేర్చుకోవలసి ఉంది.  

    

అందుకు ప్రబల ఉదాహరణ


    ఆ రోజుల్లో మహాత్మాగాంధీ మాటకి తిరుగుండేదే కాదు. 

    భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఆయన మాటను ధిక్కరించి నిలబడడమే ఎంతో సాహసం. 

    కాంగ్రెస్ సాధారణ సభ్యత్వం నాలుగు అణాలు. కాంగ్రెస్సులో తనకు నాలుగణాల సభ్యత్వం కూడా లేదంటూనే, గాంధీ, నేతాజీకీ ప్రత్యర్థిగా భోగరాజు పట్టాభి సీతారామయ్యని నిలబెట్టి, 

   "పట్టాభి ఓటమే నా ఓటమి" అని ప్రకటించినా, 

    అటువంటి పరిస్థితులలో దానికి ఎదురీది, గెలిచిన నేతాజీని చూసి మనమెంతో నేర్చుకోవాలి కదా! 

    గెలిచి చూపించిన ధైర్యమూ, రాజీనామా చేసిన ఆయన త్యాగమూ మన యువతకు అలవడితే, 

   మన జాతి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకుందాం. 

    అడుగు ముందుకేద్దాం. 

    నేతాజీ మనకిచ్చిన మార్గంలో పయనించి, దేశ ఔన్నిత్యాన్ని నిలబడదాం. 

                జై హింద్

మాతృ భాష పరిరక్షింప బడవలెననిన

 47వ రోజు:

Know about a telugu word Daily.

మన మాతృ భాష పరిరక్షింప బడవలెననిన ముందు అందరకు ఆ భాష మీద అవగాహన, పదకోశము అత్యంతావశ్యకము. అందు నిమిత్తము నా వంతు కృషిలో భాగముగా ప్రజోపయోగము గల ఒక పదమునకు గల పర్యాయ పదములను అందించ సంకల్పించినాను. ఈ నా కృషికి అందరు సహకరించి తమ తమ సమూహములలో ఉంచి విశేష ప్రచారణకు తమవంతు సహాయమును అందింతురని ఆశించు చున్నాను.

47వ రోజు (23-01-2023):

వజ్రము : అక్షజము, గుండుఱాయి, తెలిమిన్న  దృఢాంగము, పోతుమానికము, భార్గవప్రియము, షట్కోణము, సూచూముఖము, హీరకము, హీరము 

ఆంగ్లము: Diamond

24, జనవరి 2023, మంగళవారం

మాఘ_పురాణం* *4_వ_అధ్యాయము

 *మాఘ_పురాణం* *4_వ_అధ్యాయము*

*25-01-2023 బుధవారం*


🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳


*సుమిత్రుని_కథ*


పార్వతీదేవియు శివుని మాటలను విని స్వామీ మరి గురుకన్యా సంగమము చేసిన ఆ సుమిత్రుడు, సుదేవుని శిష్యుడు అతడేమయ్యెనో వాని వృత్తాంతము నెరుగ గోరుచున్నాను, దయయుంచి దానిని వివరింపుడని కోరగా శివుడిట్లు పలికెను.


 పార్వతీ..! సరియైన ప్రశ్ననడిగితివి వినుము. సుదేవుని శిష్యుడును తాను చేసిన గురు పుత్రికా సంగమమునకు పశ్చాత్తాపపడెను, చనిపోదునని గురు పుత్రిక బెదిరించుటచే భయపడి ఆమెతో వ్యభిచరింతినని అతడు బాధపడుచుండెను. తుదకు తనలోని బాధను భరింపలేక గురువు వద్దకు వచ్చి నమస్కరించి యిట్లు పలికెను. గురువర్యా! పూర్వము నేను మీ వద్ద చదువుచున్నప్పుడు ఒకనాడు సమిధలు మున్నగువాటికై అడవికి మీ ఆజ్ఞచే పోతిని.. మీ కుమార్తెయు బంతితో నాడుకొనుచు నాతో మీరు చూచుచుండగానే అడవికి వచ్చినది. అచట నిర్జనమైన ఏకాంత మనోహర ప్రదేశమున నన్ను తన కోరిక తీర్చవలసినదిగ బలవంతపెట్టినది. నేనందుకు అంగీకరింపలేదు. అప్పుడామె ఓయీ! నీవు నామాట విని నన్ను కూడనిచో నేనిచట నా ప్రాణములను విడిచెదను అనగా బలవంతముగ నాత్మహత్య చేసికొందును. నేను లేకుండ నీవింటికి పోయినచో నాతండ్రి నా కుమార్తె యెక్కడయని అడిగిన నీవేమని చెప్పగలవు. నీ గురువైన నా తండ్రి నా యందలి ప్రేమచే నిన్ను తప్పక శపించును. మూర్ఖుడా! యిప్పటికైనను నన్ను పొంది సుఖించుము. నన్ను వేగముగ కౌగలించు కొనుము.. రమ్ము. నా కోరికను దీర్చుమని యనేక విధములుగ నిర్భందించినది. నేనును మీ శాపమునకు భయపడి ఆ అరణ్యమున మీ పుత్రికతో రమించి ఆమె కోరికని తీర్చితిని. తరువాత నీ విషయమును మీకు చెప్పుటకు భయపడితిని. మీకుమార్తె చేసిన ద్రోహము వలన నేను పాపమును పొందితిని. దయయుంచి క్షమించి ఇట్టి పాపమునకు ప్రాయశ్చిత్తమును బోధింపుడని ప్రార్థించెను.


సుమిత్రుని మాటలను విని సుదేవుడు కొంతసేపు విచారించి యిట్లు పలికెను. ఓయీ! నీవు యితరుల ఒత్తిడికిలోనై చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తము నడుగుచున్నావు. వినుము అన్ని నదులలో మిక్కిలి యుత్తమ నదియైన గంగా తీరము నకు పోయి పన్నెండు సంవత్సరముల పాటు తపమాచరింపుము. అదియే నీకు తగిన ప్రాయశ్చిత్తమని పలికెను. శిష్యుడైన సుమిత్రుడును గురువుచె ప్పిన యుపదేశము ను పాటించి గంగా తీరమునకు ప్రయాణమయ్యెను. అతడు తన ప్రయాణములో ఒకచోట నొక దివ్యమైన ఆశ్రమమును జూచెను. ప్రయాణము చేయవలసిన యతడు అచట విశ్రమించ దలచెను. అచటి వారందరును శిష్యులు, మిత్రులు, కుటుంబసభ్యులు మున్నగువారితో మాఘ స్నానము చేసి శ్రీహరిని ఆ సరస్సు తీరమున పూజించి మాఘ పురాణమును వినుచుండిరి.


సుమిత్రుడును వారికి నమస్కరించి మీరు చేయు వ్రతమెట్టిది దయయుంచి వివరింపుడని ప్రార్థించెను. ఈ వ్రతమునకు ఫలమేమి? దీనిని చేసినచో నేలోకము కల్గును. మీరు పూజించునది యే దైవమును దయయుంచి చెప్పుడని యడిగెను. వారు సుమిత్రుడడిగిన ప్రార్థన విని తమలో నోకడైన సత్యవ్రతుడను వానిని విషయము వివరింపుమని నియమించిరి. సత్యవ్రతుడు సుమిత్రునితో ఇట్లు పలికెను, ఓయీ శ్రద్దగా వినుము. 


సూర్యుడు మకర రాశిలో నుండగ మాఘ మాసమున ప్రాతఃకాలమున నది, సరస్సు మున్నగువాని యందు స్నానము చేసినవాడు శ్రీహరికి యిష్టుడగును. ఇట్లు మాఘమున ప్రాతఃకాల స్నానము చేసి తీరమున శ్రీహరిని అర్చించి శ్రీహరి మహిమను వివరించు పురాణమును వినుచు మాఘ మాసమంతయు గడుపుట పుణ్యప్రదమైన వ్రతము. మాఘ స్నానము మానినవాడు సత్యశౌచములను విడిచినవాడు, పరులను నిందించువాడు, బ్రహ్మహత్య చేసిన వానితో సమానులు, అబద్దపు సాక్ష్యమును చెప్పినవాడు, దురాచారుడు స్త్రీ సాంగత్యలోలుడు మాఘ మాస స్నానము మానినవాడు, బ్రహ్మహత్య చేసిన వానితో సమానులే యగుదురు. తోటలను కూల్చినవాడు, కన్యలను, అశ్వములను అమ్మినవాడు, చెరువుగట్టును తెగ కొట్టినవాడు, పరస్త్రీ సాంగత్యము కలవాడు, దేవద్రవ్యము నపహరించువాడు, తానిచ్చిన దానినే దొంగలించువాడు, మద్యపాన లోలుడు, ఆడిన మాటను తప్పినవాడు, పెద్దలను, దేవతలను, బ్రాహ్మణులను ద్వేషించువాడు, దేవునికి నివేదన చేయని అన్నమును తినువాడు, పితృశేషాన్న భోజనుడు, సోదరుని భార్యతో రమించువాడు, అసత్య భాషణుడు, భుజించుచు అపవిత్రుల మాటలను వినువాడు, పురాణ శ్రవణమును, వివాహాది శుభకార్యములను పాడు చేయువాడు, తల్లిదండ్రులను దేషించువాడు, వీరందరును పాపాత్ములే సుమా.. మేము చేయుచున్న యీ మాఘమాస వ్రతమును పాటించినచో యీ పాపుల బుద్ధులు మారి పరిశుద్ధులై పుణ్యముల నందుదురు. మాఘస్నానము చేసి తీరమున తులసీ దళములతో మాధవునర్చించిన వాని పుణ్యo అమితమైనది సుమా. వ్రతాంతమున చేయు అన్నదానము శుభఫల ప్రదము. ఈ వ్రత మాచరించిన వానికి పునర్జన్మ యుండదు అని సత్యవ్రతుడు మాఘ స్నాన వ్రత ఫలమును పెక్కు విధములుగ వివరించెను.


 సుమిత్రుడును వారికి తాను చేసిన పాపమును, గురువు చెప్పిన ప్రాయశ్చిత్తమును వివరించెను. అప్పుడు వారు మాఘ స్నానమును మూడు దినములు చేసిన సర్వపాపములు నశించును. కావున యీ మాసమున యింకను మూడు దినములు మిగిలియున్నది. ఈ మూడు దినములును మాఘస్నాన మాచరించి ప్రాయశ్చిత్తముగ గంగాతీరమున తపము చేయుమని సుమిత్రునకు హితము పలికిరి.


సుమిత్రుడును వారి మాట ప్రకారము మాఘ మాసము చివరలో మిగిలిన మూడు దినములును మాఘ స్నానమును చేసి గంగా తీరమునకు పోయి ప్రాయశ్చిత్త తపము నారంభించెను. నిశ్చలమైన అతని తపము తీవ్రమై వర్ణింపరాని తీరులో నుండెను. ఈ విధముగా పన్నెండు సంవత్సరములు గడచినవి. అయినను మానక అతడిట్లు తపమాచరించుచు చక్రపాణి యగు, శ్రీ హరి కృపా విశేషము నంది అనుగృహీతుడై మాఘస్నాన ప్రభావముచే గంగాతీర తపశ్చర్యచే కేవల ప్రాయశ్చితమునే గాక, మోక్షమును కూడా పొందెను. పార్వతీ నీవడిగిన సుదేవ శిష్యుడగు సుమిత్రుని వృత్తంతమును పూర్తిగ చెప్పితిని. సుమిత్రుని పాప వినాశమును, పుణ్యప్రాప్తిని వివరించు యీ కథను మాఘ స్నానము చేసినవాడు శ్రీహరి పూజానంతరము ఒకసారి చదివినను వైకుంఠమును చేరును. వాని పితృ దేవతలును తమ పాపములను పోగొట్టుకొని వైకుంఠము నందుదురు. చందోవిహీనమైన మంత్రము, ఓంకారము లేని తపస్సు, మాఘస్నాన పూజాదులు లేని ధర్మాచరణ వ్యర్థములు సుమా అని శివుడు పార్వతికి వివరించెను..


ఇతి శ్రీ మాఘ పురాణే చతుర్థోధ్యాయః పారాయణం సంపూర్ణం...


🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

*🅰️🅿️SRINU*

*కాశీ ఖండం - 7*

 *కాశీ ఖండం - 7*


🎈🎈🎈🎈🎈🎈🎈🎈 


 యమ ధర్మ రాజు రచించిన ‘’లలిత ప్రబంధం‘’ అనే మహాగ్రంధం నామాన్ని స్మరించేవారికి కూడా, పునర్జన్మ ఉండదు అని, విష్ణు దూతలు, శివశర్మకు చెప్పినట్లు, అగస్త్య ముని, లోపాముద్రకు, తెలియ జేశాడు. 


 అక్కడి నుండి విష్ణు దూతలు, శివశర్మను అప్సరలోకానికి, ఆ తర్వాత సూర్య లోకానికి, తీసుకొని వెళ్లారు.  ఆ లోకాల వివరాలు తెలుసుకొందాం



 *అప్సరస, సూర్యలోక వర్ణన*



విష్ణు దూతలు, శివశర్మను అప్సరస లోకానికి తీసుకొని వెళ్లారు .అక్కడ ద్యూత విద్య లో నేర్పరులు, రసజ్ఞులు అయిన ఆడవారుంటారు.  సమస్త భాషలలో వారు కోవిదులు . క్షీరసాగర మధనంలో జన్మించినవారు.  మన్మధుని త్రిభువన విజయాస్త్రాలు వారే.


 ఊర్వశి, మేనక, రంభ, చంద్రలేఖ, తిలోత్తమ, వపుష్మతి, 

కాంతిమతి, లీలావతి, ఉత్పలావతి, అలంబుష, గుణవతి, స్థూలకేశి, కళావతి, కళానిధి, గుణనిధి, కర్పూరతిలక, ఉర్వార, అనంగతిలక, మదన మోహిని, చకోరాక్షి, చంద్రకళ, ముని మనోహర,  గవద్రావ, 

తపోద్వేష్టి, చారునాన, సుకర్ణిక, దారు సంజీవని, సుశ్రీ, క్రమ శుల్క, శుభానన, తపస్శుల్క, హిమావతి, పంచాశ్వమేదిక, రాజసూయార్ధిని, అష్టాగ్ని హోమిక, వాజపేయ శతోద్భవ, మొదలైనవారు అప్సరస గణం. వీరి సంఖ్య 6,000.  


 ఇతర స్త్రీలు కూడా కొందరుంటారు. వీరంతా లావణ్యంతో, నిత్య యవ్వనంతో, దివ్యామ్బరాలతో ఉంటారు. వీరందరూ స్వైరుణులు, సుసంపన్నులు. కోరిక తీర్చే వ్రతాలు చేసి, ఉద్యాపనాలు చేసినవారు. అప్సరసలోకానికి చేరుకొంటారు. వీరంతా సంగీత నృత్యాలలో అఖండులు. వీరిని దేవ వేశ్యలని అంటారు. సూర్యసంక్రమణం నాడు దానం చేసిన వారు, ’’మొదాత్‘’ అనే మంత్రాన్ని అనుష్టించి, దానాలిచ్చిన వారు, ఇక్కడికి చేరుకొంటారు. 


 తర్వాత సూర్య లోకానికి చేరుకొన్నాడు శివశర్మ . సూర్యలోకము తొమ్మిది యోజనాల విస్తీర్ణం కలది. విచిత్రాలైన ఏడు గుర్రాలు, ఒకే చక్రం ఉన్న రధం పై అనూరుడు సారధిగా, సూర్యుడు, నిత్య సంచారం చేస్తూంటాడు. క్షణకాలంలోనే ఆవిర్భావ, తిరోభావాలను పొందే సూర్యుడు, ప్రత్యక్ష వేద పురుషుడు. ఆదిత్యుడే సాక్షాత్తు బ్రహ్మ. సూర్యుని వల్లనే, సకల జీవరాశులు, ఆహారాన్ని సంపాదిoచు కొంటున్నాయి. ప్రత్యక్ష సాక్షి , కర్మసాక్షి.  గాయత్రీ మంత్రంతో సకాలంలో వదలబడిన అర్ఘ్యం నశించదు, అది మూడు లోకాల పుణ్యాన్ని అందిస్తుంది. సూర్యోపాసన చేసేవారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు, మిత్ర , పుత్ర, కళత్రాలు, అష్టవిధ భోగాలు స్వర్గ మోక్షాలు కలుగుతాయి. 


 ఆష్టాదశ విద్యల్లో, మీమాంస గొప్పది. దాని కంటే తర్కం, దానికంటే పురాణం గొప్పవి.  వీటికంటే ధర్మ శాస్త్రం, వాటికంటే వేదాలు, వేదం కంటే ఉపనిషత్తులు, వీటికంటే గాయత్రీమంత్రం, గొప్పవి. అది ప్రణవ సంపుటి. గాయత్రి మంత్రం కంటే అధికమైన మంత్రం, మూడు లోకాలలోనూ లేదు. గాయత్రి వేదజనని. గాయత్రి వల్ల బ్రాహ్మణులు జన్మిస్తున్నారు. తన మంత్రాన్ని ఉపాశించే వారిని రక్షిస్తుంది కనుక, గాయత్రి అని పేరు. సూర్యుడు సాక్షాత్త్ వాచ్యుడు, గాయత్రి సూర్యుని గూర్చి చెప్పే వాచకం. 


 గాయత్రి మంత్రం చేత, రాజర్షి విశ్వామిత్రుడు, బ్రహ్మర్షి అయాడు. గాయత్రియే, విష్ణువు, శివుడు, బ్రహ్మా. అమ్శుమాలి అని పిలువబడే సూర్యుడు దేవత్రయ స్వరూపుడు. అన్ని తేజస్సులు దివాకరునిలో ఉన్నాయి.

 ఆయనే కాల స్వరూపుడు, కాలుడు కూడా. తూర్పున ఉదయించి సమస్త విశ్వాన్ని ధరించే విశ్వ సృష్టికర్త. పడమర దిశలో సర్వతోముఖుడై, 

కనిపిస్తాడు. ఉత్తరాయణ, దక్షిణాయణ పుణ్యకాలాలలో, షడతీతుల్లో, విష్ణుపంచకంలో ఎవరు మహా దానం చేస్తారో, పితృక్రియలు నిర్వ హిస్తారో, వారు సూర్య సమాన తేజస్కులై , సూర్యలోకంలో  నివసిస్తారు. ఆదివారం, సూర్య గ్రహణం నాడు దానం చేస్తే, ఉత్తమ లోక ప్రాప్తి. 

హంసుడు, భానుడు, సహస్రాంశువు, తపనుడు, తాపనుడు, రవి, వికర్తనుడు వివశ్వంతుడు, విశ్వకర్మ, విభావనుడు, విశ్వ రూపుడు, విశ్వకర్త, మార్తాండుడు, మిహిరుడు, అంశుమంతుడు, ఆదిత్యుడు, ఉష్నగుడు, సూర్యుడు, ఆర్యముడు, బ్రద్నుడు, ద్వాదశాదిత్యుడు, సప్తహయుడు, భాస్కరుడు, ఆహస్కరుడు, ఖగుడు, శూరుడు,

ప్రభాకరుడు, శ్రీమంత్రుడు, లోకచక్షువు, గ్రహేశ్వరుడు, త్రిలోకేశుడు, లోక సాక్షి, తమోరి,

శాశ్వతుడు, శుచి, గభస్తి, హస్తాంషుడు, తరణి,

సుమాహారిణి, ద్యుమణి,

హరిదాశ్వుడు, అర్కుడు,

భానుమంతుడు, భయనాశనుడు, చందోశ్వుడు, వేదవేద్యుడు, భాస్వంతుడు, పూషుడు, వృషాకపి, ఏక చక్రధరుడు, మిత్రుడు, మందేహారి, తమిశ్రఘ్నుడు, దైత్యఘ్నుడు, పాపహర్త, ధర్ముడు, ధర్మప్రకాశకుడు, హీళి, చిత్రభానుడు, కలిఘ్నుడు, తార్ష్యవాహనుడు, దిక్రుతి, పద్మినీనాభుడు, కుశేషయకారుడు, హరి, ఘర్మరశ్మి, దుర్నిరీక్షుడు, చందాంశువు, కశ్యపాత్మజుడు, అనే డెబ్బదిరెండు పేర్లుసూర్యునికి ఉన్నాయి. 


 ఇందులో ప్రతి నామం మొదట ఓం అని చేర్చి ఉచ్చరిస్తూ, సూర్యుని చూస్తూ నమస్కరిస్తే, సూర్యలోక ప్రాప్తి కలుగుతుంది. రెండు చేతులతో ఎర్రగా తోమిన రాగి చెంబు నిండా, నిర్మల మైన జలాన్ని నింపి, మోకాళ్ళపైన భూమి మీద కూర్చుని, గన్నేరు పూలు ,రక్త చందనం, గరిక, అక్షతలు ఆ పాత్రలో ఉంచి సూర్యుడిని ధ్యానిస్తూ, ఫాలభాగం దగ్గర ఆ చెంబు నుంచుకొని, స్తిరచిత్తంతో, పైన చెప్పిన 72 సూర్య నామాలను ఉచ్చరిస్తూ, సూర్యునికి అర్ఘ్యాన్నిచ్చేవాడెప్పుడు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతాడు. వ్యాధులు నశిస్తాయి’’. అని శివశర్మకు, విష్ణుదూతలు వివరించారని, భార్య లోపాముద్రకు అగస్త్య ముని చెప్పాడు.


 *కాశీఖండం సశేషం..*

🎈🎈🎈🎈🎈🎈🎈🎈

*🅰️🅿️SRINU*

సృష్టి మూడు రకాలు

 🙏 *శుభోదయం* 🙏


*‌ఈ ప్రపంచంలోని సృష్టి మూడు రకాలుగా ఏకమై ఉంటుంది...*

 

*‌సృష్టి, స్థితి, లయలతో ఇది నడుప బడుతుంది*


*‌సత్వ రజస్తమో గుణాలతో నిండి ఉంటుంది...*


*‌ఇలా ఏకమై ఉన్న ఈ సృష్టి అనేకంగా కనిపిస్తూ మనిషిని భ్రమింప చేస్తుంది...*

 

*‌సృష్టిలో ఏదైనా అది పరమాత్మయే...ఈ సృష్టే పరమాత్మ...*


*‌చూసే ప్రతిదీ, వినే ప్రతిదీ, అనుభూతి చెందే ప్రతిదీ ఆ పరమాత్మ స్వరూపమే..*

 

*‌ఆ పరమాత్మనే నేను ..* 


*‌ద్రష్ట (చూసేవాడు),  దృశ్యం (చూడబడేది), దృక్కు (చూడగలిగే శక్తి) మూడూ నేనే ..*


*‌ధ్యాత (ధ్యాన శక్తి ), ధ్యాని (ధ్యానించేవాడు) ధ్యేయము (ధ్యానించే శక్తి) మూడూ నేనే ..*


*‌శ్రోత (వినే వాడు), శ్రోత్రము (వినబడేది), శ్రవణం (వినికిడి శక్తి)  మూడూ  నేనే....*

 

*‌చివరగా తెలుసుకునేది (జ్ఞానం), తెలియబడేది (జ్ఞేయము), తెలుసుకునే వాడు (జ్ఞాత) నేనే...*


*‌నన్ను  నేనే  తెలుసుకుంటున్నాను...*


*‌తెలుసుకునేది - నేనే...*

‌ *తెలియబడేది - నేనే ..*

 

*‌ఆ తెలివి కూడా నేనే...*


*ఈ ఎరుకతో ఉండటమే సాధన, సమాధి స్థితి.*

   

🙏🙏🙏🙏🙏🙏

 

తేజస్స్వరూపుడివి

 శ్లోకం:☝

*తేజోఽసి తేజో మయి దేహి*

*వీర్యమసి వీర్యం మయి దేహి*

*బలమసి బలం మయి దేహి*

*ఓజోఽసి ఓజో మయి దేహి*

*మన్యురసి మన్యుం మయి దేహి*

*సహోఽసి సహో మయి దేహి*

 - శుక్ల యజుర్వేద సంహిత 


భావం: ఓ పరమాత్మా!

నీవు అనంతమైన తేజస్స్వరూపుడివి - నన్ను తేజోవంతునిగా చేయి. 

నీవు అనంతమైన వీర్యవంతుడివి - నన్ను వీర్యవంతునిగా చేయి. 

నీవు అనంత బలసంపన్నుడివి - నాకు బలాన్ని ప్రసాదించు. 

నీవు అనంత శక్తిమంతుడివి, ఉత్సాహవంతుడివి - నాకు శక్తిని, ఉత్సాహాన్ని ప్రసాదించు. 

నీవు అనంతమైన సహనము, ధైర్యసంపన్నుడివి - నాకు ధైర్యాన్ని, సహనాన్ని ప్రసాదించు.🙏

భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామి

 🙏 *ఓం నారాయణ- ఆది నారాయణ* 🙏


*గ్రంథం:* సర్వసమర్థుడు , భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామివారి దివ్య లీలలు

*రచన:* శ్రీ పెసల సుబ్బరామయ్య మాష్టర్ 


*శ్రీ స్వామివారి భజన మహత్యం*


డి.శారద, దమ్మపేట వాస్తవ్యులు స్వామి వారి భజన మహత్యాన్ని ఈ విధంగా చెప్తున్నారు


11 సం॥ వయసు గల మా పాపకి ప్రక్కటెముకల క్రింద నొప్పి వస్తుంది. డాక్టరుకు చూపిస్తే ఎక్సరే తీసాడు. మిగిలిన టెస్టులు చేసి ఏమీలేదు, గ్యాస్ నొప్పిలాగా ఉన్నది. అని బాగా పవర్ ఫుల్ టాబ్లెట్స్ ఇచ్చాడు. పులుపు, కారం తినవద్దు అన్నాడు. మా పాప సరిగా తీపి ఇష్టపడదు. అన్నం తిందాము అని వెళ్ళి రెండు ముద్దలు తిని నొప్పి వస్తుంది అని లేచిపోయేది. ఇలాంటి పరిస్థితులలో మందులు వాడుతూ పత్యం చేస్తే నెలరోజులకు తగ్గింది. తరువాత ఒక నెలరోజులు అయ్యాక కొంచెం పులుపు తగిలేసరికి మళ్ళీ నొప్పి వచ్చేసింది. 


మరలా డాక్టరు దగ్గరకు తీసుకొని వెళదాము అనుకున్నాను. ఈలోగా మా పాప ఒకరోజు గుడికి వెళ్ళి రెండు రూపాయలు దక్షిణ వేసి స్వామి నాకు నొప్పి తగ్గించు అని ప్రార్ధించింది. ఇంటికి వచ్చాక నాతో చెబితే నేను శనివారములు వెంకయ్యస్వామి భజన *"కాపాడవయ్యా వెంకయ్యస్వామి!"* చదువు అని చెప్పాను. సరే అని శుక్రవారం చదివింది. శనివారం చదివింది అంతే ఆదివారం నుండినొప్పే లేదు... పులుపు, కారం తింటున్నా రావటం లేదు. 


ఇప్పుడు మా పాప రోజూ వెంకయ్య స్వామి భజన చదువుతుంది. స్వామి కృపవల్లనే తగ్గింది అనే విశ్వాసం నాలోనేగాక మాపాపకు కలిగించారు. ఎంత కరుణామయులో! ఏమి ఇచ్చి ఆయన ఋణం తీర్చుకోగలము. జీవితాంతం ఆయన సేవలో నిలవగలగడమే మేము ఆయనకు ఇచ్చే దక్షిణ. మా ప్రయత్నానికి స్వామి ఎప్పుడూ (ఆయన సేవలో ఉండటానికి) సాయం చేస్తూ ఉండాలని ప్రార్ధిస్తున్నాను.

🙏 *ఓం నారాయణ -ఆది నారాయణ*🙏

🌹🌹🌹🌹🌹🌹🌹🌹

*మనం ఆలోచించినా, ఆలోచించకున్నా... మనకు రావలసినవి వచ్చి తీరుతాయి .  మనకు ప్రాప్తం లేనివి మనం ఎంత గింజుకులాడి ప్రయత్నించినా,  మన కర్మానుసారంగా ముందే నిర్ణయము అయిన దానికంటే అధికంగా.. మన ప్రస్తుత ప్రయత్నం వల్ల, ఆలోచనల వల్ల,  మనకి ఏమీ అనుభవానికి రావు*


*మన ప్రారబ్దంలో అవసరాలు పొందేందుకు కొంత కృషి చేయాలని వ్రాసి పెట్టి ఉంటే.... మన ఆలోచనలతో నిమిత్తం లేకుండా అప్పటికప్పుడు మనమే ఆయా పనులు నిర్వర్తించి తీరుతాము.   ఈ విషయంలో మన ఆలోచనలకు తావే లేదు*


*ఆ పని చేయవలసినట్లు ఉన్న మన పూర్వకర్మే... మన చేత ఆ సమయానికి ...ఆ పని చేయించి తీరుతుంది . ఆ కర్మే,  మనలను ఆ పని చేసేందుకు ముందుకు నెట్టి  మరీ చేయిస్తుంది .  నీవు ముందుగా  , ఎంత ఆలోచించినా,  ఆలోచించకున్నా ...ఆ విధంగానే పనిచేసి తీరుతావు.  ఆలోచన అనవసరం*

*దత్త స్వరూపులు.. పూజ్య భరద్వాజ మాస్టర్ గారు*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మాఘమాసంలో వస్తున్న 5 ఆదివారములు

 ☀️☀️☀️☀️☀️🙏☀️☀️☀️☀️☀️

ఈసారి మాఘమాసంలో వస్తున్న 5 ఆదివారములు చాలా విశేషమైనవి.


 మొదటి ఆదివారము జనవరి 22వ తారీకు.


రెండవ ఆదివారం జనవరి 29వ తారీకు 


మూడవ ఆదివారము ఫిబ్రవరి 5వ తారీఖు అదే రోజున పౌర్ణమి కూడాను మాఘ పౌర్ణమి, ఆదివారం రావడం అన్నది చాలా విశేషం.


 నాలుగవ ఆదివారము ఫిబ్రవరి 12వ తారీకు ఇది మరీ విశేషము. కారణం, సప్తమి తిధితో కూడుకున్న మాఘ ఆదివారం. ఇది ఒక రకంగా మరో రథసప్తమిగా చెప్పవచ్చు.


అయిదవ ఆదివారం ఫిబ్రవరి 19వ తారీకు,  ఈ రోజున మాస శివరాత్రి ఇది మరీ విశేషం. కాబట్టి ప్రతి ఆదివారము నాడు పరమాన్నం చేసుకొని ఆదిత్య హృదయం పారాయణ చేసుకొని పరమాన్నము నైవేద్యముగా పెట్టి ఆ ప్రసాదాన్ని తీసుకోండి. 


దయచేసి ఈ ఆదివారాల్లో నాన్ వెజ్ మాత్రం తినకండి. 


ఓం నమశివాయ.

*మాఘ పురాణం* *3 వ అధ్యాయము*

 *మాఘ పురాణం* 

*3 వ అధ్యాయము*

*24-01-2023 మంగళవారం*


🎈🎈🎈🎈🎈🎈🎈🎈


*గురు పుత్రికా కథ*


మంగళదాయినీ..! సర్వమంగళా..! మాఘ మాస స్నాన ప్రభావముచే పూర్వమొక బ్రాహ్మణ పుత్రిక పాప విముక్తయై తన భర్తతో హరి సాన్నిధ్యము నందినది. అని శివుడు పార్వతీ దేవితో పలికెను. అప్పుడు పార్వతీదేవి.. స్వామీ! ఆ బ్రాహ్మణ పుత్రిక యెవరు. ఆమె చేసిన పాపమేమి! మాఘ స్నానమున పాప విముక్తి నందిన విధానమేమి?  వివరముగ చెప్పగోరుచున్నా ననగా శివుడిట్లు పలికెను... 


దేవి వినుము.., పూర్వము సౌరాష్ట్ర దేశమున బృందారకమనే గ్రామంలో సుదేవుడనే బ్రాహ్మణుడుండేవాడు. అతడు సదాచార వంతుడు, వేదశాస్త్ర పండితుడు. అతనికి శిష్యులు చాలా మంది వుండేవారు. వారు గురు సేవ చేస్తూ విద్యాభ్యాసం చేస్తూ వుండే వాళ్లు. ఆ సుదేవునికి సర్వాంగ సుందరి అయిన కుమార్తె వుండేది. పొడవైన కేశములతో, చక్కని ముఖంతో, చక్కని కనుముక్కు తీరులో ఆమె మిక్కిలి మనోహరంగా వుండేది. ఇట్టి కుమార్తెను ఎవరికిచ్చి వివాహం చేయగలనని అతడు విచారిస్తూ వుండేవాడు.


ఒకనాడు సుమిత్రుడనే శిష్యుడు సమిధలు, ధర్భలు మొదలైన వాటికోసం గురువు పంపగా వెళ్ళాడు. బంతితో ఆడుకుంటున్న గురు పుత్రిక కూడా సుమిత్రుని వెంబడించి వెళ్లింది. సుమిత్రుడును చాలా దూరము పోయి ఆ అరణ్యములో ఒక జలాశయాన్ని చూచాడు. ఆ చెరువు గట్టున యెత్తైన చెట్లున్నాయి. నీరు నిర్మల మనోహరంగా వుంది., పద్మాలు. వాటిపై వ్రాలే తుమ్మెదల రొద, అనేక వర్ణములలో నున్న కలువలు, జల సంచారము చేయు జలప్రాణుల విహారము మొదలైన వానిచే ఆ సరస్సు మనోహరముగ నుండెను. కోకిలలు గుంపులు కట్టి మధుర ధ్వనులు చేయుచుండెను. చిలుకలు గోరువంకలు నేర్చిన మాటలను పలుకుచున్నవి. ఎత్తైన చెట్లతో కప్పబడిన ఆ ప్రదేశము ఒక ఏకాంత మందిరములా వుంది.


గురుపుత్రిక ఆ చెరువులోని నీరు త్రాగి అచట వృక్షములకున్న పండ్లను తిని ఒకచోట కూర్చుండెను. సుమిత్రునిపై మనసు పడింది. ఓయీ! మనుష్య సంచారము లేని, యేకాంత ప్రాయమైన యీ ప్రదేశంలో నాకు నీతో కలిసి సుఖపడాలని వున్నది. ఈ వనము నీకును నాకును నచ్చినది.. మన మిద్ధరమును పడుచు వారము, మన కలయిక సుఖప్రద మగును.. ఆలసించక నావద్దకు రమ్ము, నా శరీరము దూదికంటే మెత్తగా నున్నది, నీకు మరింత సుఖమిచ్చును, రమ్ము నన్ను మోహములో తనివి దీర కౌగిలించుకొనుము, రమ్ము రమ్మని పిలిచెను. 


సుమిత్రుడు మంచిదానా..! నీవిట్లనకుము, నీ మాట దురాచార పూరితము. నీవు వివాహము కాని బాలవు. నాకు గురు పుత్రికవు.. మనము సోదరీ సోదరులము, నీవు మన్మధ పరవశురాలవై ఇలా అనుచితముగా పలుకుచున్నావు. నేను నీతో రమింపజాలను.నేనీ మాటను సూర్యచంద్రుల సాక్షిగా చెప్పుచున్నాను. ఇట్టి పాపము చేసిన మనమిద్దరము చిరకాలము నరక వాసము చేయవలసి యుండును. కావున యింటికి పోదము రమ్ము, గురువు గారు మనకై ఎదురు చూచుచుందురు. ఆలస్యమైనచో నిన్ను దండింపవచ్చును. సమిధలు, దర్భలు మున్నగు వానిని గొనిపోదము రమ్ము అని పలికెను.


గురుపుత్రిక ఆ మాటలను విని ఓయీ! కన్యారత్నము, సువర్ణము, విద్యాదేవత, అమృతము స్వయముగ చెంతకు చేరినపుడు వలదన్నవాడు మూర్ఖుడు. ఒకరినొకరము కౌగిలించుకొనక సుఖము నందక నేనింటికి రాను. నేనిచటనే నా ప్రాణములను విడిచెదను. నీవు ఇంటికి తిరిగి వెళ్లి నేను రానిచో మా తండ్రి నిన్ను శపించును. నేను నీతో సుఖింపని యీ శరీరము నొల్లను. ఇచటనే యీ శరీరమును విడిచెదను. నీవు ఇంటికి పోయి దీని ఫలితo అనుభవింపుము అని నిష్టురముగ మన్మధావేశముతో మాటలాడెను. సుమిత్రుడును యేమి చేయవలెనో తెలియని స్థితిలో నుండెను. చివరకాతడు గురుపుత్రిక కోరికను దీర్చుట కంగీకరించెను. వారిద్దరును పద్మములతో, పుష్పములతో, ఎగురుటాకులతో మన్మధ శయ్యను తీర్చుకొని మనోహరమైన ఆ వాతావరణములో యధేచ్చా సుఖముల ననుభవించిరి. వారిద్దరును తృప్తిపడిన తరువాత సమిధలు మున్నగువానిని దీసికొని గ్రామమునకు బయలుదేరిరి. గురువు శిష్యుడు తెచ్చిన సమిధలు మున్నగు వానిని చూచి యానందపడెను. పుత్రికను చూచి నీవు చాల అలసినట్లున్నావు, మధురాహారమును తిని విశ్రాంతి నందుమని లోనికి పంపెను. ఆమెయు అట్లేయని లోనికెగెను.


తండ్రి యామెను కాశ్మీర దేశ వాసియగు బ్రాహ్మణకిచ్చి వివాహము చేసెను. కొంత కాలమునకు ఆమె భర్త మరణించెను. భర్తను కోల్పోయి నేలపై బడి దుఃఖించుచున్న కుమార్తెను చూడలేక సుదేవుడును మిగుల దుఃఖించెను. అయ్యో! సుఖముల నందవలసిన వయసులోనే బాధాకరమైన వైధవ్యము కలిగినదేమి..? ఈమెకిట్టి బాధను కల్పించిన ఆ బ్రహ్మయెంత మూర్ఖుడో కదా అని పలు విధములుగా దుఃఖించుచుండెను. ఇట్లు సుదేవుడు వాని భార్య దుఃఖించు చుండగా దృడవ్రతుడను యోగి ఆ ప్రాంతమున దిరుగుచు సుదేవుని రోదన ధ్వనిని విని వాని వద్దకు వచ్చి.. 'జ్ఞానస్వరూపా..! నీ దుఃఖమేమియో చెప్పుము. నీ దుఃఖమును పోగొట్టెదనని ధైర్యము చెప్పెను. సుదేవుడు తన దుఃఖ కారణమును చెప్పి మరల దుఃఖించెను. యోగి సుదేవును, భార్య పుత్రికలను చూచి క్షణకాలము ధ్యాన యోగము నంది యిట్లు పలికెను. ఓయీ..! వినుము.. నీ కుమార్తే పూర్వజన్మలో క్షత్రియ కులమున జన్మించినది. వ్యభిచారిణియై చెడు ప్రవర్తన కలిగి యుండెను. సౌందర్యవతి, యౌవనవతి యగు ఆమె తన జారుల మాటలను విని తన భర్తను వధించెను. భర్తను వధించి భయపడి శోకించి ఆత్మహత్య చేసికొనెను. ఈమె పతి హత్యను, ఆత్మహత్యను చేసినది. ఆ దోషము వలన నీమెకీ జన్మమున యిట్టి వైధవ్యము కలిగినది. ఇట్టి యీమె పవిత్రమైన నీ వంశమున నెట్లు జన్మించినదా యని నీకు సందేహము రావచ్చును. దానికిని కారణము కలదు వినుము. ఈమె తన పూర్వజన్మలో మాఘ మాసమున సరస్వతీ నదీ తీరమున గౌరీ వ్రతము నాచరించు వారితో కలసి వారు యిసుకతో చేసిన గౌరీదేవిని పూజించుచుండగా నీ వ్రతమును చూచినది. ఆ పుణ్యము బలమున నీమె పవిత్రమైన వంశమున జన్మించినది. ఈ జన్మయందును స్వేరిణియై నీ శిష్యులతో అధర్మముగ రమించెను. ఈ దోషము వలన నీమె తమ కర్మ ఫలముల యిట్ల ననుభవించుచున్నది.. చేసిన కర్మము ననుభవింవింపక తప్పదు కదా..!


సుదేవుడు యోగి మాటలను విని చెవులు మూసుకొని తన కుమార్తె పూర్వజన్మలో పతిహత్య, ఆత్మహత్యలకు పాల్పడుబదును. ఈ జన్మలో కన్యయై సోదర తుల్యుడైన తన శిష్యునితో రమించుటను విని మరింత దుఃఖించెను. యోగికి నమస్కరించి.. 'తండ్రీ! నా కుమార్తే చేసిన పాపము యేమి చేసిన పోవును? ఆమె భర్త జీవించుట యేట్లు జరుగును? దయయుంచి చెప్పుడని పరిపరి విధముల ప్రార్థించెను.' అప్పుడా యోగి 'ఓయీ విద్వాంసుడా! నీ కుమార్తె చేసిన పాపములు పోవుటకు, ఆమె మాంగళ్యము నిలుచునట్లును చేయుటకొక ఉపాయము కలదు. శ్రద్ధగా వినుము.. 


మాఘ మాసమున ప్రాతఃస్నానము చేసి ఆ నదీ తీరమున గాని, సరస్సు తీరమున  యిసుకతో గౌరీదేవిని జేసి షోడశోపచారము లతో పూజింపవలయును. సువాసినులకు దక్షిణతో  గౌరీదేవిని సమర్పించ వలయును. ఈ విధముగ ఈమె తో ప్రతిదినము చేయింపుము. ఈమె భర్త తిరిగి జీవించును. ఈమె పాపములను నశించును. మాఘ శుద్ద తదియ నాడు రెండు క్రొత్త చేటలను తెచ్చి వానిలో చీర, రవికల గుడ్డ, ఫల పుష్పాదులు, పసుపు కుంకుమ మున్నగు సువాసిని అలంకారముల నుంచి దక్షిణ తాంబూలములతో వాయనము నుంచి సువాసినీ పూజ చేసి ముత్తైదువలకిచ్చి ఏడుమార్లు ప్రదక్షిణ నమస్కారముల నాచరింప జేయుము. ఆ సువాసినికి షడ్రసోపేత భోజనము పెట్టి గౌరవింప వలయును. మాఘ మాసమున ప్రాతఃకాల స్నానముల చేతను పైన చెప్పిన వ్రతాచరణము చేతను ఈమెకు పాపక్షయము కలుగును. భర్త పునర్జీవితుడై ఈమె మాంగళ్యము నిలుచును. మాఘ స్నానము చేసిన విధవరాలు విష్ణు లోకమును చేరును. మాఘ స్నానము చేసి గౌరివ్రత మాచరించిన సువాసిని తన మాంగళ్యమును నిలుపుకొని చిరకాలము సుఖించును. పిచ్చివారు, మూర్ఖులు మాఘ స్నానము చేసినచో వారెట్టి వారైనను వారి యనుగ్రహము నొంది చిరకాలము సుఖించి పుణ్యలోకముల నందుదురు..అని యోగి వివరించి తన దారిన బోయెను. సుదేవుడు యోగి మాటలను నమ్మి తన కుమార్తెచే మాఘ స్నానమును, గౌరీ పూజా విశిష్టమైన కాత్యాయనీ వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయించెను. కాత్యాయనీ వ్రత మహిమ చేత సుదేవుని కుమార్తె పాపములు పోయి ఆమె భర్త పునర్జీవితుడయ్యెను. ఆమెయు చిరకాలము తన భర్తతో సుఖించి తన తల్లిదండ్రులతోను, భర్తతోను కలిసి దేహాంతమున వైకుంఠమును చేరెను. 


కావున మాఘమున ప్రాతఃకాల స్నానము నదిలో గాని, సరస్సున గాని, కాలువలో గాని చేసి తీరమున శ్రీహరి నర్చించినవారు, సుదేవుని పుత్రిక వంటివారైనను యిహమున సర్వసుఖములనంది పరమున వైకుంఠవాసులగుదురు సుమాయని శివుడు పార్వతీదేవికి మాఘస్నాన మహిమను వివరించెను...


ఇతి శ్రీ మాఘ పురాణం తృతీయ అధ్యాయం పారాయణ సంపూర్ణం...


🎈🎈🎈🎈🎈🎈🎈🎈

*🅰️🅿️SRINU*

మాఘ పురాణం – 2వ అధ్యాయం

 


మాఘ పురాణం – 2వ అధ్యాయం


దిలీప మహారాజు వేటకు బయలుదేరుట:


దిలీపుడను మహారాజు అనేక యజ్ఞయాగాది క్రతువులొనర్చిన గొప్ప పుణ్యాత్ముడు. అతడు తన రాజ్యమందలి ప్రజలను తండ్రివలె అన్ని విధములా కాపాడుచుండెను. ఒకనాడా భూపాలునకు వేట నిమిత్తం అడవికి పోవలెననెడి కోరిక కలిగెను. మనసున కలిగిన కోరికను ఎట్టి వారలకైననూ నెరవేర్చుకొనుట సహజమే కదా! ఆ విధంగానే దిలీప మహారాజు వేటకు పోవ నిశ్చయించి వేటకు కావలసిన సమస్త వస్తువులను సిద్ధం చేసి వేట దుస్తులు ధరించి సైన్యసమేతుడై వెడలెను.

దిలీపుడు వేటకు వెళ్ళిన అడవి కౄరమృగములతో నిండియున్నది. ఆ క్రూర జంతువులు సమీపమందున్న గ్రామములపై పడి పశువులను, మనుష్యులను చంపి నానా భీభత్సములు చేయుచున్నవి.

దిలీపుడు అడవిలో మాటువేసి మృగములను చంపుచుండెను. తన పరివారము కూడా మృగములను మట్టు పెట్టుచుండిరి. ఇలా కొన్ని రోజుల వరకూ అడవియందు వుండి అనేక క్రూర జంతువులను జంపిరి. ఒకనాడొక మృగం పై బాణం వేసెను. ఆ బాణాన్ని తప్పించుకొని ఆ మృగం పారిపోయెను. దిలీపుడు పట్టు విడువక దాని వెంట పరుగెత్తెను. ముందు మృగం, వెనుక దిలీపుడు, ఆతని వెనుక పరివారము పరుగిడుచుండగా ఆ మృగం ఒక కీకారణ్యమున ప్రవేశించెను. అప్పటికి దిలీపుడు అలసిపోయినందున దాహంచే నాలుక ఎందిపోతున్నది. నీటికొరకు పరివారమంతా వెదుకుచుండిరి. అదృష్టం కొలదీ ఆ సమీపంలో ఒక సరస్సు కనిపించినది. దానిని చూచి సంతోషపడి దిలీపుడు సరస్సును సమీపించెను. ఆ సరస్సు అంతులేని తామరపువ్వులతో నిండి అతి మనోహరముగా నుండెను. దిలీపుడూ అతని పరివారమూ, తృప్తిదీర నీరు త్రాగిరి. గట్టుపైన ఉన్న వట వృక్షం క్రింద అలసట తీర్చుకొనుచుండగా దిలీపుడు వేటలో చెల్లాచెదురుగా తరిమివేసిన పులులు, సింహాలు, అడవి పందులు మొదలగు జంతువులు కూడా ఆ సరస్సు వద్దకే వచ్చి చేరినవి. దిలీపుడు, అతని పరివారము వాటిని చూచి గురిపెట్టి, బాణములను వేసి చంపిరి. దిలీపుడు సంతోషించి వాటి చర్మాలను ఒలిపించి తన నగరమునకు బయలుదేరి వెళ్ళిపోవుచుండెను.

అటుల ఇంటిముఖం పెట్టి వెళ్ళుచున్న సమయమున మార్గమందు ఒక సద్బ్రాహ్మణుడు ఎదురయ్యెను. ఆ బ్రాహ్మణుడు బ్రహ్మ తేజస్సు గలిగి ప్రకాశించుచుండెను. ఆ విప్రుని చూడగానే దిలీపుడు ఆగి నమస్కరించి చేతులు జోడించి నిలబడియుండెను. ఆ బ్రాహ్మణుడును క్షణమాగి, ఆ రాజును గాంచి “ఈతని ముఖవర్చస్సు చూడగా గుణవంతునివలె నున్నాడు. ఈతని కేదయినా ఉపకారము చేయుట మంచిది” అని మనసులో తలచి – మహారాజా! శుభకరమైన ఈ మాఘమాసంలో సరస్సు దగ్గరలో ఉన్ననూ అందులో స్నానం చేయకుండా ఇంటికి పోవుచున్నావేమి? మాఘమాస మహాత్మ్యం నీకు తెలియదా!” అని ప్రశ్నించెను.

ఆ బ్రాహ్మణుని మాటలకు దిలీపుడు ఆశ్చర్యపడి ఆ వృద్ధ బ్రాహ్మణుని జూచి – “విప్రోత్తమా! అటుల ప్రశ్నించారేమిటి?” అని ఆశ్చర్యంతో పలికెను.

“పరమ పావనమైన మాఘమాసం కదా!” అని జ్ఞాపకం చేయుచుంటినని బ్రాహ్మణుడు పలికెను.

“చిత్తము స్వామీ! నాకు గుర్తులేదు. రాజప్రసాదమున నున్న పురోహితులు చెప్పియుందురు. నేను మృగయావినోదినై వచ్చి అడవిలో కొద్ది దినములుండుట వలన నాకా విషయం జ్ఞప్తి లేదు. కావున మాఘమాస మహాత్మ్యము నెరింగింప వలసినదిగా ప్రార్థించుచున్నా”నని దిలీపుడు వేడుకొనెను.

ఆ బ్రాహ్మణుడు దిలీపుని దీవించి “రాజా! సూర్యవంశపు గురువైన వశిష్ఠులవారు అప్పుడప్పుడు మీకడకు వచ్చుచుండును గదా! ఆతని వలన మాఘమాస మహాత్మ్యమును గురించి తెలుసుకొనుము. ఆ మహామునికి తెలియనిది ఏదియు లేదు. గాన అటుల చేయుము” అని చెప్పి బ్రాహ్మణుడు తన దారిని తాను పోయెను.

దిలీపుడు వశిష్ఠుని కడకుబోవుట:

దిలీపుడు తన పరివారంతో నగరము జేరెను. పదేపదే బ్రాహ్మణుని మాటలు జ్ఞప్తికి తెచ్చుకొని ఎటులనో ఆ రాత్రి గడిపెను. మరునాడు ప్రాతఃకాలమున లేచి కాలకృత్యములు తీర్చుకొని మంచి ఉడుపులు, సకలాభరణములు ధరించి, మంత్రి, సామంతాదులతో వశిష్ఠుల వారి దర్శనమునకై వారి ఆశ్రమమునకు వెళ్ళెను.

ఆ సమయములో వశిష్ఠుల వారు తపమాచరించుకొనుచున్నారు. శిష్యులు వేదపఠనం గావించుచున్నారు. దిలీపుడు ఆ దృశ్యమును జూచి వారికి తపోభంగము కలుగనీయరాదనీ కొంతతడవు వేచియుండెను. దిలీప మహారాజుకు వశిష్ఠుల వారు గురుతుల్యులు. అందుచే గురుభక్తి మిక్కుటముగా నుండెను. మరికొంతసేపటికి వశిష్ఠుడు తపస్సునుండి లేచి రాజును కుశల ప్రశ్నలడిగి ఉచితాసనముపై కూర్చుండబెట్టి వచ్చిన రాజును కారణమేమని యడిగెను.

దిలీపుడు వశిష్ఠునితో “ఋషిసత్తమా! తమవలన నేను అనేక రాజధర్మములు పురాణేతిహాసములు విని సంతుష్టుడనైతిని. కానీ మాఘమాస మహాత్మ్యముగాని,దాని ధర్మములు గాని తెలియనందున ఆ విషయములు తమనుండి తెలుసుకొన గోరి తమ వద్దకు వచ్చితిని. గాన పరమ పావనమూ మంగళప్రదమూ అయిన మాఘమాస మహాత్మ్యమును వివరించవలసినదిగా కోరుచున్నాను” అనెను.

అవును మహారాజా. నీవు కోరిన కోరిక సమంజసమైనదే. మాఘమాసము యొక్క మహాత్మ్యము ప్రతి ఒక్కరూ తెలుసుకొని తరించవలసిన యావశ్యకత ఎంతయినా గలదు.

మాఘమాసముయొక్క మహాత్మ్యమును వర్ణింప నాకుకూడా శక్యముగాదు. ఇతర దినములలో చేయు క్రతువులు గాని, యాగములు గాని, ఇవ్వనంత ఫలము కేవలము మాఘమాసములో చేయునదీస్నానమువలన గొప్ప ఫలము కలుగును. అటువంటి ఫలము నిచ్చు మాఘమాసము అన్నివిధముల శుభప్రదమైనది. గాన యీ మాఘమాసమునందు చేయు నదీ స్నానమువలన మనుజుడు పుణ్యాత్ముడు అగుచున్నాడు. అంతియేగాదు. మాఘము అన్నివిధాలా పుణ్యప్రదమైనది.

అంతేకాక పుణ్యకార్యము వలన స్వర్గలోక ప్రాప్తి తాత్కాలికంగా కలుగును గాని మాఘ మాసములో సంపాదించిన ఫలము వలన శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగును. ఇంతకన్న మహత్తుగలది మరొకటి లేదు. 


facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage


instagram.com/pravachana_chakravarthy

మాఘ స్నానం

 శ్లోకం:☝️మాఘ స్నానం

*తిస్రకోట్యోఽర్ధకోటి చ*

 *యాని లోమాని మానుషే॥*

*స్రవంతి సర్వతీర్థాని*

 *తస్మాన్ పరిపీడయేత్ ।*

*దేవాః పిబన్తి శిరసి*

 *శ్మశ్రుతః పితరస్తథా ॥*

*చక్షుషోరపి గంధర్వా*

 *అధస్తాత్సర్వజంతవః ।*

*దేవాః పితృగణాః సర్వే*

 *గంధర్వా జంతవస్తథా ॥*

*స్నానమాత్రేణ తుష్యన్తి*

 *స్నానత్పాపం న విద్యతే ।*

   పద్మపురాణం, సృష్టి ఖండం


భావం: మానవ శరీరంలోని మూడున్నర కోట్ల రోమాలు సమస్త తీర్థాలకు ప్రతీకలు. వాటిని తాకి పడే నీరు అన్ని తీర్థాలనుండి పడినట్లే. స్నానం చేసేవారి తలపై నుండి జారిన నీటిని దేవతలు తృప్తులౌతారు. మీసాలు-గడ్డాలపై నుండి జారిన నీటితో పితృదేవతలు తృప్తి చెందుతారు, గంధర్వులు కన్నుల నుండి జారిన నీటితో మరియు మిగిలిన జీవులు క్రింది భాగం నుండి జారిన నీటితో తృప్తి చెందుతారు. ఈ విధంగా దేవతలు, పితరులు, గంధర్వులు మరియు సమస్త ప్రాణులు స్నానముతో తృప్తి చెందుతారు. స్నానం చేసిన తర్వాత శరీరంలో పాపం ఉండదు.

    మాఘమాసంలో ప్రాతఃకాల స్నానానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. సూర్యుడు మకరరాశిలో ఉన్న వేళ సుప్రభాత స్నానం గురించి వివిధ పురాణాలలో వర్ణించబడింది.🙏