21, మే 2023, ఆదివారం

ఆలోచించుకో

 .

                   _*సుభాషితమ్*_


 𝕝𝕝శ్లోకం𝕝𝕝


*కస్త్వం కోsహం కుత ఆయాతః*

*కా మే జననీ కో మే తాతః।*

*ఇతి పరిభావయ సర్వమసారం*

*సర్వం త్యక్త్వా స్వప్నవిచారమ్॥*


తా𝕝𝕝

*స్వప్నదర్శనం వంటి ఈ సంసారమంతా సారవిహీనమైనదని తెలుసుకుని "నేను ఎవడిని?" "ఎక్కడి నుండి వచ్చాను?"నా "తల్లి ఎవరు?" "తండ్రి ఎవడు?" అని ఆలోచించుకో* ....

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 66*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 66*


సుకల్పనందుడు కోపంగా చూస్తూ "మీరెందుకొచ్చారు ?" అని ప్రశ్నించాడు అసహనంగా. ఆయన కావాలనే, తాము 'తమ వెంట రావద్దని' చెప్పామన్న ఉక్రోషంతోనే అక్కడికి పనిగట్టుకు వచ్చాడని నందులకి అర్థమైపోయింది. 


"ఏం ? రాకూడదా ?" ఎదురు ప్రశ్నించాడు సుబంధుడు. తీక్షణంగా వాళ్లని చూస్తూ "ఇది నా ఆశ్రమం. దీనిని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి వచ్చాను" అన్నాడు పరుషంగా. 


ధర్మానందుడు పటపట పళ్లు కొరుకుతూ "ఇప్పుడు గుర్తొచ్చిందా, ఇది నీ ఆశ్రమమని.... ? అంతఃపురాల్లో, రాజమందిరాల్లో, మాతో పాటు రాజభోగాలు అనుభవించినంత కాలం గుర్తుకు రాలేదా.. నీకో ఆశ్రమం వున్నదని...?" ప్రశ్నించాడు ఏకవచనంలోకి దిగుతూ. 


"మర్యాద... మర్యాద... స్వధంశ సంజాతుడినైన సద్బ్రాహ్మణుడిని... మర్యాదిచ్చి మాట్లాడండి" అన్నాడు సుబంధుడు ఆగ్రహంతో. 


జీవసిద్ధి నవ్వి "అంటే నందసోదరులు వర్ణసంకర సంజాతులనా ?" అని చణకు విసిరాడు. 


ఆ మాట విని నివ్వెరపోయాడు సుబంధుడు. ఆ మాట నందులకి 'ఎక్కడ తగలాలో అక్కడ' తగిలింది. సుబంధుడు చప్పున తేరుకుంటూ "నా ఉద్దేశ్యం అది కాదు" అన్నాడు గట్టిగా. 


"అది కాదా... ? మరేమిటి...? మా డబ్బుతో ధర్మశాల నడిపించి అక్కడ నీకు అగ్రాసనం పెట్టించుకుని మా ఖర్చుతో నీ గొప్ప చాటుకోవడమా ? డబ్బు మాది, అయినా మేము బ్రాహ్మణద్వేషులమటా... మా తిండి తింటూ మా దగ్గిర కుక్కలా పడుండే నువ్వు సద్భ్రాహ్మణుడివటా.... అంతేనా ?" రెట్టించాడు ధర్మానందుడు వెటకారంగా. 


"నోర్ముయ్... కుక్క గిక్క అంటే మర్యాద దక్కదు..." అరిచాడు సుబంధుడు ఆగ్రహంతో. 


"ఏం చేస్తావురా గుంటనక్కా ... నువ్వోక వేదవేదాంగ వేత్తవా...? నీకొక సమున్నత ఆసనమా... ? అసలు నువ్వు ఏనాడైనా వేదాలు వల్లించావా ? ధర్మశాస్త్రాలు, ఆధ్యాత్మిక, వైదిక శాస్త్రాల విషయాలు ఎప్పుడైనా మా ముందు ప్రస్తావించావా? ఏ ఒక్క శాస్త్రాన్నైనా మాకు నేర్పావా ? మాతో అధ్యయనం చేయించావా ? మీ నాన్న మీదున్న గౌరవంతో ఆయన పోయాక, ఫోన్లే పాపమని ఆయన పదవిని నీకు మేము కట్టబెట్టాం. అంతఃపుర నివాసంతో పాటు రాజభోగాలు కల్పించాం. మాతో సరిసమాన గౌరవాలను కల్పించాం. అదంతా మరిచిపోయి... బ్రాహ్మణాహంకారంతో మమ్మల్ని... మమ్మల్ని 'వర్ణసంకరులని' మాటతూల్తావా ? ఆ చాణక్యుడిని రహస్యంగా రప్పించి అతడితో 'మా వంశం నిర్వంశం అవుతుందని' ప్రతిజ్ఞలు చేయిస్తావా ?" అరిచాడు ధర్మానందుడు ఆవేశంతో. 


ఆ సరికొత్త ఆరోపణకి నివ్వరపోతూ "నేనా.... ?" రెట్టించాడు సుబంధుడు తీవ్రస్వరంతో. 


"మరి నేనా ... ?" కల్పించుకున్నాడు జీవసిద్ధి. తలతిప్పి అసహనంగా సుకల్పనందుని వైపు చూస్తూ "మహారాజా ! యుగధర్మాల గురించి సుబంధుడు మీకు బోధించాడో లేదో నాకు తెలియదు. త్రేతాయుగధర్మానుసారం పద్నాలుగేళ్లు వనవాసం చెయ్యాలని నిబంధన పెట్టింది కైక. అలాగే ద్వాపర ధర్మానుసారం పాండవులు పన్నెండేళ్ళు అరణ్య, ఒక ఏడాది అజ్ఞాత. మొత్తం పదమూడేళ్ళు వనవాసం చెయ్యాలని నిబంధన విధించారు కౌరవులు. కలియుగ ధర్మానుసారం అది పన్నెండేళ్ళు అయ్యింది..." అన్నాడు. 


"అంటే, కలియుగ ధర్మానుసారం పదహారేళ్ల క్రితమే ఈ ఆశ్రమాన్ని పాడుపెట్టి అంతఃపురానికి చేరుకున్న సుబంధుడికి ఈ ఆశ్రమంపై ఎట్టి హక్కు లేదు. దిక్కుదివాణం లేని నీవేశనాన్ని ' ఇల్లు ' లేని వాళ్ళు ఆక్రమించుకోవచ్చు... కనుక ప్రస్తుతం ఈ ఆస్తి, అంటే ఈ ఆశ్రమం జీవసిద్ధి గురుదేవుల వారిది" అని స్పష్టం చేశాడు ధర్మానందుడు. 


"అన్యాయం... అక్రమం... ఒక బౌద్ధ సన్యాసి మాయలో పడి మీ గురువుని నన్ను అవమానిస్తారా... ? ఒక సద్భ్రాహ్మణున్ని అవమానిస్తే దాని పర్యవసానం ఏమవుతుందో తెలుసా?" ఆక్రోశించాడు సుబంధుడు. 


"మహారాజా ! ఇది నా ఆశ్రమం అని తమరు నిర్ధారించారు. నా ఆశ్రమంలో, మీ సమక్షంలో ఏమిటీ గోల ... ?" విసుకున్నాడు జీవసిద్ధి అసహనంతో. 


సుబంధుడు రెచ్చిపోతూ "నాది గోలా... ? నా ఆస్తి కాజేయ్యడానికి నువ్వెవడివిరా...? నీకు ఆస్తిహక్కు కల్పించడానికి ఈ రాజుకేం హక్కుందిరా.... ?" అరిచాడు గొంతు చించుకుని. మరుక్షణం... 


సుబంధుడి చెంప చెళ్లుమనిపించాడు సుకల్పనందుడు. ఆ దెబ్బకి కెవ్వున ఆక్రందిస్తూ వెనక్కితూలిపడ్డాడు సుబంధుడు. అతని కళ్ళు బైర్లుకమ్మాయి. 


జీవసిద్ధి నొచ్చుకుంటూ "శాంతి... శాంతి... అహింసో పరమోధర్మః" అని ప్రభోదించాడు తధాగతుడు. "రాజా ! శాంతికి నిలయమైన మా ఆశ్రమాన్ని హింసాద్వేషాలతో కలుషితం కానివ్వడం మాకిష్టం లేదు. ఏ కట్టెకి నిప్పుంటే ఆ కట్టే కాలుతుంది. రాజా ! మీరు శాంతించండి. ఆ వెర్రి బ్రాహ్మణుడిని ఇంతటితో వదిలేయ్యండి" అన్నాడు ధర్మపన్నాలు వల్లిస్తూ. 


సుకల్పనందుడు శాంతిస్తూ "తమరు చెప్పారు కాబట్టి వదిలేస్తున్నాం" అని చెప్పి ధర్మానందుడి వైపు తల తిప్పి "తమ్ముడూ ! నేటి నుంచీ ఈ సుబంధుడికి అంతఃపురం ప్రవేశాన్ని నిషేధిస్తున్నాం. ఇతడు ఇకముందు కోటలో గానీ అంతఃపురంలో గానీ కనిపించాడా... ? జాగ్రత్త" అని హెచ్చరించాడు కఠిన స్వరంతో.


సుబంధుడు చివాల్నలేచి నందులనూ, జీవసిద్ధిని కొరకొర చూసి విసవిసా వెళ్లిపోయాడు.


జీవసిద్ది నిటూర్చి " చూశావా రాజా ! కలుగులోని ఎలుకల్లాగ మీ విరోధులు ఒక్కొక్కరే ఎలా బయటపడుతున్నారో... మొన్న చాణక్యుడు. ఈవేళ సుబంధుడు. ఇలాంటి గాది క్రింద పందికొక్కులు ఇంకా ఎందరున్నారో... ?" అన్నాడు సాలోచనగా. 


నందులు ఉలిక్కిపడి మొహాలు చూసుకున్నారు. అందరూ జీవసిద్ధి వైపు భయంగా చూశారు. 


'భయంలేదు. నా రక్షణ మీకున్నంతవరకూ మీకు వచ్చిన ఇబ్బందేమీ లేదు. నిశ్చింతంగా ఉండండి" అంటూ అభయప్రదానం చేస్తూ చెయ్యెత్తి వాళ్ళని ఆశీర్వదించాడు జీవసిద్ధి. 

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

పద్యము

 166వ రోజు: (భాను వారము) 21-05-2023

మన మాతృ భాష సేవలో ఈ రోజు పద్యము:


ఆటపాటలతోడ హాయిగా చదువంగ 

చదువు తలల కెక్కు ఛాత్రులకును 

ఆటపాట లెపుడు ఆరోగ్య మందించు 

తెలిసి మెలగ మేలు తెలుగు బాల.


విద్యార్ధులు చదువు మరియు ఆట పాటలకు, ప్రతి దినము ప్రత్యేక సమయమును కేటాయించిన ఎడల వారి శారీరక మానసిక ఆరోగ్యముతో పాటు,  ఇష్టముతో చదివిన చదువు వారి మనస్సుకు హత్తుకుని భావి జీవితములో  పేరు ప్రఖ్యాతులను, కీర్తి ప్రతిష్టలను అందించును. 


ఈ రోజు పదము. 

మేక పోతు (Goat): అగ్నివాహనము, అజము, చగల, ఛగము, దేవానాంప్రియము, బస్తము, బుక్కము, వేట, స్తభము.

 माला तो कर में फिरै, जीभ फिरै मुख माहिं।

मनुवा तो चहुँदिसि फिरै, यह ते सुमिरन नाहिं।।


कबीरदास जी कहते हैं कि मनुष्य हाथ में माला फेरते हुए जीभ से परमात्मा का नाम लेता है पर उसका मन दसों दिशाओं में भागता है। यह कोई भक्ति नहीं है।

ఆయుర్వేద మూలికలు

 ప్రతి గృహము నందు ఉండదగిన ఆయుర్వేద మూలికలు మరియు ఆవరణలో ఉండవలసిన చెట్లు  - 


    ఇప్పుడు నేను మీకు తెలియచేసే మూలికలు మరియు చెట్లు అందుబాటులో ఉండే విధముగా చూసుకోనవలెను . అలాగే మీ గృహావరణలో నేను చెప్పబోయే చెట్లను పెంచుకోవడం చాల మంచిది . ఒకవేళ మీ గృహవరణలో స్థలం లేకున్నచో మీకు దగ్గర ప్రదేశాలలో ఖాళీస్థలం ఉన్నచో ఈ చెట్లను పెంచడం మంచిది . వీటివల్ల ఎన్నో గొప్పగొప్ప ఔషధ యోగాలు ఉన్నాయి . 


  గృహము నందు ఉండదగిన మూలికలు  - 


    నిమ్మకాయ , అల్లం , జీలకర్ర , సైన్ధవ లవణం , ఉప్పు , వాము , కురసాని వాము , ఇంగువ , సున్నము , బెల్లము , తేనె , ఆవునెయ్యి , నువ్వులనూనె , కుంకుడు కాయలు , వాము పువ్వు , పుదీనాపువ్వు , పచ్చ కర్పూరం , కర్పూరం , తెల్ల ఆవాలు , ఆవాలు , ఆముదము , యాలుక్కాయలు , లవంగాలు , దాల్చిన చెక్క , గసగసాలు , సీమగొబ్బి విత్తనాలు , మిరియాలు , ధనియాలు , సుగంధపాల , గంధపుచెక్క , కస్తూరి , దుప్పికొమ్ము , అక్కలకర్ర , అతిమధురము , యష్టిమధుకము , కరక్కాయ , పిప్పళ్లు , పెద్ద ఉశిరిక పప్పు , పటిక , శొంటి , పటికబెల్లము , నీరుల్లి , వెల్లుల్లి , దుంపరాష్ట్రము , మోడీ , మోదుగ మాడలు , రుద్రాక్షలు , అరటిపండ్లు , తమలపాకులు , పసుపు , వాము , తేనె మైనం మొదలైనవి . 


  గృహ అవరణలో పెంచదగిన చెట్లు - 


    నిమ్మ  , నారింజ , వేప , వెలగ , ములగ , ఉత్తరేణి , తెల్ల గురువింద , నందివర్దన , మందార , తెల్ల జిల్లేడు , నల్ల ఉమ్మెత్త , అవిశ , అరటి , పనస , తెల్ల ఈశ్వరి , మారేడు , ఉడుగ , దిరిశన , తుమ్మ , గరిక , తుమ్మి , చంద్రకాంత , గన్నేరు , తోటకూర , గోంగూర , బచ్చలి , చిత్రమూలం , సరస్వతి , చిర్రి , మోదుగ , నల్లేరు , కాడజెముడు , దూలగొండి , వెంపలి , పుదినా , వాము , తులసి , కొబ్బరి , జీడిమామిడి , కానుగ , పిప్పిలి , టేకు , వెదురు , జాజి , గులాబి , మల్లె , దానిమ్మ , పెద్ద ఉశిరిక , మేడి  మొదలైన ఔషధ చెట్లు గృహ ఆవరణలో లేక గృహానికి చుట్టుపక్కల ప్రదేశాలలో తప్పక పెంచవలెను .  


          పైన చెప్పినటువంటి ఔషధాలు మరియు ఔషధ చెట్ల గురించి నేను రాసిన మూడు  ఆయుర్వేద గ్రంథాలలో విపులంగా వివరించాను. 


   గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

            9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు .


              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                          9885030034

ఉన్న దానితో

 *శుభోదయం*

💐🙏💐🙏💐

ఉన్న దానితో పోరాటం... 

లేని దానికై ఆరాటం...

 

ఉన్నదానితో లేని తృప్తి,

లేని దానికై అసంతృప్తి...


మాయలోని మర్మం అదే... అది తొలగితే, 


పోరాటానికి, ఆరాటానికి మధ్య ఉండదు పేచీ...  


తృప్తికి, అసంతృప్తికి మధ్య  పుడుతుంది 

రాజీ... 


🙏🙏🙏🙏🙏🙏

భారతదేశ స్థితి*

 *నేటి మన భారతదేశ దుస్థితి*

దేశంలోని కొంత మంది ప్రజలు ఎంతో కష్టపడి ఉద్యోగాలు చేస్తూ, ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తూ, స్వల్ప సంతానం కలిగి ఉండి వారికై శ్రమిస్తూ, విద్య, వైద్యం వంటి అనేక ఖర్చులను భరిస్తూ బరువు బాధ్యతలతో జీవిస్తూ ఉండగా...మరో పక్క కొంత మంది ప్రజలు  బాధ్యతారాహిత్యంగా అధిక సంతానం కలిగి ఉండి కేవలం ప్రభుత్వాల ఉచిత పథకాల మీద ఆధారపడుతూ ఇస్తాను సారంగా తాను పతనం అవ్వడమే కాక దేశాన్ని కూడా పతన వ్యవస్థకు చేరుస్తున్నరు. కొంత మంది కట్టే పన్నులు మరో కొంత మంది సోమరులను పోషించడానికి అన్నట్టు తయారవుతుంది వ్యవస్థ. ప్రభుత్వ పథకాలు కేవలం పరిమిత సంతానం గల కుటుంబాలకి మాత్రమే లభించేలా చర్యలు చేపట్టేలా న్యాయ స్థానాలలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడం లేదా ఇంకేదయినా పద్ధతిలో అయిన ఏదయినా చేయగలమా అనే వైపుగా మేధావులు , విద్యావంతులు ఆలోచించ గలరని.....ఒక సగటు భారతీయుడిగా నా మనవి🙏

కర్తవ్యనిష్ఠ

 *కర్తవ్యనిష్ఠ*


పని చేయడంలో యంత్రానికి, జీవరాశికి తేడా ఉంటుంది. యంత్రానిది ఒక మూసలో పోసినట్లు యాంత్రిక పనితనమైతే, జీవులు చేసే పనిలో జీవం తొణికిసలాడుతూ ఉంటుంది. గిజిగాడు సంక్లిష్టమైన తన గూటిని గడ్డిపరకలతో అల్లి నిర్మిస్తుంది. తన ముక్కును మాత్రమే పనిముట్టుగా ఉపయోగించి ఎంతో నైపుణ్యంతో గూటి నిర్మాణం సాగిస్తుంది. సాలీడు తన గూటిని అకుంఠిత దీక్షతో ఒక అందమైన వలలా రూపొందిస్తుంది. కాలర్ టైలర్ బర్డ్ గుబురుగా ఆకులు ఉండే చెట్టును ఎంచుకుని, ఆ ఆకులపై చిన్న చిన్న రంధ్రాలు ఏర్పరచి, సాలెగూడు దారంలాంటి దానితో అందమైన గూడు నిర్మించుకుంటుంది. చీమ ఓపిగ్గా మట్టితో పుట్ట ఏర్పరచుకుంటుంది. కర్తవ్యనిష్ఠకు ఇవి ప్రకృతి మనకందించే కొన్ని ఉదాహరణలు. ఆయా జీవరాశులు కేవలం ఆ పనులకే ప్రసిద్ధం. మనిషి అలాకాదు. తాను ఎంచుకున్న ఏ పనిలోనైనా తనదైన ప్రత్యేకతను చాటుకోగలడు. ఎంచుకుని చేసేపనిని తదేక ధ్యానంతో పూర్తి కావించాలి.


ఏ కళాకారుడైనా తన పనిలో ప్రాణం పెడతాడు. అది చీర నేయడం, నగ చేయడం, చిత్రం వేయడం, నృత్యం చేయడం, పాట పాడటం.. ఇలా ఏదైనా కావచ్చు. అందుకే కళలకు అంతటి ప్రాధాన్యం, విలువా! తాము చేసే పనులను అత్యంత ఆసక్తితో చేసేవారు పరమ సిద్ధిని పొందుతారని చెప్పాడు శ్రీకృష్ణుడు. మనం చేసే ప్రతి పనీ మన స్వభావం మీద తనదైన ముద్రను వేస్తుంది. మనిషి వ్యక్తిత్వం మీద, శీలం మీద కర్మ చూపే ప్రభావమే అతడు ఎదుర్కోవలసిన శక్తులన్నింటిలోకీ అత్యంత శక్తిమంతమైనది అంటారు. వివేకానందులు. మనిషి తాను చేసే పని కేవలం ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి, సేవను చేయడానికో కాదని అది తన వ్యక్తిత్వ నిర్మాణానికి దోహదం చేసేదని గమనించి శ్రద్ధతో పనిచేస్తేనే అందులో లీనం కాగలుగుతాడు. పరిపూర్ణ ఫలితం పొందగలుగుతాడన్నది. వివేకానందుల వారి ఉద్బోదించారు. నంబి కురవ గ్రామవాసి అతడి వృత్తి వేంకటేశ్వరస్వామి వంటశాలకు కుండలు చేయడం. అందులోనే తలమునకలై స్వామి దర్శనానికి వెళ్ళలేకపోయేవాడు. కుండలు చేశాక తన చేతికి అంటుకున్న మట్టిని పువ్వుల్లా చేసి కొయ్య వేంకటేశ్వరస్వామికి అర్పించేవాడు. అవి తనకు అత్యంత ప్రియమైనవని తొండమాన్ చక్రవర్తి సమర్పించే సువర్ణ పుష్పాలను పక్కకు తోనేనేవాడు శ్రీనివాసుడు. చక్రవర్తి నంబి దగ్గరకెళ్ళి ఆయన ముందు మోకరిల్లి వేంకటేశ్వరుడు అతడి పూలను ఇష్టపడటానికి కారణమేమిటని అడిగాడు. అదేమీ తనకు తెలియదని కుండలు చేయడమే తనకు తెలిసిన పని అన్నాడు నంబి. నిష్ఠతో పనిచేయడమే భక్తి అన్న భావనతో పరమాత్ముణ్ని మెప్పించిన నంబి- అందరికీ ఆదర్శప్రాయుడు. కర్మనిష్టుడైన మంత్రుల్లో


అప్పాజీ శ్రేష్ఠుడు. రాయల మీద ప్రీతికన్నా రాజ్యక్షేమమే ప్రధానం అని భావించాడు. నేడు మానవుడు చేసే పనిలో శ్రద్ధ, అంకితభావం, నైపుణ్యం కొరవడ్డాయి. సమయం, దనం పని ఫలితాన్ని పలచన చేస్తున్నాయి. పనిలో కృత్రిమత్వం - గోచరిస్తోంది. పని కూడా మోక్షమార్గానికి దారి చూపే భక్తి అని తెలుసుకుని చక్కని పనితనం చూపగలిగితే చాలు... ధన్యజీవులం అవుతాం.


- ప్రతాప వెంకట సుబ్బారాయుడు.

ఆగి ఒకసారి చూశారు

 ఆగి ఒకసారి చూశారు


మా నాన్న శ్రీ రామానుజం గారు ఒక న్యాయవాది. మాది కులిత్తలై అగ్రహారంలోని శ్రీవైష్ణవ కుటుంబం. మేము శ్రీమఠానికి పెద్ద భక్తులం. మహాస్వామి వారు, జయేంద్ర సరస్వతి స్వామివారు ఎప్పుడు యాత్రకు వచ్చినా మా ఇంట్లోనే బస చేసేవారు.


ఇది అరవైలలో జరిగిన సంఘటన అనుకుంటా. ఆ అగ్రహారంలో పిల్లాపాపలతో ఒక కుటుంబం ఉండేది. అక్కడి ప్రముఖులలో వారి కుటుంబం కూడా ఒకటి. వారు ప్రధానంగా ఏదో వ్యాపారం చేసేవారు. బాగా కలిసివచ్చి హాయిగా ఉండేవారు. వారిది అంతా ధార్మికమైన సంపాదన. చాలాకాలం పాటు హాయిగా సాగిన వారి జీవితాలలో హఠాత్తుగా సమస్యలు మొదలయ్యాయి. వాళ్ళ ఇంట్లో కొన్ని భయంకరమైన సంఘటనలు జరగడం మొదలయ్యాయి. నేలపైన జుత్తు పెద్ద ఉండలుగా కనపడడం, వసారా మధ్యలో మానవ అశుద్ధము కనపడడము, అద్దాలు పగలడం వంటివి కనపడడం మొదలయ్యాయి.


ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో వాళ్ళకి అర్థం కావడం లేదు. వీటితో పాటు వాళ్ళ ఇంట్లోని వాళ్ళు ఎవరైనా బయటకు వెళితే చాలు వాళ్ళ బట్టలన్నీ చిరిగిపోయేవి. ఇది ఆడవాళ్ళ విషయంలో కూడా జరిగేది. ఇవన్నీ వినడానికి నమ్మేలాగా లేకపోయినా ఆ అగ్రహారంలో చాలామంది వీటీని ప్రత్యక్షంగా చూసారు.


తరువాత వాళ్ళు ఇదంతా చేతబడి వల్ల జరిగినది అని తెలుసుకున్నారు. వారు ఈ విషయానికి చాలా భయపడ్డారు. కాని దీని పరిష్కారం కనిపెట్టలేక పోయారు.


ఆ సమయంలో మహాస్వామివారు ఆ ప్రాంతానికి పర్యటనకు వచ్చి ఆ అగ్రహారానికి కూడా వచ్చారు. స్వామివారికి ఆ అగ్రహారం ప్రజలు ఘన స్వాగతం పలికారు. స్వామివారు అందరిని యోగక్షేమాలు విచారిస్తుండగా, ఆ వీధిలో నివసించే వారు ఆ కుటుంబం పడుతున్న ఇబ్బందుల గురించి చెప్పి వారికి సహాయం చెయ్యవల్సిందిగా అడిగారు.


మాహాస్వామి వారు విషయం అంతా విన్నారు కాని ఏమి చెప్పలేదు.


తరువాతిరోజు స్వామివారు వారి శిష్యులతో కలిసి ఆ వీధిలో వెళ్తుండగా, చుట్టూ ఉన్నవారు ఆ ఇంటివైపు చూపించారు. మహాస్వామివారు ఆగి ఒకసారి ఆ ఇంటిలోకి నేరుగా చూసి ముందుకు వెళ్ళిపోయారు.


ఆ ఒక్క చూపు ఆ ఇంటిలో ఉన్న సమస్యలన్నిటిని పారద్రోలింది. ఆ క్షణం నుండి ఆ ఇంటికి చేసిన చేతబడి ప్రభావాలు పూర్తిగా మాయమైపోయాయి. కుటుంబంలో అందరికి ప్రశాంతత చేకూరింది. వారు మళ్ళా వారి వ్యాపారం చూసుకుంటూ ఆడవారు కూడా ధైర్యంగా బయట తిరగగలిగారు.


నాకు ఈ సంఘటన గుర్తుకు వచ్చినప్పుడల్లా మహాస్వామి వారి ఈ చిత్రపటం స్ఫురణకు వస్తుంది. మహాస్వామివారి చూపులవల్ల ఎటువంటి క్షుద్ర శక్తి అయినా నాశనం చెయ్యబడుతుంది. అలాగే వారి కరుణా విలాసం భక్తులను రక్షిస్తుంది. ఆ చూపులకు ఎంతటి శక్తి అని ఇప్పటికి నాకు ఆశ్చర్యం వేస్తుంది.


--- శ్రీరామ్, కులిత్తలై అగ్రహారం


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

 🥗శ్రీవారి గడ్డం కింద పచ్చకర్పూరం ఎందుకు పెడతారు..?ఆంతర్యం ఏంటి..?🥗


ఆంద్రప్రదేశ్‌ లోని చిత్తూరు జిల్లాలో తిరుపతి పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం  వెలసింది. ఇక్కడికి స్వామి వారి సేవకై భక్తులు ప్రతిరోజూ తండోపతండాలుగా తరలి వస్తుంటారు. శ్రీవారికి భక్తి శ్రద్ధలతో ముడుపులు, కానుకలు సమర్పించుకుంటారు. కొందరు వారి వారి మొక్కులు తీర్చికోవడానికి తిరుపతికి కాలినడకన వస్తుంటారు. గోవిందా గోవిందా అనే నామంతో పరమ పవిత్రం అయింది తిరుపతి. ఏడు కొండలు మీద కొలువై ఉన్న శ్రీవారి గురించి చెప్పాలంటే ఎన్ని గ్రంధాలైనా చాలవు. అంతటి మహత్యం కలిగిన శ్రీవారి గడ్డం కింద నిత్యం పచ్చ కర్పూరంతో అలంకరిస్తారు దానికి కారణం మీకు తెలుసా. ఎందుకు పచ్చ కర్పూరంతో అలంకరిస్తారో దాని ఆంతర్యం ఏమిటో తెలుసుకోవాలని ఉందా... ఆలస్యం చేయకుండా చదివేయండి.


శ్రీవారి భక్తులలో అగ్రగణుడు అనంతాళ్వారు. ఆ శ్రీవారికి సేవచేస్తూ తరించిన బక్తుడు శ్రీ అనంతాళ్వార్‌. ఇతడు శ్రీవారి కొండ వెనుక భాగంలో నివసించేవాడు. ఈయన ప్రతిరోజూ స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూలమాలలు సమర్పించేవాడు. ఆయన ఒక రోజు పూలతోటను పెంచాలని నిర్ణయించుకుంటారు. పూలతోటను పెంచాలని నిర్ణయానికి వచ్చిన తరువాత పూలతోట పెంపకానికి సరిపడా నీరు కోసం ఒక చెరువును త్రవ్వాలని నిర్ణయించుకొని, మొదలు పెడతాడు. ఇతరుల సాయం తీసుకోకుండా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చెరువును త్రవ్వాలని నిర్ణయించుకుని ఆరంభిస్తారు. చెరువు తవ్వే సమయంలో అనంతాళ్వారుని భార్య నిండు చూలాలు. అతను గడ్డపారతో మట్టిని తవ్వి ఇస్తే ఆమె గంపలోకి ఎత్తి దూరంగా పడేసేది. అంతలో ఈ తతంగం అంతా చూసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఆ భార్యాభర్తలకు సహాయపడాలని అనుకుని 12 సంవత్సరాలు బాలుని రూపంలో అక్కడికి వస్తాడు. గర్భిణిగా ఉన్న ఆమెకు సాయం చేస్తానని చెప్పి ఆ మట్టిని నేను పారబోస్తా అంటాడు. దానికి అనంతాళ్వారు ఒప్పుకోడు కాని అతని భార్య అంగీకరించడంతో బాలుడు ఆమెకు సాయం చేస్తాడు. ఆమె భర్తకు తెలియకుండా మట్టి తట్టని తీసుకెళ్ళి ఇస్తే బాలుడు దూరంగా పోసి వచ్చేవాడు.


ఆమె మట్టితట్టని తీసుకెళ్ళి తొందరగా రావడం గ్రహించిన అనంతాళ్వారులు భార్యని ప్రశ్నించగా ఆమె బాలుడు సహాయం చేస్తున్నాడని చెప్తుంది. దాంతో అతడు ఆగ్రహానికి గురవుతాడు. అనంతాళ్వారులు కోపంతో చేతిలో ఉన్న గునపాన్ని బాలుడి మీదకి విసురుతాడు. అది ఆ బాలుడు గడ్డానికి తగులుతుంది. దాంతో బాలుడు రూపంలో వచ్చిన వెంకటేశ్వరస్వామి వారు ఆనంద నిలయంలోకి వెళ్ళి కనబడకుండా మాయం అయిపోతాడు.


ఆలయంలో అర్చకులు స్వామివారి విగ్రహానికి గడ్డం వద్ద రక్తం కారటం చూసి ఆశ్చర్యపోయి ఆ విషయాన్ని అనంతాళ్వారు కు చెప్తారు. దాంతో కంగారు గా అతడు అక్కడికి చేరుకుంటాడు. గర్భగుడిలో ఉన్న శ్రీవారి గడ్డం నుండి రక్తం కారడం చూసి ఆశ్చరపోతాడు. తమకి సాయం చేయడానికి వచ్చిన బాలుడు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరస్వామి వారే అని గ్రహించి కన్నీళ్ళతో స్వామివారిని మన్నించమని కోరుతూ పాదాలపై పడతాడు. గాయం వలన కలిగే బాధనుండి ఉపసమయం పొందడానికి గడ్డం దగ్గర పచ్చకర్పూరం అద్దుతాడు. అప్పటినుండి రోజూ చల్లదనం కోసం గాయంపై చందనం రాసి ఆ తర్వాత పచ్చకర్పూరం పెట్టేవాడు. అప్పటి నుండి శ్రీవారి గడ్డంపై రోజూ పచ్చకర్పూరం రాయడం ఆచారంగా మారిపోయింది. శ్రీవారిని గాయపరిచిన గునపాన్ని చూడాలి అనికుంటే  మహాద్వారం దాటిన తర్వాత కుడివైపు గోడకు వేలాడుతూ ఉండడం చూడవచ్చు.


🌹సమస్తలోకాన్ సుఖినోభవంతు,శుభోదయం 🌹

విద్యాభివృద్ధికి

 🌷🙏విద్యాభివృద్ధికి+విదేశీయానానికి మంత్ర శ్లోకం🙏🌷


🌷🙏మంత్రం🙏🌷


"జయ అజిత జయ అశేష జయ వ్యక్తిస్థితే 

జయ పరమార్థార్థ సర్వజ్ఞ జ్ఞానజ్ఞేయార్థనిః సృతః"


ఈ జయకర మంత్ర శ్లోకం నిత్యము 108 సార్లు ధ్యానిస్తుంటే సర్వ  విద్యలందు జయము కల్గును. విదేశీయానం సంకల్పించిన వా సంకల్పం తప్పక నెరవేరును.


