6, జనవరి 2021, బుధవారం

ఋభుగీత" (228)*

 _*"ఋభుగీత" (228)*_

🕉🌞🌎🌙🌟🚩


_*బ్రహ్మానందము"*_

_*16వ అధ్యాయము*_ 


_*మనని మనం గమనించి మార్చుకునేదే నిజమైన సన్మార్గం !*_


_*మౌనమే స్నానం, జపం, పూజ, మోక్షం అన్నీ అని సెలవిచ్చారు. మౌనం అంటే మనసుకు కలిగే నిశ్చింత. జననమరణాలు ఎప్పుడు అసత్యం అవుతాయంటే మనసుకు పరిపూర్ణమైన శాంతివచ్చినప్పుడు. అంతటి శాంతి ఎప్పుడొస్తుందంటే స్వస్వరూపం తెలిసినప్పుడు. స్వస్వరూపం పూజలు జపాలు, తపాలవల్ల తెలియదు. విచారణ, సత్సంగం, ధర్మాచరణ, ఆదర్శజీవనం వల్ల కలుగుతుంది. పూజలు, జపాలు, తపాలు అందుకు సహకరించేవే గానీ అవే మోక్షాన్ని ఇవ్వవు. అశాంతిగా ఉందని బాధపడుతుంటాం. అశాంతికి మూలాన్ని గుర్తించి ఆచరణాత్మకంగా దాన్ని తీసెయ్యకుండా అశాంతి ఎప్పటికీ పోదు. మనని మనం గమనించి మార్చుకునేదే నిజమైన సన్మార్గం !*_


🕉🌞🌎🌙🌟🚩

కామెంట్‌లు లేవు: