*ప్రియ బాంధవా మేలుకో 14*
సభ్యులకు నమస్కారములు.
గత వ్యాసాలలో పోలీసు భద్రతా చర్యల గురించి వివరణలు చూసాము. దేశంలోని మరొక చట్టం గురించి గురించి క్లుప్తంగా తెలుసుకుందాము. *అనైతిక మరియు అక్రమ రవాణా చట్టము*. ఈ చట్టం ఆధారంగా ప్రభుత్వం దిగువ చూపబడిన నేరాలను అరికట్టేందుకు చర్యలు చేపడుతోంది.
1) *అక్రమ రవాణా* ఈ చట్ట విరుద్ధ కార్యక్రమాలలో ఇసుక మట్టి అక్రమ రవాణాతో మొదలిడి స్వార్థపరులు బియ్యం, కలప దుంగలు, గంధపు చెక్కలు, బియ్యం, మాదక ద్రవ్యాలు, చారిత్రక, సాంస్కృతిక పురా వస్తువులు, కళాఖండాలు, ఔషధాలు, ఆయుధాలు. *ఇటువంటి న్యాయ విరుద్ధ, చట్ట విరుద్ధ కృత్యాలనిటిని వ్యవస్తీకృత నేరాలుగా పరిగణిస్తారు*. ఇటువంటి నేరాల వెనుక బలమైన సంఘ నీతి బాహ్యులు మరియు దారుణమైన నేరస్తులుంటారు. ఒక్కొక్క సారి వీరందరికీ దేశ ద్రోహులతో గూడా సంబంధాలుంటాయి.
ఈ నేరాలకు తోడుగా స్థానిక నేరాలను గూడా పరిశీలిద్దాము.
భూదంధాలు, అక్రమ నిర్మాణాలు, దొంగ నోట్ల, నకిలీ ధ్రువ పత్రాల (certificates) ముద్రణ, మూడు ముక్కలాటలు, మట్కా జూదాలు, కోడి పందాలు, క్రికెట్ బెట్టింగులు, గంజాయి విక్రయాలు, నల్ల మందు మూఠాలు, నకిలీ బిల్లు సిద్ధ హస్తులు. ఇవన్నిటికి తోడు పదార్థాలను అనగా ముడి సరుకులతో పాటు ఆహార పదార్థాలను కల్తీ చేయు సంస్థలు. *వింటుంటేనే, చదువుతుంటేనే కంపరం కల్గించే దోష భూయిష్టమైన సమాజంలో జీవిస్తున్నాము*.
ఈ దురాగతాలన్ని చేసే మాఫియా గ్రూప్ లన్ని ఆధునిక సాంకేతిక ప్రక్రియలలో ఆరితేరి ఉంటారు. వీళ్ళ వ్యాపారాలు కొన్ని కోట్ల రూపాయలతో ప్రారంభమై వేల కోట్ల వరకు విస్తరించి ఉండవచ్చుననుటలో అతిశయోక్తి ఉండక పోవచ్చును.
2) *అనైతిక అక్రమ రవాణా*:- ఈ తరహా అక్రమ రవాణాలో మానవ మరియు జీవ సంబంధమైన అంశాలు అక్రమ రవాణా కనబడుతాయి. మహిళలు, బాలికలు, పసికందులు, మానవ అవయవములు ఇత్యాది. బాల బాలికలను మరియు మహిళలను తమ తమ సంస్థలలో నిర్బంధించి బలవంతంగా పని చేయించుట గూడా ఈ అనైతిక అక్రమ రవాణా చట్టంలోనే చేర్చబడి ఉన్నది.
*అవినీతి నిరోధక చట్టం* 2018 వ సంవత్సరంలో కాలానుగుణంగా సవరించబడినది. *అనైతిక రవాణా చట్టం* PITA (Prevention of Immoral Traffic Act) మరియు SITA (Suppression of Immoral Traffic Act) 1980 సంవత్సరం నుండియే అమలులో ఉన్నది.
పైన తెలుపబడిన అక్రమ రవాణాల వలన దేశ ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పు వాటిల్లనున్నది. ఇటువంటి వ్యవస్థీకృత నేరాలను సమర్థవంతంగా ఎదుర్కొనుటకు ప్రభత్వ విభాగాలు ఏర్పడినాయి. సదరు విభాగాలు కూడా శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాయి.
విస్తారమైన భద్రతా వ్యవస్థ ఉన్నప్పటికీ దేశం మొత్తంలో *ఈ దుర్మార్గాలన్నీ మటు మాయ మయ్యాయని విజ్ఞులెవరైనా చెప్పగలరా*. భద్రత మరియు రక్షణ వ్యవస్థలు చతికిల పడ్డాయని కూడా చెప్పలేము.
ప్రజలు దేశ సమస్యల పట్ల చైతన్యులై, ఐకమత్యంతో ప్రభుత్వంతో సహకరించినప్పుడు *మాత్రమే* ఫలితాలు మరింత మెరుగ్గా ఉండి, అకృత్యాలు తగ్గు బాట పడతాయి.
ధన్యవాదములు
*(సశేషం)*
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి