30, ఆగస్టు 2021, సోమవారం

జయ గోవింద

 జయ గోవింద

సింహామాసం కృష్ణపక్షంలో రోహిణి నక్షత్రం రోజున శ్రీకృష్ణుడి తిరునక్షత్రం(పుట్టిన రోజు) నిర్వహించాలని ఈశ్వర,శ్రీప్రశ్న మొదలగు సంహితా గ్రంథాలు తెలుపుతున్నాయి.

తిరునక్షత్ర తనియ

సింహమాసే౽ సితే పక్షే రోహిణ్యాం అష్టమీతిథౌ |

చరమార్థ ప్రదాతారం కృష్ణం వందే జగద్గురుమ్ || 


నిత్య తనియ

తతో౽ ఖిల జగత్పద్మ బోధాయాచ్యుతభానునా | 

దేవకీ పూర్వసన్ధ్యాయాం ఆవిర్భూతం మహాత్మనా ||

     శ్రీజయంతి గా పిలువబడే కణ్ణన్ తిరునక్షత్ర మహోత్సవం,ఆమరుసటి రోజు శిక్యోత్సవం నిర్వహించాలని విధి విధానాలను శ్రీప్రశ్న,ఈశ్వర సంహితలు పేర్కోన్నాయి.

 మొదటి రోజున శ్రీస్వామి వారికి విశేష తిరుమంజన కార్యక్రమం,వివిధ ప్రసాదాల నివేదన(ముఖ్యంగా కాయం,పాలు,వెన్నె,మీగడతో పాటు ఇతర ప్రసాదాలు)చేసి ఊంజల్ సేవని,నృత్య,గీతాది కార్యక్రమాలు నిర్వహించాలని ,ఆతరువాతి రోజు గర్భాలయంలో మూలమూర్తి ఆరాధన జరిగిన పిమ్మట ఉత్సవమూర్తిని పల్లకిలో వేంచేపు చేసుకోని శిక్యోత్సవం(ఉట్లి కోట్టడం) నిర్వహించడానికి అనుమతికై స్వామి వారిని ప్రార్థించి ఉత్సవమూర్తిని మంటపానికి వేంచేపు చేయాలి.వీథిలోని గోప బాలకులను భగవంతునికి ఎదురుగా నిలబెట్టాలి.పాలు,వెన్నె వంటి వాటిని సిద్ధం చేసుకోని శిక్యాన్ని(ఉట్టిని)నిర్మించాలి.ఆఉట్టిలోని పాలు,పెరుగు ,వెన్నె ఇత్యాదులతో ఉన్న ఆఉట్టిని గోప బాలురు కొట్టేందుకు భగవంతుని అనుమతిని తీసుకోమని చెప్పి వేడుకను ప్రారంభించాలి.నృత్య,గీత,వాధ్య,వేద,దివ్య ప్రబంధ ,స్తోత్రాదులు చదువుతూ తిరువీథిగా ఉట్టి వద్దకు చేరుకుని అక్కడ పసుపు నీళ్ళతో ఈఉత్సవాన్ని నిర్వహించాలి.ఉత్సవం పూర్తి అయ్యాక ఉత్సవమూర్తికి ఉపచారములు సమర్పించి గర్భాలయానికి వేంచేపు చేయాలి.సంతానార్థులు ఈఉత్సవం పూర్తి తర్వాత పారణ చేసిన సంతానం కలుగుతుందని చెప్పబడింది.

భగవదుత్సవములు అనే శ్రీకోశం నుండి గ్రహించబడింది.

   ప్రియ భగవద్బందువులందరికి శ్రీజయంతి శుభాకాంక్షలు

 సర్వ అపరాధాన్ క్షమస్వ

అడియేన్ రామానుజ దాసన్

కామెంట్‌లు లేవు: