6, జనవరి 2021, బుధవారం

శ్రీలలితా సహస్రనామ వివరణ

 🌹శ్రీలలితా సహస్రనామ వివరణ🌹


*74.భండపుత్ర పధోద్యుక్త శక్తి విక్రమ నందితా*


భండాసురుని కుమారులు ముప్పైమంది. వారిని వధించడంలో బాలాత్రిపురసుందరీ దేవి చూపించిన విక్రమమునకు శ్రీదేవి చాలా ఆనందించింది. 'బాలా దేవి శ్రీలలితా అమ్మవారి కుమార్తె, ఆమె పరమేశ్వరి యొక్క ఆత్మనుండి పుట్టినది.


బాలాదేవి' అనగా "విమర్శనా శక్తి". అది అన్ని బంధనములను తొలగించుతుంది. ముక్తికి' అడ్డుగా నిలచే రకరకములైన రాక్షస స్వభావములన్నీ నశించిపోతాయి.


యుద్ధములో శ్రీమాతకు రెండువేపులా శ్యామలా దండనాయికలూ ముందూ వెనుకా సంపత్కరీ, అశ్వారూఢలూ కాపుగా వుండగా 'భండుని' కొడుకులు ముప్పైమంది వెనక నుండి ముట్టడించారు. అప్పుడు తొమ్మిదేండ్ల వయసుగల 'బాల' వారిని ఎదుర్కొని చంపి

వేసింది


శ్రీమాత తనకుమార్తెకు తన ఆయుధములలో కొన్ని యిచ్చింది. తల్లి కుమార్తె బాల యొక్క పరాక్రమం చూసి చాలా ఆనందించింది.


కం|| భండాసుర సంతానము

చండాడగ నుద్యమించు, సరణికి బాలా

మెండగు ముప్పది పుత్రుల మండించగ, జూచినంబ మదిమరి విరిసెన్!


         లలితానామసుగంధం

                   M.s.s.k

కామెంట్‌లు లేవు: