13, సెప్టెంబర్ 2024, శుక్రవారం

సెప్టెంబర్,14, 2024*🌹 *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

        🍁 *శనివారం*🍁

🌹 *సెప్టెంబర్,14, 2024*🌹

     *దృగ్గణిత పంచాంగం*                  


         *ఈనాటి పర్వం*

*సర్వేషాం పరివర్తనైకాదశి*


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*దక్షిణాయణం - వర్షఋతౌః*

*భాద్రపద మాసం - శుక్లపక్షం*


*తిథి : ఏకాదశి* రా 08.41 వరకు ఉపరి *ద్వాదశి*

*వారం    : శనివారం* (స్ధిరవాసరే)

*నక్షత్రం : ఉత్తరాషాఢ* రా 08.32 వరకు ఉపరి *శ్రవణం*


*యోగం  : శోభన* రా 06.18 వరకు ఉపరి *అతిగండ* 

*కరణం : వణజి* ఉ 09.41 *భద్ర* రా 08.41 ఉపరి *బవ*


*సాధారణ శుభ సమయాలు* 

*ఉ 10.30 - 12.00 సా 05.00 - 06.00*

అమృత కాలం :*మ 02.25 - 03.57*

అభిజిత్ కాలం  : *ప 11.38 - 12.27*


*వర్జ్యం : శేషం ఉ 06.46 వరకు & రా 12.15 - 01.44*

*దుర్ముహూర్తం:ఉ 05.56 - 07.33*

*రాహు కాలం : ఉ 08.59 - 10.31*

గుళికకాళం : *ఉ 05.56 - 07.27*

యమగండం : *మ 01.35 - 03.06*

సూర్యరాశి : *సింహం* 

చంద్రరాశి : *మకరం*

సూర్యోదయం :*ఉ 05.56* 

సూర్యాస్తమయం :*సా 06.10*

*ప్రయాణశూల : తూర్పు దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం    :  *ఉ 05.56 - 08.22*

సంగవ కాలం   :*08.22 - 10.49*

మధ్యాహ్న కాలం :*10.49 - 01.16*

అపరాహ్న కాలం:*మ 01.16 - 03.43*

*ఆబ్ధికం తిధి:భాద్రపద శుద్ధ ఏకాదశి*

సాయంకాలం  :  *సా 03.43 - 06.10*

ప్రదోష కాలం   :  *సా 06.10 - 08.31*

రాత్రి కాలం : *రా 08.32 - 11.39*

నిశీధి కాలం     :*రా 11.39 - 12.26*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.22 - 05.09*

________________________________

           🌷 *ప్రతినిత్యం*🌷

       *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*ఈ శనివారం మొదలుకొని వేంకటేశ్వర స్వామి కరావలంబ స్తోత్రం ప్రతి శనివారం మీరు పఠించడానికి ఒక్కొక్క పంక్తిని మీ ముందు ఉంచుతున్నాను*

    

    *శ్రీ వేంకటేశ్వర స్వామి*

  *కరావలంబ స్తోత్రం.....!!*  


శ్రీశేషశైలసునికేతన దివ్యమూర్తే

నారాయణాచ్యుత హరే నళినాయతాక్ష 

లీలాకటాక్ష-పరిరక్షిత-సర్వలోక

శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబమ్ 


🙏 *ఓం నమో వేంకటేశాయ*🙏

********************************

🍁 *హనుమకృత సీతారామ స్తోత్రం*🍁


అయోధ్యాపురనేతారం మిథిలాపురనాయికామ్ 

రాఘవాణామలంకారం వైదేహానామలంక్రియామ్ 


రఘూణాం కులదీపం చ నిమీనాం కులదీపికామ్ 

సూర్యవంశసముద్భూతం సోమవంశసముద్భవామ్


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹

         

🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

       🌹🌿🍁🍁🌿🌹

       *న్యాయపతి వేంకట*

      *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

Panchaag

 


*శ్రీ మధుకేశ్వర ఆలయం*

 🕉 *మన గుడి : నెం 439*


⚜ *ఉత్తర కర్ణాటక :  బనవాసి* 





⚜ *శ్రీ మధుకేశ్వర ఆలయం*



💠 మధు అంటే తేనె అని  అర్ధం. తనని ప్రార్ధించవచ్చే  భక్తుల జీవితాలను  సుఖసంతోషాలతో మధురవంతం చేసే

దైవం మధుకేశ్వరుడు. 


💠 శివునికి అంకితం చేయబడిన ఈ ఆలయాన్ని చరిత్ర ప్రకారం కదంబ వంశానికి చెందిన మయూర శర్మ నిర్మించారు. 

 కదంబులు కర్ణాటకలోని పురాతన పాలకులు మరియు చాళుక్యులు అధికారంలోకి వచ్చే వరకు వారు పాలించారు.  

చాళుక్యులు మరియు హొయసలుల వంటి రాజవంశాల వారి కాలంలో జరిగిన అనేక మార్పుల ఫలితంగా ఈ రోజు ఉన్న మధుకేశ్వర దేవాలయం ఉంది.


💠 దీనికి అనేక విభిన్న పేర్లు ఇవ్వబడ్డాయి; కొంకణాపుర, నందనవన, వనవాసిక, మొదలైనవి. నేడు ప్రధాన నిర్మాణంగా మిగిలి ఉన్నది మధుకేశ్వర దేవాలయం.


💠 శివుడు సరళంగా మరియు తేనె రంగులో ఉన్న శివలింగ రూపంలో ఉంటాడు కాబట్టి దీనికి 'మధుకేశ్వర' అనే పేరు వచ్చింది.  

సంకల్ప మండపం మరియు నృత్య మండపం చాళుక్యుల మరియు హొయసల నిర్మాణ శైలికి ప్రాతినిధ్యం వహించే కొన్ని అందమైన శిల్పాలను కలిగి ఉన్నాయి.


💠 మహాకవి కాళిదాసు మధుకేశ్వరుని ఆలయం గురించి తన కావ్యాలలో స్తుతించడం విశేషం.

చీన దేశ యాత్రీకుడు యువాన్ త్స్వాంగ్  తన భారతదేశ యాత్రలోని విశేషాలలో ఈ మధుకేశ్వరాలయాన్ని గురించి  అనేక  విశేషాలు  వివరించారు.


💠 శిల్ప కళకి ప్రాధాన్యతనిచ్చిన కదంబ వంశ రాజుల పరిపాలన కాలంలో  మయూరశర్మ అనే గొప్ప శిల్పి పర్యవేక్షణలో ఈ ఆలయం  నిర్మించబడినది.

తరువాత  వచ్చిన చాళుక్యులు, హోయసలలు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసారని చరిత్ర తెలుపుతోంది. 


💠 ఈ ఆలయంలో వేర్వేరు శిల్ప కళా శైలులు దర్శకుల మనసులను ఆకట్టుకుంటాయి.

ప్రవేశ ద్వారములకిరు ప్రక్కలా , గంభీర ఆకృతితో గజములు రెండు   మనలను ఆహ్వానిస్తున్నట్టుగా  వున్నాయి.


💠 మధుకేశ్వరా అనే పేరుకి తగినట్లుగా పరమేశ్వరుడు ఆలయ గర్భగుడిలో  తేనే  రంగు లింగంగా దర్శనమనుగ్రహిస్తున్నాడు.

అందువలననే మధుకేశ్వరుడు అనే పేరు కలిగింది.  


💠 శిల్ప కళా నైపుణ్యంతో  మలచబడిన స్థంభాల  మీద మండప ఆకారంలో ఆలయం నిర్మించబడి వున్నది.

హోయసల రాజుల పాలనా కాలంలో నృత్య మండపం, సంకల్ప మండపం  నిర్మించబడినవి.

పై కప్పు,  గోడలు నగిషీలతో , ఆ కాల శిల్పుల  శిల్ప కళా చాతుర్యానికి నిదర్శనంగా యీనాటికి చాటుతున్నాయి.


💠 నృత్య మండపంలో  ఏడడుగుల ఎత్తుకి  ఏక శిలపై మలచబడిన నందికేశ్వరుడు గంభీరంగా  ఈశ్వరుని ముందు మోకరిల్లి అభివాదము చేసే భంగిమలో దర్శనమిస్తున్నాడు.

ఆ నందీశ్వర విగ్రహం లోని శిల్ప చాతుర్యం యాత్రికులను అబ్బురపరుస్తుంది. నందీశ్వరుని ఎడమ కన్ను  గర్భగుడిలోని పరమేశ్వరుని  నంది కుడి కన్ను ప్రక్కనే సన్నిధిలో వున్న పార్వతీ దేవిని  చూస్తున్నట్టు మలచబడినది.


💠 ఈ నందీశ్వరుడు పరమ కరుణామూర్తిగా కనిపిస్తాడు.

ప్రాకారంలోని త్రిలోక మండపంలో  కైలాస పర్వతం మీద శివ పార్వతులు  ఆశీనులై వుండగా చుట్టూ నాగలోకం, పాతాళ లోకం

వున్నట్లు శిల్పాలతో మలచబడి వున్నది. 


💠 అమ్మవారి సన్నిధికి వెళ్ళే మార్గంలో ముందు  చిన్న వినాయకుని మూర్తి వున్నది.  ఆలయానికి వచ్చిన  భక్తులు ఈ మూర్తిని తప్పక దర్శించాలి.


💠 ఇక్కడికి వచ్చి శివుని దర్శించామనడానికి సాక్ష్యం ఈ గణపతే. దర్శించక  పోతే  మనం

పరమశివుని దర్శించామనడానికి నిదర్శనం వుండదు.


💠 ఇక్కడే  గ్రానెట్ శిలతో చేసిన  అర్ధ మూర్తిగా వినాయక విగ్రహం వున్నది. 

 ఈ వినాయకునికి ఒక విశేషము  వున్నది.

అర్ధ వినాయకునిలో అర్ధభాగ విగ్రహం ఇక్కడ  మిగిలిన సగ భాగం  కాశీలో వున్నదని చెప్తారు.  అష్టదిక్పాలకులు సతీ సమేతంగా   తమ తమ వాహనాలతో, ప్రత్యేకంగా దర్శనమిస్తున్నారు.


💠 దేవతలను వారి భార్యలు మరియు వాహనాలతో పాటు ఉంచాలనే ఈ అసాధారణ ఆలోచన ఈ ఆలయాన్ని అలాంటి వాటిలో ఒకటిగా మార్చింది. 

అంతేకాకుండా, వారు హిందూ మతంలోని విశ్వోద్భవ భావనను అనుసరించి ఒక నిర్దిష్ట దిశను కూడా ఎదుర్కొంటున్నారు. 

ఐరావత్ (ఏనుగు)తో ఇంద్రుడు, మేకతో అగ్ని , నరతో కుబేరుడు, తన గేదెపై స్వారీ చేస్తున్న యమ, మొసలితో వరుణుడు, మచ్చల జింకతో వాయువు మొదలైనవారు ఉన్నారు. 

మీరు చుట్టూ షికారు చేయవచ్చు మరియు దేవతలు మరియు వారి వాహనం గురించి మీ జ్ఞానాన్ని మెరుగుపరచుకోవచ్చు . 


💠 250కిమీల దూరంలో ఉన్న మంగళూరు సమీప విమానాశ్రయం. 

సమీప రైల్వే స్టేషన్ షిమోగాలో ఉంది. 

 ఇది 112 కి.మీ దూరంలో ఉంది.

గర్వించదగ్గ నాయకుడు..*

 

*నా దేశం గర్వించదగ్గ నాయకుడు..*



         *ఎ. బి. వాజ్ పేయి గారు*

                 ➖➖➖✍️



*P. V. నరసింహారావు గారు P. M. గా  ఉన్నప్పుడు Atal bihari Vajpayi గారిని India representative గా UNO కి పంపడం జరిగింది.* 


*UNO లో Kashmir issue గురించి hot డిస్కషన్స్ జరుగుతున్నయ్యి.*


*Vajpayi గారు తన ఉపన్యాసం start చేశారు. “నా views చెప్పడానికి ముందు చిన్న స్టోరీ చెప్తాను” అన్నారు…*


*చాలా కాలానికి ముందు కశ్యప్ అనే ఒక ఋషి (saint) ఉండేవాడు. ఆయన పేరు మీదనే ప్రస్తుత Kashmir కి ఆ పేరు వచ్చింది.  ఒకసారి కశ్యప్ దట్టమైన అడవి దారిలో వెళ్తూ ఒక అందమైన సరస్సు చూసాడు. అక్కడ స్నానం చేద్దామని నిర్ణయించుకొని బట్టలు తీసి ఒడ్డున  పెట్టి సరస్సులోకి దిగాడు. స్నానం చేసి ఒడ్డుకొచ్చేసరికి ఒక పాకిస్తానీ తన దుస్తులు అపహరించారని గ్రహించాడు…”*


*ఇలా  చెప్పుకుపోతూ ఉండగా సభలో నుండి ఒక పాకిస్తానీ లేచి… “objection  raise చేసాడు. * 

*”ఋషి కశ్యప్ కాలంలో అసలు పాకిస్తాన్ లేనేలేదు,  పాకిస్తానీ ఋషి యొక్క బట్టలెలా అపహరిస్తాడు?” అని చెప్పి  Vajapayi మీద  కేకలు వేసాడు.* 


*అపుడు Vajpayi నవ్వుతూ…  "నేను UNO కి చెప్పదలచుకున్న అంశం పూర్తి అయింది, అప్పుడు పాకిస్తాన్ లేనేలేదు అంటున్నారు ఇప్పుడు Kashmir,  Pakistan కి చెందినది  అంటున్నారు." అని అన్నారు.*


*సభలోని  వాళ్లంతా తమ కరతాళధ్వనులతో జయజయ  నినాదాలు చేసారు.*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

*“భగవంతుని విషయాలు గ్రూప్“* లోచేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ మెసేజ్ పెట్టండి...944065 2774.

లింక్ పంపుతాము.🙏

బొట్టు(కుంకుమ,తిలకం

 *బొట్టు(కుంకుమ,తిలకం) ఏ వేలితో పెట్టుకోవాలి అంటే*

🌸☘️🌸☘️🌸☘️🌸☘️

చేతికున్న ఐదు వేళ్ళల్లో అలవాటు ప్రకారం ఏ వేలితో నైనా పెట్టుకోవచ్చు..


అనామికా శాంతి డా స్యాత్ 

మధ్య మాయుష్కరీ భవేత్ | 

అంగుష్ఠ: పుష్టిదః ప్రోక్తః 

తర్జనీ మోక్షదాయినీ || 

అని స్కాందపురాణం చెబుతోంది..


ఉంగరం వేలుతో తిలకం పెట్టుకుంటే, శాంతి కలుగుతుంది.

మధ్యవేలితో తిలకం దిద్దుకుంటే ఆయుష్షు పెరుగుతుంది .

బొటనవేలితో బొట్టు పెట్టుకుంటే, ఆరోగ్యం సిద్ధిస్తుంది . 

ఇక, చూపుడు వేలితో బొట్టు పెట్టు కుంటే మోక్షం సిద్ధిస్తుంది . 

అందుకే, ఇతరులకి చూపుడు వేలితో బొట్టు పెట్టొద్దు .అని చెబుతారు .

ఇక చిటికెన వేలితో తిలకధారణ చేయకూడదా ! అంటారేమో,ఆ పరమేశ్వరుడి తిలకాన్ని దిద్దెప్పుడు చిటికెన వేలితోనే దిద్దుతారు . ‘కనిష్ఠికాభ్యాం గంధం పరికల్పయామి’ అని కదా ఆ స్వామికి గంధాన్ని అలంకరిస్తాము .


అందువల్ల , ఏ వేలితో తిలకమ్ దిద్దుకోవాలి ? అనే ప్రశ్నేమీ అవసరం లేదు .తిలకమ్ దిద్దుకోవడం మాత్రం ప్రధానం .


శ్రీ మాత్రే నమః..🙏🕉️🙏.

ముగ్గు

 ముగ్గు 

~~~


*_మన పూర్వీకులు ముగ్గు ఎందుకు పెట్టేవారు? ఆ ముగ్గుల అర్థం పరమార్థం ఏంటి? అనేది తెలుసుకుందాం_* 🙏


💮 ఇంటి గడప ముందు ముగ్గులో భాగంగాగీసే రెండు అడ్డగీతలు ఇంటి లోనికి దుష్టశక్తులను రాకుండా నిరోధి స్తాయి. ఇంట్లోఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళ కుండా చూస్తాయి.


💮 ముగ్గువేసి దానికి నాలుగువైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ శుభ కార్యాలు, మంగళకరమైన     పనులు జరుగుతున్నాయని గుర్తు. పండుగల సమయంలో ఈ విధంగా ఖచ్చితంగా వేయాలి.

  

💮 ఏ దేవత పూజ చేస్తున్నా దైవాన్ని ఉంచే పీట మీద మధ్యలో చిన్న ముగ్గు వేసినా నాలుగు వైపులా రెండేసి    గీతలను తప్పక గీయాలి.


💮 నక్షత్రం ఆకారం వచ్చేలా గీతలతో వేసిన ముగ్గు భూత, ప్రేత, పిశాచాలను ఆ దరిదాపులకు రాకుండా చూస్తుంది. అంతే కాదు, మనం వేసే పద్మాలు, చుక్కల ముగ్గులలో కూడా మనకుతెలీని అనేక కోణాలు దాగి ఉన్నాయి. అవి కేవలం గీతలే కాదు, యంత్రాలు కూడా.

యంత్ర, తంత్ర శాస్త్ర రహస్యాలతో కూడి ఉండడం వలన మనకు హాని కలిగించే చెడ్డశక్తులను దరిచేరనీయవు. అందుకే ఏ ముగ్గునైనా తొక్కకూడదు.


💮 తులసి మొక్క దగ్గర అష్టదళపద్మం వేసి దీపారాధాన చేయాలి.


💮 యజ్ఞ, యాగాదులలో యజ్ఞ గుండం మీద నాలుగు   గీతలతో కూడిన ముగ్గులేయాలి. దైవకార్యలలో కూడా నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి.


💮 నూతన వధూవరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టు ప్రక్కల లతలు, పుష్పాలు,  తీగలతో కూడిన ముగ్గులు వేయాలి.


💮 దేవతా రూపాలను, ఓం, స్వస్తిక్, శ్రీ గుర్తులను     పోలిన ముగ్గులు వేయ కూడదు. ఒకవేళ వేసినా      వాటిని తొక్కకూడదు.


💮 ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ, అమ్మవారు,   

శ్రీ మహావిష్ణువు ముందు నిత్యం ముగ్గులు వేస్తుందో,  ఆస్త్రీకి ఏడు జన్మలవరకు వైధవ్యం రాదని, మరియు సుమంగళిగానే మరణిస్తుందని దేవీ భాగవతం, బ్రహ్మాండపురాణం చెబుతున్నాయి.


💮 పండుగ వచ్చింది కదా అని, నడవ డానికి చోటు లేకుండా వాకిలంతా ముగ్గులు పెట్టకూడదు.


💮 ఇప్పుడు ముగ్గులు రోజు వేయలేక పెయింట్ పెట్టేస్తున్నారు. దాన్ని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు. ఏరోజు కారోజు బియ్యపు పిండి తో ముగ్గు పెట్టాలి.


💮 నిత్యం ఇంటి ముందు, వెనుక భాగంలో, తులసి మొక్క దగ్గర దీపా రాధన  చేసే ప్రదేశంలో ముగ్గు వేయాలి. 


💮 ముగ్గు  పాజిటివ్ / దైవ శక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది.


💮 ముగ్గులు శుభసూచకాలుగా పని చేస్తాయి. 


💮  *పూర్వం రోజూలలో సాధువులు, సన్యాసులు బ్రహ్మచారులు ఇల్లిల్లూ తిరిగి బిక్ష అడిగే వారు. ఏ ఇంటిముందైనా ముగ్గులేదంటే ఆ ఇంటికి వేళ్ళేవారు కాదు. వారే కాదు భిక్షకూలు కూడా ముగ్గులేని ఇళ్ళకు వెళ్ళి అడ్డుక్కునే వారు కాదు.*


💮 ఇంటిముందు ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరిగిందని గుర్తు. అందుకే మరణించిన వారికి    శ్రాద్ధకర్మలు చేసే రోజున ఉదయం ఇంటిముందు ముగ్గువేయరు. శ్రాద్ధకర్మ పూర్తైన వెంటనే, అది మధ్యా హ్నమైనా ముగ్గు వేస్తారు.


💮 ముగ్గులు వెనుక సామాజిక, మానసిక, ఆరోగ్య, ఆధ్యాత్మికమైన అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి. మనం ఆచరించే ఏ ఆచారమూ మూఢనమ్మకం కాదు. మన ఆచార, సంప్రదాయాలన్నీ  అనేకా నేక అర్ధాలు, పరమార్ధాలతో కూడినవి.🙏

రెండు పదాలు

        

"రెండు పదాలు మన జీవితాన్ని మార్చేయగలవు.

"సాధించగలను"అన్న ఆత్మ విశ్వాసం.

"ఏమీ చేయలేను" అన్న అపనమ్మకం.

వీటిలో ఏది ఎంపిక చేసుకొని నడుస్తామో, దానిపైనే మన జీవితం ఆధారపడి ఉంటుంది"

  🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹     

"సంపదను చూసి గౌరవించడం 

కన్న

సంస్కారాన్ని చూసి గౌరవించడం మిన్న.

శుభ శుక్రవారం 🌹🌹🌹Happy Friday

శృంగేరిలోని దక్షిణామ్నాయ శ్రీ శారదా పీఠానికి

 శృంగేరిలోని దక్షిణామ్నాయ శ్రీ శారదా పీఠానికి, కాశ్మీర్‌లోని సర్వజ్ఞ పీఠం మధ్య విశిష్టమైన, గాఢమైన అనుబంధం పూర్వకాలంనుంచి ఉంది. కాశ్మీర్, మహర్షి కశ్యపుని తపస్సు ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. మహర్షి కశ్యప కుమారుడు మహర్షి విభాండకుడు, అతని మనవడు మహర్షి ఋష్యశృంగుడు తామిద్దరూ తపస్సు చేసిన ప్రదేశంగా శృంగేరి ముఖ్యమైనది. ఈ ప్రప్రథమ శక్తిపీఠం శ్రీ కాశ్మీరేతు సరస్వతీ మన దేశ సమైక్య ఆరాధనాదేవతగా అనాదిగా పూజింపబడింది. శ్రీ శంకరులు మొట్టమొదటగా పూజ చేసిందీ అక్కడే.


శృంగేరి మఠం, సేవ్ శారద కమిటీ సహకారంతో, ఇటీవల కాశ్మీర్‌లోని టీట్‌వాల్‌లో చారిత్రాత్మక కుంభాభిషేక వార్షిక వేడుక (వార్షికా అభిషేక)ను నిర్వహించింది.

(లైబ్రరీ వీడియో)

ఒడిబియ్యం

 ***ఒడిబియ్యం అంటే ఏమిటి?

ప్రతి మనిషిలో వెన్నెముక లోపల 72 వేల నాడులు వుంటాయి. ఈనాడులను వెన్నెముకలు రక్షిస్తాయి. ఈనాడులు కలిసే ప్రతి దగ్గర ఒక చక్రం వుంటుంది. (Thecal sac). ఇలాంటివి మనిషి శరీరంలో 7 చక్రాలు వుంటాయి. అందులో మణిపూర చక్రం నాభి దగ్గర వుంటుంది. ఈ మణిపూర చక్రంలో మధ్యబాగంలో "ఒడ్డియాన పీఠం" వుంటుంది. మన అమ్మాయిలు నడుముకు పెట్టుకునే ఆభరణం పేరు కూడ అందుకే "ఒడ్డియాణం" వాడుకలో "వడ్యాణం" అంటారు.

ఏడు చక్రాలలో శక్తి(గౌరీదేవి) ఏడు రూపాలలో నిక్షిప్తమవుతుందనేది సిద్దాంతం. ఒడిబియ్యం అంటే అమ్మాయి ఒడ్యాణపీఠంలో వున్న శక్తికి బియ్యం సమర్పించడం అన్నట్టు. ఒడ్డియాణపీఠంలో వుండే శక్తి రూపంపేరు మహాలక్ష్మి. ఒడిబియ్యం అంటే, ఆడపిల్లను మహాలక్ష్మి రూపంలో పూజించటం అన్నమాట. అలాగే పక్కనున్న భర్తను మహావిష్ణువులా భావించి సత్కారం చేయాలి. This is nothing but alerting Mahalakshmi inside the girl. అమ్మలు చిన్నపిల్లలను ఒడిలో పెట్టుకుని కాపాడుకుంటారు. ఒడి అంటెనే రక్షణ.

ఒడిబియ్యం పోసే సమయంలో అమ్మాయిలను గమనిస్తే తెలుస్తుంది. వాళ్ళకు తెలియకుండానే మహాలక్ష్మిగా మారిపోతారు.మహాలక్ష్మి మొదటి లక్షణం రక్షించటం. బిడ్డను, అల్లుడిని రక్షించమని తల్లిదండ్రులు చేసే మహాలక్ష్మి వ్రతమే ఒడిబియ్యం. ఒడిబియ్యంలో ఒక బియ్యమే కాకుండా అష్ట ఐశ్వర్యాలు కూడా పోస్తారు. ఇవన్నీ తమబిడ్డను అష్ట ఐశ్వర్యాలతో ఉంచాలని తల్లివారు చేసే సంకల్ప పూజ మాత్రమే.

సంతోషంతో ఆ మహాలక్ష్మి(ఆడపడుచు), తన పుట్టిల్లు అష్టైశ్వర్యాలతో తులతూగాలని 5 పిడికిళ్ళ బియ్యం అమ్మవాళ్లకు ఇచ్చి, దేవుని ప్రార్ధించి, మహాధ్వారానికి నూనె రాసి, పసుపు కుంకుమ బొట్లు పెట్టి అత్తారింటికి వెళుతుంది. అక్కడ స్త్రీలను పేరంటానికి పిలిచి పుట్టింటి వారు ఇచ్చిన సారెను (ఐశ్వర్యాన్ని) ఊరంతా పంచుతుంది.

ఇది అత్త ఇంటి వారు కూడ చేయవచ్చు.

అందుకే ఒడిబియ్యం యొక్క విలువ, గౌరవం, సారాంశం తెలుసుకోవాలి అత్యంత నిష్ఠతో చేయాలి...

అలాగే మన సనాతన హైందవ ధర్మము లోని జీవహింస లేని మంచి (సదా ) ఆచరణలను ఆచరించాలి వాటి విధానం, లాభాలు తెలుసుకోవాలి , తెలియని వారికి చెప్పాలి .

శ్రీకృష్ణుడికి …* *మొత్తం సంతానం 80 మంది

 ✳️*శ్రీకృష్ణుడికి …*

   *మొత్తం సంతానం 80 మంది.*✳️

               ➖➖➖


*శ్రీకృష్ణుడికి ‘ఎనిమిది’(అష్ట) మంది భార్యలు. ఎనిమిది మందికి ప్రతి ఒక్కరికి పదిమంది చొప్పున మొత్తం 80 మంది సంతానం కలిగింది.*


**రుక్మిణి వల్ల కృష్ణుడికి…*

ప్రద్యుమ్నుడు, చారుదేష్ణుడు, సుదేష్ణుడు, చారుదేహుడు, సుబారుడు, చారుగుప్తుడు, భద్రచారుడు, చారుచంద్రుడు, విచారుడు, చారుడు అనే బిడ్డలు కలిగారు.


 **సత్యభామ వల్ల కృష్ణునికి…*

భానుడు, సుభానుడు, స్వర్భానుడు, ప్రభానుడు, భానుమంతుడు, చంద్రభానుడు, బృహద్భానుడు, అతిభానుడు, శ్రీభానుడు, ప్రతిభానుడు అనే బిడ్డలు కలిగారు.


 **జాంబవతీ శ్రీకృష్ణులకు…* 

సాంబుడు, సుమిత్రుడు,పురజిత్తు, శతజిత్తు, సహస్రజిత్తు, విజయుడు, చిత్రకేతుడు, వసుమంతుడు, ద్రవిడుడు, క్రతువు అనే సంతానం కలిగింది. జాంబవతికి కలిగిన ఈ బిడ్డలంటే కృష్ణుడికి ప్రత్యేకమైన ప్రేమ ఉండేది.


 **నాగ్నజితి, కృష్ణులకు…* 

వీరుడు, చంద్రుడు, అశ్వసేనుడు, చిత్రగుడు, వేగవంతుడు, వృషుడు, లముడు, శంకుడు, వసుడు, కుంతి అనే పిల్లలు కలిగారు.


**కృష్ణుడికి కాళింది వల్ల…* 

శ్రుతుడు, కవి, వృషుడు, వీరుడు, సుబాహుడు, భద్రుడు, శాంతి, దర్శుడు, పూర్ణమానుడు, శోమకుడు అనే కుమారులు జన్మించారు.


**లక్షణకు, శ్రీకృష్ణుడికి…*

ప్రఘోషుడు, గాత్రవంతుడు, సింహుడు, బలుడు, ప్రబలుడు, ఊర్ధ్వగుడు, మహాశక్తి, సహుడు, ఓజుడు, అపరాజితుడు అనే సంతానం కలిగింది.


**మిత్రవింద, కృష్ణులకు…* 

వృకుడు, హర్షుడు, అనిలుడు, గృద్ధుడు, వర్ధనుడు, అన్నాదుడు, మహాశుడు, పావనుడు, వహ్ని, క్షుధి అనే పుత్రులు పుట్టారు. 


 **కృష్ణుడికి భద్ర అనే భార్య వల్ల…* సంగ్రామజిత్తు, బృహత్సేనుడు, శూరుడు, ప్రహరణుడు, అరిజిత్తు, జయుడు, సుభద్రుడు, వాముడు, ఆయువు, సత్యకుడు అనే పిల్లలు పుట్టారు. 


*చాలామంది అపోహపడుతున్నట్టుగా శ్రీకృష్ణుడికి 16వేలమంది (కొన్ని గ్రంథాలలో 16100 అని ఉన్నది) భార్యలతో శారీరక బంధం కలిగియుండలేదు. 16వేల గోపికా స్త్రీలను నరకాసురుని బారి నుంచి కాపాడి సంఘములో సముచిత స్థానము కల్పించాడు.* 


*భర్త అనగా భరించువాడు అను నానుడి ప్రకారము, ఒక పురుషుని పంచన చేరి, అతని నివాసమునందు నివసించు స్త్రీలకు అతడే భర్తగా నిర్ణయించే అప్పటి కాలమాన స్థితిగతులనుబట్టి శ్రీకృష్ణునికి భార్యలుగా చెప్పబడ్డారు.*


*కానీ పైన చెప్పబడిన… ‘అష్టమహిషులతోనే’ శ్రీకృష్ణునికి సంతానం కలిగినది అని గ్రంథాల్లో పేర్కొన్నారు.*

. *✳️సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*🙏

మానవునికి ఆశ ఉండడం

 *🙏 🕉️*


      *మానవునికి ఆశ ఉండడం తప్పు కాదు*..!!

   *కాని అత్యాశ ఉండకూడదు*..!!

    *ఎంత ఉన్నా, ఇంకా ఏదో కావాలనే కోరిక ఉంటుంది*..!!

     *భగవంతుడు ఇచ్చినదానితో తృప్తి పడడమే మానవ ధర్మం*..!!

     *లేని వాటి కోసం చేతులు చాచకూడదు*..!!

     *ఎంత పుణ్యం చేసుకుంటే అంత ఫలం పరమాత్ముడు ప్రసాదిస్తాడు*..!!

     *ఆయనకు అందరూ  సమానమే*...!!        


      *విద్య మరియు వైద్యం ఉచితం చేయండి చాలు..!! ఇంకే ఉచితాలు అక్కర్లేదు*...!!🖊️

✍️

పోతనగారి కవిత




పోతనగారి కవితా చిత్రపటం!!

    "ప్రాచీన పద్యకవులలో పోతనదొక విలక్షణమైన బాణి.అతడుచెప్పదలచిన కవితావస్తువు నొకచక్కని దృశ్యముగా మలచి పాఠకులముందుంచుట పోతనలోనిప్రత్యేకత!

   మకరిచేతజిక్కిన గజేంద్రుని రక్షించుటకు బోవు నాశ్రీహరి రాకను భక్తితో ననురక్తితో వీక్షించుచున్న దేవతల

 దిదృక్షా సంరంభమును వర్ణించిన ఈపద్యములొక చక్కని అక్షరచిత్రపటమును రచియించినవి.

"వినువీధిన్ జనుదేరగాంచిరమరుల్ విష్ణున్, సురారాతి జీ

వనసంపత్తి నిరాకరిష్ణు, కరుణావర్ధిష్ణు, యోగీంద్రహృ

ద్వనవర్తిష్ణు, సహిష్ణు, భక్తజనబృంద ప్రభవాలంకరి

ష్ణు, నవోఢల్లస దిందిరాపరిచరిష్ణున్, జిష్ణు,రోచిష్ణునిన్;

భాగ-8స్కం.105 ప.

"చనుదెంచెన్ ఘను డల్లవాడె,హరి, పజ్జంగంటిరేలక్ష్మి,శం

ఖనినాదంబదె, చక్రమల్లదె, భుజంగద్వంసియున్వాడె, క్ర

య్యన నేతెంచె నటంచు, వేల్పులు "నమోనారాయణాయేతి" ని స్వనులై మ్రొక్కిరి, మింట హస్తిదురవస్థావక్రికిన్ చక్రికిన్!! 

       భాగ-8స్కం.107ప.


మొదటిపద్యంలో పోతన తన శబ్దాలంకారప్రియత్వంవెల్లడిస్తో అసమాపకక్రియాప్రయోగాలతో , శ్రీహరి యెంతవేగంగా వెళుతున్నాడో సూచించాడు.

     రెండవ పద్యంలో పోతన తనచిత్రీకరణమారంభించాడు.ఆకవితాదృశ్యాన్ని మీరుగూడా ఒకసారి మనోనేత్రాలతో వీక్షించండి.

  " , అదిగదిగో శ్రీహరిసరిగాచూడండి, అదిగోఅతనిప్రక్కనున్నఆమెయే లక్ష్మి, అదో శంఖము, అదిగో చక్రము, అడుగో గరుత్మంతుడు.అంటూఆకాశంలో నిలచి దేవతలందరూ ఆశ్రీమన్నారాయణునకు ఫాలవిన్యస్త హస్తులై నమస్కరిస్తున్నారట!!.

     అపూర్వమైన ఆదృశ్యమును పోతన తొలుత తానుదర్శించి,పిదపమనచే దర్శింపజేయుచున్నాడు.అహో!మనదెంతటి మహాభాగ్యము!!

ఇట్టి మనోజ్ఞకవితాదృశ్యములు నాన్యతోదర్శనీయములనుట యదార్ధమేకదా??.🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

14. " మహాదర్శనము

 14. " మహాదర్శనము "--పదునాలుగవ భాగము--మడ్డి-మసి


14. పదునాలుగవ భాగము-- మడ్డి-మసి



         తల్లికి ఇంకా ఆశ్చర్యము ఎక్కువైంది . శాస్త్ర విషయములు తెలుపుతుంటే , కొడుకు శ్రద్ధ చూపిస్తున్నాడు . తల్లి మాట అంటే చాలు , ఆమాటలో భావము, శ్రద్ధ ఉన్నాయి . నాకు తెలీదు , కానీ అమ్మకు తెలుసు , తానుగా తెలుసుకొనుట తనకు పట్టుపడు వరకూ , తానుగా విచారము చేసి అర్థము చేసుకొనువాడనగు వరకూ తల్లే తనకు గురువు , దైవము అన్న భావముంది. ఆమె మాటను తీసివేయునట్లు లేదు . దానిని అనుసరించియే కృతార్థుడను కావలెను అను నమ్మకము , శ్రద్ధ అందులో ఉన్నాయి . 


        ఆలంబినికి ఎందుకో గుండె బెదిరింది , " ఈ పసి బాలుడు ఇంతటి శ్రద్ధావంతుడైతే నా గతి ? వేళాకోళానికి కూడా వాడి దగ్గర ఒక అబద్ధమైనా చెప్పుటకు లేదు , తక్కెడలో పదార్థమును ఉంచునట్లు నాజూకుగా , నిష్ఠురముగా , నిజంగా ఉండవలెను . కాబట్టి వీడి దగ్గర నేను ఆలోచించకుండా ఏ మాటకూడా చెప్పుటకు లేదు . కానిమ్ము , నాకు ఇదీ ఒక సంస్కారమే . లోకోద్ధారము చేయు కొడుకును పొందిన భాగ్యము అంటే అది కొండ ఎక్కినట్లు కాదా ? ఆ దినమే వారు చెప్పినారు , ’ నీవలన వాడికి ఏ రీతిలోనూ ఇబ్బంది కాకుండా చూసుకో ’ యని . ఏదేమైనా , ఇక త్వరలోనే చౌలము అవుతుంది . ఆ తరువాత వారి భారమే . అంతవరకూ వీడు ఏమైనా అడిగితే , తనకు తెలిసినది మాయా మర్మము లేకుండా చెప్పవలెను . తనకు తెలియనిదైతే , తెలీదు , వారిని అడుగి చెపుతాను యని వ్యవధిని తీసుకొని , ఆ తరువాత చెప్పేది . ’ అని నిర్ణయించుకున్నది . సహజముగా అగ్ని మందిరము వైపుకు తిరిగి , ’ నా సంకల్పము సఫలమగునట్లు కరుణించు ’ అని నమస్కరించినది . 


         కొడుకు తల్లి చేసినది చూచినాడు . ఆమె తిరిగిన వైపుకు చూచినాడు . అక్కడ ఎవరూ కంట పడలేదు . అయినా అమ్మ చెప్పినది గుర్తుకొచ్చినది . తాను చేస్తున్నది ఎందుకు ఏమిటి అనునది లేశమైనా తెలియకుండానే తానూ అటువైపుకు తిరిగి నమస్కరించినాడు . తల్లి దగ్గరకు వచ్చి గొంతు అతి చిన్నదిగా చేసి , చెవిలో నోరు పెట్టి ’ అక్కడ ఎవరైనా దేవతలు వచ్చినారేమమ్మా ? " అని అడిగినాడు . 


        తల్లి , కొడుకు చెంపపై ఒక ముద్దిచ్చి చెప్పింది , ’ అగ్ని మందిరము ఉన్నది అటువైపే కదా ? కానీ , దేవతలు ఇక్కడున్నారు , అక్కడలేరు అనుటకు లేదు . వారు అంతటా ఉంటారు . " 


        " అంటే మన వంట్లోనూ ఉన్నారా ? ఈ కట్టెలలోనూ ఉన్నారా ? ఈ ఉడుకుతున్న పప్పులోనూ ఉన్నారా ? " అని అతి గంభీరముగా కొడుకు అడిగినాడు . 


        తల్లి కూడా అంతే గంభీరముగా చెప్పింది , " ఔనయ్యా , ఈ కట్టెలలో , ఈ బియ్యములో , ఈ పప్పులో , చిన్న పిల్లవాడివైన నీలో , పెద్దదాని నైన నాలో , అంతటా ఉన్నారు . అయితే , మండుటవలన , ఉడుకుట వలన వారికి నొప్పి కలగదు . మనము చేయునదంతా వారికే . అయితే , వారికి దానివలన నొప్పి లేదు , బాధ లేదు . వారిని మరచితే , వారికి నొప్పి . " 


        " మరచితే వారికి నొప్పి ! సరేనమ్మా , వారిని మరచిపోకుండా చూసుకుంటాను . అదే కదా నువ్వు ఆ మంత్రములో చెప్పింది ? సరే , మరచితే వారికి నొప్పి , కాబట్టి మరవరాదు " 


         ఆలంబినికి ఆశ్చర్యముల వాన కురుస్తున్నట్లాయెను . " ఇదేమిటి ? ఈ బాలుడు ఇంత గహనముగా , గంభీరముగా లోతుగా మాట్లాడుతున్నాడంటే అర్థమేమి ? " అని ఆశ్చర్యము . ఏమేమో లెక్కలు వేసుకుంటూ , " సరే , వీడు ఇతర పిల్లలవలె కాదు , దేహము చిన్నది గా ఉండుట చూసి , వీరు నా కడుపున పుట్టినారు యన్న మోహమునకు లోనై మేమూ చెడి , పిల్లలనూ చెడగొట్టుతున్నాము . దేవా ,ఈ మోహపు చెర నుండీ విడిపించు . ఎవరో జీవుడు నన్ను నిమిత్తము చేసుకొని ఈ లోకమునకు వచ్చినాడు . వాడు వచ్చిన కార్యము నావలన చెడిపోకుండా చూడు . ఇదే సద్భావము నాలో ఎప్పటికీ ఉండనీ " యని మరొకసారి నమస్కరించినది . 


       కొడుకు కూడా నిర్విషణ్ణముగా పవిత్రమైన చూపులతో ఏ సంశయమూ లేకుండా చేతులు జోడించినాడు . తల్లి అది చూచి , తనలోని మాతృ వాత్సల్యము ప్రవాహమై పొంగి బయటికి వస్తుండగా , ఇక దానిని తట్టుకొనలేక , వాడిని మరలా దగ్గరికి తీసుకొని , ముద్దు పెట్టుకొని , తొడపై కూర్చోబెట్టుకొని , హత్తుకున్నది . కొడుకు తన అంగములలో ఒక భాగము , వాటి కన్నా ఎలాగ వేరే అవుతాడు అన్న నమ్మకము ఉండవలెను , తన కాళ్ళూ చేతుల వలె వాడుకూడా తనవాడే అన్న ఖచ్చితమైన , దృఢమైన భావము ఆమెకు ఉండవలెను , లేకున్న, అలాగ హత్తుకొనుటకు సాధ్యమా ? ఆమెకు కొడుకు తన అంగములకన్నా వేరే యను భావమే ఉన్నట్లు లేదు . 


       అలాగ ఒక ఘడియ వాడిని పట్టుకొని ఉండి , " యజ్ఞీ , నువ్వు చెలుకోలు తీసుకొని నడిమింట్లో గుర్రము ఆట ఆడుకొని రా, అంతలోపల నేను చింతపండు పిసికి గిన్నెలో వేస్తాను " అన్నది . వాడు సరేనమ్మా అని మూలనున్న చెలుకోలును తీసుకొని నడిమింట్లోకి వెళ్ళినాడు . 


         తల్లి వెళుతున్న కొడుకును మరియొకసారి తిరిగి చూచినది . మరలా పిలిచి ముద్దు పెట్టుకోవాలనిపించినది . వెంటనే గృహిణీ భావము వచ్చి , ఆ భావము పెద్దదై , ’ ఇలాగ వీడితో ఆటలాడుచూ మిగిలిన పనులను చెడగొట్టుకోకూడదు , వంట చెడిపోతే వైశ్వేదేవము చెడిపోతుంది . వారూ , వారి శిష్యులూ ఏమీ అనరు , అది వారి మంచితనము . అలాగని పనులను చెడగొట్టవచ్చునా ? ’ అని గృహిణి కార్యములో కొనసాగింది . అమె పులుసులోకి చింతపండు రసము పిండి , పొయ్యిపైనున్న అన్నపు తప్పేలా ను తీసి , ఇటువైపు పెట్టి , పులుసు గిన్నెను ఎత్తి పొయ్యిపైన పెట్టింది . 


        ఆ వేళకు కొడుకు గుర్రము ఆటను నిలిపి మళ్ళీ వచ్చినాడు . తల్లి , చింతపండు పిసికిన పాత్రను కడుగుచున్నది . కొడుకు వచ్చి తల్లివద్ద నిలుచొని , ’ ఏమిటమ్మా , ఎప్పుడు చూసినా ఆ పాత్ర కడిగేది , ఈ పాత్ర కడిగేది , నువ్వు పాత్రలు కడిగేదే పెద్ద పనిగా పెట్టుకున్నావు కదమ్మా ? " అన్నాడు . 


       తల్లికి దానికీ నవ్వు వచ్చింది . " కాదయ్యా , యజ్ఞయ్యా , పాత్రలు లోపలా కడగవలెను , బయటా కడగవలెను , అవునా కాదా , చెప్పు ? లోపల కడగకుంటే మడ్డి , బయట కడగకుంటే మసి , కాదేమీ ? చెప్పూ ? " అంది 


        కొడుకు మళ్ళీ గంభీరుడై , బాల భావనను ఎక్కడో వదలి వేసినవాడిలాగా , అదే మాటను మరలా మరలా పలికినాడు . " లోపలా కడగవలెను , బయటా కడగవలెను, లోపల కడగకుంటే మడ్డి , బయట కడగకుంటే మసి , " అని తన ఒంటిని చూసుకొని , ’ బయట కడుగుట తెలుసు , కానీ లోపల కడిగేదెలాగ ? ’ అని తనలో తాను మాట్లాడుకొనునట్లు అన్నాడు . 


తల్లి ఎక్కడో , ఏదో పనిలో మునిగిఉన్నది , ’ వారు వచ్చినాక వారిని అడుగు , చెపుతారు ’ అన్నది . 


       కొడుకు ’ సరే వారినే అడగవలెను , లోపల కడిగేది ఎలాగా అని . సరే , లోపల కడగకుంటే మడ్డి , బయట కడగకుంటే మసి ’ అనుకుంటూ ఉన్నాడు .

_ఎప్పుడు, ఎలా పోతాను

 *_ఎప్పుడు, ఎలా పోతాను?_*


నగరానికి వచ్చిన, పేరు మోసిన జ్యోతిష్యుడ్ని చూడడానికి వచ్చిన రావు గారు, రూ.5,116/- దక్షిణతో పాటు, తన జాతకం, తన ప్రశ్న కూడా ముందుంచారు.


"స్వామీ నా మరణం ఎప్పుడు, ఎలా, ఏ పరిస్థితులలో జరుగుతుంది? "_


జ్యోతిష్యుడు క్షుణ్ణంగా జాతకం పరిశీలించి, కొన్ని గ్రంధాలు తిరగేసి, చివరికి ఈ విధంగా సెలవిచ్చారు...


"చూడండి రావుగారు... మీ జాతకం అత్యద్భుతంగా ఉంది. స్పష్టంగా తెలియవచ్చిందేమిటంటే మీరు మీ నాన్న గారంత వయసు జీవిస్తారు. ఆయన పోయిన స్థలంలోనే పోతారు. ఆయన పోయిన పరిస్థితులలోనే పోతారు."


ఇంకా జ్యోతిష్యుడు చెపుతుంటే వినిపించుకోకుండా రావు గారు పరుగు లంకించుకొన్నారు. దాదాపు అరగంటలోపే రావు గారు తమ తండ్రిని వృద్ధాశ్రమం నుండి ఇంటికి తెచ్చుకొన్నారు.☝️

నిజాలు

 కొన్ని పచ్చి నిజాలు:


యవ్వనంలో ఉన్నప్పుడు *"మొటిమల్ని"* గురించి బాధపడే వాళ్ళం! 


ముసలితనం వచ్చినప్పుడు *"ముడతల్ని"* గురించి బాధపడుతుంటాం!!


యవ్వనంలో ఉన్నప్పుడు *"ఆమె"* చెయ్యి పట్టుకోవాలని ఆశతో ఎదురుచూసే వాళ్ళం!


ముసలితనం వచ్చినప్పుడు ఎవరైనా వచ్చి *"చేయి"* పట్టుకుంటారా....అని ఎదురు చూస్తుంటాం!!


యవ్వనంలో ఉన్నప్పుడు నా తల్లిదండ్రులు నన్ను *"ఒంటరిగా"* వదిలేస్తే బాగుండును...అనుకునేవాళ్ళం!


ముసలితనం వచ్చినప్పుడు అందరూ *"ఒంటరిగా"* వదిలేస్తారేమో.... అని బాధపడుతుంటాం!!


యవ్వనంలో ఉన్నప్పుడు ఎవరైనా సలహాలు ఇస్తే *"చికాకు"* పడేవాళ్ళం!


ముసలితనం వచ్చినప్పుడు ఎవరూ కనీసం *"మాట్లాడటం"* లేదే అని బాధపడుతుంటాం!!


యవ్వనంలో ఉన్నప్పుడు *"అందాన్ని"* ఆస్వాదించే వాళ్ళం!


ముసలితనం వచ్చినప్పుడు మన చుట్టూ ఉన్న ప్రతి దాంట్లోనూ *"అందాన్ని"* చూసుకుంటుంటాం!!


యవ్వనంలో ఉన్నప్పుడు నాకు *"చావు"* లేదు అనుకుంటాం!


ముసలితనం వచ్చినప్పుడు .... *"రోజులు దగ్గర పడ్డాయి"* అని బాధపడుతుంటాం!!


యవ్వనంలో ఉన్నప్పుడు స్నేహితులతో *"ప్రతి క్షణాన్ని"* పండగ చేసుకునే వాళ్ళం!


ముసలితనం వచ్చినప్పుడు ఆ *"తీపి జ్ఞాపకాల్ని"* నెమరు వేసుకుంటుంటాం!!


యవ్వనంలో ఉన్నప్పుడు *"నిద్రలేవడం"* కష్టంగా ఉండేవాళ్ళం!


ముసలితనం వచ్చినప్పుడు *"నిద్రపోవడానికి"* కష్టపడుతుంటాం!!


యవ్వనంలో ఉన్నప్పుడు ధైర్యంగా *"గుండెల మీద"* పిడిగుద్దులతో గుద్దుకునే వాళ్ళం!


ముసలితనం వచ్చినప్పుడు ఈ *"గుండె ఎప్పుడు ఆగి పోతుందో"* అని భయపడుతుంటాం!!


కనుక........


జీవితంలో రకరకాల *"ఆటు పోట్లు"* వస్తుంటాయి. 

దేనికీ భయపడ కూడదు. 


ధైర్యంగా ఎదుర్కోవడమే జీవిత లక్ష్యం కావాలి.

 అదే నిజమైన *"జీవితానుభవం".* 


అది *"యవ్వనంలో"* నైనా.. *"ముసలితనంలో"* నైనా.....ఉన్న సత్యాన్ని గ్రహిస్తే జీవితం చాలా *"ప్రశాంతంగా"* ఉంటుంది.


అందుకే.......


 *యవ్వనంలో..... విర్రవీగకు!*

*వృద్దాప్యంలో..... బాధ పడకు!!*