///// ఆలోచనాలోచనాలు ///// -----౦౦౦ మనోవైఖరి ౦౦౦----- మనం A=1; B=2; C=3; D=4;- - - - - - - Z=26 అని అనుకొంటే, అదృష్టం(LUCK) = 12+21+ 3+ 11= 47;. జ్ఞానం ( KNOWLEDGE) = 11+ 14+ 15+ 23+ 12+ 5+4+7+5= 96;. పరిశ్రమ (HARD WORK) = 8+ 1+ 18+ 4+ 23+ 15+ 18+ 11= 98 ;. వైఖరి (ATTITUDE)= 1+20+20+ 9+ 20+ 21+ 4+5= 100 . కాబట్టి మన మనోస్థితి లేదా వైఖరి, అదే మన జీవితాన్ని సుసంపన్నం చేసేది. *****ఇక మనం ఏంచేయగలం అనేది మన సామర్థ్యం మీద, మనం ఏంచేస్తున్నాం అనేది మనకు లభించిన ప్రేరణ మీద, ఇక మనం దానిని ఎంతబాగా చెయ్యగలం అనేది మన దృక్పథం మీద ఆధారపడి ఉంటాయి. ***** కొండపైన నిలబడి క్రిందికి చూస్తే అన్నీ చిన్నవాటిగానే కన్పిస్తాయి. అదే మనం లోతైన లోయలో నిలబడి పైకి చూస్తే అన్నీ పెద్దవిగా కనుపిస్తాయి. మొదటిది మన అహంకారానికి, రెండవది మన ఆత్మన్యూనతకు సంకేతాలు. ఆ రెండింటి నడుమ ఉండేదే మన నిజమైన మనోస్థితి. ***** లోకంలో అల్పమైన పనులంటూ ఏవీ లేవు. ఏవైనా ఉన్నాయని మనం భావిస్తున్నామంటే అది నిజానికి మనలో దాగివున్న "అల్పత్వమే!" ***** మూర్ఖుడు చేసే ఘనకార్యం ఏమిటయ్యా అంటే తాను చెయ్యవలసిన పనులను వాయిదా వేసుకొంటూ, ఎదుటివారి పనులలో వంకలు వెతుకుతూ ఉంటాడు. ***** నీ కర్తవ్యాన్ని నీవు సరిగా నిర్వహించవు. జీవులను బాధించడం మానుకోవు. పూజలవలన, మొక్కులు తీర్చుకోవడం వలన దేవుళ్ళు వరాలను అనుగ్రహిస్తారనే భ్రమలో జీవిస్తావు. చిల్లుల బొక్కెనతో బావినుండి నీళ్ళను తోడడం సాధ్యమైన పనేనా? (ఆలోచించు!) తేది 5--10--2023, గురువారం, శుభోదయం.
ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
6, అక్టోబర్ 2023, శుక్రవారం
సేవకు ప్రతిఫలం
*సేవకు ప్రతిఫలం..*
"అంకుల్ నన్ను గుర్తుపట్టారా?.." అంటూ ఆ అమ్మాయి అడిగింది..తలయెత్తి చూసాను..గుర్తుపట్టినట్లుగా తలవూపి.."అమ్మా..ఇప్పుడేనా రావడం?.." అని అడిగాను.."మధ్యాహ్నం వచ్చాము..మా ఆయన కూడా వచ్చాడు.." అన్నది.."మంచిదమ్మా..మీ అమ్మగారి ఆరోగ్యం ఎలా ఉంది..?" అని అడిగాను.."ఇప్పుడు బాగుంది అంకుల్..తనపని తాను చేసుకుంటున్నది.." అని చెప్పింది..ఆ అమ్మాయి వాళ్ళ అమ్మతో కలిసి మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్ద నలభైరోజులు ఉన్నది..వాళ్ళ అమ్మకు ఆరోగ్యం బాగా లేకపోవడం..అప్పుడప్పుడూ విపరీతంగా కేకలు వేస్తూ పరుగెత్తడం..లాంటి సమస్యల తో బాధపడుతూ ఉంటే..తల్లిని తీసుకొని స్వామివారి మందిరం వద్దకు వచ్చింది..స్వామివారి సన్నిధి లోనే నలభైరోజులు ఆ తల్లీకూతుళ్ళు వున్నారు..ఆ నలభైరోజుల్లో ఈ అమ్మాయి ప్రవర్తన మందిరం వద్ద ఉన్న మా సిబ్బందికి..అర్చకులకూ బాగా నచ్చింది..అదే సమయం లో ఆ తల్లికి కూడా ఉన్న సమస్యలు తగ్గుముఖం పట్టాయి..తల్లీకూతుళ్ళు ఇద్దరూ స్వామివారి సేవ చేసుకునేవారు..మా సిబ్బంది తోపాటు మందిరాన్ని శుభ్రం గా ఊడ్చేవారు..స్వామివారి కి వాడే వస్తువులను కడిగిపెట్టేవారు..శనివారం నాడు మందిరానికి వచ్చే పూలను మాలలుగా కట్టి పెట్టేవారు..వారికి చేతనైన పని చేస్తూనే ఉండేవారు..అలా ఈ అమ్మాయి స్వామివారి మందిరం లో ఒక మనిషిగా కలిసిపోయింది..తన తల్లి ఆరోగ్యం బాగుపడగానే ఒక ఆదివారం నాడు స్వామివారికి పొంగలి నైవేద్యంగా పెట్టుకొని ..తల్లిని తీసుకొని తన ఊరుకు వెళ్ళిపోయింది..
"నా చిన్నప్పుడే మా నాన్న చనిపోయాడు..మా అమ్మే కూలిపని చేసుకుంటూ నన్ను పెంచింది..మాకు పెద్దదిక్కు ఎవ్వరూ లేరు..అమ్మకు ఆరోగ్యం సరి లేకపోతే..వైద్యం చేయించడానికి స్తోమత లేదు..ఏ దిక్కూ తోచక అల్లాడుతుంటే..స్వామివారి గురించి విని ఇక్కడికి తీసుకొచ్చాను..స్వామివారి దయవల్ల అమ్మ బాగుపడింది..ఇక్కడినుంచి వెళ్లిన తరువాత..ఒక స్కూల్లో టీచర్ గా చేరాను..అమ్మచేత కూలీపని మానిపించి న నా వద్దే ఉంచుకున్నాను..పోయిన సంవత్సరం నాకు వివాహం అయింది..ఆయనకు గవర్నమెంట్ ఉద్యోగం..ఆయనకు దేవుడి మీద పెద్దగా నమ్మకం లేదు..మా పెళ్లి తరువాత కూడా మా అమ్మ మా వద్దే ఉంటున్నది..పెళ్లికి ముందుగానే అమ్మ గురించి ఆయనతో చెప్పాను..ఒప్పుకున్నారు..ఈ స్వామివారి గురించి..మా అమ్మ ఆరోగ్యం బాగుపడటం గురించి ఆయనకు పదే పదే చెప్పడం వల్ల..ఈరోజు నాతోబాటు ఇక్కడకు వచ్చారు..ఈరాత్రికి ఇక్కడ నిద్రచేసి..రేప్పొద్దున స్వామివారి సమాధి దర్శించుకొని వెళ్లిపోతాము.." అని చెప్పి..తన భర్తను పరిచయం చేసింది.."సరే తల్లీ..స్వామివారు మీ తల్లికి ఆరోగ్యం బాగు చేశారు..నీ కళ్లారా చూశావు..మీ ఆయన లో కూడా దేవుడంటే భక్తి కలిగిస్తారేమో చూద్దాం.." అన్నాను..స్వామివారి చిత్రపటం వైపు తిరిగి నమస్కారం చేసుకున్నది..
ఆ దంపతులు ఆరోజు స్వామివారి మందిరం లోనే నిద్ర చేసారు..మరుసటి రోజు ఉదయాన్నే ఇద్దరూ స్వామివారి సమాధి దర్శించుకొని వాళ్ళ ఊరెళ్లిపోయారు..మరో పదిహేనురోజుల తరువాత..ఒక శనివారం నాటి సాయంత్రం..ఆ అమ్మాయి తన భర్త తో కలిసి స్వామివారి మందిరానికి వచ్చింది..నేరుగా నేను ఉన్న చోటుకి వచ్చి.."అంకుల్..స్వామివారు తన మహిమ చూపారు..ఈరోజు మా ఆయన పట్టుబట్టి నన్ను ఇక్కడకు తీసుకొచ్చారు..స్వామివారి మందిరానికి వెళదాము..అక్కడ నిద్ర చేద్దాము..అని ఆయనే నాకు చెప్పి తీసుకొచ్చారు.." అన్నది..అతని వైపు చూసాను.."అవునండీ..పోయినసారి ఇక్కడికి వచ్చినప్పుడు..స్వామివారి సమాధి వద్ద నమస్కారం చేసుకున్నప్పుడు..మనసులో అనుకున్నాను..నాకు నిదర్శనం చూపిస్తే నేను నమ్ముతాను అని అనుకున్నాను..చాలారోజుల నుంచీ నా ఉద్యోగం తాలూకు సమస్య కోర్టు లో ఉన్నది..ఇక్కడ నుంచి వెళ్లిన మూడోరోజే అది నా కనుకూలంగా తీర్పు వచ్చింది..స్వామివారి వల్లే అని నాకు నమ్మకం ఏర్పడింది..ఆ తీర్పు వల్ల నాకు ప్రమోషన్ కు కూడా అడ్డంకులు తొలగిపోయాయి..పైవాళ్ళు ఆ ఫైలు కూడా సిద్ధం చేశారు..అందువల్ల స్వామివారి వద్దకు రావాలని అనుకోని..తనకు చెప్పి తీసుకొచ్చాను.." అన్నాడు..
"అమ్మా..నువ్వు నీ వివాహానికి ముందు ఇక్కడ కొన్నాళ్లపాటు వుండి స్వామిసేవ చేసుకున్నావు..అదే నీకు అదృష్టం..ఆ సేవ ఫలితమే నీ భర్తకు కూడా స్వామివారి మీద భక్తి ఏర్పడింది..ఇకనుంచీ ఇద్దరూ స్వామివారి వద్దకు సంకోచం లేకుండా రావొచ్చు.." అన్నాను..
స్వామివారు కరుణామయులు..ఆ విషయం మాకు పదే పదే ఋజువు చేస్తూనే వున్నారు..చూస్తూనే ఉన్నాము..కానీ అదేమి చిత్రమో..మాకు ప్రతిసారీ కొత్తగా వుంటుంది..
సర్వం..
శ్రీ దత్తకృప!
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).
పుణ్యాలే మనిషిని రక్షిస్తాయి.
గీర్వాణవాణి
వనే రణే శత్రు జలాగ్నిమధ్యే
మహార్ణవే పర్వతమస్తకే వా
సుప్తం ప్రమత్తం విషమస్థితం వా
రక్షంతి పుణ్యాని పురాకృతాని.
అడవిలో,యుద్ధంలో,శత్రువులమధ్యలో,నీటిలో,అగ్నిలో,సముద్రంలో,పర్వతశిఖరంపైఉన్నా, నిద్రితుడై,ప్రమత్తుడై ఉన్నా, సంకటస్థితిలో ఉన్నా పూర్వంచేసిన పుణ్యాలే మనిషిని రక్షిస్తాయి.
ఆలోచనాలోచనాలు
{{{{{ ఆలోచనాలోచనాలు }}}}}} ***** అవధాన మధురిమలు ***** 00000 పంచసహస్రావధాని శ్రీజంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి 00000 సమస్యాపూరణములు 1* " బలివాకిటివాడొ, బాణువాకిటివాడో." పూరణము;--- "" కం. వెలయాలితోడి నెయ్యము/ కలుగగనే రాదు తప్పి, కలిగినొ దానిన్ / నిలుపగ రావలె నజుడో/ బలివాకిటివాడొ, బాణువాకిటివాడో!"" 2* "రాతిరి సూర్యుండు సంబరమ్మున దోచెన్." పూరణము;---"" కం. ఆతత కాసారము ల/ జ్ఞాత మనోజ్ఞంబులయ్యె,జక్రము లెల్లన్/ గావరముడిగెన్/ రాతిరి, సూర్యుండు నంబరమ్మున దోచెన్."" 3* "పచ్చి మాంసంబు దినువాడు బ్రాహ్మణుండు." పూరణము;--- ""తే.గీ. బ్రహ్మవిజ్ఞాన హేతు భావప్రబోధి/ నిత్యకర్మాభి నిరతుడే ద్విజుడు కాని/ యగునె కలుద్రావ జందెమ్ము లవలద్రోసి/ పచ్చిమాంసంబు దినువాడు బ్రాహ్మణుండు."" 4* "భరతున్ దునిమె రాఘవుండు భామిని కొఱకై" పూరణము;--- "" కం.హరిసుతుని బరిమార్చెను/ సిరిగురు నొప్పించె శమముచెడి రావణునిన్/ హరపదసేవనారం/ భ రతుం దునిమె రాఘవుండు భామిని కొఱకై."" 5*" ధరతగ్గుట హెచ్చుకొఱకె ద్వైగుణ్యముతో." పూరణము;--- "" కం. ధరణీ ప్రవాహవేగ / స్ఫురణంబునకోడి మొక్క భూమికి వంగన్/ మరియున్ లేచుటకొఱకే / ధరతగ్గుట హెచ్చుకొఱకె ద్వైగుణ్యముతో."" దత్తపది---పెట్టె -- బెట్టు -- దిట్ట -- గట్టు -- వెద్ది పదములతో పద్యం. తే. గీ. " పెట్టెలోనిడి తాళంపు బెట్టువైతె / ధనము బుధులడ్గ? దిట్టవు! ఘనగుణమణి/ గణములకు రోహణంపు బెన్గట్టువెద్ది / ఘనకలాబ్ధికి జెలియలిగట్టు చెపుమ?"" వర్ణనాంశములు--- 1* లక్ష్మీ సరస్వతీ సంవాదము--- సీ. పదివేసములవాఁడు పడతి నీ మగఁడన్న చతురాస్యుఁడగు నటే చామ యనియె. అన్యకాంతాలోలుఁడగు నీదు మగఁడన్న, తననోట సతి నుంచుకొనునె యనియె పాముపానుపుమీఁదఁ బండు నీ మగఁడన్న, పూరేకులొత్తునే బోఁటి యనియె. నటరాజనృత్తనందనుఁడు నీ మగఁడన్న , కర్నశౌంకారోక్తికరుఁడె యనియె తే. గీ. సృష్టిలేకున్న నెవనిఁబోషించునన్న / సృజనగావించి యెట్లు రక్షించుననియె/ ఇట్టు లన్యోన్యవాద ప్రవృత్తలైన / వాగ్ధనాత్మక మాతలఁ బ్రస్తుతింతు. 2* శక్తిత్రయము--- పంచ!! సురాసురేంద్రగేయ గానశోభిచారితన్ సతిన్./ సరోజనేత్ర రంజనైక చాతురీధురన్ రమన్ / వరప్రదాన కౌశలస్వభావయుక్త భారతిన్/ స్థిరస్థితిన్ శుభంబు గూర్పఁ జిత్తమందు నెంచెదన్. 3* "అయిదు భాషల మాటలతో పద్యము"---- ఉ. టైమయిపోయె ధూమశకటంబిఁక నేగు చలోరెహా కదా/ గీమునఁ గాలయంత్ర నహికెం కడునాలస మేలచేసెదో/ జామున నూరికింజని విచారణ సత్సభ నిల్వనేరమో/ యేమి యనర్థ మేర్పడు నొహేసఖ చాంగ్ల యనంగ వింటివే? ( డా. రాపాక ఏకాంబరాచార్యులవారి అవధాన విద్యా సర్వస్వం సౌజన్యంతో) తేది 4--10--2023, బుధవారం, శుభోదయం.
నమ్మకం..రక్షణ..*
*నమ్మకం..రక్షణ..*
"స్వామివారి సమాధి వద్దకు వెళ్ళడానికి అనుమతి ఇస్తారా?.." అంటూ ఆ యువకుడు నాలుగోసారి నన్ను అడిగాడు.."మీకు ఇందాకటి నుంచీ చెపుతూనే వున్నాను..మీవంతు రాగానే మిమ్మల్ని లోపలికి పంపుతాము..స్వామివారి సమాధి వద్దకు వెళ్లి..మీకోర్కెలు తెలపుకోండి..అంతవరకూ ఇక్కడ స్థిమితంగా కూర్చోండి..అందరికీ అవకాశం కల్పిస్తాము.." అని ఒకింత అసహనంగా అతనితో చెప్పాను.."సరేనండీ..వేచి ఉంటాను.." అన్నాడు..ఆదివారం నాటి ఉదయం ప్రభాతసేవ తరువాత స్వామివారి సమాధి దర్శనానికి వచ్చే భక్తులతో..ఆ చిన్న మంటపం నిండిపోయి ఉన్నది..వరుసక్రమంలో ఒక్కొక్కరినీ లోపలికి పంపుతున్నాము..ఆ సమయం లో ఈ యువకుడు పదే పదే అడుగుతున్నాడు..అందువల్ల అసహనానికి గురికావాల్సి వచ్చింది..మరో అరగంట తరువాత..ఆ యువకుడు స్వామివారి సమాధిని దర్శించుకొని ఇవతలికి వచ్చాడు..భక్తుల హడావిడి కూడా మరో రెండు గంటల్లో సమసిపోయింది..
"ఇప్పుడు మీతో కొద్దిసేపు మాట్లాడటానికి వీలవుతుందా?.." అంటూ మళ్లీ ఆ యువకుడు నా వద్దకు వచ్చాడు.."పొద్దున లాగా హడావిడి లేదు..మీరు చెప్పేదేదో చెప్పండి.." అన్నాను..అతను నా దగ్గరగా వచ్చి నా ప్రక్కన కూర్చున్నాడు.."ప్రసాద్ గారూ..నేను మిమ్మల్ని విసిగించడానికి రాలేదు..నాపేరు మనోహర్..నా స్వానుభవం లో స్వామివారు నన్ను ఎలా కాపాడిందీ మీకు చెప్పుకోవాలని అనిపించి వచ్చాను..పోయిన సంవత్సరం దాకా నాకు మొగిలిచెర్ల కానీ..ఈ స్వామివారి గురించి కానీ ఏమీ తెలీదండీ..నేను సాయిబాబా భక్తుడిని..మా ఊళ్ళో బాబా గుడికి తరచూ వెళుతుంటాను..రెండు మూడేళ్ల కు ఒకసారి శిరిడీ వెళుతుంటాను..నాకు మా అమ్మ తప్ప ఇంకెవరూ లేరండి..నాకు చిన్న వ్యాపారం ఉన్నది..ఆ దుకాణం మీద వచ్చే ఆదాయంతో జీవిస్తున్నాను..మా ఇద్దరికీ లోటు లేకుండా జరిగిపోతున్నది..పోయిన సంవత్సరం నేను ఒంగోలు వచ్చానండీ..అక్కడ సాయిబాబా గుడికి వెళ్ళినప్పుడు..నా మిత్రుడు ఈ స్వామివారి గురించి చెప్పాడు..ఆరోజు సాయంత్రం అతనితో కలిసి ఇక్కడకు వచ్చానండీ..ఆరాత్రికి ఇక్కడ నిద్ర చేసాము..తెల్లవారి స్వామివారి సమాధి దర్సనం చేసుకొని వెళ్ళాము..ఆరోజే మా ఊరు వెళ్ళిపోయాను..నాలుగు నెలల క్రితం..రోడ్డు విస్తరణ చేయాలని.. మా దుకాణం తొలగించమని మా ఊరు మున్సిపాలిటీ వాళ్ళు నోటీసు ఇచ్చారండీ..ఆరోజే మా అమ్మకు విపరీతంగా కడుపులో నొప్పి వచ్చింది..బాగా మనస్తాపం చెందాను..అమ్మను డాక్టర్ వద్దకు తీసుకెళ్లి మందులు ఇప్పించాను..పరీక్షలు చేసి ఆపరేషన్ త్వరలో చేయించుకుంటే మంచిది అన్నారు..ఎందుకనో నాకు ఈ స్వామివారు గుర్తుకొచ్చారు..స్వామికి మనసులోనే మొక్కుకున్నాను..ఆ ప్రక్క ఆదివారం నాడు ఇక్కడికి వచ్చి..స్వామివారి సమాధి వద్ద నా వేదన చెప్పుకొని వెళ్ళాను...మీరు నమ్మండి నమ్మకపోండి..ఒక వారం రోజుల్లో..మా ఊళ్ళో మంచి సెంటర్ లో నాకు దుకాణం పెట్టుకోవడానికి మరో గది అద్దెకు దొరికింది..అదికూడా తక్కువ అద్దెకు..పాత షాప్ ఖాళీ చేసి కొత్తదాంట్లో చేరిపోయాను..వ్యాపారము కూడా మెరుగుపడింది..అమ్మ ఆరోగ్యం కుదుటబడింది..ఇక్కడికి వచ్చి మొక్కుకున్నందువల్లే నాకు మేలు జరిగిందని నాకు బలంగా అనిపించింది..ఈరోజు స్వామివారికి మొక్కు చెల్లించుకుందామని వచ్చాను..స్వామివారి సమాధిని దర్శించుకొని..స్వామికి కృతజ్ఞతలు చెప్పుకున్న తరువాతే..మీతో మాట్లాడాలని అనుకున్నాను..అందుకే ఉదయం మిమ్మల్ని తొందరపెట్టాను..ఏమీ అనుకోవద్దు.." అన్నాడు..
"స్వామివారిని నమ్మి కొలిచినందుకు మీకు మంచి జరిగింది..చాలా సంతోషం మనోహర్.." అన్నాను.."ప్రసాద్ గారూ..స్వామివారి దయవల్ల లక్షణంగా వున్నాను..వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాను..నా తరఫున పెద్దదిక్కు మా అమ్మ ఒక్కతే..ఈరోజు స్వామివారి వద్ద ఆ కోరిక కూడా కోరుకున్నాను..మాలో కలిసిపోయే అమ్మాయి వస్తే చాలు..కట్నకానుకలు వద్దు..వచ్చే బుధవారం నాడు ఇక్కడ అన్నదానం చేయించండి..మీరు కూడా నా తరఫున స్వామివారికి నా కోరిక విన్నవించండి.." అన్నాడు..ఆరోజు సాయంత్రం దాకా స్వామివారి మందిరం వద్దే వుండి..మరోమారు స్వామివారి సమాధిని దర్శించుకొని తన ఊరికి వెళ్ళిపోయాడు..మరో రెండు నెలల తరువాత మనోహర్ కు వివాహం కుదిరిందని ఫోన్ చేసి చెప్పాడు..పెళ్లికాగానే తన భార్యను, తల్లిని తీసుకొని స్వామివారి సన్నిధికి వస్తానని చెప్పాడు..
మనోహర్ మనసా వాచా స్వామివారినే నమ్ముకున్నాడు..అతనిలో స్వామివారిపై ఉన్న భక్తి విశ్వాసాలే అతనికి అన్ని వేళలా రక్షగా ఉన్నాయి..
సర్వం..
శ్రీ దత్తకృప!
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).
ఆలోచనాలోచనాలు
///// ఆలోచనాలోచనాలు ///// ***** చాటుపద్య సుమ మాలిక***** తెనాలి రామకృష్ణ కవి కృతములు ***** 1* కం. వక్కలు చేరెఁడు నేఁగొని / చొక్కాలోఁబోసికొంటి --- చొచ్చొచ్చొచ్చో (ధ్వనివైచిత్రి, వ్రాయవీలుగాని పద్ధతి) యెక్కడి దొంగలు వచ్చిరొ! అక్కఱకును లేకపోయె హరిశ్రీకృష్ణా! 2* సీ. ప్రౌఢదీర్ఘ సమాసపదములఁ గూర్చి శ్రీనాథుండు కూలార్చె నైషధంబు. దానితల్లిగ నల్లసానిపెద్దన చెప్పె ముదిమదితప్పి యాముక్తమాల్య దూహించి తెలియరాకుండ సూరపరాజు భ్రమఁ గళాపూర్ణోదయము రచించె. నతిశ్లేషశబ్దవాగాడంబరంబొప్పఁ బస ఘటించెను మూర్తి వసుచరిత్ర. నిట్టికవులకు నేను వాకట్టు కొఱకు / చెప్పినాఁడ మదీయవైచిత్రి మెఱయ / బాండురంగవిజయమును బటిమ దనర / విష్ణువర్ధిష్ణుఁడగు రామకృష్ణ కవిని. ( సూరన కవి ఈ కవి తరువాత తరం వాడు. కావున ఇది కల్పిత పద్యమని సాహితీ విమర్శకుల భావన.) 3* మ. వరబింబాధరముం బయోధరములున్ వక్రాలకంబుల్ మనో / హర లోలాక్షులు చూప కవ్వలిమొగం బైనంతనేమాయె? నీ / గురుభాస్వజ్జఘనంబుఁ గ్రొమ్ముడియు మాకుం జాలవే? గంగ క / ద్దరి మేలిద్దరిఁ గీడునుం గలదె యుద్యద్రాజబింబాననా! 4* కం. విధుకృతకదనము వదనము/ మధుకరనికరములఁ గేరు మగువచికురముల్ / విధు మధుకరలీలాజయ / మధురోక్తులు పిక్కలౌర, మధురాధరకున్. 5* కం. తారకములఁ గోరకముల / వారకములకెల్ల నెల్ల వారకము లిడున్ / శ్రీరమణీ హారమణీ / భారమణీయత్వదీయ పదనఖరముల్. 6* కం. జలచరము మిడుత మ్రింగెను/ జలచరమును మిడుత మ్రింగె జగతీస్థలిలో/ వలరాజు రాజు మ్రింగెను / వలరాజును రాజు మ్రింగవచ్చినఁబడియెన్. 7* గీ. చాన నెమ్మోము గెల్చుఁ గంజాతములను / కాంత కంజాతములగెల్చుఁ గంధరమును/ కంధరమును సమదశంఖంబు గెల్చు / శంఖభావంబు నయ్యర్థచంద్రుగెల్చు. 8* కం. కమలాకర కమలాకర / కమలాకర కమలకమల కమలాకారా/ కమలాకరమైన కొలను గనిరాసుదతుల్. 9* గీ. నాని నీనాను నేనును నాని నాను / నాన నేనును నిన్నూని నున్న నన్ను/ నెన్న నున్నను నిన్నెన్న నున్న నాన / నిన్న నేనన్న నున్న నన్నెన్ను నన్ని. 10* కం. కమలాకమలామోదిత / కమలా కమలావతంస కమలాకమలా/ కమలా కమలాన్వయవర / కమలాకమలాస్య రాధఁ గానరె యిచటన్. తేది 3--10--2023, మంగళవారం, శుభోదయం.
నాగమణిగారి నియమం..*
*నాగమణిగారి నియమం..*
"ఈరోజు నాగమణి గారి పేరుతో అన్నదానము అని రిజిస్టర్ లో ఉన్నది..కానీ ఇతర వివరాలేమీ లేవు..బోర్డ్ మీద అన్నదానానికి విరాళం ఇచ్చిన దాత తాలూకు గోత్రము, పేరు..ఊరు..వ్రాయాలి కదా..ఇక్కడ కేవలం నాగమణి గారు అని మాత్రమే ఉన్నది..కనీసం వారి సెల్ నెంబర్ కూడా లేదు..ఈరోజు ఇక్కడ అన్నదానం జరిపించామని వారికి తెలియచేయాలి కదా?..వారి గోత్రనామాలతో అర్చన చేయించాలి..ఇప్పుడెలా?.." అని మా సిబ్బంది నన్ను అడిగారు..నేను రిజిస్టర్ తెప్పించుకుని చూసాను..నిజమే..ఒక్క పేరు తప్ప మరే వివరాలు లేవు.."ఇది నమోదు చేసింది ఎవరు?.." అని అడిగాను.."మీరు నా పేరు వ్రాసుకోండి..ఆతేదీకి నేను వస్తాను..అన్ని వివరాలు ఇస్తాను.." అని ఆవిడ చెప్పింది సార్..ఎంత ఖర్చు అవుతుంది..అని అడిగింది..చెప్పాను..అంత మొత్తము ఇచ్చింది..రసీదు ఇచ్చాను..ఎలాగూ ఆవిడ వస్తానన్నారు కదా అని నేను మిగిలిన వివరాలు అడగలేదు..." అని సిబ్బందిలో ఒకరు చెప్పారు.."సరే..ఇప్పుడు సమయం ఏడు గంటలేకదా..?..తొమ్మిదిన్నర కు వచ్చే బస్సులో వేస్తారేమో వేచి చూద్దాము.. మరో రెండుగంటలు చూద్దాం..అన్నదానం మాత్రం నిర్వహిద్దాము.." అని చెప్పాను..
స్వామివారి ప్రభాతసేవ పూర్తి కాగానే..మా సిబ్బంది మైకు ద్వారా..అన్నదానం ఉందన్న సంగతి అందరు భక్తులకూ తెలియచేశారు..ఆరోజు మంగళవారం..ఉదయం తొమ్మిదిన్నర సమయం లో వచ్చిన బస్సులో కొందరు భక్తులు వచ్చారు కానీ..అన్నదానానికి విరాళం ఇచ్చిన నాగమణి గారు మాత్రం రాలేదు..మరో అరగంట గడిచింది..స్వామివారి మందిరం ముందు ఒక కారు వచ్చి ఆగింది..అందులోనుండి దంపతులు దిగారు..వారి వెనకాలే నాగమణి గారు కూడా వచ్చారు..మందిరం లోపలికి వచ్చి..కాళ్ళూ చేతులూ కడుక్కొని..నేను కూర్చున్న స్థలం వద్దకు వచ్చి.."నా పేరు నాగమణి అండీ..ఈరోజు ఈ స్వామివారి సన్నిధిలో అన్నప్రసాదం ఏర్పాటుకు నాకు అవకాశం దొరికింది..అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తామని మీ సిబ్బంది చెప్పారు.." అన్నారు.."అమ్మా..ఉదయం నుంచీ మీ గురించే మేము మథనపడుతున్నాము..మీ తాలూకు వివరాలేవీ మా వద్ద లేవు..ఈకార్యక్రమం జరుపుతున్నామని మీకు తెలియచేయాలి కదా..అలాగే మీ గోత్రనామాలతో అర్చన చేయడానికి కూడా ఇబ్బంది వచ్చింది..మీరే వచ్చారు కనుక ఇక మాకు బాధలేదు.." అన్నాను..నాగమణి గారు నా వైపు చిరునవ్వుతో చూసి.."నేను వస్తానని చెప్పే వెళ్ళాను బాబూ..ఆరోజు మీరు లేరు.." అన్నారు..
తనతో వచ్చిన దంపతులను నాకు చూపిస్తూ.."వీళ్ళిద్దరూ నా తమ్ముడూ మరదలూనూ..అసలు వీళ్ళగురించే నేను ఈ స్వామిదగ్గరకు వచ్చాను..వీడిపేరు రాజేశ్వరరావు..అమ్మాయి ప్రసూనాంబ..అమెరికా లో వుంటారు..వీళ్లకు ఇద్దరు పిల్లలు.. మూడేళ్ళ క్రితం వీళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు..వీడి చిన్ననాటి స్నేహితుడు ఒకడు కలిసాడు..మాటల్లో రెండు మూడు రకాల వ్యాపారాలు చెప్పాడు..కొద్దిగా పెట్టుబడి పెడితే..ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మబలికాడు..మా తమ్ముడు ఆశ పడ్డాడు..సరే అన్నాడు..ఆ స్నేహితుడి మాటలు నమ్మి..ఏ కాగితాలూ లేకుండా కొంత డబ్బు ఇచ్చాడు..ముందు కొద్దిగా పెట్టుబడి చాలు అని చెప్పిన ఆ స్నేహితుడు..వీడి నుంచి దాదాపు కోటి రూపాయలు వసూలు చేసాడు..ఆ తరువాత ముఖం చాటేశాడు..తీరా వీడు ఇక్కడికి వచ్చి విచారిస్తే..మోసపోయానని తెలుసుకున్నాడు..ఆ స్నేహితుడి వద్ద కొన్ని భూముల తాలూకు పత్రాలు తప్ప మరేమీ లేవు..ఆ భూముల కాగితాలు వీడి చేతిలో పెట్టి..ఇంతకంటే ఏమీ చేయలేను..అని తేల్చి చెప్పాడు..అవి ఎవరూ కొనే భూములు కూడా కాదు..మావాడు బాగా దిగులు పడ్డాడు..అప్పుడు నేనే సలహా ఇచ్చాను.."నాయనా మనం ఒకసారి మొగిలిచెర్ల వెళ్లి ఆ దత్తాత్రేయుడి ని శరణు వేడదాము..ఏదో ఒక దారి చూపిస్తాడు..నువ్వు దిగులుపడకు..నీ కష్టార్జితం అయితే ఎక్కడికీ పోదు.." అని చెప్పాను..వీళ్లిద్దరి తరఫున నేనే ఇక్కడికి వచ్చాను..మొత్తం పదకొండు ఆదివారాలపాటు ఒక నియమం అనుకోని ..ప్రతి ఆదివారం ఈ స్వామివద్దకు సాధారణ భక్తులతో పాటు వచ్చి..స్వామివారి సమాధిని దర్శించుకొని..వీళ్ల గురించి ప్రార్ధించి వెళ్ళాను..స్వామివారు ఖచ్చితంగా పరిష్కారం చూపుతారు అని నా మనసుకు తోచింది..అందుకు తగ్గట్టుగానే..పోయిన నెలలో ఈ అవధూతకు మామీద దయ కలిగింది..అనుకోకుండా వీడి వద్ద ఉన్న భూముల కు రేటు వచ్చింది..అగ్రిమెంట్ అయింది..కొంత డబ్బూ చేతికి వచ్చింది..అందుకే ఈరోజు అన్నదానం చేయిస్తానని మొక్కుకొని..వీళ్ళిద్దరినీ పిలిపించాను..ఈరోజు మంగళవారం అయినా..ఈరోజే అన్నదానం చేయడానికి కారణం ఉంది..ఈరోజు వీడి పుట్టినరోజు..స్వామివారి దయవల్ల మా తమ్ముడు నిరాశ లోంచి బయటపడ్డాడు.." అని చెప్పారు..
నాగమణి గారు పదకొండు ఆదివారాలు.. స్వామివారి మందిరానికి వచ్చి వెళ్లిన విషయం మేమెన్నడూ గమనించలేదు..
ఆరోజు అన్నదానానికి బోర్డ్ మీద తమ పేర్లు ఏవీ రాయవద్దని నాగమణి గారు కోరారు..స్వామిచూపిన కరుణ తమ మీద ఎల్లకాలమూ ఉంటే చాలని..తమ పేర్లు ప్రచారం చేసుకోవాలని అనుకోలేదని చెప్పారు..అందరూ ఆరోజు అర్చన చేయించుకున్నారు..ఆరోజు మధ్యాహ్నం నాగమణి గారు తిరిగి వెళ్లిపోయేముందు నా వద్దకు వచ్చి.."స్వామివారు కరుణించబట్టి మావాడికి తన సొమ్ము లభించింది..ఈ క్షేత్రం అభివృద్ధికి సహాయం చేయమని సలహా ఇచ్చాను..నలుగురికి ఉపయోగపడే ఏ కార్యక్రమమైనా నాకు తెలియచేయండి..తప్పకుండా మా వంతు సహకారం మేము అందిస్తాము.." అన్నారు..
సర్వం..
శ్రీ దత్తకృప!
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).
మంచి మాటలు
💐 *
T.Kashinatham.
🌷 ** 🌷
🪷 *మంచి మాటలు* 🪷
🎄 “డబ్బు”ఆస్తులను సంపాదించి పెడుతుంది కానీ,”మంచితనం” మనుషుల్ని సంపాదించి పెడుతుంది. మంచితనం సంపాదించుకున్న మనిషికి పేదరికం రావొచ్చేమో కాని, “ఒంటరితనం” ఎప్పటికీ రాదు. హద్దులకు మించి “ఆశలు” ఉన్నట్లయితే శక్తికి మించి కష్టాలు పడాల్సి ఉంటుంది. అందుకే ఏదైనా అదుపులో ఉంటేనే మంచిది.”
🎄“తెలివి తేటలు ఎక్కువ, తక్కువ అందరికీ ఉంటాయి. కాని, అవి ఎదుటి వారి మనసును గెలుచుకోవాలి. అప్పుడే,మన “గొప్పతనం”తెలుస్తుంది. మోసేది “బరువు” అనుకుంటే దించి వేయాలనిపిస్తుంది, “బాధ్యత” అనుకుంటే మోయాలనిపిస్తుంది. “కర్తవ్యం” అనుకుంటే చేయాలనిపిస్తుంది మరియు. “ఇష్టం” అనుకుంటే కష్టమనిపించదు.”
🎄 “ఎక్కడైతే అవసరానికి కాకుండా ఆత్మీయతకు చోటుంటుందో, ఎక్కడైతే చేసిన తప్పుకు క్షమాపణ అడిగితే మన్నించే వీలుంటుందో మరియు ఎక్కడైతే పట్టింపులకు ప్రాధాన్యత లేకుండా ఉంటుందో, అక్కడ “బంధాలు” బలంగా ఉంటాయి. అంతేకాదు,అక్కడ మనుషులతో పాటు మనసులు కూడా మాట్లాడతాయి.”
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
ఆలోచనాలోచనాలు
{{{{{ ఆలోచనాలోచనాలు }}}}} *** Wisdom evergreen ***. ***** My riches consist not in the extent of my possessions , but in the fewness of my wants. --- J. Brother ton.
***** One person's candle is light for many. --- Babylonian Talmud.
***** Love means exposing yourself to the pains of being hurt, deeply hurt by someone you trust. --- Reira Weems.
***** You must have bird in your heart before you can find it in the bush. --- John Burroughs.
***** We ourselves feel that we are doing is just a drop in the ocean. But the ocean would be less because of that missing drop. --- Mother Teresa.
***** Success is the sum of small efforts , repeated day in and day out. --- Robert Collier.
***** Things work out best for those who make the best of how things work out. --- John Wooden.
***** We can't stop the waves , but we can surf them. --- Jonathan Kabat-Zinn.
***** The whole life is now, is today, is this eternal moment. --- Jalaluddin Rumi.
***** The cure of the part should not be attempted without the cure of the whole. --- Plato. Dt 2--10--2023, Monday, Good morning.
5, అక్టోబర్ 2023, గురువారం
అద్భుతమైన విషయం
- :అద్భుతమైన విషయం పూర్తిగా చదవండి:-
______________________________________
.భారతీయ శ్లోకాల్లో సైన్స్… ఆశ్చర్యపరిచే నిజాలు…!!
భారతీయుల ఙ్ఞానసంపద ఒక మహా సముద్రం… అందులో మన ఋషులు, మునులు, ఆచార్యులు, గురువులు, పెద్దలు రచించిన శ్లోకాలు నీటి బిందువులు వంటివి. అందులో రెండంటే రెండు నీటి బిందువులు చాలు… భారత దేశం “విశ్వగురువు” అని సగర్వంగా చెప్పడానికి.
1. హనుమాన్ చాలీసాలో ఒక శ్లోకం
2. గాయత్రి మంత్రం...
ముందుగా తులసీదాస విరచిత హనుమాన్ చాలీసాలో ఒక శ్లోకం గురించి మాటాడుకుందాం…
“యుగ సహస్ర యోజన పర భానూ!
లీల్యోతాహి మధుర ఫల జానూ”!!
దీని తాత్పర్యం సవివరముగా తెలుసుకుందాం…
యుగ= 12,000 దివ్య సంవత్సరములు
సహస్ర=1000
యోజన్= 8 మైళ్ళు
యుగ x సహస్ర x యోజన= పర్ భాను
12000 x 1000 x 8 మైళ్ళు=96000000 మైళ్ళు
1 మైళు = 1.6 కిలో మీటర్లు
96000000 మైళ్ళు = 96000000 x 1.6 కిలో మీటర్లు =
153600000 కిలో మీటర్లు (ఇది భూమికి సూర్యునికి మధ్య దూరంగా కవి వర్ణన)
ఈ విషయాన్ని నాసావాళ్లు స్వయంగా ఒప్పుకోవడం కూడా జరిగింది. కాకపోతే నాసా(NASA) శాస్త్రఙ్ఞులు భూమికి సూర్యునికి మధ్య దూరాన్ని ఇంత ఖచ్చితంగా చెప్పలేదు.
హనుమంతుడు భువి నుండి సూర్యుణ్ణి చూసి దానిని ఒక తినే పండుగా భావించి సూర్య మండలానికి చేరుకున్నాడని మన ఇతిహాసాలు తెలిపిన విషయాలలో వాస్తవికతను గ్రహించిన విదేశీయులు ఆశ్చర్యచకితులవుతున్నారు.
ఇప్పుడు గాయత్రీ మంత్ర మహిమ గురించి తెలుసుకుందాం. మహిమ అనంగానే అదేదో మ్యాజిక్కు, మాయ అని కాకుండా మహిమను ఙ్ఞానమార్గంగా తీసుకుందాం. అప్పుడే ఙ్ఞానాభివృధ్ధి కలుగుతుంది.
అమెరికన్ శాస్త్రవేత్త డా.హోవార్డ్ స్టెయిన్జెరిల్.. గాయత్రీ మంత్ర బీజాక్షరముల ధ్వనులపై తనయొక్క లేబొరేటరీలో పరిశోధన చేయగా అతడు ఎంతో ఉద్వేగానికి లోనయ్యాడు…
ఆయన తెలిపిన వివరాలు ఏంటంటే…
గాయత్రీ మంత్రం ఉఛ్ఛారణ జరుగుతున్నప్పుడు 1,10,000 ధ్వని తరంగాలు ఒక్క సెకనులోనే విడుదలయ్యాయని, ఈ ప్రపంచంలో మరే శ్లోకానికి గాని, పదాలకు గాని ఇంతటి శక్తి లేదని తేల్చి చెప్పాడు.
గాయత్రీ మంత్రోఛ్చారణ సమయంలో బీజాక్షర విస్ఫోటనం సంభవిస్తుంది. అది వినినా లేదా పఠించిన అయా వ్యక్తులకు మానసిక వికాసం పరిఢవిల్లుతుంది అని ఆ తర్వాత జరిపిన పరిశోధనల్లో కూడా అది స్పష్టమయింది.
ఈ విషయాన్ని గ్రహించిన ఎన్నో ఇతర దేశాలు గత రెండు సంవత్సరముల నుండి సూర్యోదయ సమయమందు పఠనం లేదా శ్రవణం చేయడం వారి జీవితాలలో ఒక భాగంగా చేసుకున్నారు.
వేల సంవత్సరాల క్రితమే మనకున్న విఙ్ఞానం అలాంటిది…!
ఇదీ మన భారత వైశిష్ట్యం…
ఇదీ మన వేద విఙ్ఞాన సారం…
ప్రతి భారతీయుడికి గర్వకారణం…
మన ఈ విఙ్ఞానాన్ని ప్రపంచానికి చాటుదాం…!!- :అద్భుతమైన విషయం పూర్తిగా చదవండి:-
______________________________________
.భారతీయ శ్లోకాల్లో సైన్స్… ఆశ్చర్యపరిచే నిజాలు…!!
భారతీయుల ఙ్ఞానసంపద ఒక మహా సముద్రం… అందులో మన ఋషులు, మునులు, ఆచార్యులు, గురువులు, పెద్దలు రచించిన శ్లోకాలు నీటి బిందువులు వంటివి. అందులో రెండంటే రెండు నీటి బిందువులు చాలు… భారత దేశం “విశ్వగురువు” అని సగర్వంగా చెప్పడానికి.
1. హనుమాన్ చాలీసాలో ఒక శ్లోకం
2. గాయత్రి మంత్రం...
ముందుగా తులసీదాస విరచిత హనుమాన్ చాలీసాలో ఒక శ్లోకం గురించి మాటాడుకుందాం…
“యుగ సహస్ర యోజన పర భానూ!
లీల్యోతాహి మధుర ఫల జానూ”!!
దీని తాత్పర్యం సవివరముగా తెలుసుకుందాం…
యుగ= 12,000 దివ్య సంవత్సరములు
సహస్ర=1000
యోజన్= 8 మైళ్ళు
యుగ x సహస్ర x యోజన= పర్ భాను
12000 x 1000 x 8 మైళ్ళు=96000000 మైళ్ళు
1 మైళు = 1.6 కిలో మీటర్లు
96000000 మైళ్ళు = 96000000 x 1.6 కిలో మీటర్లు =
153600000 కిలో మీటర్లు (ఇది భూమికి సూర్యునికి మధ్య దూరంగా కవి వర్ణన)
ఈ విషయాన్ని నాసావాళ్లు స్వయంగా ఒప్పుకోవడం కూడా జరిగింది. కాకపోతే నాసా(NASA) శాస్త్రఙ్ఞులు భూమికి సూర్యునికి మధ్య దూరాన్ని ఇంత ఖచ్చితంగా చెప్పలేదు.
హనుమంతుడు భువి నుండి సూర్యుణ్ణి చూసి దానిని ఒక తినే పండుగా భావించి సూర్య మండలానికి చేరుకున్నాడని మన ఇతిహాసాలు తెలిపిన విషయాలలో వాస్తవికతను గ్రహించిన విదేశీయులు ఆశ్చర్యచకితులవుతున్నారు.
ఇప్పుడు గాయత్రీ మంత్ర మహిమ గురించి తెలుసుకుందాం. మహిమ అనంగానే అదేదో మ్యాజిక్కు, మాయ అని కాకుండా మహిమను ఙ్ఞానమార్గంగా తీసుకుందాం. అప్పుడే ఙ్ఞానాభివృధ్ధి కలుగుతుంది.
అమెరికన్ శాస్త్రవేత్త డా.హోవార్డ్ స్టెయిన్జెరిల్.. గాయత్రీ మంత్ర బీజాక్షరముల ధ్వనులపై తనయొక్క లేబొరేటరీలో పరిశోధన చేయగా అతడు ఎంతో ఉద్వేగానికి లోనయ్యాడు…
ఆయన తెలిపిన వివరాలు ఏంటంటే…
గాయత్రీ మంత్రం ఉఛ్ఛారణ జరుగుతున్నప్పుడు 1,10,000 ధ్వని తరంగాలు ఒక్క సెకనులోనే విడుదలయ్యాయని, ఈ ప్రపంచంలో మరే శ్లోకానికి గాని, పదాలకు గాని ఇంతటి శక్తి లేదని తేల్చి చెప్పాడు.
గాయత్రీ మంత్రోఛ్చారణ సమయంలో బీజాక్షర విస్ఫోటనం సంభవిస్తుంది. అది వినినా లేదా పఠించిన అయా వ్యక్తులకు మానసిక వికాసం పరిఢవిల్లుతుంది అని ఆ తర్వాత జరిపిన పరిశోధనల్లో కూడా అది స్పష్టమయింది.
ఈ విషయాన్ని గ్రహించిన ఎన్నో ఇతర దేశాలు గత రెండు సంవత్సరముల నుండి సూర్యోదయ సమయమందు పఠనం లేదా శ్రవణం చేయడం వారి జీవితాలలో ఒక భాగంగా చేసుకున్నారు.
వేల సంవత్సరాల క్రితమే మనకున్న విఙ్ఞానం అలాంటిది…!
ఇదీ మన భారత వైశిష్ట్యం…
ఇదీ మన వేద విఙ్ఞాన సారం…
ప్రతి భారతీయుడికి గర్వకారణం…
మన ఈ విఙ్ఞానాన్ని ప్రపంచానికి చాటుదాం…!!
దివ్య దక్షణ యాత్ర* -
*దివ్య దక్షణ యాత్ర* -
జ్యోతిర్లింగాల తో కలిపి*..
ఈ అక్టోబర్ 31 వతేదీ నాడు సికిందరాబాద్ నుండి ప్రారంభం అయ్యే ప్రత్యేక భారత్ గౌరవ్ ట్రైన్ లో
ప్రముఖ పుణ్య క్షేత్రాలు అయిన
అరుణాచలం : అరుణాచలం దేవాలయం
రామేశ్వరం : రామ లింగేశ్వర స్వామి దేవాలయం
మధురై : మీనాక్షీ అమ్మన్ దేవాలయం
కన్యాకుమారి: వివేకానంద రాక్ గార్డెన్ , కుమారి అమ్మన్ దేవాలయం
ట్రివేండ్రం : శ్రీ పద్మానాభ దేవాలయం
తిరుచ్చి : శ్రీ రంగనాధ్ స్వామి దేవాలయం
తంజావూరు : బృహదేశ్వర ఆలయం
మొదలైన దేవాలయాలను సందర్శించే అవకాశం
రైలు ప్రయాణం , లోకల్ ప్రయాణం భోజనం తో కూడిన ప్రత్యేక టూర్
టిక్కెట్ ధరలు :
*స్లీపర్ క్లాస్* : 14.100/-
*3rd AC* : 21,500/-
*2nd ఏసి* : 27,900/-
మరిక ఆలస్యం ఎందుకు ?
నేడే మీ కుటుంభ సభ్యులకు దక్షణ భారత దేవాలయాల్ని ఒకేసారి సందర్శించే అవకాశం కల్పించండి
టిక్కెట్స్ కోసం
*ట్రావెల్ ఇండియా*
ప్రభుత్వ రంగ పర్యాటక బుకింగ్ ఏజన్సీ
బేగం పేట్
హైదారాబాద్ .
ఫోన్ : *9848829574, 8801393100*