🌷🙏శ్రీ మాత్రే నమః🌷🙏

20, మే 2023, శనివారం

ఆచార్య సద్బోధన:*

 

            *ఆచార్య సద్బోధన:*

                 ➖➖➖✍️


*' పరోపకారార్ధమిదం శరీరం ' పరులను సేవించుట కొరకే మానవ దేహము.* 

*సేవ చేస్తే వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో అని తటపటయిస్తూ ఉంటే పనులు జరగవు.*


*అసలు నువ్వేమనుకుంటున్నావో ముందు ఆలోచించు!*

*ఆకలి వేసినపుడు నీకు నచ్చిన ఆహారము తింటున్నావు, మంచి దుస్తులు వేసుకుంటున్నావు. పక్కవాడకి నచ్చలేదు అని, వద్దు అన్నాడని  మానుకుంటున్నావా!లేదు కదా! మంచిని శత్రువు చెప్పినా వినాలని, చెడును మిత్రుడు చెప్పినా వినకూడదని అంటుంటారు.*


*సేవ అనేది అత్యుత్తమైన ఆధ్యాత్మిక సాధన.*

*దానిని ఎవరో ఏమో అనుకుంటారు అని వదులుకోవడం మూర్ఖత్వం.*


*మంచి చేస్తున్నపుడు ఎవరి మాట పట్టించుకోవాల్సిన పని లేదు.*


*భగవంతుణ్ణి దృష్టిలో పెట్టుకో! అన్నింటా భగవంతుడే తోడై నిన్ను సఫలం చేస్తాడు...*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️

*మన ఆరోగ్యం….!


          *అమృతఫలం..జామ!*

                   ➖➖➖✍️


*చక్కెర వ్యాధిని కంట్రోల్ చేయగలిగే ఏకైక ఔషధం…జామ కాయ.*


*ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం_ ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఏ రోగాలతో అత్యధికంగా చనిపోతున్నారు అనే విషయాలని ఎన్నో సార్లు వెల్లడించింది. అందులో ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులతో అత్యధికంగా ప్రజలు చనిపోతుంటే..రెండవ స్థానం మాత్రం చెక్కెర వ్యాధితో ప్రజలు చనిపోతున్నారని తేల్చి చెప్పింది. * 


*ప్రపంచ వ్యాప్తంగా డయాబెటిస్ వ్యాధి తీవ్ర రూపం దాల్చిందని, దీని ప్రభావానికి చిన్న పిల్లలు సైతం లోనవుతున్నారని తెలిపింది.*


*అయితే డయాబెటిస్ ఉన్న వాళ్ళు ఈ షుగర్ లెవిల్స్ కంట్రోల్ చేసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదని అంటున్నారు నిపుణులు.* 

*మరి షుగర్ లెవిల్స్ ని కంట్రోల్ చేయడం ఎలా…?*


*షుగర్ లెవిల్స్ ని కంట్రోల్ చేయడానికి జామకాయలు ఎంతగానో ఉపయోగ పడుతాయి.*


*వీటిని రెగ్యులర్ గా తీసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు అంటున్నారు నిపుణులు.* 


*జామకాయలో పీచు పదార్ధం ఎక్కువగా ఉంటుంది. ఇది బ్లడ్ లో  షుగర్ లెవిల్స్ ని చెక్ చేస్తుంది. జామలో ఉండే గ్లైకమిక్ ఇండెక్స్ తొందరగా అరగనివ్వవు.* 


*దాంతో రక్తంలో గ్లూకోజ్ లెవిల్స్ ఒక్క సారిగా పెరగకుండా ఉంటాయి.* 


*ఫలితంగా బ్లడ్ లో లెవిల్స్ ని కంట్రోల్ చేస్తుంది. అందుకే వైద్యులు డయాబెటిస్ రోగులకి జామకాయలు ఎక్కువగా తీసుకోమని సూచిస్తారు.*


*అంతేకాదు బరువు తగ్గాలని అనుకునే వారు కూడా జామకాయ తినవచ్చు ఎందుకంటె జామకాయలో కేలరీస్ తక్కువగా ఉంటాయి. అత్యధిక బరువు ఉన్న వారికి కూడా షుగర్ వచ్చే ప్రమాదాలు ఎక్కువగా కాబట్టి జామ కాయ తినడం ద్వారా బరువు తగ్గి వివిధ వ్యాధుల నుంచీ కాపాడుకోవచ్చు.* 


*షుగర్ ని కంట్రోల్ లో ఉంచడానికి సోడియం, పొటాషియం రెండూ కావాలి ఈ రెండూ జామకాయలో పుష్కలంగా లభిస్తాయి. “సి” విటమిన్ కోసం అందరూ నిమ్మకాయ, నారింజ తినాలని అంటారు.  కానీ జామకాయలో “సి విటమిన్” నాలుగు రెట్లు అధికంగా ఉంటుంది.* 


*డయాబెటిస్ ఉన్న వారికి రోగ నిరోధక శక్తి అధికంగా ఉండాలి. జామలో   రోగ నిరోధక శక్తిని అందించే కారకాలు లెక్కకి మించే ఉంటాయి.*✍️

                                     ….సేకరణ.

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

                                                                                                                                   

      *అద్భుతం ఖరీదు.. ₹.83/-*

                  ➖➖➖✍️

                                                               *ఒక చిన్నబాబు అతని పిగ్గీబ్యాంక్ పగలగొట్టి అందులోని డబ్బులు లెక్కపెడుతున్నాడు.*


*చాలా జాగ్రత్తగా లెక్క పెడుతున్నాడు. మూడుసార్లు లెక్కపెట్టాడు.*


*తప్పు ఉండకూడదు అని తనకు తాను చెప్పుకుంటున్నాడు..*

*ఆ డబ్బులు తీసుకుని నెమ్మదిగా తన ఇంటి వెనకాల తలుపు నుండీ వెళ్ళి ఒక మందుల షాప్ దగ్గర నుంచున్నాడు..*


*షాప్ లో ఆవిడ తనవేపు చూసేవరకు ఎదురుచూస్తూ నుంచున్నాడు...*

*షాప్ ఆవిడ బాబుని చూసి అడిగింది.. “ఏమి కావాలి బాబు” అని.* 


*బాబు చెప్పాడు..*

*“నాకు ఒక అద్భుతం కావాలి” అని.*


*షాప్ ఆవిడ అర్ధం కానట్టూ “ఏంటి బాబు సరిగ్గా చెప్పవా” అని అడిగింది.*


*“నాకూ సరిగ్గా తెలీదు..కానీ చెల్లికి ఆరోగ్యం ఏమీ బాలేదు కదా..నాన్న అంటున్నారు ‘ఒక అద్భుతం మాత్రమే చెల్లిని కాపాడగలదు’  అని. చెల్లి చాలా కష్టపడుతోంది. అందుకే నా దగ్గర ఉన్న డబ్బులన్నీ తెచ్చాను అద్భుతం కొనుక్కుని వెళ్దామని..అది ఉంటే చెల్లికి నయం అయిపోతుంది.” అని అడిగాడు బాబు.*


*ఆవిడకి ఏమి చెప్పాలో అర్ధం కాలేదు..*

*“ఇక్కడ అద్భుతాలు అమ్మము బాబు” అని షాప్ ఆవిడ బాధగా చెప్పింది. బాబు మాటలకి విషయం అర్ధం అయ్యి ఆవిడకి బాధేస్తోంది....*


*”నా దగ్గర డబ్బులు ఉన్నాయి అద్భుతం కొనేందుకు.. అవి చాలకపోతే నేనింకా డబ్బులు తెచ్చిస్తాను.” అని బతిమలాడుతున్నట్టుగా అడుగుతున్నాడు బాబు...*


*ఇంతలో బాబు పక్కనే ఇదంతా వింటున్న పొడుగ్గా ఉన్న, మంచిగా తయారయ్యి ఉన్న, హుందాగా ఉన్న ఒకాయన బాబుని అడిగారు...“ఏమిటి నీ చెల్లి సమస్య, నీకు తెలుసా?” అని ...*


*బాబు చెప్తున్నాడు..”చెల్లికి తలలో చెడుది ఏదో పెరుగుతోందంటా.. అది బాగవ్వాలంటే సరిపడా డబ్బులు లేవు, అద్భుతం ఉంటే చెల్లి తప్పక బాగవుతుంది. అని నాన్న అమ్మకి చెప్తుంటే విన్నాను... సరే అదేదో కొందామని నా దగ్గర ఉన్న డబ్బులన్నీ తెచ్చేసాను, కావాలంటే ఇంకా డబ్బులు పోగేసి తెస్తాను..” అని చెప్తుంటే బాబుకి తెలీకుండానే అతని చిట్టి చెంపల మీద కన్నీళ్ళు జారుతున్నాయి....*


*ఆ పొడుగు మనిషి కొంచెం కిందకు వంగి బాబుని అడిగారు.. ”నీ దగ్గర ఎంత డబ్బు ఉందీ!” అని..*


*బాబు చెప్పాడు..“83 రూపాయలు” అని...అదీ వినపడి వినపడనట్టు..*


*”ఓ అవునా ...తమాషా చూడు నీ చెల్లికి కావాల్సిన అద్భుతం కూడా సరిగ్గా 83 రూపాయలే. ఏదీ పద నా దగ్గర ఉన్న అద్భుతం నీ చెల్లెలికి సాయపడగలదేమో చూద్దాం..” అని నెమ్మదిగా ఒక చేత్తో బాబు చెయ్యి పట్టుకుని ఇంకో చేత్తో బాబు అందించిన డబ్బులు తీసుకుని చొక్కా జేబులో పెట్టుకున్నారు బాబు తృప్తి కోసం.*


*ఆయన ఒక పేరు పొందిన పెద్ద హాస్పిటల్ కి డైరెక్టర్. ఆయన ఒక్కరే చిన్నిపాప సమస్యకు వైద్యం చెయ్యగలరు...*


*ఆయన దయ వల్ల పాపకు ఒక్క పైసా కూడా ఇవ్వనక్కరలేకుండానే ఆపరేషన్ జరిగింది...తొందరగానే పాప ఇల్లు చేరి మునుపటిలాగా ఆరోగ్యంగా బాబుతో సరదాగా ఉండగలుగుతోంది.* 


*తల్లి అంటోంది...*

*“ఎంత అద్భుతం జరిగిందీ అది కూడా ఒక్క పైసా ఖర్చు పెట్టనక్కరలేకుండానే” అని తండ్రితో అంటోంది.*


*అది విన్న బాబు నవ్వుకుంటున్నాడు. వాడికి మాత్రమే తెలుసు...ఒక అద్భుతం ఖరీదు 83 రూపాయలు అని...*

*కానీ ఒక అద్భుతం విలువ 83 రూపాయలు ప్లస్ ఆ చిన్ని బాబు అపార విశ్వాసం...*

*కల్మషం లేని ప్రేమ, స్వార్ధం లేని ప్రయత్నం తప్పక ఫలిస్తాయి.. దేవుడిని నమ్ముకున్నవారికి ఏదో ఒక రూపేణా తప్పక సాయం అందుతుంది.*

*అది ఒక అద్భుతం లాంటి ఒక మంచి మనిషి మానవత్వం రూపంలో...*

*మనిషికి మనిషి సాయం చెయ్యాలి, అని అనుకోవాలి, అంతే........!* ✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     

*మనం..*

       *నడుస్తున్న శవాలమా..?*

                 ➖➖➖✍️


*మనిషి సుఖభోగాలను అనుభవిస్తున్నంత కాలం పరమాత్మ చింతన కలిగి ఉండటం కష్టమే. మామూలుగా ఆపద సమయాల్లో మాత్రమే భగవంతుడు గుర్తుకొస్తాడు.* 


 *జీవితం కష్టసుఖాల సంగమం. కష్టాల్లో సైతం మద్యపాన వ్యసనానికి దాసులైన వారికి భగవంతుడు జ్ఞప్తికి రాడు. అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతూ పశుతుల్యంగా జీవితాన్ని గడుపుతుంటారు వీళ్లు.* 


 *”జాతస్యహి మరణం ధృవమ్’’ అన్నారు. పుట్టినవాడు గిట్టక తప్పదు. ఈ భూమీద పడ్డ ప్రతీ జీవినీ ప్రతీక్షణం మృత్యువు కనిపెట్టుకునే ఉంటుంది. కనుక వ్యర్థంగా కాలంగడపకుండా దైవచింతన కలిగి ఉండటం ఎంతైనా అవసరం. ఉత్కృష్టమైన మానవజన్మ ఎత్తికూడా అనివార్యమైన భగవత్ప్రేమకు పాత్రులు కాకపోవడం ఆత్మహత్యా సదృశం.*


*అభ్యాసం ఉంటే తప్ప ఎవరికి పరమాత్మ చింతన అలవడదు. అది ఇసుమంతైనా లేకపోగా..  ”ఏమి తిందామా! ఏమి త్రాగుదామా!” అనే యావతో జీవితాన్ని వృథా చేసుకునే వాళ్లకెంత ఆయుష్షుంటే ఏం లాభం? అది హారతికర్పూరంలా కరిగిపోతూనే ఉంటుంది కదా!*


*ఈశ్వరోపాసనకి పూజ,  ప్రార్థన ముఖ్య సాధనాలు. మన స్థూల శరీరానికి  కర చరణాదులు ఎలాగో అలాగే ఆత్మకు జ్ఞానాదులు అలాంటివి. లోకంలో జనులు దేహం మీదున్న అభిమానం చేత సర్వసుఖాల్ని పొందడంకోసమే ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారే తప్ప ఆత్మానంద సుఖంకోసం గాని, సంసార బంధ విముక్తులు అవడానికిగాని యత్నించరు. కాగా “ఎవరినెట్లా పీడించాలా?”అనే పైశాచిక ప్రకృతిని ఒంటబట్టించుకుంటున్నారు. అందువల్లే ఉత్కృష్టమైన ఈ మానవజన్మ వ్యర్థవౌతోంది.*


*ఆత్మను పోషించుటకు, రక్షించుటకు పరమాత్మ చింతనే ముఖ్యసాధనమనేమాట నిర్వివాదాంశం. అడగనిదే అమ్మైనా పెట్టదంటారు. అలాగే భగవంతుణ్ణి తలంచని వాణ్ణి ఆ దేవుడు కరుణించడు. ముక్తినివ్వడు. పండితులు, భాగవతులు తమ గానం చేత, పూజాది సత్కర్మలచేత జపతపముల చేత భగవంతుణ్ణి అనేక రకాలుగా స్తుతిస్తారు.*


*రాజదర్శనం కావాలంటే ముందుగా భటుని దర్శించవలసి ఉంటుంది. తోటలోని ఫలాలు కావాలనుకుంటే ముందుగా తోటమాలిని ఆశ్రయించాలి. అలాగే భగవంతుణ్ణి గురించి తెలుసుకోవాలనుకుంటే ముందు భాగవతుల్ని ఆశ్రయించాలి. అది సాధ్యంకానప్పుడు సత్పురుష సాంగత్యమైనా చెయ్యాలి. అది కూడ దుర్లభం అనుకుంటే తన దుష్టప్రవర్తనను తానే సరిదిద్దుకోగలగాలి. అందుకు శుభాశుభములు తెలుసుకోవాలి. అవి తెలుసుకోవాలంటే వివేకం ఉండాలి. వివేకం కలగాలంటే ముందు తను నీతిగా ఉండాలి. అందుకు విద్య అవసరం. విద్య అంటే ఆ సర్వేశ్వరుని మార్గాన్ని తెలుసుకోవడమే తప్ప పొట్టకూటికోసం విద్యలుకావని గ్రహించాలి. ఈశ్వర చింతన యందు అభిలాష ఉంటే విజ్ఞానవంతులవుతారు.*


*మనమంతా పుణ్యంకోసం నదీస్నానాలు, గుళ్ళు గోపురాల దర్శనం చేస్తుంటాం. ఇవన్నీ బాహ్యేంద్రియ శుద్ధి చేసేవే గాని ఆత్మశుద్ధికి తోడ్పడవు. వాటన్నిటికంటె ముందు శుభకర్మల్ని ఆచరించాలి.     పరోపకారం,                          సత్యం పలకడం, భూతదయ, సత్‌సాంగత్యం, దానాదిక ధర్మాలు, ఈశ్వర స్తుతి వంటి ఉత్తమగుణాలే శుభకర్మలు అనబడతాయి. శుభకర్మలు చేసేందుకు అలవాటుపడని వాళ్ళంతా ఈ భూమ్మీద నడుస్తున్న శవాలే.*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀



          *హరే కృష్ణ అంటే ఏంటి?*

                  ➖➖➖✍️


*మనం తరుచూ భగవంతుడియొక్క ఈ నామాన్ని వింటూ ఉంటాం. హరే కృష్ణ అంటే కేవలం ఎదో ఒక మతం వాళ్ళకో, ఒక సంస్థకో, కొంతమంది భక్తులకో సంబంధించినది కాదు. కలియుగంలో సమస్త మానవాళిని ఉద్దరించేసే భగవానుడియొక్క దివ్య మంత్రం.*


*ఇద్దరు భక్తులు కలిసినపుడు ఒకరినొకరు ‘హరే కృష్ణ’ అంటూ పిలుచుకుంటూ ఉండటం సాధారణంగా చూస్తూ ఉంటాం. అసలు హరే కృష్ణ అంటే ఏంటో ఒకసారి చూద్దాం…*


*’హరి’ అంటే తేలికైన అర్ధం ఏంటంటే ఎటువంటి పాపములనైనా, ఎటువంటి దోషములనైనా హరించగలిగినవాడు,* 


 *’కృష్ణ’ అంటే భగవంతుడు, సర్వ జగన్నియామకుడు. ‘క్రిష్’ అంటే అనిర్వచనీయమైన ఆనందం (మోక్షం), అటువంటి మోక్షాన్ని ప్రసాదింపగలవాడు కాబట్టి ఆయన్ని ‘కృష్ణ’ అంటారు.* 


*సృష్టిలో కొన్ని పాపాలకు ప్రాయశ్చిత్త కర్మలు ఉన్నాయి. కానీ ‘పంచమహా పాతకాలు’ అంటే బ్రాహ్మణ హత్య, బంగారం దొంగతనం చెయ్యటం, మందు తాగడంలాంటి మహా పాతకాలులాంటి వాటికి ప్రాయశ్చిత్త కర్మలు లేవు.* 


*యోగి అయినా, జ్ఞాని అయినా, ఎంతటి గొప్పవారైనా ఆ ప్రారబ్ధ కర్మలు మాత్రం అనుభవించవలసిందే.*


*సృష్టిమొత్తం మీద అలా పోగొట్టగల నామం ఏదైనా ఉంది అంటే అది కేవలం ‘కృష్ణ’ నామం మాత్రమే,  కృష్ణ కథలు మాత్రమే! అందుకే ప్రత్యేకంగా భాగవతాన్ని తీసుకొనివచ్చారు వ్యాసులవారు.* 


*కలియుగంలో కేవలం ‘భాగవతం’ చదివినంత మాత్రాన, విన్నంత మాత్రాన, కృష్ణ నామం స్మరించినంత మాత్రాన పంచ మహాపాతకాలే కాదు సమస్త పాపరాశి ధ్వంసమై కృష్ణలోకమైన మోక్షాన్ని చేరుకుంటారు. *


*చాలామంది భక్తులు రోజుకి కొన్ని వేలసార్లు కృష్ణ నామం పారాయణం చేస్తూ ఉంటారు. జననమరణ చక్రం అనే సంసార సముద్రంలో నావ వంటిది ‘హరే కృష్ణ’ నామం.* 


*"కోట్లజన్మల తర్వాత ఏ ఒక్కడో మాయాపూరితమైన జగత్తుని వదిలి నన్నే స్మరించుకుంటూ నాకు దాసుడవుతున్నాడు. అటువంటి వాడియొక్క యోగక్షేమాలు నేనే వహిస్తున్నాను” అని భగవద్గితలో(7.19) కృష్ణుడు మనకి అభయం ఇచ్చారు.*


*అలా ఆ పరాత్పరుడియొక్క ‘హరేకృష్ణ’ నామాన్ని ప్రతిరోజు స్మరించుకోవడం మన జన్మజన్మాంతరంగా కలిగిన అదృష్టం.* 


*అందునా వాట్సాప్, ఫేస్బుక్ లాంటి ‘సోషల్ మీడియా’ ద్వారా ఆధ్యాత్మిక గ్రూపులలో ప్రతిరోజూ కృష్ణ నామాన్ని స్మరించుకోవటం, కృష్ణుని  చిత్రపటాలని చూడటం కూడా ఆధ్యాత్మికతలో, భక్తిలో ఒక భాగమే. ప్రతిరోజు క్రింద ఉన్న కృష్ణ మంత్రాన్ని  స్మరించుకోవడం ఉత్తమం.*


*హరే కృష్ణ హరే కృష్ణ *

*కృష్ణ కృష్ణ హరే హరే *

*హరే రామ హరే రామ*

*రామ రామ హరే హరే * (108 సార్లు)


*కర్మఫలితంగా ఎటువంటి ఆపదలు మనల్ని, మనకుటుంబ సభ్యులను  భాదించకుండా ఉండాలని, కృష్ణపరమాత్మ మనల్ని అనుగ్రహించాలని ఆయన పాదపద్మములను నమస్కరిస్తూ... 

✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

              

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


*సనాతన..*

                   *ధర్మ రక్షణ!*

                   ➖➖➖✍️



*సనాతనధర్మాన్ని రక్షించడమంటే అసలు అర్ధమేమిటి? *


*ఎలాగైతే కాపరి పశువులను రక్షిస్తాడో అలా రక్షించడమా?*


*కాదు…*


*ధర్మాన్ని రక్షించడం అంటే ధర్మాన్ని ఆచరించడం. ధర్మాన్ని తాను ఆచరించడం, ఇంకొకరి చేత ఆచరింపజేయడంవల్ల ధర్మం రక్షింపబడుతుంది.*


*వెనకటికాలంలో ఎంతోమంది ఎన్నోరకాల అనుష్ఠానాలు చేసేవారు . తమ పిల్లలను వేరే దేశాలకు పంపిస్తారో..లేదో...అనేది వేరే విషయం. మొట్టమొదటగా వారిని సంస్కారవంతులుగా తయారు చేసేవారు.*


*మా పిల్లలు ధనవతులు కాకపోతే ఏమైపోతారని భయపడేవారు కాదు.*


*అయ్యో ! మా పిల్లలు సంస్కారహీనులైతే ఏమైపోతారు? అని ఆలోచించేవారు.*


*ఆ సంస్కారమే వారికి అన్ని రకాల శ్రేయస్సులను అందజేస్తుంది. కాబట్టి చిన్ననాటినుండే రామాయణ, భారత, భాగవత పురన ఇతిహాసాదులన్నీ చెప్తుండే వారు. దానితో వారి మనస్సులో అద్భుతమైన సంస్కారం ఏర్పడేది.* 


*ఆ సంస్కారం చిన్నవయసులో కలిగితే, ఆ సంస్కారమే వారిచేత ధర్మాచరణ చేయిస్తుంది. అప్పుడు ధర్మాన్ని రక్షించడం అవుతుంది.* 


*మన చేత ఆచరించబడిన ధర్మం పుణ్యంగా మారి మనకు ఈ లోకంలో, పరలోకంలోనే కాక తరువాతి జన్మలకు కూడా శ్రేయస్సును, సుఖాన్ని అనుగ్రహిస్తుంది.*


*ఈ విధంగా ఆచరణతోనే సనాతన ధర్మం రక్షింపబడుతుంది.*✍️

సనాతన ధర్మస్య ధర్మో రక్షతి రక్షితః

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖


*రామాయణం...

ఒకసారి చదివినంత మాత్రాన మన సమస్త పాపాలని తీసేస్తుంది.


              *వాల్మీకి రామాయణం:*

                     *3 వ  భాగం:*

                     ➖➖➖✍️


రామాయణం ప్రారంభం చేస్తూ వాల్మీకి మహర్షి ఇలా అంటారు.............

పూర్వకాలంలో కోసల దేశం అనే గొప్ప రాజ్యం ఉండేది. ఆ దేశ రాజధాని అయిన అయోధ్యని మనువు తన సంకల్ప బలంతో నిర్మించాడు. ఆ నగరం 12 యోజనముల పొడవు, 

3 యోజనముల వెడల్పు ఉండేది. (యోజనం అంటే = 9 మైళ్ళు) ఆ నగరం మధ్యలో రాజ ప్రాసాదంలో దశరథ మహారాజు నివాసముండేవారు. ఆ నగరంలో రహదారులన్నీ విశాలంగా, ఎప్పుడూ సుగంధ ధూపాలతో ఉండేవి. ధాన్యం, చెఱకు లాంటి పంటలన్నీ బాగా పండేవి ఆ రాజ్యంలో. ఏ ఇంట్లోను కూడా అనవసరంగా ఉన్న నేల లేదు. అయోధ్య నగరంలో అందరూ చాలా సంతోషంగా ఉండేవాళ్ళు, అందరూ ధర్మం తెలిసిన వాళ్ళే, ఎవడికి ఉన్నదానితో వాడు తృప్తిగా ఉండేవాళ్ళు, అందరూ దానం చేసేవాళ్ళు, సత్యమే పలికేవాళ్ళు, అందరూ ఐశ్వర్యవంతులే, ఆవులు, గుర్రాలు, ఏనుగులతో ఆ నగరం శోభిల్లేది. చెవులకి కుండలములు లేనివాడు, కిరీటం లేనివాడు, మెడలో పూలహారం లేనివాడు, హస్తములకు ఆభరణములు లేనివాడు, దొంగతనం చేసేవాడు, నాస్తికుడైనవాడు ఆ అయోధ్య నగరంలో లేడు.


*దశరథ మహారాజుకి 8 ప్రధాన మంత్రులు  ఎప్పుడూ సహాయం చేసేవారు, వాళ్ళు… దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలకుడు, సుమంత్రుడు. 

వశిష్ఠుడు, వామదేవుడు ఎల్లప్పుడూ దశరథ మహారాజుకి సలహాలు ఇచ్చే ఋత్విక్కులు. ఇతరమైన బ్రాహ్మణులూ, మంత్రులు కూడా ఉండేవారు. ఆ మంత్రులు అపారమైన విద్య కలిగిన వాళ్ళు, పని చెయ్యడం తెలిసినవాళ్లు, ఇంద్రియములను నిగ్రహించినవాళ్లు, శ్రీమంతులు, శాస్త్రము తెలిసిన వాళ్ళు, సావధాన చిత్తం కలిగినవాళ్ళు. ఆ కోసల దేశంలో పరభార్య మీద వ్యామోహం ఉన్న వ్యక్తి ఒక్కడు కూడా లేడు.

ఇన్ని ఉన్నా ఆ దశరథ మహారాజుకి ఒక బాధ ఉండేది. వంశోద్ధారకుడైన పుత్రుడు లేడనే బాధ ఉండేది. ఆయనకి అప్పటికి 60,000 సంవత్సరాలు నిండిపోయాయి. ఆయనకి అశ్వమేథ యాగం చెయ్యాలనే ఆలోచన వచ్చి, వెంటనే సుమంత్రుడిని పిలిచి, ఋత్విక్కులైన వశిష్ఠుడు, వామదేవుడు మరియు ఇతర పురోహితులని పిలవమని చెప్పాడు. అందరికీ తన ఆలోచన చెప్పాడు. అందరూ సరే అన్నారు. అశ్వమేథ యాగానికి కావాల్సిన సంభారములన్నీ తెప్పించి, సరయు నదికి ఉత్తర తీరంలో యాగమంటపం నిర్మించారు.

దశరథ మహారాజు దక్షిణ నాయకుడు, ఆయనకి 300 కి పైగా భార్యలున్నారు. కాని పత్నులు మాత్రం కౌసల్య, సుమిత్ర, కైకేయి. తను యాగం మొదలపెడుతున్నాడు కాబట్టి, తన పత్నులని దీక్ష స్వీకరించమన్నాడు. అంతఃపురంలోకి వెళుతున్న దశరథ మహారాజుతో సుమంత్రుడు ఇలా అన్నాడు...........


సనత్కుమారో భగవాన్ పూర్వం కథితవాన్ కథాం |

ఋషీణాం సన్నిధౌ రాజన్ తవ పుత్రాగమం ప్రతి ||


పూర్వకాలంలో ఒకసారి సనత్కుమారుడు ఋషులకు ఇలా చెప్పాడు........ ఇక్ష్వాకువంశములో జన్మించిన దశరథ మహారాజుకి కుమారులు లేక అశ్వమేథ యాగం చేస్తాడు. ఆ యాగం వల్ల ఆయనకి నలుగురు కుమారులు కలుగుతారు. కాని అశ్వమేథ యాగంతో పాటు పుత్రకామేష్టి యాగం కూడా చెయ్యాలి. ఈ రెండు యాగాలని చెయ్యగలిగినవాడు రుష్యశృంగుడు. ఆయన ఆ యాగాలని చేస్తేనే బిడ్డలు పుడతారని సనత్కుమారుడు చెప్తుంటే విన్నాను అని సుమంత్రుడు దశరథ మహారాజుతో అన్నాడు. ఆ రుష్యశృంగుడు పక్కనే ఉన్న అంగదేశంలో ఉన్నాడు, కాబట్టి మీరు వెళ్లి ఆయనని తీసుకొని రండి” అన్నాడు.


అప్పుడు దశరథ మహారాజు, నాకు ఆ రుష్యశృంగుడు గురించి వివరంగా చెప్పు అంటే, సుమంత్రుడు ఇలా చెప్పసాగాడు.....   పూర్వకాలంలో విభణ్డక మహర్షి చాలాకాలం తపస్సు చేసి స్నానం చెయ్యడానికి ఒక సరస్సు దగ్గరికి వెళ్ళగా, అక్కడ అలా వెళుతున్న ఊర్వశిని చూసేసరికి ఆయన రేతస్థానము నుంచి కదిలిన వీర్యం సరోవరంలో పడింది. ఆ వీర్యాన్ని ఒక జింక తాగి, గర్భం దాల్చి, శిరస్సు మీద కొమ్ము ఉన్న ఒక పిల్లవాడికి జన్మనిచ్చింది. అలా శిరస్సు మీద కొమ్ముతో పుట్టాడు కాబట్టి ఆయనకి రుష్యశృంగుడు అని పేరు పెట్టారు. ఆ విభణ్డక మహర్షి, రుష్యశృంగుడికి సమస్త వేదాలు, శాస్త్రాలు, యజ్ఞయాగాదులు అన్నీ చెప్పాడు. కాని ఆ రుష్యశృంగుడికి లోకం తెలీకుండా పెంచాడు, ఆయనకి అసలు ఈ సృష్టిలో స్త్రీ-పురుషులని ఇద్దరు ఉంటారని కూడా తెలీకుండా పెంచాడు. అంటే విషయసుఖాల వైపు వెళ్ళకుండా పెంచాడు. ఎప్పుడూ ఆ ఆశ్రమంలోనే, తండ్రి పక్కనే ఉండేవాడు. ఆ అంగరాజ్యాన్ని పరిపాలించే రోమపాదుడు ధర్మం తప్పడం వల్ల ఆ రాజ్యంలో వర్షాలు పడడం మానేశాయి. దేశంలో క్షామం వచ్చింది. రుష్యశృంగుడు కాని మన దేశంలో అడుగుపెడితే వర్షాలు తప్పక కురుస్తాయని కొందరు మహర్షులు అన్నారు.


వెంటనే రాజు మంత్రుల్ని పిలిచి విషయం చెప్తే, “రుష్యశృంగుడిని తీసుకురావడం మావల్ల కాదు, ఏమి కోరికలు లేని వాడు, మన రాజ్యానికి ఎందుకు వస్తాడు?” అన్నారు. 


ఎంతైనా మంత్రులు కనుక ఒక మాట అన్నారు..... 

ఇంద్రియార్థైః అభిమతైః నరచిత్త ప్రమాథిభి |. 


రుష్యశృంగుడికి కుడా ఇంద్రియాలు, మనస్సు ఉంటాయి. వాటికి ఇప్పటిదాకా రుచి తగలక, విషయసుఖాల వైపుకి రాలేదు. కాబట్టి అందంగా అలంకరించుకున్న కొంతమంది వేశ్యలని పంపిస్తే, విభణ్డకుడు లేని సమయంలో వీళ్ళు ఆ రుష్యశృంగుడి మనస్సుని ఆకర్షించి, ప్రలోభపెడతారు. అప్పుడు ఆయనే వాళ్ళ వెంట వస్తాడు, అని మంత్రులు సలహా ఇచ్చారు.


ఆ వేశ్యలకి విభణ్డకుడి మీద ఉన్న భయం వలన, వాళ్ళు ఆశ్రమానికి దూరంగా ఉండి పాటలు పాడడం, నాట్యం చెయ్యడం మొదలుపెట్టారు. 


ఒకరోజు విభణ్డకుడు లేని సమయంలో గానం విన్న రుష్యశృంగుడు, ఆ గానం వస్తున్న వైపు వెళ్ళాడు. అక్కడున్న ఆ వేశ్యలని చూసి, వాళ్ళు పురుషులే అనుకొని, “మహాపురుషులారా! మీరు మా ఆశ్రమానికి రండి, మిమ్మల్ని పూజిస్తాను” అన్నాడు. 


అందరూ విభణ్డకుడి ఆశ్రమానికి వెళ్లారు. తరువాత ఆ వేశ్యలు ఆశ్రమంనుంచి వెళ్ళిపోతూ ఆ రుష్యశృంగుడిని గట్టిగ కౌగలించుకుని వెళ్ళిపోయారు. 


మరునాడు ఆ రుష్యశృంగుడికి మనసులో దిగులుగా అనిపించి, ఆ వేశ్యలని చూడాలనిపించి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. 


ఈసారి వాళ్ళు ఆయనని కొంచెం దూరంలో ఉన్న తమ ఆశ్రమానికి రమ్మన్నారు. 


సరే అని అందరూ బయలుదేరారు. ఆయన అలా అంగదేశంలో అడుగుపెట్టగానే..........


తత్ర చ ఆనీయమానే తు విప్రే తస్మిన్ మహాత్మని |

వవర్ష సహసా దేవో జగత్ ప్రహ్లాదయన్ తదా ||


ఆకాశం నుంచి బ్రహ్మాండమైన వర్షం కురిసింది. వెంటనే రోమపాదుడు రుష్యశృంగుడికి నమస్కారం చేసి, ప్రార్ధించి, అంతఃపురానికి తీసుకెళ్ళి తన కుమార్తె అయిన శాంతని ఇచ్చి వివాహం జరిపించారు.


కాబట్టి దశరథ మహారాజు ఆ రుష్యశృంగుడిని పిలవడానికి, అంగదేశానికి స్వయంగా వెళ్ళాడు. అక్కడ 8 రోజులున్నాక, వెళ్ళిపోతూ దశరథుడు రోమపాదుడితో ఇలా అన్నాడు...  “మా ఇంట్లో ఒక ముఖ్యమైన కార్యం ఉంది, కనుక నీ కూతుర్ని అల్లుడిని కూడా నాతో పంపిస్తావా” అని అడిగాడు. 


రోమపాదుడు ఆనందంగా పంపించాడు. 


దశరథుడు చాలా సంతోషించి, వాళ్ళని అయోధ్యకి తీసుకెళ్ళాడు.✍️

రేపు...4వ భాగం..

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

* గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మెసేజ్ పెట్టండి...

9493906277

లింక్ పంపుతాము.🙏

[18/05, 8:54 pm] +91 94939 06277: 180523b0336.   190523-2.

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀X83.



    మహాస్వామి – ముస్లిమ్ భక్తుడు

                  ➖➖➖✍️



    కంచి కామకోటీ పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు పండరీపురంలో మకాం చేస్తున్నారు.     


     వారి దర్శనం కోసం మేము అక్కడికి బయలుదేరాము.     మేము ఎక్కిన రైలు పండరీపురం చేరుకుంది. 'చంద్రభాగా' నది ఆవలి ఒడ్డున  ఒక చిన్న మఠంలో బస చేస్తున్న పరమాచార్య స్వామి వారి దగ్గరికి వెళ్ళడానికి ఎలాగా అని మేము ఆలోచిస్తూ నిలుచున్నాము.


       ఆ రోజుల్లో టాక్సీలు అవి ఏవి లేవు. అప్పుడు ప్రయాణ సాధనం      గుర్రపు బండి మాత్రమే.  నా కళ్ళు  ఒక  టాంగా వాడి మీద పడ్డాయి.       చూడడంతోనే అతను మహమ్మదీయుడు అని  తెలిసి పోవడం వల్ల    స్వామి వారి గురించి... అతనికి తెలిసి ఉండదని వేరొక టాంగా కోసం వెతికాను.    అక్కడ అతను తప్ప ఎవరూ లేక పోవడంతో వెళ్ళి అతనితో, “శంకరాచార్య స్వామి వారు ఎక్కడ బస చేసి ఉన్నారో నీకు తెలుసా....?”    అని అడిగాను. 


       అతను “కంచి పెరియవనా? వారు తెలియకేం.... చాలా   బాగా   తెలుసు. మిమ్మల్ని   అక్కడికి  తీసుకుని వెళ్తాను. ఆయన మాకు అల్లా”  బదు లిచ్చాడు. 


          నేను కొంచం ఆశ్చర్యపోయి, సరే పదమన్నాను.


                మేము స్వామి వారున్నచోటికి చేరుకున్నాము. ఆ టాంగావాలా   మాతో డబ్బు తీసుకోవడానికి   నిరాకరించాడు. అతను  సరాసరి  పరమాచార్య  స్వామి వారు   కూర్చుని ఉన్న  చోటికి  మమ్మల్ని తీసుకుని వెళ్ళాడు.   అతను ఆనందం తో,        తల్లి దగ్గరికి నెలల బిడ్డ వెళ్ళిన చందంగా....  స్వామి వారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు.  అది అతనికి ఈ జన్మకు లభించిన హక్కు కాబోలు, పరమాచార్య స్వామి వారు  కూడా      ఏమి మాట్లాడ లేదు.      స్వామి వారికి    మమ్మల్ని.... పరిచయం చేసాడు.     

 

    తరువాత తను మాతో, ”వీరు వచ్చిన నాటినుండి   మా జీవితాలు     ధన్యమ య్యాయి.   తాగుడు మొదలైన  వ్యసనా లను త్యజించాము”       అని అన్నాడు. 


            అతను కళ్ళారా చూసిన ఒక సంఘటనని మాతో పంచుకున్నాడు.

"చంద్రభాగా నది ఎగువ ప్రాంతంలో... వర్షాలు ఎక్కువై     నదికి     వరదలు... వచ్చాయి.     ప్రమాదపు అంచులో నది ప్రవాహం ఉంది.    ఆరోజు స్వామివారు  నిద్రలేచారు.    వరద ఉధృతి ... ఎక్కువగా ఉంది... వెళ్ళొద్దని అందరూ బ్రతిమాలుకున్నా స్వామివారు స్నానానికి నదికి వెళ్ళారు.       నదిలోకి వెళ్ళి వారి దండాన్ని ఒకచోట నిలబెట్టారు. ఆశ్చర్య కరంగా వరదనీరు ఆదండం దరిదాపు ల్లోకి కూడా రాలేదు.        అక్కడినుండి వరద వెనుకకు   వెళ్ళనారంభించింది. నేను కూడా నదిలో స్నానం చేసాను.

దీనికి  నేను ప్రత్యక్ష సాక్షిని.....”      అని భావోద్వేగంతో   చెప్పాడు   ఆ సాధారణ ముస్లిమ్ భక్తుడు.


                         ➖➖


      [ఆదిశంకరాచార్యుల వారు గురువు అన్వేషణలో భాగంగా....     నర్మదానదీ పరీవాహక ప్రాంతానికి    వచ్చినప్పుడు, నదికి వరద వచ్చింది.         వారు తమ కమండలంలో ఆ వరద నీటినంతటినీ పట్టి, వరద ముంపు నుండి కాపాడారు. 


      అలా చేసినవాడే   నీకు శిష్యుడై...., జగద్గురువై సనాతన ధర్మాన్ని     ఉద్ధరి స్తాడని       గోవిందభగవత్పాదులకు.... చెప్పారు.]


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


http://t.me/paramacharyavaibhavam


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

 *శుభోదయం*


💐🙏💐🙏💐


*అన్వేషణ నా కర్తవ్యం*


*ఆలోచన నా నైజం* 


*ఆవేదన నా కర్మ ఫలం*

 

*అనురాగం నా బంధనం*


*ఆత్మీయత నా  గుణం*


*ఆక్రోశం నా దుఃఖం*


ఇవన్నీ *నాకు* కలిగేవి.


*ఆనందం  నా లక్షణం.*

  

*ఆనందం నా స్వభావం.*

 

ఇది *నాలో* ఉండేది.




*Sri panjarla Mahindra Reddy*


*హిందూ మతాన్ని విచ్ఛిన్నం చేయడానికే*

*బ్రాహ్మణ వ్యతిరేక వాదం వెనుక ఉన్న కుట్ర .*


*పరాయి మత చాందస వాద పాలకులచే మన మెదళ్లలో నాటబడ్డ బ్రాహ్మణ వ్యతిరేక సిద్ధాంతం అర్ధం చేసుకోవడానికి బుర్ర ఉంటే చాలు ఎవరికైనా . అపారమైన తెలివితేటలూ అవసరం లేదు . మన దేశాన్ని తుష్కర మూకలు 800 సంవత్సరాలు , క్రైస్తవ మూకలు 200 సంవత్సరాలు అప్రతిహతంగా పాలించారు . మరి ఈ దేశంలో కొన్ని వర్గాల వారు అభివృద్ధి చెందలేకపోవడానికి పూర్తిగా బ్రాహ్మణులే కారణం అంటుంటే మన బుర్ర ఎప్పుడైనా ఆలోచించిందా?*


*మన దేశాన్ని పాలించిన చక్రవర్తులలో అధిక శాతం బ్రహ్మణేతరులు కాదా ?* *ఉదాహరణకు చంద్రగుప్త మౌర్య , శ్రీ కృష్ణ దేవరాయ , ఛత్రపతి శివాజీ , చోళులు , పాండ్యులు వీళ్ళెవరూ బ్రాహ్మణులు కాదే . బ్రాహ్మణుడైన చాణక్యుడు లేకుంటే చరిత్రలో చంద్ర గుప్తుని స్థానం ఏంటి అసలు . మన పురాణాల్లో గాని , కధల్లో గాని మనం ఏం చదువుకున్నాం ? "* *అనగనగా ఒక ఊరిలో ఒక బీద బ్రాహ్మణుడు ఉండేవాడు . అతని కుటుంబానికి తినడానికి తిండి కూడా ఉండేది కాదు . ఒకరోజు అతను అడవిలో వెళ్తుండగా.... " ఇటువంటి కధలే కదా మనం చదువుకుంది . మరి అంత పేద బ్రాహ్మణుడు వేరే వారిపై వివక్ష ఎలా చూపించాడంటారు చెప్పండి ?*


*నేడు హరిజనులుగా పేర్కొనబడుతున్న కొన్ని కులాల వారిని నిజానికి అణచివేసింది భూస్వాములు , జమిందారులు , క్రైస్తవులు, ముస్లింలు మాత్రమే . మొత్తం బ్రాహ్మణులలో అర్చక వృత్తి చేప్పట్టే వారూ కేవలం 20% మాత్రమే ఉంటారు . ఒకసారి ఆలోచించండి . మన స్నేహితుల్లో ఉన్న బ్రాహ్మణుల్లో ఎంతమంది అర్చక వృత్తి చెప్పట్టారో. నా స్నేహితుల్లో అర్చక వృత్తిని చేపట్టిన వారు 2 ,3 ముగ్గురు తప్పించి ఎవరూ లేరు.*


*మేధావులు చెప్పినట్టు బ్రాహ్మణులకు మాత్రమే వేద విద్య అనుకుంటే నేడు మనకు ఆది కావ్యమైన రామాయణం ఉండేది కాదు . హిందువులకు అత్యంత పవిత్రమైన భగవద్గీత , పురాణాలు , మహా భారతాలే ఉండేవి కాదు . వీటిని రచించింది బ్రాహ్మణులు కాదు . ఎప్పటి సంగతో ఎందుకు హిందూ ధర్మ రక్షకుడు అయిన స్వామీ వివేకానంద బ్రాహ్మణుడు కాదు.* 


*చరిత్రలో బ్రాహ్మణులపై దాడి :*


*హిందువుల మహా పుణ్య క్షేత్రం అయిన కాశీలో, గంగ ఒడ్డున మతం మారాడానికి నిరాకరించారు అన్న కారణంతో వేల మంది బ్రాహ్మణులను , వారి పిల్లలను నరికి చంపి దూరంగా కనపడే ఒక పెద్ద గుట్టగా వేసాడు ముష్కర చక్రవర్తి ఔరంగజేబు . ఆ బ్రాహ్మణుల జంధ్యాలు తెంచి గుట్టగా పోసి నిప్పంటించి చలి కాచుకున్నడు ఆ క్రూరుడు .*


*క్రైస్తవ సన్యాసి సెయింట్ జేవియర్ పోర్చుగల్ రాజుకి ఒక ఉత్తరం రాసాడు . దాని సారాశం ఏమంటే " బ్రాహ్మణులను లేకుండా చేస్తే  భారతీయులందరూ తేలిగ్గా క్రైస్తవులుగా మారిపోతారు " అని . అర్ధం అయ్యింది కదా . బ్రాహ్మణ వ్యతిరేక సిద్ధాంతం వెనుక ఉన్న అసలు కుట్ర ఇదీ . వేల మంది గౌడ సరస్వతి బ్రాహ్మణులను కిరాతకంగా చంపించాడు నేర విచారణ పేరుతో . దీనినే మనం "Goa Inquisition" పేరుతో చరిత్రలో చదువుకుంటాం .*


*మైసూరు ప్రాంతం మేల్కొటేలో దీపావళి రోజున 800 మంది అయ్యంగార్ బ్రాహ్మణులను ఊచకోత కోయించాడు టిప్పు సుల్తాన్ . అందుకే ఇప్పటికీ ఆ ప్రాంతంలో బ్రాహ్మణులు దీపావళి జరుపుకోరు .*


*ఇక కాశ్మీరీ పండిట్ల సంగతి తెలియనిది ఎవరికీ . మతం మారతారా లేక ఇళ్ళు విడిచిపెట్టి పోతారా అని నమాజ్ అనంతరం మైకుల్లో ప్రకటన చేస్తే ప్రాణాలు అరచేత పట్టుకుని ఢిల్లీ ప్లాటుఫారంల పైకి చేరి దిక్కు లేని జీవితం గడుపుతున్నారు వేలాది మంది కాశ్మీరీ పండిట్లు . ముష్కర జీహాదీల చేతుల్లో దాదాపుగా హత్య చేయబడ్డ వారూ 500000 మంది.*


*మీకు తెలుసా కాశీలో రిక్షా తొక్కుకుని జీవించే వారిలో అధిక శాతం బ్రాహ్మణులే .  ఢిల్లీ రైల్వే స్టేషన్లో కూలీలుగా పని చేసేవారిలో 50% బ్రాహ్మణులే . ఆంధ్ర ప్రదేశ్లో వంట పని వారుగా పని చేసేవారిలో 75% బ్రాహ్మణులే . ఈ బాధలు పడలేకే చదువుకున్న బ్రాహ్మణులు ఎక్కువగా సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తూ విదేశాల్లో స్థిరపడుతూ అక్కడ మన సంప్రదాయాలను ప్రచారం చేస్తున్నారు.*


*బ్రాహ్మణులు ప్రధానంగా జ్ఞానానికి ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల , మత మార్పిడి మాఫియాలు ఎక్కువగా బ్రాహ్మణ వ్యతిరేక కధలు ప్రచారం చేస్తుంది . వారు చెప్పే తాటాకు, చెంబు కధలు చరిత్రలో ఎక్కడా కనపడవు . కాని ఒక అబద్దాన్ని పదే పదే చెబితే దాన్నే నిజం అనుకుంటుంది ఆలోచించే సమయం లేని లోకం . ఇదే వారి సిద్ధాంతం . నేటికి కూడా ఇలా వ్యతిరేక సిద్ధాంత్తాన్ని కాంగ్రెస్ , కమ్యూనిస్ట్ మొదలైన చాలా పార్టీ వాళ్ళు వెనక ఉండి నడిపిస్తున్నారు . దయచేసి ఎవరు వారి ఉచ్చు లో పడకండి , మీ ధర్మాన్ని చరిత్ర ని తెలుసుకోండి , ధర్మంగా జీవించండి .*

*జై శ్రీ రామ్ జై భారత్ భారత్ మాతాకీ జై జై హింద్*

*ఇట్లు*

*మీ పెంజర్ల మహేందర్ రెడ్డి*

*అఖిల భారత ఓసి సంఘం*

*మరియు EWS ఎకనామికల్ వీకర్ సెక్షన్*

 *జాతీయ అధ్యక్షుడు*

*జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

తండ్రి తన పిల్లలకు రాసిన ఒక లేఖ....

 *


*ఒక తండ్రి తన పిల్లలకు రాసిన ఒక లేఖ....*


నేను ఈ లేఖ రాయడానికి మూడు కారణాలున్నాయి.


1. జీవితం లో అదృష్టం, దురదృష్టం అనేవి చాలా చంచలమైనవి. ఎవరూ వీటిని ఖచ్చితంగా అంచనా వేయలేరు.


2. నీ తండ్రిగా నేను నీకు ఇవి చెప్పకపోతే, ఇంకెవ్వరూ నీకు చెప్పరు.


3.నీకు ఇవి తెలిస్తే బహుశా జీవితంలో చాలా సమయాలలో నీ గుండె గాయపడకుండా ఉంటుంది.


*ఈ క్రింద విషయాలు జాగ్రత్తగా గుర్తుంచుకో....*


1. నీతో సఖ్యంగా లేని వారి పట్ల ద్వేషం పెంచుకోకు.

 నేను, మీ అమ్మ తప్ప నీకు తప్పనిసరిగా మంచే చేయాలన్న బాధ్యత ఎవరికీ లేదని బాగా గుర్తెరిగి మసలుకో.

నీతో మంచిగా ఉన్నవారిపట్ల కృతజ్ఞుడివై వుండు.

 అలాగే జాగ్రత్తగా గమనించు కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కరూ చేసే ప్రతి పనికీ ఒక ఉద్దేశం ఉంటుంది. 

 నీతో ఎవరైనా స్నేహంగా ఉంటే ఎప్పటికీ అలానే ఉండాలని లేదు, జాగ్రత్త, గుడ్డిగా వారిని ఆత్మీయులుగా నమ్మి మనసు గాయపరచుకునేవు సుమా!


2. ఏ ఒక్కరూ తప్పనిసరి కాదు మరియు తప్పక కలిగి ఉండితీరవలసినది ఏదీ లేదని మరచిపోకు.

ఇది నీవు సరిగా అర్థం చేసుకున్న రోజు నీ చుట్టూ ఉన్నవారు నిన్ను వద్దనుకున్నా, 

నువ్వు బాగా కోరుకున్నది నీకు దూరమైనా నీ మనసు పెద్దగా గాయపడదు.


3. జీవితం చిన్నది.

ఒక్క రోజు వ్యర్థమైనా చక్కగా అనుభవిం చాల్సిన, 

మళ్ళీ తిరిగిరాని ఒక రోజుని కోల్పోయావన్న విషయం గుర్తించు.


4. ప్రేమ అనేది ఒక నిలకడలేని, చంచలమైన ఒక భావన.

కాలాన్ని, మూడ్ ని బట్టి వెలసిపోయే ఒక ఎమోషన్.

 నువ్వు బాగా ప్రేమించానను కున్నవారు దూరమైనపుడు కుంగిపోకు, ఓపిక పట్టు. కాలం నీ గాయాలను, బాదలను అన్నింటినీ కడిగేస్తుంది.

ప్రేమ యొక్క సౌందర్యాన్ని , 

అలాగే ప్రేమ విఫలమవడాన్ని అతిగా ఊహించుకోకు. 

ఇవి ఏమంత పెద్ద విషయాలు కావని కాలం గడిచే కొద్దీ తెలుసుకుంటావని తెలుసుకో.


5. చాలామంది పెద్దగా చదువుకోకుండానే జీవితంలో బాగా పెద్ద స్థాయికి వెళ్లుండచ్చు, 

కానీ దానర్థం నువ్వు కష్టపడి చదవకుండానే గొప్పవాడయిపోతావని కాదు. 

నువ్వు సంపాదించే జ్ఞానమంతా నీ ఆయుధాలని గ్రహించు.

దీవాళా తీసిన స్థితి నుండి తిరిగి ఉన్నతమైన స్థానం చేరడం సాద్యమే, 

కానీ దీవాళా తీసినప్పటి పరిస్థితి దారుణంగా ఉంటుందని మరచిపోకు.


6. నేను వృద్ధాప్యంలో ఆర్థికంగా నీమీద ఆధారపడను, అలాగే జీవితాంతం ఆర్థికంగా నీకు ఆసరా ఇవ్వలేను. నువ్వు పెద్దవాడవుతూనే నా బాధ్యత తీరిపోతుంది. తర్వాత బస్సులో తిరుగుతావా నీ సొంత లగ్జరీ కారులోనా? రిచ్ గానా మామూలు జీవితమా? అన్నది నీవే నిర్ణయించుకో.


7. నువ్వు నీ మాట నిలబెట్టుకో. ఇతరులనుంచి ఏది ఆశించకు.

 నువ్వు అందరితో మంచిగా ఉండు, 

అందరూ నీతో మంచిగా ఉంటారని అనుకోకు. 

ఇది నువ్వు సరిగా అర్ధం చేసుకోకపోతే నీకు అనవసర సమస్యలు తప్పవు.


8. లెక్కలేనన్ని లాటరీ టికెట్లు చాలా కాలం కొన్నా, ఒక్క చెప్పుకోదగ్గ పెద్ద ప్రైజ్ కూడా ఎప్పుడూ రాలేదు. కష్టపడితేనే ధనవంతులవుతాము అన్నదానికి ఉదాహరణమిదే. విజయానికి షార్ట్ కట్ లేదని బలంగా నమ్ము.


9. అది ఎంత తక్కువ/ ఎక్కువ కాలమైనా సరే, మనం కలసివున్న కాలాన్ని జాగ్రత్తగా దాచుకుందాం. వచ్చే జన్మలో మళ్లీ కలుస్తామో లేదో మనకు తెలియదు కదా కన్నా!

                                      *........ నాన్న*


Heart Touching and very valuable 👍

సత్యం వలన

 .

             _*సుభాషితమ్*_


 𝕝𝕝శ్లోకం𝕝𝕝


*అమృతం చైవ మృత్యుశ్చ* 

*ద్వయం దేహే ప్రతిష్ఠితమ్।*

*మృత్యుమాపద్యతే మోహాత్* 

*సత్యేనాపద్యతేఽమృతమ్॥*

                         ~మహాభారతమ్


తా𝕝𝕝

*శరీరంలో అమృతమూ మృత్యువూ రెండూ ఉంటాయి... మోహం వలన మృత్యువును, సత్యం వలన అమృతాన్ని పొందుతారు*......"

 WHAT TO DO IF SUDDENLY YOU ARE UNABLE TO PASS URINE ...

This is the experience of a famous allopathy doctor on account of a medical article. He is in his 70's and an ENT specialist. It was astonishing to listen to one of his experiences which he shared. 

That morning one day he had a problem on waking up. He had an urge to pass urine but for some reason he was unable to do so. At an advanced age some people face such a problem some times and if they try two or three times they may succeed. He tried repeatedly but nothing happened. His continuous efforts didn’t bear any result. Then he realised there is a problem. Although he is a doctor he is no exception to such physical problems as he is also made of flesh and blood like everyone else. Now his lower abdomen became heavy and he was unable to sit or stand and was suffering from the pressure buildup. Immediately he called up a known urologist on the phone and explained his situation. The Urologist replied “I am at present in a hospital in the outskirts and I will be at a clinic in your area in one and a half hours.. Will you be able to withstand it for that long?” He replied “I will try”. 

At that instant he received an incoming call from another allopathy doctor, a childhood friend. With great difficulty the old doctor explained the situation to his friend.  

His friend replied “Oh, your bladder is full and you are unable to pass urine. Don’t worry, do as I suggest and you will be able to overcome it”. 

And he gave the instruction:

: “Stand up and jump vigorously … while jumping lift both your hands as though you are plucking mangoes from a tree.. Do that 15 to 20 times”. 

What? ? ?

With a full bladder he wants me to jump? 

Though a little sceptical the old doctor tried it. What a relief to him when within 5 to 6 jumps urine started passing. He felt overjoyed and thankful to his childhood friend for solving the issue with such a simple method which otherwise would have required an admission to a hospital where they would have inserted a catheter inside the bladder, injections, anti-biotics etc etc etc resulting in a bill over thousands of Dollars in addition to physical and mental stress for him and his near and dear ones.

 

KINDLY SHARE WITH SENIOR CITIZENS AND ALL WHO MAY NEED THIS VERY SIMPLE REMEDY FOR WHAT COULD BE AN UNBEARABLE EXPERIENCE.