మనము గడిపే ఇక్కడి వివాహ జీవితములో, ఇక్కడ అనుభవించే సుఖములు, సత్సంతానము- ఇవన్నీ కూడా నశ్వరములే! నశించే వస్తువులే! సీతారాములు దాంపత్యము అనశ్వరమైనది, నశించేది కాదు.
భూలోక దృష్టితో చూస్తే వారు దాలా కష్టపడినారు. వారు కాపురము చేసినది పట్టుమని పదిరోజుల లేదు. వశిష్ఠుడు. రామపట్టాభిషేకమునకు గొప్ప ముహూర్తము పెట్టినాడు. ఆయన జ్యోతిష శాస్త్రము తెలియకుండా ముహూర్తము పెట్టుతాడా? అవతార కార్యక్రమములో మొట్టమొదట సింహాసనము మీద కూర్చునే ముందు లోకమును నిష్కంటకము చేయాలి కదా! సింహాసనము మీద కూర్చున్న మరునాడే యుద్ధమునకు బయలు దేరుతాడా? కాబట్టి ముందు నిష్కంటకము చేసిన తరువాత ధర్మప్రతిష్ఠ అప్పుడు చేసి, అప్పుడు పట్టాభిషికుడు కావటము అనేది దాని అర్థము. ప్రతిష్ఠుడైన ముహూర్తమునకు చాలా అంతరార్ధము ఎక్కువగా ఉంటున్నది.
సాధారణముగా మనము ఏమి అనుకుంటున్నాము అంటే, "బ్రాహ్మణుడు పెండ్లికి చాలా మంచి ముహూర్తము పెట్టినాడండి. చాలా బాగా జరిగింది. చాలామంది బంధువులు వచ్చినారు. వర్షము రాలేదు. ఏ ఆటంకమా కలుగలేదు. అందరూ మంచి విందు భోజనము చేసినారు" అంటాము. పెళ్ళి ముహూర్తము అందుకోసము పెడతారా? వధూవరులు నూరేండ్లు సుఖముగా ఉండాలి. పిల్లపాపలను కని మనుమల పెండ్లిండ్లు కూడా వారు చూడవలెనని కదా అనుకునేది! పెళ్ళిలో ఏమీ లేకపోయినా, ఎవరూ రాకపోయినా ఫరవాలేదు. దానికి ఒక పరమార్ధము అంటూ ఉంటుంది.
సద్గురు శ్రీ శివానందమూర్తి గారు
సంగీత విద్య, పేజీ: 234
శివానంద గురు కల్చరల్ ట్రస్ట్ వరంగల్
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి